తాడిపత్రి ఆస్పత్రిలో ఉద్రిక్తత  | Relatives Of Boys Demand Probe Into Death | Sakshi

తాడిపత్రి ఆస్పత్రిలో ఉద్రిక్తత 

Published Tue, Apr 17 2018 6:44 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

Relatives Of  Boys Demand Probe Into Death - Sakshi

ఆసుపత్రిలో ఆందోళనకు దిగిన మృతుల బంధువులు

తాడిపత్రి : తమ పిల్లలను ఎవరో హత్య చేసి, చెరువులో పడేశారంటూ.. వారెవరో గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ పవన్, బాలాజీ బంధువులు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యల్లనూరు మండలం చిలమకూరు సమీపంలోని చిత్రావతి నదిలో విద్యార్థులు పవన్‌ (8), బాలజీలు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు, సమీప బంధువులు తమ పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఎవరో హత్య చేసి  నదిలోని నీటిగుంటలో పడేశారని ఆరోపించారు. 

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు పోస్టుమార్టం నిర్వహించేందుకు వీలులేదని ఆందోళనకు దిగారు. పోలీసులు కొందరిని కాపాండేందుకు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అర్బన్, రూరల్‌ సీఐలు సురేందర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డిలు ఆస్పత్రికి చేరుకుని విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

విద్యార్థుల మృతదేహాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement