తిరుమల: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన తిరుమల ఘాట్రోడ్డులోని చివరి మలుపు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు.. రైల్వేకోడూరు మండలానికి చెందిన రంగనాథ్(40) బైక్పై ఘాట్రోడ్డులో వస్తుండగా.. వెనక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొట్టింది. దీంతో రంగానాథ్ బస్సు కింద పడటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రంగనాథ్ మృతిచెందాడు.