అందుకే ఆయనకు మంత్రి పదవి: తమ్మినేని
శ్రీకాకుళం: నారాయణ విద్యాసంస్థల అధినేత, మంత్రి నారాయణపై తమ్మినేని సీతారాం మండిపడ్డారు. విద్యార్థుల నుంచి జలగల్లా ఫీజులు వసూలు చేశారని వైఎస్ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు.
విద్యార్ధుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసిన ఫీజుల సొమ్మునే ఎన్నికలలో ఖర్చు చేసినందుకు నారాయణకు మంత్రి పదవి వచ్చిందని తమ్మినేని విమర్శించారు. ఆర్దికంగా ఆదుకున్నందుకుఏ కార్పోరేట్ రాజకీయ వేత్లలకు చంద్రబాబు పెద్ద పీట వేశారని తమ్మినేని అన్నారు.
మండలపరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో విప్కు వ్యతిరేకంగా ఓటేస్తే అభ్యర్థులపై అనర్హత వేటు పడుతుందని తమ్మినేని సీతారాం హెచ్చరించారు.