కాకినాడ:జిల్లాలో చేపట్టిన అంబేద్కర్ వర్థంతి కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ, టీడీపీ ప్రోటోకాల్ వివాదం తలెత్తడంతో ఆ సమావేశం గందరోళంగా మారింది. దీంతో సమావేశాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, సభ్యులు బాయ్ కాట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.