
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య
వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం శాంతినగర్లో గురువారం దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలికపై పొట్టి చాంద్బాషా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను హత్య చేశాడు. బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు చాంద్బాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.