
సాక్షి, విజయవాడ : అవనిగడ్డ నియోజక వర్గంలో పాముల బెడద స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 8 నెలల కాలంలో ఇప్పటికే 8 మందికి పైగా పాముకాటుకు గురైప్రాణాలు కోల్పోగా.. తాజాగా నాగాయలంక మండలం ఏటిమోగ గ్రామంలో పీతా వెంకటేశ్వరమ్మ (45) అనే మహిళ పాముకాటుతో మరణించారు. కూలీ చేసుకుని బతికే వెంటేశ్వరమ్మ ఎప్పటిలాగానే శుక్రవారం పనికి వెళ్లారు. అక్కడ ఆమెను ఓ పాము కాటేసింది. అయితే, త్వరగా ఆస్పత్రికి వెళ్లకుండా ఆమె ఆలస్యం చేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment