సర్వేపై హోంమంత్రికి టీడీపీ ఎంపీల ఫిర్యాదు | TDP MPs complaint against Telangana Survey | Sakshi
Sakshi News home page

సర్వేపై హోంమంత్రికి టీడీపీ ఎంపీల ఫిర్యాదు

Published Thu, Aug 14 2014 3:17 AM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM

సర్వేపై హోంమంత్రికి టీడీపీ ఎంపీల ఫిర్యాదు - Sakshi

సర్వేపై హోంమంత్రికి టీడీపీ ఎంపీల ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ : ఈ నెల 19న టీ సర్కారు నిర్వహించనున సర్వేపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తున్నట్టు సమాచారం. దీనిపై టీ ప్రభుత్వాన్ని వివరణ కోరినట్టు తెలుస్తోంది. అయితే దీన్ని కేంద్ర హోంశాఖ వర్గాలు ధృవీకరించలేదు. కాగా, ఈ సర్వే రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు బుధవారం టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.  
 
సర్వేలకు కేంద్ర సంస్థలుండగా.. కులాలు, ప్రాంతాల పేరుతో టీ సర్కారు సర్వే నిర్వహిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా హోంమంత్రిని కలిసిన విషయాన్ని టీడీపీ ఎంపీలెవరూ ధ్రువీకరించలేదు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కలిసి ఈ ఫిర్యాదు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతుండగా.. ఈ అంశంపై ఇంకా కలవలేదని, గురువారం కలుస్తామని పార్టీలోని మరికొన్ని వర్గాలు చెప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement