
సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 57వ రోజుకి చేరుకుంది. మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గం బత్తలవారిపల్లి గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు.
అక్కడి నుంచి మిట్టపాల్యం, వెంకటాపురం గ్రామాల మీదుగా బండకింద పల్లి, రాఘవరెడ్డి పల్లి, మణిక్య రాయుని పల్లి చేరుకుంటుంది. దారిపోడవునా వైఎస్ జగన్ ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతారు.
అటుపై యాత్ర కార్తికేయపురం, అట్టవారిపల్లి గ్రామాల మీదుగా పెనుమూరుకి పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి గొబ్బిల్లమిట్ట, గాంధీపురం మీదుగా చిప్పరపల్లి చేరుకుని పాదయాత్రను ముగిస్తారు. ఇప్పటివరకు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన పాదయాత్ర ఇప్పటిదాకా 778.7 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment