ఆచంట: కోడిపందాల స్థావరాలపై దాడులు నిర్వహించిన పోలీసులు 19 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 కోళ్లు, రూ. 2,650 నగదు, 9 ద్విచక్రవాహనాలు, 12 నాటు కత్తులు, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పడమంచలలో ఆదివారం అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. కోడి పందాలు ఆడుతున్న వారితో పాటు బెట్టింగ్ నిర్వహించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు.