రేపు ఉదయం రాష్ట్రపతిని కలవనున్న జగన్ | YS Jagan will meet Rashtrapati tomorrow | Sakshi
Sakshi News home page

రేపు ఉదయం రాష్ట్రపతిని కలవనున్న జగన్

Published Wed, Dec 25 2013 5:42 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ - Sakshi

వైఎస్ జగన్

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రేపు ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చారు.

బొల్లారంలోని రాష్ట్రపతి  నిలయంలో రేపు ఉదయం జగన్తోపాటు పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలుస్తారు. జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు రాష్ట్రపతి వద్దకు వెళతారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగా ఉంచమని వారు రాష్ట్రపతిని కోరతారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఈ బృందం రాష్ట్రపతికి  అఫిడవిట్లు ఇస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement