కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి | seemandhra cabinet ministers should be resigned:seemandhra employees | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి

Published Thu, Dec 12 2013 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి

కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి

సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎంపీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. భోజన విరామ సమయంలో ఉద్యోగులు బుధవారం సచివాలయంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సీ-బ్లాక్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సోనియా గో బ్యాక్, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, డిగ్గీ రాజా గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా నేతలు మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ, అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామన్నారు. విభజనకు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్, టీడీపీలకు భవిష్యత్తుండదని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement