రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా) : పోలీసులు, అటవీ అధికారుల సంయుక్త దాడుల్లో రూ.కోటి విలువైన ఎర్ర చందనం దుంగలు పట్టుబడ్డాయి. రైల్వే కోడూరు మండల కేంద్రంలోని జ్యోతినగర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు.
అనుమానాస్పదంగా కనిపించిన వ్యానును సోదా చేయగా రూ. కోటి విలువైన 109 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాహన సంబంధీకులు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. ఈ మేరకు వాహనాన్ని, దుంగలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి, పోలీసులకు అప్పగించనున్నట్లు అటవీ రేంజి అధికారి రెడ్డి ప్రసాద్ తెలిపారు.
రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం
Published Fri, Oct 9 2015 7:49 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM
Advertisement
Advertisement