ఉల్లి ధరల నియంత్రణపై సర్కారు దృష్టి | Onions prices to be controlled | Sakshi
Sakshi News home page

ఉల్లి ధరల నియంత్రణపై సర్కారు దృష్టి

Published Sun, Aug 18 2013 3:52 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

Onions prices to be controlled

సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధరల అదుపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శనివారం మంత్రులు ముఖేష్ గౌడ్, శ్రీధర్ బాబు పౌరసరఫరా, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రోజువారీ ధరల సమీక్ష, నియంత్రణకోసం ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ధరల నియంత్రణకు రూ.100 కోట్ల నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉల్లిపాయలు, కూరగాయల ధరలు అందుబాటులో ఉంచడానికి మార్కెటింగ్‌శాఖ అధికారులు నేరుగా రైతుల వద్ద నుంచి సరుకు కొనుగోలు చేసి రైతు బజార్లలో సరసమైన ధరలకు విక్రయించాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement