భయపెడుతున్న డెంగీ | Peoples are afraid with Dengue | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న డెంగీ

Published Tue, Jul 29 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

Peoples are afraid with Dengue

 మరో 11కేసుల నమోదు

అనంతపురం అర్బన్: జిల్లాను డెంగీ భూతం బెంబేలెత్తిస్తోంది. కొద్దిరోజులుగా ఈ వ్యాధి విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం మరో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగం కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది.
 
ఆది, సోమవారాలకు సంబంధించి 86 శ్యాంపిల్స్ తీసుకోగా.. అందులో 11 పాజిటివ్‌గా, ఒక అనుమానాస్పద కేసుగా తేలాయి. అనంతపురం నగరంలోనూ డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. స్థానిక బేబీ హాస్పిటల్‌లో 3, హృదయ ఆస్పత్రిలో ఒక కేసు నమోదైనట్లు తెలిసింది. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఒక  కేసు  అనుమానాస్పద డెంగీగా నమోదైంది. ఏడు కేసులు రూరల్ ప్రాంతాల నుంచి నమోదయ్యాయి.
 
కాంపొనెంట్స్‌కు అనుమతి రానట్లే
సర్వజనాస్పత్రిలోని కాంపొనెంట్స్(రక్తశుద్ధి పరికరాలు)కు ఇప్పట్లో మోక్షం లభించే సూచనలు కన్పించడం లేదు. ఆస్పత్రిలో నాలుగేళ్లుగా రూ. 80 లక్షల విలువ గల 18 రకాల పరికరాలు మూలనపడ్డాయి. వీటిని సోమవారం సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ శ్రీనివాసన్, అనంతపురం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ హరిహరతేజ మరోసారి పరిశీలించారు. వీటి వాడకానికి అనుమతించాలంటే టెక్నికల్ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువుకు నిలయంగా మారిన మన జిల్లాలో ఎక్కువ మంది గ్రామాల్లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
 
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఉంచేందుకు ఇష్టపడటం లేదు. చదువుపై ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. విద్యార్థులు లేని కారణంగా ఒకటి, రెండు కాదు ఏకంగా 177 స్కూళ్లు జిల్లాలో మూతపడ్డాయంటే పరిస్థితికి అద్దం పడుతోంది. బోధన సరిగా లేదని.. పేద వర్గాల తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఇష్టపడం లేదు.
 
ఒకప్పుడు వందల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఈ రోజు పిల్లలు లేక కళాహీనంగా మారాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో వందలాది స్కూళ్లు పిల్లలు లేని కారణంగా మూతపడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనిఫైడ్ డి స్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్)-2013 ప్రకారం జిల్లాలో 177 స్కూళ్లు విద్యార్థులు లేక, 10 మందిలోపు విద్యార్థుల సంఖ్య ఉన్న కారణంగా క్లోజ్ చేశారు. బత్తలపల్లి మండలం చిన్నేకుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒక్క విద్యార్థీ లేనికారణంగా క్లోజ్ చేశారు.
 
మూతపడిన ప్రాథమిక పాఠశాలలివే : అగళి మండలం గొల్లహట్టి, లక్ష్మీపురం, బీరనపల్లి, ఎంకె గొల్ల హట్టి, హుళికెరదేవరహ ళ్లి, ఎంఎం పాల్యం. అమడగూరు మండలం బావిచెరువుపల్లి, సీతిరెడ్డిపల్లి, దుడరగుట్టపల్లి, అమరాపురం మండలం కదతడహళి,్ల అనంతపురం మండలం జంగాలపల్లి, ఆత్మకూరు మండలం దొద్దెకొట్టాల, బత్తలపల్లి మండలం చీమలనాగేపల్లి, రామాంజుంపల్లి, కళ్యాణదుర్గం మండలం పింజరికొట్టాల, కూడేరు మండలం మరుట్ల, కనగానపల్లి మండలం కొండ్రెడ్డిపల్లి,  బెళుగుప్ప మండలం వీరాంజినేయ కొట్టాల, బ్రహ్మసముద్రం మండలం విఎన్ హళ్లి, గుమ్మగట్ట మండలం మారెమ్మపల్లి తాండ, పామిడి మండలం పామిడి ఆర్‌ఎస్, యల్లనూరు మండలం పిఎం కొండాపురం, బుక్కపట్నం మండలం నాయనవారిపల్లి, నల్లగుట్టపల్లి, బుక్కరాయసముద్రం మండలం గోవిందంపల్లి, పుట్లూరు మండలం నాగిరెడ్డిపల్లి, రామగిరి మండలం ఆకుతోట్ల, రాయదుర్గం మండలం జుంజురాంపల్లి పాఠశాలలు మూతపడ్డాయి.

చిలమత్తూరు మండలంలో 6, ధర్మవరం మండ లంలో 10, గాండ్లపెంటలో 4, గార్లదిన్నెలో 2, గోరంట్లలో 7, గుడిబండలో 2, గుంతకల్లులో 2, కదిరిలో 3, కొత్త చెరువులో 4, కుందిర్పిలో 4, లేపాక్షి మండలం శిరివరం, మడకశిరలో 8, ముదిగుబ్బలో 10, నల్లచెరువులో 4, నల్లమాడలో 2, నంబులపూలకుంటలో 5, నార్పలలో 2, ఓబులదేవచెరువులో 7, పరిగిలో 2, పెద్దపప్పూరు మండలం రెడ్డిపల్లి, పెనుకొండ లో 5, రొద్దంలో 5, రొళ్లలో 10, శెట్టూరులో 3, శింగనమలలో 2, సోమందేపల్లిలో 5, తాడిపత్రిలో 2, తలుపులలో 11, యాడికిలో 4, తనకల్లు మండలంలో 15 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి.
 
సూపర్‌వైజర్‌ను నియమించాల్సిందేనని శ్రీనివాసన్ మరోసారి తేల్చిచెప్పారు. ల్యాబ్ టెక్నీషియన్ అలీ ఆ పోస్టుకు సరిపోతాడని బ్లడ్ బ్యాంకు ఇన్‌చార్జ్ డాక్టర్ శివకుమార్ చెప్పగా.. ఏపీసాక్స్ ద్వారా నియమితుడైన అలీ ఏవిధంగా సరిపోతాడని శ్రీనివాసన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కాంపొనెంట్స్ వాడకానికి ఎప్పుడు అనుమతి లభిస్తుందో తెలియడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement