ప్రజల దృష్టి మళ్లించేందుకే సెక్షన్ 8 | MP YS Avinash Reddy fires on Cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

ప్రజల దృష్టి మళ్లించేందుకే సెక్షన్ 8

Published Sun, Jun 28 2015 2:07 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

ప్రజల దృష్టి మళ్లించేందుకే సెక్షన్ 8 - Sakshi

ప్రజల దృష్టి మళ్లించేందుకే సెక్షన్ 8

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

 పులివెందుల : ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకే సెక్షన్ 8 వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శనివారం పులివెందులలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మా ట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీకల్లోతు అవినీతి కూపంలో కూరుకుపోయారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తర్వాత చంద్రబాబుకు సెక్షన్ 8  గుర్తుకు రావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిం చారు. తెలంగాణాలో అభాసుపాలైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లోనూ అదే విధంగా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు.

ఓటుకు కోట్లు కేసులో సహకరించడం లేదని ఏకంగా గవర్నర్‌నే మార్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు అనే క సమస్యలతో బాధపడుతుంటే ఇవేవీ చంద్రబాబు పట్టిం చుకోకుండా కేసు నుంచి బయటపడేందుకు అనైతికంగా ఆలోచిస్తుంటే ఏపీ పోలీసులు దన్నుగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో చంద్రబాబు రాష్ట్రాన్ని మ ద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

 ప్రజలతో మమేకం :
 శనివారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. తన వద్ద కు వచ్చిన వారి సమస్యలు ఓపికగా విన్న ఎంపీ పరిష్కారానికి అధికారులకు ఫోన్లు చేసి బిజీబిజీగా గడిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement