రా​‍ష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌ హోం’ | President Pranab mukherjee hosts 'At Home' programme | Sakshi
Sakshi News home page

రా​‍ష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌ హోం’

Dec 30 2016 7:14 PM | Updated on Aug 15 2018 9:37 PM

రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ శుక్రవారం ప్రముఖులకు ‘ఎట్‌ హోం’ తేనీటి విందు ఇచ్చారు.

హైదరాబాద్‌: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వారం రోజులుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహించారు.

గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, పలువురు మంత్రులు, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, సాయుధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటన ముగియటంతో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement