పార్వతీపురం (విజయనగరం) : చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. టీడీపీ నాయకులు, వారి బంధువులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు.
రెండు రోజుల క్రితం సాలూరులో మునిసిపల్ ఉద్యోగినిపై ఓ టీడీపీ కౌన్సిలర్ అత్యాచారయత్నం చేసిన ఘటనపై శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజన్న దొర మీడియాతో మాట్లాడారు. ఈ అంశాన్ని శాసనసభలో లేవనెత్తుతామని చెప్పారు. ఈ ఘటనపై మహిళా డీఎస్పీతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
'బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు'
Published Fri, Oct 16 2015 4:15 PM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM
Advertisement
Advertisement