'భారత్-విండీస్ వన్డేను అడ్డుకుంటాం' | north coastal andhra jac threat to stop india, west indies ODI | Sakshi
Sakshi News home page

'భారత్-విండీస్ వన్డేను అడ్డుకుంటాం'

Published Wed, Oct 8 2014 4:30 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

north coastal andhra jac threat to stop india, west indies ODI

విశాఖపట్నం: ఉత్తరాంధ్రకు ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం వద్ద ఉత్తరాంధ్ర రాజకీయ ఐక్యవేదిక సభ్యులు ఆందోళన చేపట్టారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేకహోదా కల్పించకుంటే ఈనెల 14న ఇక్కడ జరగనున్న భారత్-వెస్టిండీస్ వన్డే మ్యాచ్ ను అడ్డుకుంటామని ఆందోళనకారులు హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన హామీయిచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు.

భారత్-విండీస్ మూడో వన్డే విశాఖపట్నంలో జరగనుంది. ఆందోళనకారులు హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు మ్యాచ్ జరుగుతుందో, లేదోనని క్రికెట్ అ భిమానులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement