సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వచ్చే నెల నాలుగో తేదీ రాత్రి హైదరాబాద్కు రానున్నారు. 5వ తేదీ ఉదయం సర్దార్ వల్లభాయి పటేల్ జాతీ య పోలీసు అకాడమీలో జరగనున్న 2012 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ ప్రొబేషనర్స్ పరేడ్లో రాష్ట్రపతి పాల్గొం టారు. అనంతరం రాష్ట్రపతి తిరిగి ఢిల్లీ వెళతారు. మరోవైపు రాష్ట్రపతి కొత్త సంవత్సరం వేడుకలను రాష్ట్రంలోనే జరుపుకోనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా ప్రణబ్ డిసెంబర్ 16న హైదరాబాద్కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఇప్పటివరకు ఖరారైన షెడ్యూల్ మేరకు జనవరి 1వ తేదీ వరకు రాష్ట్రపతి ఇక్కడ ఉంటారు.