పోర్టు కోసం పోరాటం | MP Vara Prasad comments on Chandrababu | Sakshi
Sakshi News home page

పోర్టు కోసం పోరాటం

Sep 12 2017 4:10 AM | Updated on Aug 9 2018 4:32 PM

పోర్టు కోసం పోరాటం - Sakshi

పోర్టు కోసం పోరాటం

దుగరాజపట్నం పోర్టు కోసం కేంద్ర ప్రభుత్వంతో మూడున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నామని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు పేర్కొన్నారు.

- చంద్రబాబూ.. దుగరాజపట్నం నిర్మాణానికి అడ్డుపడొద్దు: ఎంపీ వరప్రసాద్‌
దీక్షకు మద్దతు పలికిన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, నేతలు  
 
వాకాడు(గూడూరు): దుగరాజపట్నం పోర్టు కోసం కేంద్ర ప్రభుత్వంతో మూడున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నామని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగ్గరాజపట్నంలో సోమవారం ఆయన పోర్టు సాధన కోసం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి,  ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కిలివేటి సంజీవయ్య, పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు ఎంపీ వరప్రసాద్‌రావు నిరాహార దీక్షకు మద్దతు పలికి పరామర్శించారు.

విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు వరంలా వచ్చిన దుగరాజపట్నం పోర్టు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎంపీ వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అభివృద్ధి చెందాలంటే దుగరాజపట్నం పోర్టు ఈ ప్రాంతానికి ఎంతో అవసరమన్నారు. పోర్టు నిర్మాణానికి అడ్డుపడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నామని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలు, దళితులు, మహిళలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలన్నారు.

పోర్టు నిర్మాణం, కోస్టల్‌ కారిడార్‌ ఏర్పాటు కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం చంద్రబాబు అధికార దాహంతో కలెక్టర్ల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, సీఈసీ, సీజీసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, నెల్లూరు జిల్లా యువజన అధ్యక్షుడు రూపకుమార్‌యాదవ్, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement