'రిషితేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది' | rishiteshvari case investigation is going on says ganta srinivas | Sakshi
Sakshi News home page

'రిషితేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది'

Published Thu, Jul 30 2015 2:54 PM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM

rishiteshvari case investigation is going on says ganta srinivas

విశాఖపట్నం: పెండింగ్లో ఉన్న 92 ప్రాజెక్ట్లపై చర్చించడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో గురువారం సమావేశమయ్యారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో దర్యాప్తు  కొనసాగుతోందని, 2 రోజులుగా యూనివర్సిటీలోనే ప్రభుత్వం నియమించిన కమిటీ ఉండి ఆధారాలు సేకరించే పనిలో ఉందన్నారు. యూనివర్సిటీల్లో ర్యాగింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హాస్టళ్లలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు అమలు పరిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. హాస్టళ్లలో ఉన్న ఔటర్స్ను నిరోధించేందుకు చర్యలు చేపడుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement