ఏటీ చెల్లింపులో పోటాపోటీ | Advance tax: SBI pays 23% more at Rs 1794 crore, LIC outgo up 15% | Sakshi
Sakshi News home page

ఏటీ చెల్లింపులో పోటాపోటీ

Published Tue, Mar 17 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

ఏటీ చెల్లింపులో పోటాపోటీ

- అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల్లో ఆర్థిక సంస్థల ముందంజ
- ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ రెండంకెల వృద్ధి

ముంబై: మార్చి త్రైమాసికం ముందస్తు పన్ను చెల్లింపుల్లో ఆర్థిక సంస్థలు ముందున్నాయి. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి సంస్థలు ఈ విషయంలో రెండంకెల వృద్ధి రేటును నమోదుచేశాయి. వివరాల్లోకి వెళితే...
ఎస్‌బీఐ 23 శాతం అధికంగా రూ.1,794 కోట్ల ముందస్తు పన్ను చెల్లించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ చెల్లింపు రూ.1,456 కోట్లు.

డిసెంబర్ క్వార్టర్‌లో బ్యాంక్ చెల్లింపులు రూ.1,425 కోట్లు. రుణ వృద్ధి బలహీనంగా ఉన్నప్పటికీ ముందుస్తు పన్ను చెల్లింపుల్లో బ్యాంక్ ముందుండడం గమనార్హం.
ఎల్‌ఐసీ ఈ విషయంలో 15% అధికంగా చెల్లించింది. ఈ విలువ రూ. 1,280 కోట్ల నుంచి రూ.1,470 కోట్లకు చేరింది.  ఆర్థిక సంవత్సరం మొత్తంలో చెల్లింపులు రూ.5,100 కోట్ల నుంచి రూ.5,880 కోట్లకు చేరాయి.
ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్ 23 శాతం తక్కువగా రూ.230 కోట్లను మాత్రమే చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ చెల్లింపు రూ. 298 కోట్లు.
హెచ్‌డీఎఫ్‌సీ 10 శాతం అధికంగా తమ చెల్లింపులను రూ.500 కోట్ల నుంచి రూ.550 కోట్లకు పెంచింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 12.8 శాతం వృద్ధితో రూ. 2,160 కోట్ల నుంచి రూ. 2,435 కోట్లకు పెరిగింది.
గ్రామీణాభివృద్ధికి సంబంధించిన రుణదాత నాబార్డ్ చెల్లింపులు రూ.370 కోట్ల నుంచి రూ.380 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఈ విలువ రూ. 1,490 కోట్ల నుంచి రూ.1,560 కోట్లకు ఎగసింది.
ప్రైవేటు రంగంలోని యస్ బ్యాంక్ చెల్లింపులు రూ. 200 కోట్ల నుంచి రూ. 260 కోట్లకు పెరిగాయి.
యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ రూ.25 కోట్లు చెల్లించింది.
 అడ్వాన్స్ ట్యాక్స్ అంటే..: అధిక ఆదాయ కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు తమ ఆదాయంపై పన్నును ఒక ఆర్థిక సంవత్సరంలో నాలుగు దఫాలుగా ముందస్తుగా చెల్లించడమే ఈ అడ్వాన్స్ ట్యాక్స్ వ్యవస్థ. ఒక నిర్ధిష్ట సమయంలో కంపెనీ పనితీరుకు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు అద్దం పడుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement