ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య | student suicides for the air conditioner buying | Sakshi
Sakshi News home page

ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య

Published Sat, May 30 2015 7:58 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య

రాజమండ్రి: తన ఇష్టం ప్రకారం ఏసీ కొనలేదని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజమండ్రి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. జాంపేట మఠం వీధికి చెందిన నందారపు శివజ్యోతి ఓ కళాశాలలో ఇటీవలే బీకాం ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసింది. ఆమె స్నేహితురాలి ఇంట్లో నూతనంగా ఏసీ కొనుగోలు చేశారు.

దాంతో తన ఇంట్లో ఏసీ పెట్టించాలంటూ శివజ్యోతి తల్లిదండ్రులను కోరింది. తల్లిదండ్రులు కొనలేమని చెప్పినా ఆ అమ్మాయి వినలేదు. ఏసీ విషయమై తల్లితో గొడవపడింది. మనస్తాపంతో శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ హుక్‌కు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement