రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | one dies in road accident in nellore district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Published Mon, Sep 28 2015 8:04 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

one dies in road accident in nellore district

నాయుడుపేట(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం నాయుడుపేట-పూతలపట్టు జాతీయరహదారిపై సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానిక అగ్రహారపేట నివాసి మైలారు శంకరయ్య(38) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన సోమవారం ఉదయం డ్యూటీ ముగించుకుని, ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో శంకరయ్య అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement