
వీవీ వినాయక్కు ప్రముఖుల పరామర్శ
చాగల్లు : ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ను పలువురు రాజకీయ, సినీప్రముఖులు శనివారం కలిసి సంతాపం తెలిపారు. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పితాని సత్యనారాయణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు జీఎస్ రావు, కారుమూరి నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్కృష్ణ, సినీ ప్రముఖులు, నిర్మాతలు డీవీవీ దానయ్య, పరుచూరి కిరీటి, ఠాగూర్ మధు, నటుడు రఘుబాబు, మాటల రచయిత కోన వెంకట్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల దుర్గేష్, వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యులు బండి పట్టాభి రామారావు(అబ్బులు), మహిళా నాయకురాలు పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, నిడదవోలు సీఐ జి.శ్రీనివాసరావు, కలగర హరిబాబు, మారిశెట్టి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్, కేతనపల్లి శ్రీనివాస్, ఆత్కూరి కృష్ణ, గండ్రోతు సూర్యనారాయణ, వెజ్జు వెంకటేశ్వరరావు, ఉప్పులూరి నానాజీ, డి.సూరిబాబు సంతాపం తెలిపారు.