
వైఎస్సార్సీపీ నేతకు బెదిరింపు కాల్స్
ప్రాణ హాని ఉందని ఎస్పీ, డీజీపీ, హోంమంత్రికి రమేష్రెడ్డి ఫిర్యాదు
తాడిపత్రి : వైఎస్సార్సీపీ యువజన నాయకుడు, తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ రమేష్రెడ్డికి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఆయన పోలీసులను ఆశ్రయించినట్లు విశ్వసనీయ సమాచారం. గత సార్వత్రిక, మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఆయన చురుకుగా పాల్గొన్నారు.
ఇటీవల పార్టీలో క్రియశీలకంగా పని చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతల దృష్టి రమేష్రెడ్డిపై పడ్డంతో ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. గత 20 రోజుల క్రితం కూడా ఆయన ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాక్కోని ఉండటాన్ని గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు వచ్చే లోపే దుండగులు పారిపోయారని స్థానికులు పోలీసులకు తెలిపారు. అత్యంత సమస్యాత్మక మైన తాడిపత్రి ప్రాంతంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడటం పరిపాటిగా మారింది.
ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రమేష్రెడ్డికి చెందిన కళాశాల, ఆస్తుల విషయంలో అధికార పార్టీ నేతలు స్వయంగా కరపత్రాలను పంచి దుష్ర్పచారం చేశారు. అలాగే వారం క్రితం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, దీంతో తనకు ప్రాణహాని ఉందని రమేష్రెడ్డి జిల్లా ఎస్పీ, డీజీపీ, హోంశాఖ మంత్రిని కలిసి వివరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ లిస్టు ఆధారంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.