Varaprasad Rao Velagapalli
-
‘వాళ్లు తెలుగు మీడియంలో చదువుతున్నారా?’
సాక్షి, అమరావతి: ఆంగ్ల విద్యపై ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా? అని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంగ్ల భాషను తీసుకురావడం వల్ల అణగారిన వర్గాల్లో నూతనోత్తేజం వచ్చిందన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఆంగ్ల విద్యా విధానం తీసుకురావడం శుభపరిణామం. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. నేను ఆంగ్ల భాషలో చదువుకోవడం వల్లే ఉన్నతస్థాయికి వచ్చానని గర్వంగా చెబుతున్నా. రిటైర్డ్ ఐఏఎస్, మాజీ ఎంపీగా ఆంగ్ల భాషలో పట్టు ఉండటం వల్లే నేను మంచి పేరు సంపాదించా’నని ఆయన తెలిపారు. -
ఈ క్షణాలు తీపి గుర్తులు: రతన్ టాటా
సాక్షి, విశాఖపట్నం : విశ్వవిద్యాలయాలకు పరిశ్రమలతో ఇంటరాక్షన్ పెరగాలని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అభిలాషించారు. అంతేకాకుండా యూనివర్సిటీల్లో పరిశోధనలు విస్త్రతంగా జరగాలని ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో ఈ క్షణాలు తీపిగుర్తులుగా మిగిలిపోతాయన్నారు. విశాఖపట్నం క్లీన్ సిటీగా అభివర్ణించారు. ఈ నగరంపైపై ఇప్పటివరకూ దృష్టి సారించలేదని.. ఇకపై పెడతామన్నారు. విశాఖలో టాటా గ్రూప్ ఏ రంగంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలనే అంశంపై ముంబైలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇక ఇదే సమ్మేళనంలో పూర్వ విద్యార్థిగా పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల తర్వాత ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థిగా రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. -
దుగ్గరాజు పట్నంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: దుగ్గరాజు పట్నం ఓడరేవు తీసుకొని వచ్చేంత వరకు తమ పార్టీ పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ పోర్టును కాపాడేందుకే దుగ్గరాజు పట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు. సోమవారం దుగ్గరాజు పట్నం పోర్టు నిర్మాణం పురోగతి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేతను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ను కలిసి ఈ విషయంపై చర్చిద్దామని వచ్చానని తెలిపారు. 2018వరకు దుగ్గరాజు పట్నం తొలి దశ పనులు పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. చంద్రబాబు ఒక్క లెటర్ రాస్తే.. కేంద్రం ఎనిమిది వేల కోట్లు విడుదల చేయడానికి సిద్దంగా ఉందని నితిన్ గడ్కరీ తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా బకింగ్ హామ్ కెనాల్ ప్రాజెక్ట్ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. అయితే బకింగ్ హామ్ కెనాల్కు మూడు వేల కోట్ల కేటాయింపులు జరిగేల చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు వరప్రసాద్ తెలిపారు. -
‘బాబుకు పాలించే అర్హత లేదు’
సాక్షి, తిరుపతి: దొంగ హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవ చేశారు. దుగరాజు పట్నం పోర్టు రాకపోవడానికి నూటికి నూరు పాళ్లు చంద్రబాబే కారణమని మండిపడ్డారు. కృష్ణపట్నం పోర్టు కోసమే దుగరాజు పట్నంను అడ్డకున్నారని ధ్వజమెత్తారు. మన్నవరం ప్రాజెక్టు రాకతో బతుకులు మారతాయని ఆశపడిన జిల్లా ప్రజలు చంద్రబాబు అసమర్థతో నిరాశకు గురయ్యారని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీఎం అయితేనే మన్నవరం ప్రాజెక్టు బాగుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
‘బాబు అసమర్థతే కారణం’
సాక్షి, తిరుపతి: ప్రత్యేక హోదాపై పూటకో మాట మార్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. అదివారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో అవిశ్వాసం, తదితర అంశాలపై స్పందిచారు. వైఎస్ఆర్సీపీ ఒత్తిడి వల్లే పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టారని, నాలుగేళ్లుగా టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ఇప్పటివరకు 30 దేశాలు తిరిగాడని.. కానీ అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదని ఎద్దేవ చేశారు. బీజేపీతో టీడీపీ లాలూచీ నిజం కాదా? బీజేపీ తప్పులను గతంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బాబు అసమర్థత వల్లే రాష్ట్రానికి నిధులు రాలేదని ఆరోపించారు. చంద్రబాబు కేవలం కమీషన్ల కక్కుర్తి కోసమే పోలవరం ప్రాజెక్టును చేపట్టారే తప్పా ఎలాంటి మంచి ఉద్దేశంతో కాదని వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేణిగుంట రైల్వేస్టేషన్లో వరప్రసాద్కు ఘనస్వాగతం
-
దోచుకున్న సొమ్ముతో ఎన్నికలకు: వరప్రసాద్
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీలు నెరవేర్చ మని అడుగుతున్న బడుగు, బలహీన వర్గాలపై చంద్రబాబు దూషణ లకు దిగుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధిచెబు తారని హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. బుధవారం వరప్రసాద్ హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లు అధికారంతో దోచుకున్న సొమ్ముతో ఎన్నికలకు సిద్ధమవుతున్న బాబు బీసీలు, ఎస్సీ, ఇతర వర్గాలను చిన్నచూపు చూస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వారే ఆయనకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఎన్నికల హామీని నెరవేర్చాలని కోరిన మత్స్యకారులను మీ అంతు చూస్తానని చంద్రబాబు బెదిరించారని, తాజాగా కనీస వేతనాలు అడిగిన నాయీబ్రాహ్మణులను బెదిరించారని, దీన్ని బట్టి ఆయనకు ఎంత అహంకారమో స్పష్టమవుతోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను తనఖా పెడతారా? రాష్ట్రంలోని పది సాగునీటి ప్రాజెక్టులను బ్యాంకులకు తనఖా పెట్టడానికి వీలుగా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ రైతువిభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగాన్ని ఏం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని ఆయన ప్రశ్నించారు. -
‘ఢిల్లీ వెళ్లి చతికిల పడిన చంద్రబాబు’
సాక్షి, హైదరాబాద్ : రెండేళ్లుగా సీఎం చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరు దళితుడిగా పుట్టాలని కోరుకోరని గతంలో చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేశారు. చిన్నకులాల వాళ్లంటే ఆయనకు చులకన భావం ఉందని ఎంపీ పేర్కొన్నారు. ‘మత్స్యకారులను మీ అంతు చూస్తానని చంద్రబాబు అన్నారు.. అంటే.. చంద్రబాబుకు ఎంత అహంకారం. నాయిబ్రాహ్మణులు కనీస వేతనాలు అడిగితే కళ్ళు ఎర్రజేసి వారిపై చిందులేస్తారా ? బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు మాత్రం చంద్రబాబుకు కావాలి. కానీ, వారి బాగోగులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని’ ఎంపీ వరప్రసాద్ ధ్వజమెత్తారు. అసలు చంద్రబాబులో మానవత్వం ఉందా అని ఎంపీ ప్రశ్నించారు. బీజేపీపై నేను యుద్ధం ప్రకటిస్తానని చెప్పినా బాబు.. ఢిల్లీ వెళ్లి చతికిల పడ్డారని వరప్రసాద్ ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి మోదీ అంటే బాబులో ఎంత భయం ఉందో అర్థమవుతుందన్నారు. 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చెప్పిన హామీలన్నీ నెరవేర్చేవారు. ఆయనకు కనీస రాజకీయ జ్ఞానం కూడా లేదని ఎంపీ మండిపడ్డారు. సత్తా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు అని వరప్రసాద్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం విలువ, ఓటు విలువ, దళితుల విలువ గురించి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో తెలుస్తుందని ఎంపీ అన్నారు. దివంగత నేత వైఎస్సార్ కలలు నెరవేర్చాలనే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ప్రజల మద్దతుతోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఎంపీ వరప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
రెండేళ్లుగా చంద్రబాబులో అసహనం పెరిగిపోయింది
-
‘విచారణ అంటే చంద్రబాబు భయపడుతున్నారు’
సాక్షి, తిరుపతి : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగల మీద సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. అయితే విచారణకు మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఆయన తెలిపారు. టీటీడీ వివాదంపై ఎంపీ వరప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అయితే టీటీడీలో జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తిన రమణ దీక్షితులను తొలగించడం దారుణమని పేర్కొన్నారు. ఆరోపణలు చేసిన వారికి చట్ట ప్రకారం ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సూచించారు. తిరుమల పోటులో అర్చకులకు తెలియకుండా తవ్వకాలు జరిపారని చచెప్పారు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో.. చివరికి అధికారులకు కూడా తవ్వకాల గురించి తెలియదని చెబుతున్నారు. తిరుమల స్వామి వారి నగల మీద ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్సీపీ టీటీడీ వివాదంపై విచారణకు డిమాండ్ చేస్తుందన్నారు. రమణ దీక్షితులకు, మాకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ నేత వరప్రసాద్ స్పష్టం చేశారు. -
వర్ల రామయ్య పిల్లలు ఫోన్ వాడరా?
సాక్షి, విజయవాడ: బస్సులో ప్రయాణిస్తున్న యువకుడి పట్ల ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత ప్రవర్తన, అభ్యంతరకర వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఎంపీ వరప్రసాద్ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వర్ల తీరును ఆక్షేపించారు. (చదవండి: నువ్వు మాదిగా? ఇంకేం చదువుతావ్) ‘‘మచిలీపట్నం బస్టాండ్లో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన వర్ల రామయ్య.. తన స్థాయిని మర్చిపోయి ఓ యువకుడిని ఉద్దేశించి వాడు, వీడు అని దుర్భాషలాడారు. పక్కనున్న టీడీపీ నాయకులు ఆయన్ని ఇంకాస్త రెచ్చగొట్టారు. ఇంగితజ్ఞానం కూడా మర్చిపోయి.. నీ కులమేంటని ప్రశ్నించారు. ఫోన్ వాడితే పనికిరాకుండాపోతావని తిట్టిపోశారు. ఏం? వర్ల రామయ్యగారి పిల్లలు ఫోన్లు వాడరా? పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా? అసలు కులం అడగటం ఏం సంస్కృతి? ఆయన అనాల్సిన మాటలేనా అవి!’’ అని ఎంపీ వరప్రసాద్ వాపోయారు. యథా బాబు.. తథా రామయ్య: గతంలో దళితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మాట్లాడారు. కనీసం క్షమాపణలు చెప్పినట్లు కూడా చెప్పలేదు. ఇక ఆయన కింద పనిచేసే నాయకులు అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోలేం’ అని వరప్రసాద్ పేర్కొన్నారు. -
పెట్టింది వైఎస్సార్.. పీకేది చంద్రబాబే
సాక్షి, విజయవాడ: నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు నాయుడు.. జీవితంలో నేర్చుకున్నది ఏమీలేదు కాబట్టే ఇంకా దుర్భాషలాడే స్థాయిలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పి. వరప్రసాద రావు అన్నారు. ముఖ్యమంత్రి వినియోగించిన ‘పీకుడు’ పదాన్ని పాజిటివ్గా తీసుకుంటే, పీకేవాళ్లెవరో, పెట్టేవాళ్లెవరో ఇట్టే తేల్చయవచ్చని చెప్పారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సంబోధించింది మహానేత వైఎస్సార్నా, లేక వైఎస్ జగన్నా తెలియకున్నా తాను మాత్రం సమాధానం చెబుతానని వరప్రసాద్ అన్నారు. జగన్ ఇంకా అధికారం చేపట్టలేదన్న సంగతి గుర్తుచేసిన ఆయన.. టీడీపీది పీకే రాజకీయమైతే.. వైఎస్సార్సీపీది పెట్టే రాజకీయమని స్పష్టం చేశారు. పీకేది చంద్రబాబే: ►గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు 10 లక్షల పెన్షన్లను పీకేశారు. వృధాప్య పెన్షన్ వయసును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచి పెన్షన్లు పీకేశారు. ►దాదాపు 10 లక్షల మంది పేదల రేషన్ కార్డుల్ని పీకేశారు. ►2 లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి పీకేసిన ఘటన బాబుదే ►తాను సీఎంగా ఉన్న కాలంలో 60కిపైగా ప్రభుత్వ సంస్థలను పీకేశారు.. అంటే మూసేశారు. ►నాడు గొప్పగా అమలైన ఉచిత విద్యుత్ పథకాన్ని పీకేశారు. ►జన్మభూమి కమిటీల పేరుతో దుర్మార్గపు కమిటీలను వేసి జనాన్ని పీక్కుతింటున్నారు. ►మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానీ, కలెక్టర్గానీ పేదలకు ఇల్లో, ఇంకేదో సాయం చేసే స్థితిలోలేరు.. ఎందుకంటే వాళ్ల అధికారాలన్నీ మీరు పీకేశారు.. వాటిని జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు. ►ఇంత అహంకారంతో మాట్లాడే మిమ్మల్ని ప్రజలే పీకేసే రోజు వస్తుంది. పెట్టింది వైఎస్సారే: ►ఈ రాష్ట్ర ప్రజలకు ఏ ముఖ్యమంత్రైనా మంచి చేశారంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మాత్రమే. ►ఆయన పేదల కోసం ఆరోగ్యశ్రీని పెట్టారు. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల పేద పిల్లల చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టారు. ►డ్వాక్రా మహిళలకు పావల వడ్డీ పథకం పెట్టి వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ►2004-2008 మధ్య కాలంలో అంబులెన్స్లు, మందుల సరఫరా ఎలా జరిగిందో ప్రజలకు గుర్తుంది. ►నా నియోజకవర్గం(తిరుపతి పార్లమెంట్ పరిధి)లో మూడు ఎస్ఈజెడ్లు పెట్టారు. తద్వారా వందలాది పరిశ్రమలు, వేల మందికి ఉపాధి కల్పించారు. అసమర్థత.. ఇష్టారీతి ప్రవర్తన@బాబు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని ఇసుమంతైనా గౌరవించని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ అసమర్థత వల్లే ప్రత్యేక హోదా రాలేదు. మా ఎమ్మెల్యేలను కొని, వాళ్లను మంత్రులు చేశారు. ఇష్టారీతిగా నియంతమాదిరి వ్యవహరిస్తున్నారు. మీకు ప్రజాస్వామ్యం పట్ల విలువలేదని తెలుసుకాబట్టే మేం(వైఎస్సార్సీపీ) అసెంబ్లీనిని బహిష్కరించాం. కేంద్రం నుంచి వచ్చే నిధులను మీ పేరున్న పథకాలుగా చెప్పుకోవడంకాదు.. ఈ జీవితం మొత్తంలో ప్రజలకు నేనిది చేశాను.. అని చెప్పగలిగే ధైర్యం చంద్రబాబుకు లేదు. కాబట్టే ఆయన దుర్భాషలకుదిగుతున్నారు’’ అని వరప్రసాద్ పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును తరిమికొట్టాలి
-
నల్లజెండాలతో పాదయాత్ర
విజయవాడ: ప్రజలను వంచించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి దీక్ష చేసే అర్హత లేదని, ఏప్రిల్ 30న వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో పాల్గొనే అందరూ నల్లజెండాలు పట్టుకుని, నల్లబాడ్జీలు ధరించి పాదయాత్ర చేస్తారని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..నాలుగేళ్ల నుంచి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఏప్రిల్ 30న ఏపీకి జరిగిన అన్యాయాన్ని నల్లజెండాలతో పెద్ద ఎత్తున తెలియజేస్తామని వివరించారు. మరో వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ..హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం చంద్రబాబేనన్నారు.హోదాకు వంచన చేసింది ముమ్మాటికీ చంద్రబాబేనని మండిపడ్డారు. ఈ నెల 30వ తేదీని వంచన దినంగా పాటిస్తామని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.విశాఖలో ఏప్రిల్ 30న వంచన దినాన్ని పెద్ద ఎత్తున జరుపుతామని వివరించారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనే అందరూ నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి, ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసన ద్వారా ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. -
ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ జగన్ వల్లే సాధ్యం
-
చంద్రబాబు వల్లే హోదా వెనక్కు
నెల్లూరు(సెంట్రల్) : ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఆందదప్రదేశ్కు ప్రత్యేక హోదా హామీ వెనక్కు పోయిందని తిరుపతి పార్లమెంట్ సభ్యులు వెలగపల్లి వరప్రసాద్రావు విమర్శించారు. హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంపీ పదవులకు రాజీనామా చేసి, ఆమరణదీక్ష చేసిన అనంతరం మొదటి సారిగా గురువారం రాత్రి ఆయన నెల్లూరుకు చేరుకున్నారు. ఎంపీ వరప్రసాద్కు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ రైల్వేస్టేషన్లో ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరప్రసాద్రావు మాట్లాడుతూ నాలుగేళ్లుగా దొంగనాటకాలు ఆడి, బీజేపీతో చంద్రబాబు దోస్తీ కట్టారన్నారు. హోదా విషయంపై సీఎం చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడారన్నారు. అదేవిధంగా తమ రాజీనామాలపై హేళనగా మాట్లాడిన టీడీపీ నేతలు ఇప్పుడు హోదా కోసం దీక్ష చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు చేసే దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే మోసంతోనే దొంగ దీక్షకు చంద్రబాబు పూనుకున్నారని విమర్శించారు. తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో, ప్రజల ఆకాంక్ష కోసం పదవులను త్రుణపాయంగా వదులుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పోరాటాల ద్వారా హోదాను సాధించుకుంటామన్నారు. తలుపులు మూసిన తరువాత ఆందోళనా? తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో తలుపులు మూసి వేసిన తరువాత ఆందోళన అంటూ బయట నాటకాలు ఆడారని ఆరోపించారు. వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. తాము హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే దాదాపుగా 100 మందికిపైగా ఎంపీలు తమకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి మోదీ ఇంటి ముందు తాము ఆందోళన చేశామని టీడీపీ ఎంపీలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వాళ్లు చేసింది ప్రధాని ఇంటి ముందు కాదని, ఎక్కడో చేసి అనుకూల మీడియా ద్వారా ప్రధాన మంత్రి ఇంటి ముందు అని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో హోదా కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ప్రధానంగా తమ రాజీనామాలు స్పీకర్ ఫార్మెట్లోనే ఇచ్చామన్నారు. ఆమరణ దీక్ష భగ్నం చేసిన తరువాత కూడా రాష్ట్రపతిని కలిశామని పేర్కొన్నారు. ఎంపీని కలిసిన ఎమ్మెల్యే కాకాణి రాజీనామా చేసిన తరువాత నెల్లూరుకు మొదటిసారిగా వచ్చిన తిరుపతి పార్లమెంట్ సభ్యులు వి.వరప్రసాద్రావును వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి హోటల్ అనురాగ్లో కలిశారు. గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన ఆమరణ దీక్ష ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. హోదా పోరాటంలో ప్రతి ఒక్కరం భాగస్వాములుగా ముందుకు పోతామన్నారు. -
చంద్రబాబు దీక్షకు దిగటం హాస్యాస్పదం..
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదాపై నాలుగేళ్లుగా కాలయాపన చేసి.. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు దీక్షకు దిగటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకే ఆయన దీక్ష చేపడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి.. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాను కాలరాసి.. చంద్రబాబు చేస్తున్న దీక్ష కొంగజపం లాంటిదని వరప్రసాద్ విమర్శించారు. నాలుగేళ్లుగా కేంద్రంతో సక్యతగా ఉంటూ.. ఇప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. పీఎం నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోతుందని భావించిన చంద్రబాబు మళ్లీ కొత్త చక్రాలను వెతుక్కుంటూ.. బయటకు వచ్చి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టేందుకు దీక్ష చేపడుతుందన్నారు. విజయవాడ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరప్రసాద్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీక్ష ప్రజాస్వామ్య ఆయుధమని, కానీ చంద్రబాబు లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేకులు దీక్ష చేపడితే.. దాని అర్థం మారిపోతుందన్నారు. పరిపాలన అంతా జన్మభూమి కమిటీల్లోనే పెట్టారని, కలెక్టర్లకు అధికారాలు లేకుండా చేశారని వరప్రసాద్ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులెలా ఇస్తారని అన్నారు. హోదాపై ప్రజల్లో చైతన్యం వచ్చిందంటే వైఎస్సార్ సీపీ వల్లేనని, హోదా వచ్చి ఉంటే ఏపీ ఇంత మొత్తంలో అప్పు చేయాల్సి వచ్చేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చంద్రబాబు ఏరోజు హోదా గురించి మాట్లాడలేదన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ దీక్ష చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ కూడా మోసం చేసిందని, చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టారని వరప్రసాద్ అన్నారు. సీఎంగా కొనసాగే హక్కు చంద్రబాబుకు ఉందా అని ఆయన ప్రశ్నలు సంధించారు. ప్రజలను మోసం చేయడంలోనే చంద్రబాబుకు అనుభవం ఉందని, ప్రతి రంగంలో ఉన్నవారిని మోసం చేసి ఓట్లు వేయించుకుని, తన తప్పు లేదన్నట్లు చంద్రబాబు బీజేపీపై నెపాన్ని నెడుతున్నారన్నారు. మొదట నుంచి హోదా కోసం పోరాటం చేసింది వైఎస్సార్ సీపీనే అని, చివరకు పార్లమెంట్లో 13సార్లు అవిశ్వాసం పెట్టామని, హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలందరూ రాజీనామా చేశామని ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. -
ఆందోళనలో ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం ,ఆస్పత్రికి తరలింపు
-
క్షీణించిన ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం ,ఆస్పత్రికి తరలింపు
-
క్షీణించిన ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హెదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీల ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. శనివారం మేకపాటి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా తిరపతి ఎంపీ వరప్రసాద్ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన శనివారం సాయంత్రం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీనితో పాటు డీ హైడ్రేషన్కు గురయ్యారు. పలు పరీక్షలు జరిపిన రామ్మనోహర్లోహియా వైద్యులు పరిస్థితి ఆందోళన కరంగా ఉందని, దీక్ష వెంటనే విరమించాలని వరప్రసాద్కు సూచించారు. రక్తంలో షుగర్ లెవల్స్ 72కు పడిపోయాయని, దీక్ష కొనసాగించడం ప్రమాదకరం అని డా. భల్లా వైద్య బృందం తెలిపింది. ఈ పరిస్థితులపై ఏపీ భవన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పందించారు. వైస్సార్ సీపీ ఎంపీలు దీక్ష విరమించాలని కోరారు. ఇప్పటికే మేకపాటి ఆరోగ్యం క్షీణించిందని తాజాగా వరప్రసాద్ సైతం అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. వైద్యుల సూచన మేరకు దీక్ష విరమించాలని, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే వైద్యుల విన్నపాన్ని వరప్రసాద్ సున్నితంగా తిరస్కరించారు. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన దీక్షాస్థలికి చేరుకున్నారు. బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. -
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన
-
లాలూచీ కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన
-
ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి: వైఎస్ఆర్సీపీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై తొమ్మిదోసారి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కోరుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై వంద మందికి పైగా ఎంపీల మద్ధతు కూడగట్టామని, సభలో స్పీకర్ నేడు చర్చ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు రాజీనామాలతో పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య చరిత్రలో తొలిసారి అని వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. ఏదో సాకు చూపించి తీర్మానంపై చర్చ చేపట్టకుండా సభను వాయిదా వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంపీల మద్దతు ఉన్నప్పటికీ తీర్మానంపై చర్చనుంచి తప్పించుకోవడానికి బీజేపీ చూస్తుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కేవలం తన రాజకీయలబ్ది కోసమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ జపం చేస్తున్నారని విమర్శించారు. లాలూచీ కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వస్తున్నారని, టీడీపీ అసమర్ధత వల్లే ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. గత నాలుగేళ్ల నుంచి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలకు విప్ జారీ కాగా, తమ ఎంపీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. నేటి నుంచి చివరిరోజు వరకు పార్టీ ఎంపీలందరూ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని కోరింది. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా సభలో వ్యవహరించాలని ఆదేశించింది. -
చంద్రబాబు రాత్రికి రాత్రే రంగులు మార్చారు
-
జంప్ జిలానీలను కాపాడేందుకే టీడీపీ డ్రామాలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరొస్తుందోనని భయపడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే రంగులు మార్చారని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు. నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నానని చెప్పిన అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకుని, లేదు మేం వేరుగా వెళ్తున్నామంటూ చంద్రబాబు ప్రకటించాడన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో ఎంపీ వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీకి భయపడి తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి వస్తుందని, అంతేగానీ వారికి టీడీపీకి ప్రత్యేక హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులు ఇచ్చారని, అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాకు ప్రాణం పోసింది వైఎస్ఆర్సీపీ అని, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పోరాటాలతోనే హోదా ఉద్యమం ఉధృతమైందన్నారు. టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలపై అనర్హత వేటు పడుతుందనే భయంతోనే చంద్రబాబు ఎన్డీఏ నుంచి భయటకు వచ్చారని చెప్పారు. అవిశ్వాసానికి ముందుకు రాకపోతే వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేస్తుందని, చర్చ, ఓటింగ్ జరిగితే టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీలపై వేటు పడుతుందన్న భయంతోనే హోదా విషయంలో ముందుకొచ్చారని చంద్రబాబు కుటిలనీతిని వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ బహిర్గతం చేశారు. -
అవిశ్వాసానికి మేం సిద్ధంగా ఉన్నాం
-
హోదాను సాధించలేని అసమర్థ సీఎం
సాక్షి, అమరావతి: 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నానని గొప్పలు చెబుతున్న సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించలేని అసమర్థ సీఎంగా చరిత్రలో నిలిచిపోయారని వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిలో నంబర్ వన్గా ఉన్నామంటూ ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు అవినీతిలో నంబర్ వన్ స్థానంలో నిలిచారని దుయ్యబట్టారు. తనకు రెండు ఎకరాలు మాత్రమే ఉండేదని చెబుతున్న చంద్రబాబు దేశంలోనే సంపన్న సీఎంగా ఎలా ఎదిగారని ప్రశ్నించారు. రాజకీయ చరిత్రలో ప్రజలకు గుర్తుండిపోయేలా ఒక్క మంచి పనైనా చేయలేకపోయారని విమర్శించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో సంక్షేమానికి బాట వేయడం వల్లే ప్రజలు ఆయన్ను మరిచిపోలేదన్నారు. వైఎస్ హయాంలో పేదల కోసం 48 లక్షల ఇళ్లు నిర్మించడంతో పాటు ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 వంటి ఎన్నో పథకాలను అమలు చేసి నిరుపేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. వచ్చింది రూ.15 వేల కోట్ల పెట్టుబడులే విశాఖపట్నంలో మూడు సార్లు పెట్టుబడుల సదస్సులను నిర్వహించడం వల్ల రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పైకి చెబుతున్నా వాస్తవానికి ఈ సదస్సుల మూలంగా రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని వరప్రసాద్ తెలిపారు. ప్రత్యేక హోదా సాధించి ఉంటే కేంద్రం నుంచి 90 శాతం చొప్పున గ్రాంట్లు వచ్చేవని తద్వారా పరిశ్రమలు ఎక్కువగా వచ్చేవని చెప్పారు. రాష్ట్రానికి హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఎప్పుడూ కోరలేదన్నారు. 10 సంక్షేమ పథకాల అమలుకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను చంద్రన్న కానుక, చంద్రన్న బాట, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలకు నిధులను మళ్లించారని ఆరోపించారు. ఎన్నికల ముందు 600 హామీలిచ్చి వాటిలో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేకహోదా కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు పదవుల రాజీనామాకు సిద్థమయ్యామని, చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలూ రాజీనామాకు సిద్ధపడాలని సూచించారు. పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఓటుకు నోటు కేసులో తెలంగాణ పోలీసులకు దొరికిపోయిన చంద్రబాబు కేసు నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి పారిపోయారన్నారు. -
యువత భవిష్యత్తు కోసం దేనికైనా రెడీ
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ వరప్రసాద్ మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్లలో చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రానికి పదిహేనేళ్లు ప్రత్యేకహోదా కావాలని అడిగిన చంద్రబాబు మళ్లీ ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. నలభై ఏళ్ల అనుభవం ఉండి కూడా రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీ లేదని, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పెట్టుబడుల పేరుతో సదస్సు పెట్టి దాదాపు 20లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ డప్పుకొట్టుకున్నారని, కానీ ఇప్పటి వరకూ సాధించింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి రాయితీల రూపంలో ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారంటూ ప్రశ్నించారు. అసలు ప్రత్యేక ప్యాకేజీలో ఏం వచ్చిందో, అందులో ఏముందో ఏరోజు అగిడిన పాపాన పోలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదు సంతకాలు చేస్తానని చెప్పిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయకపోవడంతో వడ్డీల భారంతో సతమతమౌతున్నారని అన్నారు. బెల్టు షాపులను పూర్తిగా నిషేధిస్తామని ప్రకటించిన చంద్రబాబు వాటిని రద్దు చేయకుండా మహిళలను మోసం చేశారంటూ మండిపడ్డారు. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకొనే చంద్రబాబు రాజకీయ అనుభవంలో ఏఒక్క మంచి పనినైనా చేశారా అని ప్రశ్నించారు. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. పోలవరం, ప్రత్యేక ప్యాకేజీపై శ్వేతపత్రం కావాలని డిమాండ్ చేశారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఊసరవెళ్లిలా రంగులు మారుస్తున్నారంటూ విమర్శించారు. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడానికే కాదు ఏం చేయడానికైనా సిద్ధమేనని వరప్రసాద్ అన్నారు. -
