శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. హైదరాబాద్లో శనివారం ఉదయం నుంచి సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఎంపికపై నివేదిక సమర్పించింది. ఈ సమావేశఃలో కమిటీలోని 9 మంది సభ్యులు పాల్గొన్నారు. శివరామకృష్ణన్ కమిటీ త్వరలో మలేసియా, సింగపూర్ దేశాల్లో పర్యటించనుంది.