
అనుమతి తీసుకునే వరకూ అడ్డుకుంటాం
ప్రభుత్వ అనుమతి తీసుకునే వరకూ ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటూనే ఉంటామని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు.
త్వరితగతిన ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరామని చెప్పారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ.. ఎటువంటి హింస జరగదని ముద్రగడ హామీ ఇస్తేనే పాదయాత్రకు అనుమతిస్తామని చెప్పారు.