అద్దె భవనాల్లో ఐటీఐ | Rental buildings ITI | Sakshi
Sakshi News home page

అద్దె భవనాల్లో ఐటీఐ

Aug 3 2015 3:05 AM | Updated on Sep 3 2017 6:39 AM

అద్దె భవనాల్లో ఐటీఐ

అద్దె భవనాల్లో ఐటీఐ

ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ కళాశాల ఏర్పాటై 18 ఏళ్లయినా సొంత భవనాలు సమకూరలేదు...

- సొంత భవనాలు సమకూరేదెన్నటికో?
- 2013లో స్థలం కేటాయింపు
- 4.60 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదన
కడప ఎడ్యుకేషన్:
  ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ కళాశాల ఏర్పాటై 18 ఏళ్లయినా సొంత భవనాలు సమకూరలేదు. 1997 నుంచి 2001 వరకు ఆర్ట్స్ కళాశాల సమీపంలో అద్దె భవనాల్లో సాగించారు. ఆ తరువాత బాలాజీ నగర్‌లోని ఐటీఐ వద్ద గల డీఎల్‌టీ సీ ఐటీఐలోని భవనాల్లోకి తరలించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. అవి కూడా బాగా దెబ్బతిని అంత సౌకర్యంగా ఉండటం లేదని పలువురు విద్యార్థులు తెలిపారు.
 
2013లో స్థలం కేటాయింపు: ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ కోసం 2013లో ప్రభుత్వం 4 ఎకరాల 97 సెంట్ల స్థ లాన్ని రిమ్స్ సమీపంలో కేటాయిం చిం ది. అందులో భవనాలను, కార్యాలయా న్ని నిర్మించేందుకు అప్పట్లో 4,60 కోట్ల తో ప్రతిపాదనలు కూడా పంపారు. కానీ అప్పటి నుంచి నేటి వరకు ఆ ఊసే లేదు. మళ్లీ ఏడాది క్రితం ఏపీడబ్లూ డీసీ వాళ్లకు మళ్లీ కూడా ప్రతిప్రాదనలు పంపారు. కానీ స్పందనమాత్రం లేదు.
 
సొంత నిధులు ఉన్నా: ప్రభుత్వ మైనార్టీ ఐటీఐకి దాదాపుగా రెండున్నర కోట్లు నిధులు ఉన్నట్లు తెలిసింది. సంబంధిత నిధులను కూడా కళాశాల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంది. కానీ దీనిని గురించి ప్రభుత్వమే పట్టింకకోకపొతే వారు కూడా మిన్నకుండి పోయినట్లు తెలిసింది.   
 
కోర్సుల వివరాలు: ప్రభుత్వ మైనార్టీ కళాశాలలో ఐదు రకాల కోర్సులు ఉన్నాయి. ఎలక్ట్రికల్, పిట్టర్, మోటర్‌మోకానిక్‌కు సంబంధించిన కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులకు రెండేళ్ల కాలపరిమితి ఉండగా డీజల్‌మోకానికల్, కంప్యూటర్ అపరేటర్‌కు మాత్రం ఏడాది మాత్రమే కోర్సుకు కాల పరిమితి. ఈ కళాశాలలో 136 మంది విద్యార్థులు చేరే సౌలభ్యం ఉంది. కానీ అప్పట్లో సమైకాంధ్ర ఉద్యమం వల్ల విద్యార్థులు అడ్మిషన్లు తక్కువగా జరిగినట్లు తెలిసింది.
 
ఈ ప్రభుత్వమైనా స్పందించాలి: మైనార్టీ ఐటీఐ భవనాల నిర్మాణం విషయంలో ఇప్పటి ప్రభుత్వమైనా స్పందిం చాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. స్థలం కేటాయించి కూడా ఏడాదినన్నర కాలం కావస్తుందన్నారు. సంబంధిత విషయంలో అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
 
ఉద్యోగావకాశాలు: ప్రస్తుతం టెక్నికల్‌కు సంబంధించి మం చి డిమాండ్ ఉంది. ప్రైవేటు కంపెనీల్లో ఐటీఐ అభ్యర్థులకు మంచి ఆదరణ ఉం ది. దీనికి తోడు కళాశాల వారే క్యాంపస్ ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవలే బెంగుళూరుకు చెందిన ఓ కంపెనీ వారు క్యాంపస్ ఇంట ర్వ్యూను నిర్వహించి పలువురికి ఉద్యోగావకాశాలను కల్పించింది. కనుక ప్రతి ఒక్కరూ సంబంధిత విషయాన్ని గమనించి ఐటీఐలో చేరితే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement