చెట్టును ఢీకొన్న టాటాఎస్.. వ్యక్తి మృతి | tata ace rolls and one dies | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న టాటాఎస్.. వ్యక్తి మృతి

Published Mon, Jun 29 2015 8:16 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM

tata ace rolls and one dies

అనంతపురం: వేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలం తడకలపల్లి గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. కర్ణాటకలోని మధుగిరి తాలుక బేర్పూర్‌ గ్రామానికి చెందిన రాజన్న(42) టాటా ఎస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని హిదూపురం నుంచి బేర్పూర్‌కు పశువుల లోడ్‌తో బయలుదేరాడు.

వాహనం తడకలపల్లి సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం నడుపుతున్న రాజన్న అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని బెంగళూరు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement