గుంటూరు : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్కు శుక్రవారం మోచిప్ప మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డీఎస్ రాజునాయుడు మాట్లాడుతూ.. ఆస్పత్రి చరిత్రలో ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించవచ్చన్నారు. జీజీహెచ్ వైద్యులపై నమ్మకం ఉంచి.. ప్రజలకు ప్రభుత్వాస్పత్రులపై ఉన్న అపనమ్మకాలను పారద్రోలేలా స్వయంగా మంత్రి జీజీహెచ్లో ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పారు.