ఢిల్లీలో ధర్నాకు అనుమతి లభించింది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం మార్చి 5న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు అనుమతి లభించిందని వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాదరావు తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో డీసీపీ మధుర్వర్మను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాజీలేని పోరాటం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 5న ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్లో ధర్నా నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని వివరించారు. -
‘హోదా ఇవ్వకుంటే ఏప్రిల్ 6న ఎంపీ పదవికి రాజీనామా’
సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీలు మరోసారి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఏప్రిల్ 6న ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్రెడ్డి స్పష్టం చేశారు. హోదా విషయంలో రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం మంత్రి నక్కల హరిబాబు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్కు తగదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి హితవు పలికారు. టీడీపీ ఎంపీలూ కలిసిరావాలి: వరప్రసాద్ చిత్తూరు: ప్రత్యేక హోదా కోసం మొదటినుంచీ పోరాడుతోంది వైఎస్ఆర్సీపీనే అని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలు కూడా తమతోపాటు రాజీనామా చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. -
ఏపీ సీఎం అసమర్థుడు
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి సభ నుంచి బయటకు వెళ్లారు. అనంతరం బడ్జెట్పై చర్చలో గల్లా జయదేవ్ వైఎస్సార్సీపీపై దూషణలతో ప్రసంగం ప్రారంభించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి సభలోకి వచ్చి జయదేవ్ వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ఆ వెంటనే స్పీకర్ను కలిసి ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. బడ్జెట్పై చర్చలో భాగంగా తమకూ అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో వరప్రసాదరావుకు అవకాశం కల్పించారు. ‘‘టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగంలో మా పార్టీ అధ్యక్షుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మా అధ్యక్షుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించారు. ఒకవేళ అలా జరిగి ఉంటే సిల్లీ కారణాలపై 16 నెలలు జైల్లో ఉండేవారు కాదు. ఒక వ్యక్తి ఇక్కడ లేనప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతారు? ఇది పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధం. ఆ వ్యాఖ్యలను స్పీకర్ తొలగించాలి..’’ అని వరప్రసాదరావు కోరారు. దీనికి వెంటనే సభాపతి స్థానంలో ఉన్న ఉపసభాపతి స్పందిస్తూ.. అన్పార్లమెంటరీ పదాలు ఉంటే వాటిని తొలగిస్తామని ప్రకటన చేశారు. ఆ తర్వాత వరప్రసాదరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్రప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ‘‘ఏపీ ముఖ్యమంత్రి పూర్తిగా అసమర్థుడు. నాలుగేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోయారు’’ అని మండిపడ్డారు. పట్టిసీమలో అవినీతి జరిగిందని కాగ్ తప్పు పట్టిందని.. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
-
టెక్ 2017 సదస్సు సందర్శించిన ఎంపీ వరప్రసాద్
-
మా ఎమ్మెల్యేలను టీడీపీ దొంగిలించింది
-
మా ఎమ్మెల్యేలను టీడీపీ దొంగిలించింది
తిరుపతి సెంట్రల్: తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ దొంగిలించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మండిపడ్డారు. స్పీకర్ తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. తిరుపతి ప్రెస్క్లబ్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా వారిని మంత్రులుగా చేశారని, వెంటనే వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేశాకే తాము అసెంబ్లీలో అడుగు పెడతామని తమ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హుందాగా చెప్పారన్నారు. అయితే, ప్రజా కోర్టులో ఎక్కడ తాము దొంగలుగా మిగులుతామోననే భయంతో అధికారపార్టీ ఉన్నఫళంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. తమకు ప్రజలే దేవుళ్లని, మూడేళ్లుగా అధికార పక్షం ఏవిధంగా ప్రతిపక్షంపై దాడి చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందో ప్రజలందరికీ తెలిపేందుకే వైఎస్ జగన్ ప్రజా సంక్పల యాత్రను చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనీయకండా అడ్డుకోవడం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా తమ ఎమ్మెల్యేల గొంతు నొక్కేస్తున్నారని, ఇదేనా ప్రజాస్వామం అంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు అసెంబ్లీకి తమ ఎమ్మెల్యేలు హాజరైనా ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. అసలు అభివృద్ధే జరగలేదని నెత్తీనోరు కొట్టుకుంటుంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాను చెప్పిందే అంతా జరగాలన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయనపాటి మమత, మైనార్టీ నాయకులు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ, ఎస్టీ విభాగం నాయకులు హనుమంత నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘మా ఎమ్మెల్యేలను టీడీపీ దొంగలించింది’
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు తీరు అప్రజాస్వామికంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటిస్తూ, మంత్రులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను తక్షణమే బర్తరఫ్ చేయాలని ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేయాలని, తమ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను దొడ్డిదారిన టీడీపీ దొంగలించిందన్నారు. గురువారం ఆయన తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో .. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రపై అధికార పార్టీ, విషం కక్కుతున్న ఎల్లో మీడియా తీరును తప్పుబడుతూ, ప్రజలకు వాస్తవాలను వివరించారు. ఫిరాయింపుకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుని, వీటన్నింటిని అమలు చేశాకే తాము అసెంబ్లీలోకి అడుగు పెడుతామంటూ వైఎస్ జగన్ హుందాగా చెప్పడం జరిగిందన్నారు. అయితే ప్రజాకోర్టులో ఎక్కడ తాము దొంగలుగా మిగులుతామేమోనని అధికార పార్టీ ఉన్నఫలంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసిందన్నారు. పైగా అభివృద్దిని అడ్డుకుంటోందని, ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని ప్రతిపక్షంపై అనవసరపు నిందలు మోపుతోందన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. ప్రజాసంకల్పయాత్రలో జగన్కు లభిస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు సర్కార్ భయపడుతోందన్నారు. వైఎస్ జగన్ చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రకు ఓ లక్ష్యం ఉందన్నారు. తమకు ప్రజలే దేవుళ్లని, మూడేళ్లుగా అధికార పక్షం ఏవిధంగా ప్రతిపక్షంపై దాడి చేసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందో ప్రజలందరికీ తెలిపేందుకే ఆయన పాదయాత్రను చేపడుతున్నట్టు ఎంపీ వరప్రసాద్ తెలిపారు. -
సీఎం ప్రలోభాల వల్లే పార్టీ ఫిరాయింపులు
తెనాలి అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోభాలకు గురిచేయడం వల్లే ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్ అన్నారు. పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఫిరాయింపులకు తెర తీయడం మంచిపద్ధతి కాదన్నారు. ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండబోదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం తెనాలిలోని ఒక హోటల్లో వైఎస్సార్సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం విడుదల అవుతున్న నిధులను చంద్రబాబు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల కోసం నిధులను రాష్ట్రానికి అందజేస్తోందని, అవి కూడా లబ్ధిదారులకు చేరకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇలా జరగడానికి ప్రధాన కారణం జన్మభూమి కమిటీలేనని, వెంటనే ఆ కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సమావేశంలో రాష్ట్ర దళిత నాయకులు గోళ్ళ అరుణ్కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి యాజలి జోజిబాబు తదితరులు పాల్గొన్నారు. -
నిజమైన ప్రజాస్వామ్యం లేదు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమంటారు. కానీ ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అసమానత్వం పెరిగిపోతోంది. అధికారంలో ఉన్న వారికే దేశ సంపద చెందుతోంది. పేదల పరిస్థితిలో పురోగతి కానరావడం లేదు. రాష్ట్రంలోనూ దాదాపు అదే పరిస్థితి అని తిరుపతి ఎంపీ వెలగపూడి వరప్రసాద్ ఆవేదన వెలిబుచ్చారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మూడేళ్ల కాలంలో తిరుపతి లోక్సభ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. రాజకీయంగా ప్రజలకు సేవలందించడం పవిత్రమైన వృత్తిగా ఎంపీ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఈ రంగాన్ని చాలా మంది తప్పుగా భావిస్తున్నారన్నారు. ఈ మూడేళ్ల కాలంలో 1,300 గ్రామాల్లో పర్యటించిన తాను రాజకీయాలకతీతంగా సమస్యలు పరిష్కరించానన్నారు. ఇప్పటివరకూ 90 మందికి ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కింద రూ.1.50 కోట్ల మేర ఆర్థిక సాయం అందించానని వెల్లడించారు. ఏర్పేడు లారీ దుర్ఘటనలో మృతి చెందిన 17 కుటుంబాలకు రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించడం తనకెంతో తృప్తినిచ్చిందని చెప్పారు. ఇకపోతే రైల్వేస్టేషన్ల అభివృద్ధి, కొత్తగా ఆర్యూబీల నిర్మాణం, కొత్త రైళ్ల ఏర్పాటు వంటి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. మురికివాడల అభివృద్ధి, ఇతరత్రా పనుల కోసం ఇప్పటివరకూ రూ.22 కోట్ల ఎంపీ ల్యాడ్స్ వినియోగించామని తెలిపారు. త్వరలో తిరుపతి నుంచి మలేషియా, సింగపూర్, దుబాయ్ దేశాలకు ఎయిరిండియా విమానం ప్రారంభం కానుందని, ఈ మేరకు విమానయాన శాఖ మంత్రి నుంచి ఆమోదం లభించిందని వివరించారు. ఉపాధి పనులు గాడి తప్పుతున్నాయి.. దేశమంతా ఉపాధి పనుల కోసం రూ.48 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇందులో మన రాష్ట్రంలో ఈ పనులు అధ్వానంగా జరుగుతున్నాయని తిరుపతి ఎంపీ వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి లోక్సభ పరిధిలోని 1,300 గ్రామాల్లోనూ కేవలం 30 శాతం పనులే పేదలకు ఉపాధి కల్పించాయని చెప్పారు. వైఎస్ హయాంలో 90 శాతం వేజ్ కాంపోనెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజలతో చేయించాల్సిన పనులను మెషీన్లతో చేయిస్తున్నారని తెలిపారు. నీరు–చెట్టు పనుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. పంట సంజీవని పనులనూ ఉపాధి పనులుగా చూపించి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలదే పెత్తనంగా మారిందని, చివరకు కలెక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. అర్హత గలవారికే ట్రాక్టర్లు ఇవ్వాలని కోరితే కలెక్టర్లు చేతులెత్తేస్తున్నారని తెలిపారు. పేదల భూములను గుంజుకుని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. జీడీపీ ప్రకటనల్లో మాత్రమే పెరిగిందని, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని తెలిపారు. 1982–83లో దేశసంపద 90 శాతం బీసీలు, ఎస్సీలు అనుభవించారని, ఇప్పుడు 40 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుబులిటీ రిపోర్టు ఉన్నా దుగ్గరాజపట్నం పోర్టుపై శ్రద్ధ పెట్టడం లేదని ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు మరోసారి అవకాశమిస్తే దుగ్గరాజపట్నం పోర్టును సాధిస్తానన్నారు. -
నీటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నం
-
రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థ నిర్వీర్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులకు కూడా ఎలాంటి అధి కారాలు లేకుండా చేశారని, అంతా అధికార పార్టీ నేతలతో ఏర్పాటైన జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మూడేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నీరుగార్చి, పాలనాపరంగా ఘోరంగా విఫలమైన బాబు ముస్సోరి వెళ్లి ఐఏఎస్లకు ఎలాంటి శిక్షణ ఇస్తారు? జన్మభూమి కమిటీలతో కలెక్టర్ల అధికారాలన్నింటినీ కత్తిరించానని చెబుతారా?’ అని సూటిగా ప్రశ్నించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వరప్ర సాద్ విలేకరులతో మాట్లాడారు.ఏపీలో సీఎం కార్యాలయమే రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందన్నారు. మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు విమర్శిస్తే ఇప్పటి వరకు సమాధానమే చెప్పలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఏ మాత్రం విలువ లేదని వరప్రసాద్ విమర్శించారు. రాష్ట్రంలో దారుణంగా పాలన సాగిస్తున్న బాబు ముస్సోరి వెళ్లి ఐఏఎస్లకు పాఠాలు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. -
పోర్టు కోసం పోరాటం
-
పోర్టు కోసం పోరాటం
- చంద్రబాబూ.. దుగరాజపట్నం నిర్మాణానికి అడ్డుపడొద్దు: ఎంపీ వరప్రసాద్ - దీక్షకు మద్దతు పలికిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నేతలు వాకాడు(గూడూరు): దుగరాజపట్నం పోర్టు కోసం కేంద్ర ప్రభుత్వంతో మూడున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నామని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావు పేర్కొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగ్గరాజపట్నంలో సోమవారం ఆయన పోర్టు సాధన కోసం ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, కిలివేటి సంజీవయ్య, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు ఎంపీ వరప్రసాద్రావు నిరాహార దీక్షకు మద్దతు పలికి పరామర్శించారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు వరంలా వచ్చిన దుగరాజపట్నం పోర్టు గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎంపీ వరప్రసాద్రావు పేర్కొన్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అభివృద్ధి చెందాలంటే దుగరాజపట్నం పోర్టు ఈ ప్రాంతానికి ఎంతో అవసరమన్నారు. పోర్టు నిర్మాణానికి అడ్డుపడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నామని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలు, దళితులు, మహిళలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలన్నారు. పోర్టు నిర్మాణం, కోస్టల్ కారిడార్ ఏర్పాటు కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం చంద్రబాబు అధికార దాహంతో కలెక్టర్ల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, సీఈసీ, సీజీసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, నెల్లూరు జిల్లా యువజన అధ్యక్షుడు రూపకుమార్యాదవ్, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
దేశంలోనే నంబర్వన్ అవినీతి చక్రవర్తి బాబు
► ఎంపీ వెలగపల్లి, ఎమ్మెల్యే కిలివేటి సూళ్లూరుపేట : ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్రను దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలుపుతానని చెబుతుoటా డని, అయితే ఆయనే దేశంలో నంబర్ వన్ అవినీతి చక్రవర్తిగా పేరు ప్రఖ్యాతులు గడించారని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టీవీఆర్ఆర్ కల్యాణమండపంలో నవరత్నాల సభ నిర్వహించారు. తొలుత పెళ్లకూరు మండలం చిల్లకూరు సర్పంచ్ బసివిరెడ్డి వెంకట శేషారెడ్డి మృతికి మౌనం పాటించారు. సభా కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన ఎమ్మెల్యే కిలివేటి ముందుగా అధ్యక్షోపన్యాసం చేశారు. నిరుపేద ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన నవరత్నాలను బూత్ కమిటీ చైర్మన్లు, గ్రామ కమిటీ చైర్మన్లు ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు. నంద్యాల ఎన్నికల ఫలితం చూసి జడవాల్సిన పనిలేదన్నారు. సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి, క్యాబినెట్లో పనిచేసే మంత్రులు వచ్చి అక్కడే కూర్చుని అధికార యంత్రాంగాన్ని, పోలీసులను వాడుకుని సుమారు రూ.200 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారన్నారు. దీనిని గెలుపుగా ఎవరూ భావించాల్సిన అవసరం లేదన్నారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారన్నారు. గడిచిన పదేళ్ల కాంగ్రెస్పాలనలో 51 సార్లు ఎన్నికలు జరిగితే అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఒక్కసీటు గెలవలేదని గుర్తుచేశారు. ముఖ్యఅతిథి ఎంపీ వెలగపల్లి మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడ అవినీతి సంపాదన ఉంటుందో అక్కడ వాలిపోతారన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లేఖ రాసుంటే దుగరాజపట్నం ఓడరేవు వచ్చి ఉండేదన్నారు. వైఎస్సార్ హయాంలో ఈ ప్రాంతంలో మేనకూరు, మాంబట్టు, శ్రీసిటీ సెజ్లు ఏర్పాటై సుమారు లక్షమందికి పైగా ఉపాధి లభించిందన్నారు. ఈ మూడున్నరేళ్లలో బాబు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి వైఎస్ జగన్ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ నేతలు సంజీవయ్యను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా వైఎస్సార్ సీపీలోనే ఉంటానని చెప్పారని పొగడ్తలతో ముంచెత్తారు. పార్టీ నియోజకవర్గం నేతలు దువ్వూరు బాలచంద్రారెడ్డి, కామిరెడి సత్యనారాయణరెడ్డి, కట్టా సుధాకర్రెడ్డి, కట్టా రమణారెడ్డి, నలుబోయిన రాజసులోచనమ్మ, కురుగొండ ధనలక్ష్మి, పాలూరు మహేంద్రరెడ్డి, దేశిరెడ్డి మధుసూదన్రెడ్డి, వేణుంబాక విజయశేఖర్రెడ్డి, గునిశెట్టి వెంకటేశ్వర్లు, ఆరు మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించండి
- కేంద్రాన్ని కోరిన వైఎస్సార్సీపీ - ‘పోలవరం’ కేంద్రమే చేపట్టాలి: ఎంపీ వెలగపల్లి సాక్షి, న్యూఢిల్లీ: విభజన కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేసింది. మంగళవారం లోక్సభలో సప్లిమెంటరీ డిమాండ్స్పై జరిగిన చర్చలో ఆ పార్టీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 9 రోజులు నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పటివరకూ కేంద్రం ఈ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. వైజాగ్ – చెన్నై పారిశ్రామిక కారిడార్లో మూడేళ్లయినా ఎటువంటి పురోగతి లేదని, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇక్కట్లలో ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ కారిడార్ను త్వరితగతిన అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు వాస్తవ వ్యయం రూ. 40 వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ జాతీయ ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రమే పూర్తిగా భరిస్తూ ప్రాజెక్టును చేపట్టాలని కోరారు.పేద రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచాలన్నారు. విభజన చట్టంలో పొందుపరచిన విశాఖ రైల్వేజోన్ ఇప్పటివరకూ సాకారం కాలేదని, దీన్ని త్వరితగతిన ప్రకటించాలని కోరారు. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా ఇంతవరకూ అమలు కాలేదని, స్థానికులంతా ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. -
ముస్లింలకు వైఎస్సార్సీపీ అండ
- ఎంపీ వరప్రసాదరావు - ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా న్యూఢిల్లీ: ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు తెలిపారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లే ఏపీలో కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్లను పెంచాలని కోరారు. ముస్లిం ఐక్య వేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఏపీలో 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు పలికిన వరప్రసాదరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారని, విద్య, ఉద్యోగ రంగాల్లో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. ముస్లింల ఐక్య వేదిక సంఘం అధ్యక్షుడు షేక్ జలీల్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబడిన ముస్లింలను ఆదుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ సభ్యునికి కూడా స్థానం కల్పించకుండా అన్యాయం చేసిందని మండిపడ్డారు. ధర్నాలో సంఘం రాష్ట్ర కార్యదర్శి మౌలాన ఆరీఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు
రాపూరు: వైఎస్సార్సీపీలో గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబునాయుడు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటని తిరుపతి ఎంపీ వరప్రసాద్రావు పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా నియమించలేదన్నారు. మండలంలోని గోనుపల్లి గ్రామంలో నూతన రామమందిరంలో ఆదివారం జరిగిన కుంభాభిషేక మహోత్సవానికి జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కువైందని విమర్శించారు. గోనుపల్లి ఎస్టీకాలనీలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎంపీ నిధులు రూ.5లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్ఎస్ కెనాల్ కోసం పోరాటం: జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి సోమశిల స్వర్ణముఖి లింకు కెనాల్ కోసం పోరాడుతామని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. ఎస్ఎస్కెనాల్కు ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. అటవీశాఖ అనుమతులు రాలేదని అర్ధంతరంగా నిలిపివేశారన్నారు. ఎస్ఎస్ కెనాల్ పూర్తయితే గోనుపల్లి, రాపూరు చెరువులు రిజర్వాయర్లుగా మారుతాయన్నారు. ఎస్ఎస్ కెనాల్ కింద వేల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. ఎస్ఎస్కెనాల్ నిర్మాణానికి కృషి చేసి రైతులను ఆదుకుంటామన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి 1200 బోర్లు వేసేందుకు రూ.20కోట్లు అవసరమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బండి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ భవనానికి రూ.2లక్షలు మంజూరవుతాయన్నారు. ఈ సమావేశంలో పెంచలకోన మాజీ చైర్మన్ రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జయరావిురెడ్డి, పాపకన్ను దయాకర్రెడ్డి,సిద్దవరం సర్పంచ్ మురళీమోహన్ రెడ్డి, చెంచురావి రెడ్డి, మధుసూదనరెడ్డి, తిరుపాల్రెడ్డి, సర్పంచ్ శారద, ఎంపీటీసీ సభ్యురాలు యోజన పాల్గొన్నారు. -
ఐదేళ్ల తర్వాత నష్టాలు ఎవరు భర్తీ చేస్తారు?
జీఎస్టీ బిల్లుపై ఎంపీ వెలగపల్లి సాక్షి, న్యూఢిల్లీ: అనేక ప్రయోజనాలున్న జీఎస్టీ బిల్లును తేవడం ప్రశంసనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు చెప్పారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదేళ్ల వరకు కేంద్రం భర్తీ చేస్తుందని చెప్పారని, ఐదేళ్ల తరువాత నష్టాలు కొనసాగితే ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ విషయంమై నిర్ణయం తీసుకోవాలని కోరారు. బుధవారం జీఎస్టీ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్రం వివిధ వస్తువులపై సెస్ వేసి నిధిని తయారు చేయాలనుకుంటోందని, అయితే అది కేవలం స్వల్ప మొత్తమే అవుతుందని వరప్రసాదరావు పేర్కొన్నారు. అలాంటప్పుడు నష్టాలను ఎక్కడి నుంచి భర్తీచేస్తారని ప్రశ్నించారు. లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై సెస్ విధించాలనుకోవడంలో తప్పులేదని, అయితే ఆల్కహాలేతర శీతలపానీయాలపై కూడా సెస్ విధించాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చిన్న చిన్న రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై అదనపు సెస్ విధించడం మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమే అవుతుందని, ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలును లక్ష్యంగా పెట్టుకున్నారని, అయితే అప్పటికి పరిశ్రమలు, అధికార యంత్రాంగం సంసిద్ధులై ఉండడం కష్టసాధ్యమైనందున ఈ అంశాన్ని కూడా పునః పరిశీలించాలని కోరారు. -
'జీఎస్టీ నష్టాలను ఎవరు భరించాలి'
న్యూఢిల్లీ: అనేక ప్రయోజనాలు ఉన్న జీఎస్టీ బిల్లును తేవడం ప్రశంసనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం జీఎస్టీ బిల్లుపై లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదేళ్ల వరకు కేంద్రం భర్తీ చేస్తుందని చెప్పారని, అయితే ఐదేళ్ల తరువాత నష్టాలు కొనసాగితే ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. వస్తువుల వర్గీకరణ, కేంద్ర, రాష్ట్ర వాటా, రూ. 1.5 కోట్ల లోపు, పైబడి టర్నోవర్ ఉన్న సంస్థలపై అజమాయిషీ తదితర అంశాలను బిల్లులో చేర్చాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాల నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్రం వివిధ వస్తువులపై సెస్ వేసి నిధిని తయారు చేయాలనుకుంటోందని, అయితే అది కేవలం స్వల్ప మొత్తమే అవుతుందని పేర్కొన్నారు. అలాంటప్పుడు నష్టాలను ఎక్కడి నుంచి భర్తీచేస్తారని ప్రశ్నించారు. లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై సెస్ విధించాలనుకోవడంలో తప్పులేదని, అయితే ఆల్కహాలేతర శీతలపానీయాలపై కూడా సెస్ విధించాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గ్రామీణులు సైతం వీటిని విరివిగా వినియోగిస్తున్న సంగతిని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. 12 నాటికల్ మైళ్ల మేర సముద్ర ప్రాదేశిక జలాల పరిధిని రాష్ట్రాల పరిధిలోకి తేవడం వల్ల ఆ సరిహద్దును పంచుకునే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు రాకుండా చూడాలని కోరారు. చిన్న చిన్న రిఫ్రిజిరేటర్లు, ఏసీలపై అదనపు సెస్ విధించడం మధ్య తరగతి ప్రజలపై భారం మోపడమే అవుతుందని, ఈ విషయాన్ని మరొకసారి పరిశీలించాలని కోరారు. జులై 1 నుంచి జీఎస్టీ అమలును లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇందుకు పరిశ్రమలు, అధికార యంత్రాంగం సంసిద్ధులై ఉండడం కష్టసాధ్యమైనందున ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలని కోరారు. -
హోదా ఇవ్వకపోవడం మోసగించడమే
ధన్యవాద తీర్మానంపై ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగంలో ఏపీకి ప్రత్యేక హోదా అమలు విషయం లేదని, ప్రత్యేక హోదా అమలు చేయక పోవడం రాష్ట్ర ప్రజలను మోసగించడమే అవుతుందని వైఎస్సార్ సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు పేర్కొ న్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై జరిగిన చర్చలో ఆయన తన ప్రసంగాన్ని సభకు సమర్పించారు. ‘ప్రత్యేక హోదా అమలుచేయకపోవడం రాష్ట్ర ప్రజలను మోస గించడమే. అన్ని ప్రముఖ జాతీయ పార్టీలు, నాయకులు హామీ ఇచ్చిన విధంగా ఏపీకి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలి. అలాగే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ను ప్రకటించాలి..’ అని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేవలం 55 వేల గ్యాస్ కనెక్షన్లు మంజరు చేశారన్నారు. స్టాండ్ అప్ ఇండియా స్కీమ్ బాగున్నా.. ఎస్సీ, ఎస్టీల రుణాలకు తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. తిరుపతి నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ పూర్తిస్థాయిలో పని దినాలు కల్పించలేదని పేర్కొన్నారు. -
పేదలు ఉపాధి కోల్పోతున్నారు
వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వరప్రసాదరావు సాక్షి, న్యూఢిల్లీ: నల్ల ధనం అరికట్టేందుకు పెద్ద నోట్ల రద్దు ఆలోచన బాగానే ఉన్నా పటిష్ట ప్రణాళిక లేకపోవడంతో సామాన్యులు తీవ్రంగా ఇక్కట్ల పాలవుతున్నారని, చివరకు రోజువారీ కూలిని కూడా కోల్పోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాత నోట్లను రద్దు చేసినప్పుడు పటిష్ట ప్రణాళిక అవసరమనీ అది లోపించిందన్నారు. -
పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డు
తిరుపతి ఎంపీ వరప్రసాద్రావు కోట : మండలంలోని దుగ్గరాజపట్నంలో ఓడరేవు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందని తిరుపతి ఎంపీ వరప్రసాద్రావు ఆరోపించారు. ఆదివారం కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్కుమార్రెడ్డి నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోనే పోర్టును పొందుపరచారని, దానిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. తాను పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తినపుడు కేంద్రమంత్రి నితిన్గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే వెంటనే పోర్టు ఏర్పాటుకు సిద్ధమన్నారు. కష్ణపట్నం పోర్టు ప్రయోజనాల దష్ట్యా సీఎం చంద్రబాబునాయుడు దుగ్గరాజపట్నం పోర్టును వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజీని సమర్ధిస్తున్న టీడీపీ నాయకులు హోదాను ఎందుకు వద్దో ప్రజలకు తెలపాలన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ముఖ్యమంత్రి కష్ణా పుష్కరాలకు వినియోగించి దుర్వినియోగం చేశారన్నారు. నిధులివ్వండి స్థానిక ముస్లిం వీధిలో మహిళలు డ్రైనేజీ కాలువల కోసం నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరారు. కోట దళితవాడలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. కోట పంచాయతీకి రూ.6 లక్షలు ఎంపీ నిధులు వెచ్చించి కొత్త ట్రాక్టర్ను కొనుగోలు చేయగా దానిని పరిశీలించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సంపత్కుమార్రెడ్డి, యూత్ రాష్ట్ర కార్యదర్శి పల్లెమల్లు వెంకట కష్ణారెడ్డి, కోట సర్పంచ్ రాఘవయ్య, ఉపసర్పంచ్ ఇంతియాజ్, గాది భాస్కర్ పాల్గొన్నారు. -
రూ.12 కోట్లతో అభివృద్ధి పనులు
తిరుపతి ఎంపీ వెలగపల్లి కామకూరు(బాలాయపల్లి) : రూ.12 కోట్లుతో తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని కామకూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రూ.7.50 లక్షలతో బస్షెల్టర్, సీసీరోడ్లు, తాగునీటికి, విద్యుత్ దీపాల ఏర్పాటుకు మంజూరుచేశామన్నారు. కామకూరు నుంచి గాజులపల్లి వరకు, చిలమనూరు గ్రామం నుంచి కామకూరు వరకు, నిడిగల్లు రైల్వేస్టేషన్ నుంచి కొత్తురు గ్రామం వరకు రోడ్డు వసతి కల్పించాలని జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. హోదా వస్తే పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఈకార్యక్రమంలో సూళ్లూరుపేట గడపగడపకు వైఎస్సార్ పరిశీలకుడు గూడూరు భాస్కర్రెడ్డి, గ్రామ సర్పంచ్ కిరణ్మయి, బాలాయపల్లి ఎంపీటీసీ రమేష్ ,పెరిమిడి రామయ్య, సురేంద్రరెడ్డి, కామకూరు రమణయ్య, వెంకటయ్య, పాల్గొన్నారు. -
విగ్రహాలు తొలగించడం పద్ధతికాదు
తిరుపతి ఎంపీ వెలగపల్లి సూళ్లూరుపేట : మహానాయకులు విగ్రహాలు తొలగించడం మంచి పద్ధతి కాదని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. పుష్కరాల పేరుతో వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని తీసేయడం క్షమించరాని నేరమని చెప్పారు. సూళ్లూరుపేటలోని పరమేశ్వరీనగర్లో ఉన్న ఎంపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ మెతకSవైఖరివల్లే ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ విషయంలో మొండిచేయి చూపించారన్నారు. 2వ తేదీన జరిగే బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 2న తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతంగా చేయడానికి పార్టీ శ్రేణులంతా కృషి చేసి బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. షార్ సహకారంతో.. తీరప్రాంత గ్రామాలైన రాగెన్నపట్టెడ, పేర్నాడుల్లో రూ.40 లక్షలతో ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సతీష్ ధవన్ స్పేస్సెంటర్ (షార్) కేంద్రం వారు. సుమఖంగా ఉన్నతారని ఎంపీ తెలిపారు. పట్టణంలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి ముందుకొచ్చారన్నారు. సూళ్లూరులో శ్మశానవాటికను అభివృద్ధి చేయడానికి ఎంపీ ల్యాడ్స్నుంచి రూ.20 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. పట్టణానికి మధ్యలో ఉన్న రైల్వేగేట్కు సబ్వే నిర్మాణంపై రైల్వేమంత్రి సురేష్ప్రభుతో మాట్టాడగా ఆయన ఒప్పుకున్నారని, అయితే నిధులు తమ వద్ద లేవని మీరే సమీకరించుకుని చేసుకోమని చెప్పారని వెల్లడించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు వంకా రామాంజనేయులు, పోకల దుష్యంతయ్య, గోపాలకష్ణయ్య, దామనెల్లూరు ఎంపీటీసీ సభ్యుడు దాసరి జయరామయ్య, సుల్తాన్బాషా, వంకా దినేష్ పాల్గొన్నారు. -
కశ్మీర్పై స్పష్టమైన విధానమేది?
లోక్సభ చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్ అంశంపై ఒక సమగ్ర విధానాన్ని తీసుకొచ్చి అక్కడి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ పరిణామాలపై లోక్సభలో బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘బాధాతప్తమైన హృదయంతో చెబుతున్నా. భారత ప్రభుత్వానికి కశ్మీర్ విషయంలో ఒక స్పష్టమైన విధానం లేదు. ఏదో ఒక చిన్నవిధానం ఎంచుకున్నా అది తాత్కాలికమైందే. కశ్మీర్కు దేశంలోని ఇతర ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు, ప్రజల మనసుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు నిర్మాణాత్మకమైన ప్రణాళికేదీ లేదు. అందువల్ల భారత ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో వచ్చేందుకు ఇదొక మంచిసమయం. స్వాతంత్య్రం వచ్చినవేళ కశ్మీర్ ప్రజలకు మనం అనేక హామీలిచ్చాం. కానీ వాటిని అమలు చేయలేదు. అది ప్లెబిసైట్ కావొచ్చు. రెఫరెండం కావొచ్చు. అవెందుకు చేయట్లేదో కశ్మీర్ ప్రజలకు చెప్పలేకపోతున్నాం. కశ్మీర్ విషయంలో మన వైఖరి దురదృష్టకరమైంది. అందువల్లే ఇప్పుడు అశాంతి నెలకొంది. ప్రజలు అభద్రతతో ఉన్నారు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య శాండ్విచ్లా నలిగిపోతున్నారు. దీనికితోడు మరోపక్కన చైనా. అందువల్ల దేశ ప్రయోజనాలదృష్ట్యా కశ్మీర్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా సమగ్ర విధానం రూపొందాలి’’ అని పేర్కొన్నారు. -
ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ వరప్రసాద్ బుచ్చినాయుడుకండ్రిగ: ప్రజా సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తిరుపతి ఎంపీ వరప్రసాద్ ఆరోపిం చారు. శుక్రవారం నీర్పాకోట గ్రా మంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి అరణివిద్యానాథరెడ్డితో కలసి ఆయన పర్యటిం చారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంద ని, గుక్కేడు తాగునీటి కోసం జ నం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టించుకోవటంలేదన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పంటపొలాలు బీడు పొలాలుగా మారుతాయని తెలిపారు. అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి జలదీక్ష చేశారని గుర్తు చేశారు. ఆయనకు భా రీస్థాయిలో రైతులు మద్దతు తెలుపారన్నారు. నీర్పాకోట గ్రామం లో తాగునీటి ఓవరుహెడ్ట్యాం కును నిర్మిస్తానని, గ్రామంలోని సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అరణివిద్యానాథరెడ్డి, గ్రామస్తు లు బాలాజీ, రామయ్య, మార్కొండేయులు, లక్ష్మయ్య సుబ్రమణ్యం, చిన్నయ్య, ప్రకాష్, పాండయ్య, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఇకనైనా వైదొలగాలి
వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాదరావు సాక్షి, న్యూఢిల్లీః ప్రత్యేక హోదాకు కేంద్రం నిబంధనలను సాకుగా చూపుతోందని, టీడీపీ ఇప్పటికైనా కేంద్రం నుంచి వైదొలగి ఒత్తిడి తేవాలని వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రంలో నిరుద్యోగితకు, పారిశ్రామిక రంగానికి సమాధానం దొరుకుతుందని చెప్పారు. -
సత్తా ఉంటే రాజీనామా చేసి గెలవాలి
పాశం సునీల్కు ఎంపీ వరప్రసాద్రావు హితవు వాకాడు: గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కు సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్రావు పేర్కొన్నారు. వాకాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు డాక్టర్ నేదురుమల్లి పద్మనాభరెడ్డి నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పార్టీ నుంచి పిరికివాడిలా పారిపోవడం దారుణమన్నారు. ఆయన్ను మొదటిసారి ఎమ్మెల్యే చేసిన గూడూరు నియోజవర్గ ప్రజలకు జీవితాంతం దణ్ణం పెట్టుకోవాలని సూచించారు. విలువల్లేని రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. పాశం సునీల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటం చాలా బాధాకరమన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తేనే తాను ఎంపీగా, సునీల్ గూడూరు ఎమ్మెల్యేగా గెలిచామని వివరించారు. ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహించడం దారుణమన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని చంద్రబాబు చూడటం అన్యాయమని చెప్పారు. అనంతరం పద్మనాభరెడ్డి మాట్లాడారు. వరప్రసాద్రావు ఎంపీగా గెలిచిన అనంతరం మండలాల్లో అనేక సార్లు తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని నిధులను కేటాయిస్తున్నారని కొనియాడారు. అనంతరం పాపారెడ్డి మనోజ్కుమార్రెడ్డి కుటుంబసభ్యులను కలిశారు. పార్టీ మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్శేఖర్రెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్కుమార్రెడ్డి, నేదురుమల్లి శ్రీధర్రెడ్డి, కోట ఎంపీటీసీ దారా సురేష్, నాయకులు దుష్యంతయ్య శెట్టి, తుమ్మల మోహన్నాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షులు అడపాల ఏడుకొండలు, సుధాకర్రెడ్డి, గాది భాస్కర్, కుంబాల మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
రాజధాని కూడా లేదని ఎంపీ వెలగపల్లి ఆవేదన సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలుచేసి తీరాలని వైఎస్సార్సీపీ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేసింది. బుధవారం లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై మరోసారి నొక్కిచెప్పారు. ‘స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని మేం మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉన్నాం. మా పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దీనిపై ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. మాకు రాజధాని లేదు. కేంద్రం మమ్మల్ని ఆదుకోవాలి’ అని విన్నవించారు. తాజా బడ్జెట్ గ్రామీణ భారతంపై దృష్టిపెట్టినందుకు ధన్యవాదాలన్నారు. ప్రత్యక్ష బదిలీ పథకం, ఎల్పీజీ వదులుకోండి పథకం, ప్రధాని పంటల బీమా పథకం, గంగా శుద్ధి పథకం బాగున్నాయనీ అయితే ప్రజల్లో అనేక విషయాల్లో అనుమానాలున్నాయన్నారు. -
'కోర్టులో అలాంటి ఘటనలు దురదృష్టకరం'
న్యూఢిల్లీ: పటియాల కోర్టులో జరుగుతున్న పరిణామాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పటియాల కోర్టులో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. -
'ఎన్ని కేసులు పెట్టినా భయపడం'
తిరుపతి: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ ను నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఖండించారు. వైఎస్సార్ సీపీపై సీఎం చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... అక్రమ కేసులతో తమ పార్టీ ప్రజా ప్రతినిధులను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని, బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. తమపై పెట్టిన కేసులను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని చెప్పారు. -
'చట్టాన్ని గౌరవించే పార్టీ మాది'
శ్రీకాళహస్తి: వైఎస్సార్ సీపీని అణగదొక్కడానికే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని తిరుపతి ఎంపీ వరప్రసాద్ ఆరోపించారు. ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. కోర్టులో హాజరుకావడానికి వస్తున్న మిథున్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, కక్షపూరిత రాజకీయాలు వదిలిపెట్టాలని టీడీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. మిథున్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 40 ఏళ్లుగా రాజకీయల్లో ఉన్నారని, ఆయనను ఎదుర్కొలేక ఎలాంటి చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ చట్టాన్ని గౌరవించే పార్టీ అని స్పష్టం చేశారు. అన్యాయాన్ని చూస్తూ ఊరుకోబోమని వరప్రసాద్ అన్నారు. -
టెక్నాలజీతో రైల్వేలను పరుగెత్తిస్తాం
తిరుపతి-షిర్డీ రైలును జెండాఊపి ప్రారంభిస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ రైల్వేల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. తిరుపతి నుంచి షిర్డీకి కొత్తగా ఏర్పాటు చేసిన వారాంతపు రైలును తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, రాష్ట్ర మంత్రులతో కలసి శనివారం ఆయన తిరుపతిలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. తిరుపతికి యాత్రికుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తలైన్లు, డబ్లింగ్-ట్రిబ్లింగ్ పనుల కోసం రూ.15,500 కోట్లు మంజూరు చేశామన్నారు. తిరుపతిలో నిర్మించనున్న మెకనైజ్డ్ ల్యాండ్రీ విభాగానికి రైల్వే మంత్రి శంకుస్థాపన చేశారు. - తిరుపతి అర్బన్ -
నేడు తిరుపతి-షిరిడీ రైలు ప్రారంభం
తిరుపతి అర్బన్: చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు చెందిన షిరిడీ భక్తుల చిరకాల కోరిక నెరవేరనుంది. తిరుపతి నుంచి షిరిడీ(సాయినాథ్ నగర్) వరకు కొత్తగా ఏర్పాటు కానున్న వారాంతపు ఎక్స్ప్రెస్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు శనివారం తిరుపతిలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాయలసీమలోని వివిధ పట్టణాలకు చెందిన లక్షలాది మంది సాయి భక్తులు షిరిడీ చేరుకోవాలంటే వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తోంది. ఈ విషయమై తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ చొరవ తీసుకుని అనేకసార్లు ఢిల్లీలో ప్రధానికి, రైల్వే మంత్రికి విన్నవించారు. పార్లమెంట్లోనూ ఈ అంశాన్ని చర్చించారు. చివరకు రైల్వే మంత్రి తిరుపతి-షిరిడీ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రెండు నెలల క్రితమే మౌఖిక సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో కొత్త రైలు శనివారం ప్రారంభం కానుంది. ఈ రైలు శనివారం ప్రారంభిస్తున్ననప్పటికీ అధికారికంగా జనవరి 5వ తేదీ నుంచి తిరుగుతుంది. రైలు రాకపోకల వేళలివే.. ► 17417 నంబరుతో ఈ రైలు ప్రతి మంగళవారమూ ఉదయం 7 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు షిరిడీకి(సాయినాథ్ నగర్) చేరుకుంటుంది. ► 17418 నంబరుతో షిరిడీలో ప్రతి బుధవారమూ రాత్రి 07.10 గంటలకు బయలుదేరి గురువారం రాత్రి 11.45కు తిరుపతికి చేరుతుంది. -
తిరుపతి ఈద్గా సమస్యపై జగన్తో చర్చించిన ఎంపీ
తిరుపతి మంగళం : తిరుపతిలో ఈద్గా సమస్యపై ఎంపీ వరప్రసాద్ శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఎంపీ వరప్రసాద్ తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తిరుపతిలో ముప్పై సంవత్సరాలుగా ముస్లిం లు ప్రార్థనలు చేసుకుంటున్న ఈద్గా మైదానం తమది అని రైల్వే అధికారులు చెబుతున్నారనీ, అయితే ఇన్ని సంవత్సరాలు తమ ఆధీనంలో ఉన్న మైదనానాన్ని తమకు కేటాయించాలని ముస్లింలు కోరుతున్నారని చెప్పారు. గతంలో ముస్లిం మైనారిటీ నాయకులతో కలసి రైల్వే ఉన్నతాధికారులకు కూడా విన్నవించామని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఎంపీకి హామీ ఇచ్చారు. -
నల్లధనం అరికట్టే వ్యవస్థ ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ: నల్లధనం అరికట్టడానికి మన దగ్గర సరైన వ్యవస్థ ఉందా? అని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు లోక్సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెల్లడించని విదేశీ ఆదాయం, ఆస్తులపై పన్ను విధించే బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రిటర్నులు దాఖలు చేయనివారికి రూ. 10 లక్షల పరిహారం విధించారు. అయితే ఈ నిబంధన అమలుచేసేందుకు వీలుగా మన వద్ద వ్యవస్థ ఉందా?’ అని ప్రశ్నించారు. అలాగే బిల్లులోని నియమ, నిబంధనల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ.. పటిష్ట అమలుకు తగిన సూచనలు ప్రభుత్వానికి ఇచ్చారు. -
సరిహద్దు ప్రజలకు న్యాయం చేయండి
లోక్సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి న్యూఢిల్లీ: భారత్, బంగ్లా మధ్య గల వివాదాస్పద సరిహద్దులో ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావు కేంద్రాన్ని కోరారు. ఈ సరిహద్దులో ఉన్న త్రిపుర, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ పరిధిలో దాదాపు 54 వేల మంది నివసిస్తున్న ప్రాంతం రెండు దేశాలకు చెందకుండా వివాదాస్పద సరిహద్దుగా ఉంది. దీనికి తెరదించుతూ కేంద్రం భూ సరిహద్దు ఒప్పందంపై 119వ రాజ్యాంగ సవరణ బిల్లును గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనిపై చర్చలో పాల్గొన్న ఎంపీ ఈ బిల్లు కారణంగా 34 వేల మంది భారత్కు, 18 వేల మంది బంగ్లాదేశ్కు చెందేలా.. 260 ఎకరాలు బంగ్లాదేశ్కు, 174 ఎకరాలు భారత్కు వచ్చేలా చేస్తూ తెచ్చిన ఈ బిల్లును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. -
దుగరాజపట్నం పోర్టు నిర్మించాలి
లోక్సభలో తిరుపతి ఎంపీ వరప్రసాద్ నిర్మిస్తామని మంత్రి నితిన్గడ్కరీ స్పష్టమైన హామీ తిరుపతి: దుగరాజపట్నం ఓడరేవును నిర్మించాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. లోక్సభలో గురువారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దీనిని నిర్మిస్తామని స్పష్టం గా ఉందని, ఆ మేరకు వెంటనే దీనిని నిర్మించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీంతో పాటు ఇప్పటికే ఓడరేవు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వచ్చాయన్నారు. వైజాగ్ పోర్టు నుంచి నిపుణుల బృందం కూడా వచ్చి పరిస్థితులు అధ్యయనంచేసి కట్టడానికి అనువుగా ఉందని నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో వారు ఏర్పాటుచేసిన సమావేశానికి కూడా తాను వెళ్లినట్టు వివరించారు. శ్రీహరికోటవారు సైతం కొన్ని నిబంధనలు పెట్టి ఓడరేవును నిర్మించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పోర్టు వల్ల గూడూరు, సర్వేపల్లి, నాయుడుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు లబ్ధిపొందుతాయన్నారు. దీంతో పాటు బాగా వెనుకబడిన మండలాలు చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు, సూళ్లూరుపేట, చిల్లకూరు, ముత్తుకూరు మండలాలు సైతం అభివృద్ధి చెందుతాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనికితోడు ఓడరేవుకు సమీపంలోనే హౌరా-చెన్నై నేషనల్ హైవే, రైల్వేట్రాక్ విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్రంలో లాభాల్లో ఉన్న పోర్టు నుంచి రూ.300కోట్లు తీసుకుని దీనిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దుగరాజపట్నం ఓడరేవును నిర్మిస్తే దాని ప్రభావం కృష్ణపట్నం ఓడరేవుపై పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందేహిస్తున్నారని, రాష్ట్రప్రభుత్వం అనుమతిస్తే కేంద్రం ఓడరేవు నిర్మించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. -
అంశాలవారీగా మా మద్దతు ఉంటుంది...
- పజలకు ఇబ్బంది కలిగే అంశాలను ఎత్తిచూపుతాం - రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద చర్చలో - వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు మేలుచేసే పనుల్లో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ తరఫున అంశాలవారీగా మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ చెప్పారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాల్లో వేలెత్తి చూపుతామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై కేంద్రం ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానం మీద గురువారం లోక్సభలో జరిగిన చర్చలో వరప్రసాద్ మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్, మేక్ ఇన్ ఇండియా, జన్ధన్ యోజన, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే స్కిల్ ఇండియా, ఆడ పిల్లలకు విద్యనందించే ఉద్దేశంతో చేపట్టిన బేటీ బచావో, బేటీ పడావో పథకాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. అదేవిధంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను బలపరిచేలా ప్రవేశపెట్టిన నీతిఆయోగ్ను అభినందించారు. అయితే కొన్ని అంశాల్లో ఎన్నో లోపాలున్నాయని పేర్కొన్నారు. దేశంలో దాదాపు 30 శాతం మంది దళితులు, 50 శాతం మంది బీసీలు ఇంకా వెనుకబడే ఉన్నారని, దేశ అభివృద్ధి కేవలం 20 శాతం మంది జనాభాకే చేరుతున్నదని అన్నారు. పేదలు గౌరవంగా బతికేలా వారి ఆర్థికస్థితిని మార్చేలా పథకాలను రూపొందించాలని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కోరారు. కేంద్రం పారిశ్రామిక అభివృద్ధి పేరిట భూసేకరణ చేపట్టాలని చూస్తోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 20 ఏళ్లలో యూరప్ తరహాలో భారత్లోనూ వ్యవసాయం చేసేవారే లేకపోయే పరిస్థితి ఉంటుందన్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ఏ ఒక్క చర్యా తీసుకోకపోవడం బాధాకరమన్నారు. -
రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి
వెంకటగిరి టౌన్: తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వేపరమైన సమస్యలను ఆ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి పెడతానని ఎంపీ వెలగపల్లి వరప్రసాద్రావు అన్నారు. రైల్వే సమస్యలపై వెంకటగిరిలో శనివారం ఆయన స్థానికులతో చర్చించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రైల్వే జీఎం పర్యటనకు హాజరుకాలేకపోయానన్నారు. ప్రజల నుంచి సమస్యల వివరాలు సేకరించి ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు రైల్వే మంత్రితో చర్చిస్తాన్నారు. ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. శేషాద్రి, శబరి ఎక్స్ప్రెస్లను వెంకటగిరిలో నిలిపేలా చూడాలన్నారు. నిమ్మ ఎగుమతుల నేపథ్యంలో హౌరా ఎక్స్ప్రెస్లో ప్రత్యేక బోగీ ఏర్పాటు చేయాలని, యాతలూరు రైల్వేస్టేషన్లో ప్యాసింజర్ రైళ్లను నిలపాలని కోరారు. బుసపాళెం వద్ద రైల్వే క్రాసింగ్ను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. వెంకటగిరి- నాయుడుపేట మార్గంలో రైల్వేస్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తిరుపతి నుంచి షిరిడీకి రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలని సాయిభక్తులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ వరప్రసాద్రావు స్థానిక రైల్వేస్టేషన్ మాస్టర్ శేషగిరిరావుతో సమావేశమై ప్రజల నుంచి వచ్చిన వినతులపై చర్చించారు. వీటిలో కొన్ని సమస్యలను ఇటీవల రైల్వే జీఎం శ్రీవాత్సవ దృష్టికి తీసుకెళ్లామని స్టేషన్ మేనేజర్ వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఆవుల గిరియాదవ్, నాయకులు నక్కా వెంకటేశ్వరరావు, చిట్టేటి హరికృష్ణ, మధు, సాయినాయుడు, కె రాజారెడ్డి, తిరుమల పాల్గొన్నారు. -
కొత్త కులాలను చేరిస్తే రిజర్వేషన్ శాతాన్నీ పెంచండి
వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్రావు సాక్షి, న్యూఢిల్లీ: ఎస్టీ జాబితాలో కొత్త కులాలను చేర్చాల్సి వస్తే, అందుకు అనుగుణంగా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్రావు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సవరణ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన గురువారం లోక్సభలో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లుకు తమ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకలించారు. కేంద్ర ప్రభుత్వం కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లోని కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయన్నారు. అయితే ఇప్పటికే ఉన్న ఎస్టీలకు నష్టం జరగకుండా ఆ ప్రక్రియ చేపట్టాలని కోరారు. దేశంలో నమోదవుతున్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కేవలం 10 శాతం వాటిల్లోనే శిక్షలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012లో 3.048 కేసులు నమోదైతే కేవలం 175 కేసుల్లోనే శిక్షలు పడ్డాయని గుర్తుచేశారు. -
'జూపూడికి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది'
నెల్లూరు:జూపూడి ప్రభాకర రావుకి వైఎస్సార్ సీపీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. దళితులకు వైఎస్సార్ కుటుంబం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే నారాయణ స్వామిలు తెలిపారు. తన ఓటమికి సుబ్బారెడ్డే కారణమని జూపూడి చెప్పడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలోమాట్లాడిన పార్టీ నేతలు.. ఇప్పటికైనా జూపూడి తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ తరుపునే అధిక సీట్లను దళితులే గెలిచారని వారు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర రావు శనివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనంతట తానుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.రాజీనామా లేఖను కొరియర్ ద్వారా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపానని జూపూడి చెప్పారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. -
'రోజుకోమాటతో పబ్బం గడుపుతున్నారు'
తిరుపతి: రుణమాఫీపై చంద్రబాబు తీరు దారుణంగా ఉందని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ విమర్శించారు. రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఆశలను కల్పించి ఇప్పుడు మీనమేషాలు లెక్కించడం సిగ్గుచేటుని మండిపడ్డారు. రిజర్వు బ్యాంకు ఇప్పటివరకు రుణమాఫీపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రులు రుణమాఫీపై రోజుకోమాట చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. మన్నవరం ప్రాజెక్ట్, దుగరాజపట్నం ఓడరేవు సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఢిల్లీలో పోరాటం చేస్తుందని చెప్పారు.