press meet
-
అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది: ఫరియా అబ్దుల్లా
డ్యాన్స్ లవర్స్ను మెప్పించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’(Dance Ikon) కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2(Dance Ikon 2) వైల్డ్ఫైర్’ రానుంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ షో ఆహా ఓటీటీలో ప్రీమియర్కు రెడీ అవుతోంది. ఈ షోకు ఓంకార్(Ohmkar), హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్లుగా వ్యవహరించనున్నారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ఫైర్’ షోలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటారని, హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్తో ఈ డ్యాన్స్ షో వీక్షకులను అలరిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ‘డ్యాన్స్ ఐకాన్ 2’ షో ప్రెస్మీట్లో హోస్ట్స్లో ఒకరైన ఓంకార్ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ ఐకాన్ 2–వైల్డ్ఫైర్’లో ఐదుగురు కంటెస్టెంట్స్ సర్ప్రైజ్ చేస్తారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్లు చర్చనీయాంశమవుతాయి. ముగ్గురు హోస్ట్లతో పాటు సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2: వైల్డ్ ఫైర్’ వీక్షకులకు హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో’’ అని అన్నారు.ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’కు కూడా నన్ను హోస్ట్గా అడిగారు. కానీ, ఆ సమయంలో చేయలేకపోయాను. ఇప్పుడు ఓంకార్, శేఖర్ మాస్టర్లతో కలిసి హోస్ట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఈ షో వీక్షకులకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని గ్యారంటీగా చెప్పగలను’’ అని తెలిపారు. ‘‘ఈ షోలో వీక్షకులను సర్ప్రైజ్ చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఉంటాయి’’ అని చె΄్పారు శేఖర్ మాస్టర్. ఈ కార్యక్రమంలో మెంటార్ యశ్, మెంటార్ మానస్, సింగర్ జాను లైరి, మెంటార్ ప్రకృతి మాట్లాడారు. -
‘ప్రేమిస్తావా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఈ పెట్టుబడుల వల్ల వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి: Revanth Reddy
-
'మదగజరాజా'మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అంజలి,వరలక్ష్మి (ఫొటోలు)
-
సందు దొరికితే చాలు వైఎస్ జగన్ పై బురద చల్లాలనే ప్రయత్నమే
-
స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు YSRCP మద్దతుగా నిలిచింది
-
కూతురి ఫస్ట్ మూవీ.. ఏడ్చేసిన సుకుమార్ భార్య (ఫోటోలు)
-
కార్చిచ్చుపై ప్రెస్మీట్లో ముత్తాతనయ్యానని జో బైడెన్ ప్రకటన
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు బైడెన్కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్తో పాటు దక్షిణ కాలిఫోర్నియా మొత్తాన్ని భీకర కార్చిచ్చు చుట్టుముట్టి పెను నష్టం చేస్తున్న విషయం తెలిసిందే. దాని ధాటికి ఇప్పటికే లక్షన్నర మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇళ్లతో పాటు సర్వం బుగ్గి పాలై భారీగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా లాస్ ఏంజెలెస్లో హాలీవుడ్ తారలతో పాటు ప్రముఖులుండే అతి సంపన్న ఆవాసాలు పెద్ద సంఖ్యలో అగ్నికి ఆహుతిగా మారాయి. ఈ విపత్తుపై స్థానిక శాంటా మోనికాలో బైడెన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉన్నట్టుంది వ్యక్తిగత ప్రకటన చేశారు. తనకు ముని మనవడు పుట్టాడని చెప్పుకొచ్చారు. ‘ఈ ప్రతికూల వార్తల నడుమ ఒక శుభవార్త. ఈ రోజే నేను ముత్తాత అయ్యాను. చాలా కారణాలతో నాకీ రోజు గుర్తుండిపోతుంది‘ అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘పేరుకేమో అగ్ర రాజ్య అధ్యక్షుడు. కనీసం ఎక్కడేం మాట్లాడా లో తెలియదా?‘ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మంటల్లో బైడెన్ కుమారుని ఇల్లు కూడా బుగ్గిగా మారినట్టు వార్తలొచ్చాయి. ‘అది పూర్తిగా కాలిపోయిందని తొలుత చెప్పారు. బానే ఉందని ఇప్పుడంటున్నారు‘ అంటూ ఈ వార్త లపై బైడెన్ స్పందించారు.ప్రెస్ మీట్కు ముందే...మీడియా సమావేశానికి ముందే బైడెన్ స్థాని క ఆస్పత్రిలో ముని మనవడిని చూసి వచ్చారు. ఆ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పదవిలో ఉండగా ముత్తాత అయిన తొలి అమెరికా అధ్యక్షునిగా కూడా 82 ఏళ్ల బైడెన్ రికార్డు సృష్టించడం విశేషం. పెద్ద వయసులో అధ్యక్షుడు అయిన రికార్డు ఆయన పేరిటే ఉండటం తెలిసిందే. 77 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పుడా రికార్డును తిరగరా యనున్నారు. ఈ నెల 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. -
LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
‘డాకు మహారాజ్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
ఫిబ్రవరి 15తో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ
-
టాలీవుడ్ పెద్దల ప్రెస్ మీట్
-
మోహన్ లాల్ 'బరోజ్' మూవీ ప్రెస్మీట్ (ఫోటోలు)
-
విజయ్ సేతుపతి ‘విడుదల-2’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
మా నాన్నను విష్ణు ట్రాప్ చేసాడు
-
నాన్న తరఫున మీడియా మిత్రులకు క్షమాపణలు కోరుతున్నా: మంచు మనోజ్
-
ఏపీ సచివాలయంలో రగడ.. వెంకట్రామిరెడ్డి ప్రెస్మీట్ అడ్డగింత
సాక్షి, గుంటూరు: తమను వేధించడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పోలీసుల హడావుడితో రగడ చోటుచేసుకుంది. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రావడంతో వారికి, ఉద్యోగుల సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిన్న(గురువారం) ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై కూడా పోలీసులు దాడులు చేశారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేగింది. నేడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిన్న ఏం జరిగిందంటే..రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారిని ఇబ్బందులకు గురిచేశారు. డిన్నర్ చేస్తున్న సమయంలో 50 మంది వరకు పోలీసులు.. ఉద్యోగులను చుట్టుముట్టారు. ప్లాన్ ప్రకారం డిన్నర్ పార్టీపై ఏడు పోలీసు స్టేషన్ల సిబ్బంది దాడులు చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ ఉద్యోగులపై కేసులు పెట్టారు.అనంతరం ఉద్యోగులను పోలీసు స్టేషన్కు తరలించారు. గురువారం అర్ధరాత్రి వరకు వారిని పీఎస్లోనే ఉంచారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బొంకుల బాబు పవర్ బాగోతం.. బయటపెట్టిన వైఎస్ జగన్.. భజన మీడియాకూ సీరియస్ వార్నింగ్ (ఫొటోలు)
-
నితిన్ 'రాబిన్హుడ్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వైఎస్ఆర్ సీపీ MLCల ప్రెస్ మీట్
-
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం మాత్రం ఆరోగ్య శ్రీని పట్టించుకోవడం లేదు
-
లగచర్ల బాధితులతో NHRCని కలిసిన బీఆర్ఎస్ నేతలు
-
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్