హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన రాష్ట్ర సమస్యలు, ఇతర అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.