‘కన్నాలేసే గుణం ఎక్కడికి పోతుంది’ | MP Vijaya Sai Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘ఇంకో మూడ్నాలుగు నెలలే వారి ఆగడాలు’

May 3 2020 4:08 PM | Updated on May 3 2020 4:27 PM

MP Vijaya Sai Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: సైకిల్ బెల్స్, కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోయే చిల్లర దొంగలను చేరదీసి పదవులిచ్చినందుకు చంద్రబాబుకు ప్రజల చేతిలో పెద్ద శాస్తే జరిగిందని ట్విటర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రౌడీ షీట్లు మూసేయించినా బుద్ధులు మారవు కదా. కన్నాలేసే గుణం ఎక్కడికి పోతుందంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంకో మూడ్నాలుగు నెలలే వారి ఆగడాలు. తర్వాత అడ్రసు లేకుండా పోతారని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.
(చంద్రబాబు రాజకీయ సన్యాసం : మంత్రి జోస్యం)

‘మై డియర్ పప్పూ అండ్ తుప్పూ ! భౌతిక దూరం పాటించడం అంటే... భౌతికంగా (రాష్ట్రానికి) దూరం కావటం కాదు.... ఇటలీలో ఉన్న పిల్లలు, గుజరాత్‌లో ఉన్న జాలర్లు, వేరే రాష్ట్రాల్లో ఉన్న కూలీలు కూడా వచ్చేశారు... పప్పూ అండ్ తుప్పూ మీరు మాత్రం టీకా వచ్చేవరకు ఇల్లు కదలం అంటున్నారు’అని ఆయన మరో ట్వీట్‌లో  పేర్కొన్నారు.
(‘ఎక్కడివారు అక్కడే ఉండాలి’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement