HDFC
-
22న యూపీఐ సేవలు బంద్!.. హెచ్డీఎఫ్సీ ప్రకటన
స్మార్ట్ఫోన్ వాడకంలోకి వచ్చిన తరువాత దాదాపు చాలామంది లావాదేవీల కోసం 'ఫోన్పే, గూగుల్ పే' వంటి యూపీఐ యాప్లను ఉపయోగిస్తున్నాయి. అయితే తాజాగా హెచ్డీఎఫ్సీ ఖాతాను.. యూపీఐ పేమెంట్స్ యాప్లకు లింక్ చేసుకున్నవారికోసం బ్యాంక్ ఓ సందేశం అందించింది.బ్యాంక్ అందించిన సందేశం ప్రకారం.. శనివారం (ఫిబ్రవరి 22) ఉదయం 2:30 AM నుంచి 7 AM వరకు.. హెచ్డీఎఫ్సీ ఖాతాకు లింక్ అయిన యూపీఐ సేవలు పనిచేయవు. అంటే 4:30 గంటలు యూపీఐ సేవలను నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ అధికారికంగా వెల్లడించింది. తన ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగానే సిస్టం మెయిటెనెన్స్ చేపడుతున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది.హెచ్డీఎఫ్సీ ప్రకారం.. ఆ సమయంలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. ఒకవేళా ఒకటికంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉన్నవారు.. ప్రైమరీ అకౌంట్గా హెచ్డీఎఫ్సీని లింక్ చేసి ఉంటే.. అత్యవసరం అనుకుంటే మార్చుకోవడం మంచింది. లేకుంటే 7 గంటల తరువాత యూపీఐ సేవలను యదావిధిగా కొనసాగించవచ్చు.చదవండి: 'ఆ నిర్ణయం నన్ను ఎంతగానో బాధించింది': బిల్ గేట్స్కేవలం హెచ్డీఎఫ్సీ అకౌంట్ మాత్రమే ఉన్నవాళ్లు.. ముందుగానే ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసి పెట్టుకోండి. ఏదైనా ప్రయాణం సమయంలో, లేదా ఇతర అత్యవసర సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఫిబ్రవరి 22న ఏ సమయంలో యూపీఐ పనిచేయదనే విషయాన్ని కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ మెయిల్ ద్వారా తెలియజేసింది. -
మళ్ళీ పెరిగిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు.. ఈ సారి ఎంతంటే?
దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC).. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) మరోమారు పెంచుతూ ప్రకటించింది. వడ్డీ రేట్లను ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచిన తరువాత.. ఎంసీఎల్ఆర్ రేట్లు 9.20 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.హెచ్డీఎఫ్సీ ప్రకటించిన కొత్త ఎంసీఎల్ఆర్ రేట్లు 2024 డిసెంబర్ 7 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఓవర్నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ను 5 పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 9.15 శాతం నుంచి 9.20 శాతానికి చేరింది. ఒక నెల టెన్యూర్ రేటు (9.20 శాతం), మూడు నెలల టెన్యూర్ రేటు (9.30 శాతం) యధాతదంగా ఉంచింది.ఆరు నెలలు, 12 నెలలు (ఒక సంవత్సరం) టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం వద్ద ఉంది. రెండు సంవత్సరాల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.45 శాతం అయితే.. మూడేళ్ళ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 9.50 శాతంగా ఉంది. పెరిగిన వడ్డీ రేట్లను బట్టి చూస్తే.. ఓవర్నైట్ టెన్యూర్ ఎంసీఎల్ఆర్ మాత్రమే 5 పాయింట్లు పెరిగినట్లు తెలుస్తోంది.కొత్త ఎంసీఎల్ఆర్లుఓవర్ నైట్: 9.20 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
ATM Withdrawal Limit: ఏటీఎం నుంచి ఎంత తీసుకోవచ్చు..?
ప్రస్తుతం అంతటా డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా యూపీఐ వచ్చాక భౌతికంగా నగదు చలామణి చాలామటుకు తగ్గిపోయింది. ఎంత డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నా కొన్ని సందర్భాలలో చేతిలో నగదు అవసరం ఉంటుంది. దీని కోసం ఖాతాదారులు ఏటీఎం సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి రోజుకు ఎంత డబ్బు విత్డ్రా చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రధాన బ్యాంకుల్లో ఏ బ్యాంక్ ఏటీఎం విత్డ్రా లిమిట్ ఎంతన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..ఎస్బీఐమీరు మ్యాస్ట్రో డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ డెబిట్ కార్డ్ కలిగి ఉంటే, గరిష్టంగా రోజుకు రూ.40,000 విత్డ్రా చేసుకోవచ్చు. మీ ఖాతా ‘ఇన్టచ్’ లేదా ’ఎస్బీఐ గో’కి లింక్ అయిఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 40,000. అదే ఎస్బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్తో రోజుకు గరిష్టంగా రూ. 1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు.హెచ్డీఎఫ్సీ హెచ్డీఎఫ్సీ ఖాతాకు ఇంటర్నేషనల్, వుమన్ అడ్వాంటేజ్ లేదా ఎన్ఆర్ఓ డెబిట్ కార్డ్లను లింక్ చేసినట్లయితే, రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ బిజినెస్, టైటానియం లేదా గోల్డ్ డెబిట్ కార్డ్లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. టైటానియం రాయల్ డెబిట్ కార్డ్కు రూ. 75,000. ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డ్లకు రూ. 1,00,000. అదే జెట్ప్రివిలేజ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరల్డ్ డెబిట్ కార్డ్తో అయితే రోజుకు రూ. 3,00,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు.కెనరా బ్యాంక్కెనరా బ్యాంక్ క్లాసిక్ రూపే, వీసా లేదా స్టాండర్డ్ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్లతో రోజుకు గరిష్టంగా రూ.75,000 విత్డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం లేదా మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్తో 1,00,000 వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది.ఐసీఐసీఐఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ వినియోగదారులకు విత్డ్రా పరిమితి రోజుకు రూ. 1,50,000. ఐసీఐసీఐ ఎక్స్ప్రెషన్, ప్లాటినం లేదా టైటానియం డెబిట్ కార్డ్లకు డైలీ లిమిట్ రూ. 1,00,000. ఇక ఐసీఐసీఐ స్మార్ట్ షాపర్ సిల్వర్ డెబిట్ కార్డులకు అయితే రూ. 50,000. అదే ఐసీఐసీఐ బ్యాంక్ సాఫిరో డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు గరిష్టంగా రూ. 2,50,000 విత్డ్రా చేసుకోవచ్చు.యాక్సిస్ బ్యాంక్యాక్సిస్ బ్యాంక్ రూపే ప్లాటినం లేదా పవర్ సెల్యూట్ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 40,000 విత్డ్రా చేసుకోవచ్చు. లిబర్టీ, ఆన్లైన్ రివార్డ్స్, రివార్డ్స్ ప్లస్, సెక్యూర్ ప్లస్, టైటానియం రివార్డ్స్, టైటానియం ప్రైమ్ డెబిట్ కార్డ్ల ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. అలాగే ప్రెస్టీజ్, డిలైట్ లేదా వాల్యూ ప్లస్ డెబిట్ కార్డ్లకు లిమిట్ రూ. 1,00,000. యాక్సిస్ బ్యాంక్ బుర్గుండి డెబిట్ కార్డ్ ద్వారా రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 3,00,000.బ్యాంక్ ఆఫ్ బరోడావరల్డ్ అగ్నివీర్, రూపే క్యూస్పార్క్ ఎన్సిఎంసి, రూపే ప్లాటినం డిఐ, మాస్టర్ కార్డ్ డిఐ ప్లాటినం లేదా బిపిసిఎల్ డెబిట్ కార్డ్ ఉంటే రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే క్లాసిక్ డీఐ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డీఐ డెబిట్ కార్డ్ నుండి రోజుకు రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. రూపే సెలెక్ట్ డిఐ డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 ఉపసంహరించుకోవచ్చు.ఇండియన్ బ్యాంక్సీనియర్ సిటిజన్లు, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారులకు రోజుకు రూ. 25,000 విత్డ్రా పరిమితి ఉంది. రూపే ప్లాటినం, రూపే డెబిట్ సెలెక్ట్, మాస్టర్ కార్డ్ వరల్డ్ లేదా మాస్టర్ కార్డ్ వరల్డ్ ప్లాటినం కార్డులతో రోజుకు రూ. 50,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఐబీ డిజీ రూపే క్లాసిక్, కలైంజర్ మగలిర్ ఉరిమై తిట్టం (KMUT) పథకం, రూపే కిసాన్ లేదా ముద్రా డెబిట్ కార్డ్లు ఉన్నవారు రోజుకు రూ. 10,000 విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక రూపే ఇంటర్నేషనల్ ప్లాటినం డెబిట్ కార్డ్ తో రూ. 1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు.యూనియన్ బ్యాంక్మీ ఖాతాకు లింక్ అయిన క్లాసిక్ వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్ లతో రోజుకు రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ లేదా రూపే డెబిట్ కార్డ్లకు పరిమితి రూ. 75,000. అదే బిజినెస్ ప్లాటినం వీసా, మాస్టర్ కార్డ్ ద్వారా రూ. 1,00,000 ఉపసంహరించుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 1,00,000, యూనియన్ బ్యాంక్ సిగ్నేచర్ వీసా, మాస్టర్ కార్డ్ లతో రూ. 1,00,000 విత్డ్రా చేసుకోవచ్చు.పంజాబ్ నేషనల్ బ్యాంక్రూపే ఎన్సీఎంసీ క్లాసిక్, వీసా క్లాసిక్ లేదా మాస్టర్ కార్డ్ క్లాసిక్ డెబిట్ కార్డ్తో రోజుకు గరిష్టంగా రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. రూపే ఎన్సిఎంసి ప్లాటినం డొమెస్టిక్, రూపే ఎన్సిఎంసి ప్లాటినం ఇంటర్నేషనల్, రూపే ఉమెన్ పవర్ ప్లాటినం, రూపే బిజినెస్ ప్లాటినం ఎన్సిఎంసి, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్ల విత్డ్రా పరిమితి రూ. 1,00,000. అలాగే రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్, మాస్టర్ కార్డ్ బిజినెస్ డెబిట్ కార్డ్లతో రోజుకు రూ. 1,50,000 విత్డ్రా చేసుకోవచ్చు.బ్యాంక్ ఆఫ్ ఇండియా మాస్టర్ కార్డ్ టైటానియం, రూపే సంగిని, రూపే పీఎంజేడీవై, రూపే ముద్ర, రూపే కిసాన్, రూపే పంజాబ్ అర్థవ్యస్థ, వీసా క్లాసిక్, ఎన్సీఎంసీ, మాస్టర్ బింగో లేదా వీసా బింగో డెబిట్ కార్డ్ల ద్వారా రోజుకు గరిష్టంగా రూ. 15,000 విత్డ్రా చేసుకోవచ్చు.రూపే ప్లాటినం, వీసా పేవేవ్ (ప్లాటినం), మాస్టర్ కార్డ్ ప్లాటినం డెబిట్ కార్డ్లకు రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000. రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్ లిమిట్ రూ. 50,000. వీసా బిజినెస్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్లతో రోజుకు రూ. 1,00,000 వరకు డబ్బు తీసుకోవచ్చు.కోటక్ బ్యాంక్ కోటక్ జూనియర్ డెబిట్ కార్డ్తో రోజుకు రూ. 5,000, రూపే డెబిట్ కార్డ్ లేదా క్లాసిక్ వన్ డెబిట్ కార్డులతో రూ. 10,000, 811 డ్రీమ్ డిఫరెంట్, ఈజీ పే డెబిట్ కార్డ్లతో రూ. 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. సిల్క్ ప్లాటినం, రూపే ఇండియా లేదా పెషోప్మోర్ డెబిట్ కార్డ్ ఉంటే రూ. 40,000, జిఫ్ఫీ ప్లాటినం ఎడ్జ్, ప్రో, బిజినెస్ క్లాస్ గోల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఎలైట్ కార్డుల రోజువారీ ఉపసంహరణ పరిమితి రూ. 50,000 ఉంది.ఇక యాక్సెస్ ఇండియా డెబిట్ కార్డ్ ఉపసంహరణ పరిమితి రూ. 75,000 కాగా పీవీఆర్, సిగ్నేచర్ ప్రో, నేషన్ బిల్డర్స్, గోల్డ్, జిఫ్ఫీ ప్లాటినం ఏస్, ప్లాటినం ఎడ్జ్, ప్రో, ఏస్ డెబిట్ కార్డ్లు రోజువారీ విత్డ్రాయల్ లిమిట్ రూ. 1,00,000. అదే ప్రివీ లీగ్ ప్లాటినమ్, వరల్డ్, బిజినెస్ పవర్ ప్లాటినమ్ ఏస్, ఆస్ట్రా డెబిట్ కార్డ్ ఉంటే రోజుకు రూ. 1,50,000 విత్డ్రా చేసుకోవచ్చు. ప్రివీ లీగ్ నియాన్, ప్రివీ లీగ్ ప్లాటినమ్, ప్రివీ లీగ్ సిగ్నేచర్ డెబిట్ కార్డ్లకు రూ. 2,00,000, ప్రివీ లీగ్ బ్లాక్, ఇన్ఫినిట్ డెబిట్ కార్డ్లకు రూ. 2,50,000 రోజువారీ ఉపసంహరణ పరిమితి ఉంది. -
సామాన్యులపై ఈఎంఐల మోత: వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారా? అయితే ఈఎమ్ఐ చెల్లిస్తున్న వారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన.. హెచ్డీఎఫ్సీ తాజాగా కొన్ని పీరియడ్ లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) ఐదు బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఇది హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల ఫ్లోటింగ్ లోన్ల ఈఎంఐను ప్రభావితం చేస్తుంది.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు పెరగడం వల్ల వడ్డీ రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.50 శాతం మధ్య ఉన్నాయి. కొత్త వడ్డీ రేట్లు ఈ రోజు నుంచే (నవంబర్ 7) అమలులోకి వస్తాయి. ఎంసీఎల్ఆర్ పెరిగినప్పుడు, లోన్ వడ్డీ పెరుగుతుంది. దీంతో లోన్ కడుతున్న కస్టమర్ల ఈఎంఐ కూడా పెరుగుతుంది.కొత్త ఎంసీఎల్ఆర్లు ఇవే..ఓవర్ నైట్: 9.15 శాతంఒక నెల: 9.20 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.45 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.50 శాతంఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
ఒక్క కంపెనీ లాభం.. రోజుకు రూ.216 కోట్లు!
దేశంలోని కొన్ని కంపెనీలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అవి మనం నిత్యం వింటున్న పేర్లే.. బాగా తెలిసిన కంపెనీలే. అయితే అవి రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటాం. 2024 ఆర్థిక సంవత్సరానికి ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఆధారంగా సగటున రోజుకు ఎంత లాభం ఆర్జిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ నేతృత్వలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.79 లక్షల కోట్ల ఏకీకృత ఎబీటా (EBITDA)ని నివేదించింది. నికర లాభం రూ. 79,020 కోట్లుగా ఉంది. అంటే కంపెనీ సగటున రోజుకు ఆర్జిస్తున్న లాభం రూ.216.5 కోట్లు. ఈటీ మనీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో సగటున రోజువారీ లాభంలో టాప్ టెన్ కంపెనీల జాబితా ఇదే..లాభాల్లో టాప్10 కంపెనీలు🔝రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.216.5 కోట్లు🔝ఎస్బీఐ రూ.186.7 కోట్లు🔝హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.179.3 కోట్లు🔝ఓఎన్జీసీ రూ.156.4 కోట్లు🔝టీసీఎస్ రూ.126.3 కోట్లు🔝ఐసీఐసీఐ బ్యాంక్ రూ.123.3 కోట్లు🔝ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.118.2 కోట్లు🔝ఎల్ఐసీ రూ.112.1 కోట్లు🔝కోల్ ఇండియా రూ.102.4 కోట్లు🔝టాటా మోటర్స్ రూ.87.1 కోట్లుఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా అనిల్ అంబానీ.. -
ఐదు లక్షల మంది రైతులకు సాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా చిన్న రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో ఒకటైన ‘పరివర్తన్’ ద్వారా ఈ సాయం అందించనున్నట్లు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (డీఎండీ) కైజాద్ ఎం బారుచా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్యాంకు గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. స్థిరమైన వృద్ధిని పెంపొందించడంతోపాటు అల్పాదాయ వర్గాలకు అండగా నిలుస్తోంది. 2014లో ప్రారంభమైన ‘పరివర్తన్’ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద సీఎస్ఆర్ ప్రోగ్రామ్ల్లో ఒకటి. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ద్వారా సేవలందిస్తున్నాం. గత పదేళ్ల కాలంలో రూ.5000 కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో ఈ నిధులు పెంచుతాం. ఇప్పటికే పరివర్తన్ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా నిలిచాం. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 25,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. స్మార్ట్ తరగతులు, పాఠశాల ఫర్నిచర్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనను నిరోధించడానికి స్వచ్ఛ భారత్ అభియాన్కు అనుగుణంగా 25000 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను ఇప్పటికే నిర్మించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటుకేంద్ర ప్రభుత్వం 2013 తరువాత కంపెనీల చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అందులోని సెక్షన్ 135లో సీఎస్ఆర్ నిబంధనను చేర్చింది. దాని ప్రకారం కార్పొరేట్ సంస్థల నికర లాభంలో రెండు శాతం సీఎస్ఆర్కు కేటాయించాలి. ఆర్థిక సర్వేలోని వివరాల ప్రకారం గడిచిన ఎనిమిదేళ్లలో అన్ని దేశీయ కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ కింద దాదాపు రూ.1.53 లక్షల కోట్లు ఖర్చు చేశాయి. -
పెరిగిన హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు
భారతదేశంలో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC) వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచినట్లు అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.అధికారిక వెబ్సైట్ ప్రకారం.. హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో మూడు నెలల ఎంసీఎల్ఆర్ 9.30 శాతంగా ఉంది. ఒక సంవత్సరానికి ఎంసీఎల్ఆర్ 9.45 శాతంగా ఉంది. ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ ఈఎంఐ పెరుగుతుంది. ఇందులో ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ రెండూ ఉంటాయి. ఇది కస్టమర్ల మీద ప్రభావం చూపిస్తుంది.ఓవర్ నైట్: 9.10 శాతంఒక నెల: 9.15 శాతంమూడు నెలలు: 9.30 శాతంఆరు నెలలు: 9.40 శాతంఒక సంవత్సరం: 9.45 శాతంరెండు సంవత్సరాలు: 9.45 శాతంమూడు సంవత్సరాలు: 9.45 శాతంఎంసీఎల్ఆర్ అంటే..ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుని రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. దీన్నే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. అందువల్ల ఎంసీఎల్ఆర్ రేటు పెరిగితే.. రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. -
రేపు మూడు గంటలు యూపీఐ సర్వీసు నిలిపివేత!
హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన యూపీఐ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా దాదాపు మూడు గంటల పాటు వినియోగదారులకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.ఈమేరకు బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం..బ్యాంక్ ‘ఎమర్జెన్సీ సిస్టమ్ మెయింటెనెన్స్’ కారణంగా యూపీఐ సేవలు పనిచేయవు. రేపు ఉదయం 2:30 నుంచి 5:30 వరకు యూపీఐ సేవలు నిలిపేస్తున్నారు. బ్యాంకు వినియోగదారులు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు ఈ చర్యలు తీసుకుంటుంది.ఇదీ చదవండి: ఏడాదిలో 42 వేల మంది రాజీనామా!హెచ్డీఎఫ్సీ ప్రకటించిన సమయంలో బ్యాంకు కరెంట్, సేవింగ్స్ ఖాతా(కాసా) హోల్టర్లకు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు అందుబాటులో ఉండవు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్పే, ఫోన్పే, వాట్సప్పే, పేటీఎం..వంటి థర్డ్పార్టీ యాప్ల ద్వారా హెచ్డీఎఫ్సీ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉండదు. -
హెచ్డీఎఫ్సీలో అకౌంట్ ఉందా?.. 13న ఈ సేవలన్నీ బంద్!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఈనెల 13న (జులై 13) సిస్టమ్ అప్గ్రేడ్ చేపడుతోంది. ఈ కారణంగా ఆ రోజు పలు బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుస్తుందని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ఉదయం 3:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ అంతరాయం ఉంటుంది.హెచ్డీఎఫ్సీ అప్డేట్ అనేది సుమారు 13:30 గంటలు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని సర్వీసులకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకుని.. అవసరమైన కార్యకలాపాలను 12వ తేదీనే చేసుకుంటే మంచిది. ఎందుకంటే 13వ తేదీ అసౌకర్యానికి గురికాకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం.జులై 13న అందుబాటులో ఉండే సేవలు👉యూపీఐ సేవలను ఉదయం 3:45 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి 4:30 వరకు ఉపయోగించుకోవచ్చు. 👉ఏటీఎమ్ సర్వీసును ఉదయం 3:45 నుంచి 9:30 వరకు, మధ్యాహ్నం 12:45 నుంచి 4:30 వరకు ఉపయోగించుకోవచ్చు.👉నెట్బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు సిస్టమ్ అప్గ్రేడ్ సమయంలో అందుబాటులో ఉంటాయి.👉ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ బదిలీలు, బ్రాంచ్ బదిలీలతో సహా అన్ని ఫండ్ బదిలీ అందుబాటులో ఉండవు. -
క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లిస్తున్నారా.. కొత్త చార్జీలు తెలుసుకోండి!
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన 'హెచ్డీఎఫ్సీ' అద్దె చెల్లింపుల కోసం కొత్త ఫీజును ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు క్రెడో, చెక్, మొబిక్విక్, ఫ్రీఛార్జ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా చెల్లించే అద్దె మీద 1 శాతం ఫీజు వసూలు చేయనుంది. దీనిని గరిష్టంగా రూ. 3వేలుకు పరిమితం చేశారు. ఈ విషయాన్ని బ్యాంక్ జూన్ 26న కస్టమర్లకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంటే ముందు.. క్రెడిట్ కార్లు చెల్లింపులకు సంబంధించిన విధివిధానాలను ఇతర క్రెడిట్ కార్డు జారీదారులు, బ్యాంకులు కూడా ప్రకటించాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ రెండూ తమ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లలో అద్దె చెల్లింపుల కోసం రివార్డ్ పాయింట్లను అందించడం ఆపివేసాయి.2024 ఫిబ్రవరి 1 నుంచి అమెజాన్ పే ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వంటి నిర్దిష్ట కార్డ్లు మినహా.. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ల ద్వారా చేసే అద్దె చెల్లింపులు, ఈ వాలెట్ లోడింగ్ లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్లు లభించడం లేదు. కాగా ఇప్పుడు హెచ్డీఎఫ్సీ చెల్లింపులపైన అదనపు ఫీజు చెల్లింపులను ప్రారంభించింది. ఈ మార్పులు 2024 ఆగష్టు 1నుంచి అమలులోకి రానున్నాయి. -
ఇకపై బ్యాంక్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్లుండవు.. ఎవరికంటే..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కస్టమర్లకు పంపించే ఎస్ఎమ్ఎస్లపై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ వినియోగదారులు చేసే యూపీఐ డెబిట్, క్రెడిట్ లావాదేవీలకు కొత్త నిబంధన వర్తిస్తుందని చెప్పింది.బ్యాంక్ యూపీఐ డెబిట్, క్రెడిట్లు ఉపయోగించి రూ.100లోపు లావాదేవీలు చేస్తే ఇకపై ఎస్ఎమ్ఎస్లు పంపబోమని తెలిపింది. 2024 జూన్ 25 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ చెప్పింది. అయితే అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ సందేశాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేసింది. తాజా పరిమితి ప్రకారం.. రూ.100కు పైన ఎవరికైనా నగదు పంపినా/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తే ఎస్ఎమ్ఎస్ అలర్ట్లు అందుతాయి. దాంతోపాటు రూ.500కు మించి నగదు అందుకున్నప్పుడు మాత్రమే ఎస్ఎమ్ఎస్ సదుపాయం ఉంటుంది.ఇదీ చదవండి: క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలుఅధిక మొత్తంలో యూపీఐ లావాదేవీలు జరుగుతున్నందున బల్క్ ఎస్ఎమ్ఎస్లు పంపేందుకు అయ్యే ఖర్చులు పెరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం..2023లో యూపీఐ లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఏడాది చివరినాటికి దాదాపు 118 బిలియన్లకు చేరుకున్నాయి. -
హెచ్డీఎఫ్సీ.. ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన దీపక్ పరేఖ్.. తదుపరి ఎవరంటే..
హెచ్డీఎఫ్సీ లైప్ ఇన్సూరెన్స్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి దీపక్ పరేఖ్ వైదొలిగారు. ఈనెల 18 వ్యాపార వేళలు ముగిసినప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. గత 24 ఏళ్లుగా సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్గా ఆయన అందించిన సేవలకు కంపెనీ కృతజ్ఞతలు తెలిపింది. పరేఖ్ అనంతరం ఎవరు ఈ కంపెనీని ముందుండి నడిపిస్తారనే వాదనలను తెరదించుతూ కొత్త ఛైర్మన్ను కూడా ఏకగ్రీవంగా నియమించారు. కేకి ఎం మిస్త్రీను సంస్థ ఛైర్మన్గా నియమిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. 23 ఏళ్లుగా కంపెనీలో ఉన్న ఆయన ప్రస్తుతం బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఆయన క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో సహ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. మిస్త్రీ హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ పొందిన అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇదీ చదవండి: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే.. ఏప్రిల్ 24, 2024న వికె విశ్వనాథన్, ప్రసాద్ చంద్రన్ తమ ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుని స్వతంత్ర డైరెక్టర్లుగా కొనసాగుతారని కంపెనీ తెలిపింది. ఇటీవల వెంకట్రామన్ శ్రీనివాసన్ను ఐదేళ్ల కాలానికిగాను నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫార్సు ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్గా నియమించినట్లు కంపెనీ గతంలోనే పేర్కొంది. -
హెడీఎఫ్సీ బ్యాంక్ రుణాలు ఎన్నంటే..?
ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణాలు రూ.25 లక్షల కోట్లను అధిగమించాయి. 2024 మార్చి త్రైమాసికం ముగిసే నాటికి ఈ మేరకు రుణాలున్నట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. 2023 మార్చి 31 నాటికి ఈ రుణాల విలువ రూ.16.14 లక్షల కోట్లు ఉండగా, 55.4 శాతం వృద్ధితో రూ.25.08 లక్షల కోట్లకు చేరినట్లు నియంత్రణ సంస్థలకు బ్యాంక్ రిపోర్ట్ చేసింది. 2023 జులై 1న హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల విలీనం తర్వాతి రుణాలు కాబట్టి, గత ఏడాదితో వీటిని పోల్చిచూడొద్దని బ్యాంకు వర్గాలు తెలిపాయి. త్రైమాసిక ప్రాతిపదికన 2023 డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే (రూ.24.69 లక్షల కోట్లు) 2024 మార్చి త్రైమాసికంలో 1.6 శాతం మాత్రమే రుణాలు పెరిగాయి. ఇదీ చదవండి: పెరిగిన వెజ్ భోజనం ధర.. తగ్గిన నాన్వెజ్ ఖరీదు దేశీయ రిటైల్ రుణాలు 2023 మార్చి 31తో పోలిస్తే 109 శాతం, డిసెంబరు 31తో పోలిస్తే 3.7 శాతం వృద్ధి చెందాయి. వాణిజ్య-గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు వరుసగా 24.6 శాతం, 4.2 శాతం మేర పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు 2024 మార్చి 31 నాటికి రూ.23.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023 డిసెంబరు 31 నాటికి రూ.22.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన రూ.18.83 లక్షల కోట్ల నుంచి 26.4 శాతం పెరిగాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తన హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో 100 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్విస్ ఛాలెంజ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ వాటాను ఎవరు కొనుగోలు దారులను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ బిడ్డర్ ప్రయోజనాల కోసం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతి స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది ఓ కంపెనీలో వాటాను మరో సంస్థకు అమ్మేందుకు ఉపయోగపడే బిడ్డింగ్ ప్రక్రియ. ఆసక్తిగల సంస్థ (సాధారణంగా ఒక ప్రైవేట్ సంస్థ) ఒక కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ కోసం ఒక ప్రతిపాదనను ప్రారంభిస్తుంది. అప్పుడు ప్రభుత్వం ప్రాజెక్టు వివరాలను బహిరంగంగా విడుదల చేసి, ఇతర పార్టీలను తమ ప్రతిపాదనలను సమర్పించమని ఆహ్వానిస్తుంది. ఈ ప్రతిపాదనను ప్రారంభించిన అసలు బిడ్డర్(ఇక్కడ హెచ్డీఎఫ్సీ బ్యాంక్)కు తిరస్కరించే హక్కు ఉంది. అసలు బిడ్డర్కు నచ్చితే వాటా అమ్మకం ప్రక్రియ ముందుకు సాగుతుంది. -
ఈ రెండు బ్యాంక్ ఖాతాదారులకు బంపరాఫర్
ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడిదారులకు భద్రత ఎక్కువ, రిస్క్ తక్కువ. అందుకే పెట్టుబడి దారులు ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టేందుకు మక్కువ చూపుతుంటారు. మీరు కూడా ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఎఫ్డీలపై 7.75శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తూ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్లు వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల (బిపిఎస్) వరకు పెంచింది. కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఫిబ్రవరి 9, 2024 నుండి అమలులోకి వస్తాయి. 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.5శాతం నుండి 7.75శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇది కాకుండా, బ్యాంక్ 18 నెలల కాలపరిమితికి వడ్డీ రేట్లను పరిమిత కాలానికి 21 నెలల కంటే తక్కువకు పెంచింది. సాధారణ పౌరులకు, వడ్డీ రేటు 7.25శాతం. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు, అదే టెన్యూర్ కాలానికి వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను ఫిబ్రవరి 17, 2024 నుండి రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం, సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు 7.75శాతం అందిస్తుండగా.. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పౌరులకు సంవత్సరానికి 7.2శాతం వడ్డీని అందిస్తుంది. . సాధారణ పౌరులకు, ఫిక్స్డ్ డిపాజిట్ అత్యధిక వడ్డీ రేటు 18 నెలల నుండి 2 సంవత్సరాల టెన్యూర్ కాలానికి 7.2శాతం వరకు ఉంటుంది. మరోవైపు, సీనియర్ సిటిజన్లకు అదే టెన్యూర్ కు 7.75శాతం వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొంది. -
దీర్ఘకాలంలో నమ్మకమైన లాభాలనిచ్చే ఫండ్.. ఓ లుక్కేయండి..
లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ వేల్యుయేషన్లను అర్థం చేసుకోవడం సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన విషయమే. భవిష్యత్తులో వీటిల్లో ఏ విభాగం, మిగిలిన విభాగాలతో పోలిస్తే మంచి పనితీరు చూపిస్తుందని ముందుగా గుర్తించడం కూడా కష్టమే. గత 15 ఏళ్ల కాలంలో లార్జ్క్యాప్ ఇండెక్స్ నాలుగేళ్ల కాలంలో మంచి పనితీరు చూపించగా, మిడ్క్యాప్ ఇండెక్స్ కూడా నాలుగు సంవత్సరాలలో మంచి పనితీరు ప్రదర్శించింది. కానీ, స్మాల్క్యాప్ మాత్రం ఏడేళ్లలో మంచి పనితీరు చూపించింది. కనుక ప్రతీ విభాగంలోనూ ఇన్వెస్టర్ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రాబడులు ఆర్జించడానికి మంచి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇలా లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టి మంచి రాబడులు ఇచ్చేవే ఫ్లెక్సీక్యాప్, మలీ్టక్యాప్ ఫండ్స్. ఈ విభాగంలో ఎంతో కాలంగా పనిచేస్తూ, మంచి పనితీరు చూపుతున్న పథకాల్లో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. రాబడులు ఈ పథకం ఏ కాలంలో చూసినా కానీ, బెంచ్ మార్క్ అయిన బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. గడిచిన ఏడాది కాలంలో 37.58 శాతం రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. మూడేళ్లలో కాలంలో వార్షిక రాబడి 24.27 శాతంగా ఉంది. ఇక ఐదేళ్ల కాలంలో 19.40 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 17.13 శాతం చొప్పున వార్షిక రాబడి ఈ పథకంలో భాగంగా ఉంది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడితో పోల్చి చూస్తే, ఈ పథకమే 3 శాతం నుంచి 8 శాతం మేర అధిక రాబడిని వివిధ కాలాల్లో అందించినట్టు తెలుస్తోంది. ఇక బీఎస్ఈ 500 టీఆర్ఐతో చూసినా కానీ, ఈ పథకంలోనే 1–6 శాతం మేర వివిధ కాలాల్లో అధిక రాబడి కనిపిస్తుంది. ఈ పథకం 1995 జనవరి 1న ప్రారంభమైంది. గతంలో హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్ కాగా, అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది. ఆరంభం నుంచి వార్షిక రాబడి 19 శాతం మేర ఉండడం గమనించొచ్చు. పెట్టుబడుల విధానం/ఫోర్ట్ఫోలియో హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్కు దేశ ఈక్విటీ మార్కెట్లో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉండడం గమనార్హం. తొలుత రూ.52 కోట్లతో ఆరంభమైన ఈ పథకంలో ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది జనవరి చివరికి రూ.47,642 కోట్లుగా ఉన్నాయి. ప్రతి మార్కెట్ సైకిల్లో మంచి పనితీరు చూపించే అవకాశం ఉన్న రంగాలు, కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. ప్రస్తుతం ఈ పథకం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 87.5 శాతమే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. డెట్ సాధనాల్లో 0.42 శాతం పెట్టుబడులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లోనూ 3.79 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. నగదు, నగదు సమానాల రూపంలో 8.29 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీల్లో 91 శాతం పెట్టుబడులను లార్జ్క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్క్యాప్ కంపెనీల్లో 7.61 శాతం, స్మాల్క్యాప్ కంపెనీల్లో 1.52 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. పోర్ట్ఫోలియోలో 41 స్టాక్స్ ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 32 శాతం పెట్టుబడులు పెట్టింది. హెల్త్కేర్ కంపెనీలకు 12.59 శాతం, టెక్నాల జీ కంపెనీలకు 9.5 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 7.39 శాతం చొప్పున కేటాయించింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్లో వాటా కొనుగోలుకు HDFCకి లైన్ క్లీయర్
-
అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ తమ వాలెట్ బిజినెస్ ముకేశ్ అంబానీకి చెందిన NBFCతో పాటు HDFC బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తీవ్ర సంక్షోభంలో ఉన్న కంపెనీ తమ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీకి విక్రయిస్తుందనే పుకార్లు వెల్లువెత్తడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 14 శాతం పెరిగి 288.75 రూపాయల గరిష్ఠానికి చేరుకున్నాయి. పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జియో ఫైనాన్షియల్లు ముందున్నాయని, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ బృందం ఈ విషయాన్నే.. గత నవంబర్ నుంచి జియో ఫైనాన్షియల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. RBI నిషేధానికి ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి జియో కూడా సుముఖత చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్బీఐ పేటీఎం లైసెన్స్ రద్దు చేస్తుందా.. పేటీఎంలో మనీలాండరింగ్, కేవైసీ ఉల్లంఘనల కారణంగా బ్యాంకింగ్ లైసెన్స్ను కూడా రద్దు చేసే విషయాన్ని RBI పరిశీలిస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు.. ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్లను స్వీకరించకూడదనే నియమాలు అమలులోకి వస్తాయా? అనేది తెలియాల్సి ఉంది. పేటీఎం సీఈఓ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని, ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని విజయ్ శేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల ఎక్కువ మంది దీని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం కరో ఓ ఛాంపియన్గా నిలుస్తుందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే.. -
పడగొట్టిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ
ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇతర ముఖ్యాంశాలు... జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది. ► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది. ► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది. ►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్ఈలో 2% డిస్కౌంట్తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది. ► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి. ► బీఎల్ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్స్రై్కబ్ అయ్యాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 39% జంప్
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. గతేడాది డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో (2023–24, క్యూ3) బ్యాంక్ కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభం రూ. 17,718 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 12,735 కోట్లతో పోలిస్తే 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 54,123 కోట్ల నుంచి రూ. 1,15,015 కోట్లకు చేరింది. 112 శాతం ఎగసింది. స్టాండెలోన్ నికర లాభం 34 శాతం వృద్ధితో రూ.16,373 కోట్లకు దూసుకెళ్లింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.12,259 కోట్లుగా ఉంది. ఇక స్టాండెలోన్ ఆదాయం 60 శాతం వృద్ధి చెంది, రూ. 51,208 కోట్ల నుంచి రూ. 81,720 కోట్లకు పెరిగింది. ఎన్పీఏలు ఇలా... బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) క్యూ3లో స్వల్పంగా పెరిగాయి. 1.23 శాతం నుంచి 1.26 శాతానికి చేరాయి. అయితే నికర ఎన్పీఏలు మాత్రం 0.33 శాతం నుంచి స్వల్పంగా 0.31 శాతానికి తగ్గాయి. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర మంగళవారం 0.31 శాతం పెరిగి రూ. 1,678 వద్ద ముగిసింది. -
రూ.10వేల పెట్టుబడితో.. 15 కోట్లు సంపాదన, ఎలా అంటే?
నెలకు 10వేలు 25ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే సుమారు 15 కోట్ల వరకు డబ్బు సంపాదించడం ఎలా? ఈ రహస్యాన్నే హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, యాంఫీ ఛైర్మన్ నవనీత్ మునోత్ బహిర్ఘతం చేశారు. ముంబైలో జరిగిన బిజినెస్ టుడే 500 వెల్త్ క్రియేటర్ సమ్మిట్లో భారతీయ మార్కెట్ల భవిష్యత్తు గురించి, వ్యాపారాలు, పెట్టుబడిదారులు, కొత్తగా పుట్టుకొస్తున్న మార్కెట్ ట్రెండ్లు, సవాళ్లు, అవకాశాల్ని అన్వేషించడం అనే అంశంపై ఆయా కంపెనీల సీఈఓలు మాట్లాడారు. ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, యాంఫీ ఛైర్మన్ నవనీత్ మునోత్ మాట్లాడుతూ..మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ విలువ 17 వేల కోట్లు మూడేళ్ళ క్రితం అది నేటితో పోలిస్తే సగం. మ్యూచువల్ ఫండ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి దాదాపు 25 ఏళ్లు పట్టింది. 2017లో 4,000 కోట్లు, 2018లో 8,000 కోట్లు, ఇప్పుడు 2023లో 17,000 కోట్లుగా ఉందని అన్నారు. అనంతరం.. ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులతో భారీ రాబడులే వచ్చాయి. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో నెలకు రూ.10వేల చొప్పున 25 నుంచి 30 ఏళ్లు పెట్టుబడులు పెడితే 18-19 శాతం వడ్డీ ఇలా అసలు వడ్డీ మొత్తం కలుపుకుని రూ.15 కోట్లు వచ్చాయి. అయితే, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పరంగా అంత సానుకూలత లేదు. కాబట్టి రాబోయే 28 సంవత్సరాలలో రూ.10వేలు పెట్టుబడి పెడితే ఇంత భారీ మొత్తంలో డబ్బుల్ని సంపాదించవచ్చా’ అంటే ఖచ్చితంగా చెప్పలేను అని అన్నారు. అయితే ఇది దేశ సామర్ధ్యం ఎలా ఉందో నిరూపిస్తుంది. పెట్టుబడుల పరంగా భారత్ మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు అత్యుత్తమం అంటూ నవనీత్ మునోత్ తన ప్రసంగాన్ని ముగించారు. -
5 రోజుల్లో రూ. 26 వేల కోట్లు లాభపడిన లక్కీ ఇన్వెస్టర్లు
దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) కూడా ఒకటి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంకాప్) పరంగా కూడా టాప్ 10 కంపెనీల జాబితాలో టాప్లో కొనసాగుతూ వస్తుంది. తాజాగా లిస్ట్లో కూడా రిలయన్స్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. దీంతో రిలయన్స్ పెట్టుబడిదారులు అపార లాభాలను సొంతం చేసుకున్నారు. గత 5 రోజుల ట్రేడింగ్లో రూ. 26,000 కోట్లకు పైగా లాభాలను సాధించారు. ఆర్ఐఎల్ ఎంక్యాప్ గత వారం రూ.16,19,907.39 కోట్లకు పెరిగింది. క్రితం వారంతో పోలిస్తే రూ.26,014.36 కోట్లు పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో నాలుగు కంపెనీలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఇందులో ఆర్ఐఎల్ తరువాత భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ ,హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిలిచింది. ఆరు కంపెనీలు లాభాలనుకోల్పోయాయి. రూ. 20,490 లాభాలతో రూ. 11,62,706.71 కోట్ల ఎంక్యాప్తో హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 5,46,720.84 కోట్లకు చేరుకుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,030.88 కోట్లు పెరిగి రూ.6,51,285.29 కోట్లకు చేరుకుంది. గత వారం నష్టపోయిన టాప్ కంపెనీల్లో టీసీఎస్ నిలిచింది. రూ.16,484.03 కోట్లు తగ్గి రూ.12,65,153.60 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎస్బీఐ , బజాజ్ ఫైనాన్స్ నష్టపోయిన ఇతర టాప్ కంపెనీలు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జోరు
ముంబై: మార్టిగేజ్ దిగ్గజం, మాతృ సంస్థ.. హెచ్డీఎఫ్సీ విలీనం తదుపరి ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో రూ. 16,811 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టాండెలోన్ నికర లాభం రూ. 15,976 కోట్లకు చేరింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో విలీన సంస్థ నికర లాభం రూ. 11,162 కోట్లుగా మదింపు వేసింది. ఇక గత క్యూ2 స్టాండెలోన్ లాభం రూ. 10,606 కోట్లుగా లెక్కకట్టింది. మార్జిన్లు డీలా గతంలో 4 శాతానికిపైగా నికర వడ్డీ మార్జిన్లు సాధిస్తూ వచ్చిన నంబర్ వన్ ప్రైవేట్ రంగ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ ప్రస్తుత సమీక్షా కాలంలో 3.4 శాతం మార్జిన్లు ప్రకటించింది. ఇందుకు విలీనం తదుపరి బ్యాలన్స్షీట్లో తక్కువ ఈల్డ్స్ ఆర్జించే సెక్యూర్డ్ ఆస్తులు(రుణాలు) పెరగడం ప్రభావం చూపింది. అంతేకాకుండా విలీనానికి మార్కెట్ రుణ సమీకరణ వ్యయాలు సైతం పెరిగాయి. అయితే నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోనున్నట్లు బ్యాంక్ సీఎఫ్వో శ్రీనివాసన్ వైద్యనాథన్ పేర్కొన్నారు. అధిక ఈల్డ్స్ అందించే ఆస్తులు పెరగడం, చౌకగా సమీకరించిన డిపాజిట్లతో మార్కెట్ రుణాలను రీప్లేస్ చేసిన తదుపరి మార్జిన్లు మెరుగుపడనున్నట్లు వివరించారు. 30 శాతం అప్ ఈ ఏడాది క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 30 శాతం జంప్చేసి రూ. 27,385 కోట్లను తాకింది. గతేడాది క్యూ2లో రూ. 21,021 కోట్ల వడ్డీ ఆదాయాన్ని సాధించాయి. ఇక ఇతర ఆదాయం రూ. 7,596 కోట్ల నుంచి రూ. 10,708 కోట్లకు జంప్ చేసింది. అటు డిపాజిట్లు, ఇటు అడ్వాన్సులు(రుణాలు).. రూ. లక్ష కోట్ల చొప్పున నమోదయ్యాయి. డిపాజిట్లు 5.3 శాతం, అడ్వాన్సులు 4.9 శాతం చొప్పున వృద్ధి చూపాయి. స్థూల మొండిబకాయిలు 1.41 శాతం నుంచి 1.34 శాతానికి తగ్గాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,240 కోట్ల నుంచి రూ. 2,903 కోట్లకు వెనకడుగు వేశాయి. ఎడ్యుకేషన్ రుణాలందించే క్రెడిలా విక్రయాన్ని పూర్తి చేయవలసి ఉన్నట్లు వైద్యనాథన్ పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లిస్టింగ్ ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు. నికరంగా 16,000 మంది ఉద్యోగులను తీసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1.98 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం క్షీణించి రూ. 1,530 వద్ద ముగిసింది. -
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించిన హెచ్డీఎఫ్సీ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులకు భారీ షాకిచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించేసింది. సాధారణ ఖాతాదారులకు 35 నెలల టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 7.20 శాతం నుంచి ఐదు బేసిక్ పాయింట్ల తగ్గింపుతో 7.15 శాతానికి, అలాగే 55 నెలల టెన్యూర్ కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ పథకంపై వడ్డీ 7.20 శాతానికి తగ్గించింది. 12 నెలల నుంచి 15 నెలల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేండ్ల నుంచి రెండు సంవత్సరాల 11 నెలలు, మూడేండ్ల ఒక్కరోజు నుంచి నాలుగేండ్ల ఏడు నెలల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ ఖాతాదారులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ చెల్లిస్తున్నది. ఇక ఐదేండ్ల ఒక రోజు నుంచి 10 ఏండ్ల మధ్య మెచ్యూరిటీ గల ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ పౌరులకు ఏడు శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై కొత్త వడ్డీరేట్లు వర్తిస్తాయి. -
బ్యాంక్ షేర్లలో తాజా కొనుగోళ్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో భాగంగా ఫెడరల్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్సహా పలు బ్యాంకులలో అదనపు వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకు ఆర్బీఐ నుంచి తాజాగా అనుమతులు లభించినట్లు హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వెల్లడించింది. వెరసి అనుమతి పొందిన బ్యాంకులలో వాటాను 9.5 శాతంవరకూ పెంచుకునేందుకు గ్రీన్సిగ్నల్ లభించినట్లు తెలియజేసింది. బ్యాంకులలో అదనపు పెట్టుబడులను చేపట్టేందుకు పెట్టుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ క్లియరెన్స్ ఇచి్చనట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి పొందిన జాబితాలో డీసీబీ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ సైతం ఉన్నాయి. మరోవైపు చెల్లించిన మూలధనం లేదా వోటింగ్ హక్కులలో 9.5 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు హెచ్డీఎఫ్సీ ఏఎంసీకి ఆర్బీఐ నుంచి అనుమతి లభించినట్లు విడిగా ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా.. 2023 జూన్30కల్లా ఫెడరల్ బ్యాంక్లో 4.49 శాతం, ఈక్విటాస్ ఎస్ఎఫ్బీలో 4.68 శాతం చొప్పున హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వాటాలు కలిగి ఉంది. అయితే తాజా కొనుగోళ్ల తదుపరి ఒక్కో బ్యాంకులో 9.5 శాతం వాటాను మించేందుకు అనుమతించరు. -
మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో అవకాశాలు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం: ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్
HDFC Bank hikes interest rates దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిచ్చింది. అన్ని రకాల లోన్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఆయా రుణాలపై ఈఎంఐ భారం మరింత భరించక తప్పదు. (యాపిల్కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు) హెచ్డీఎఫ్సీ రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం మేర పెంచింది. దీని ప్రకారం బ్యాంకుకు సంబంధించిన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై ఇకపై వడ్డీ భారం పెరగనుంది. ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ పెంపు తర్వాత 8.35 శాతం నుంచి 8.50 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.45 శాతం నుంచి 8.55 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.70 శాతం నుంచి 8.80 శాతానికి చేరుకుంది. ఏడాదిలోపు రుణాలపై వడ్డీరేటు భారం 5 బేసిస్ పాయింట్లు పెరిగి 9.15 శాతానికి చేరింది . (ఐఫోన్లలో పెగాసస్ స్పైవేర్: అప్డేట్ చేసుకోకపోతే అంతే!) సెప్టెంబరు 7 నుంచి అమల్లోకి వచ్చిన హెచ్డీఎఫ్సీ MCLR 6 నెలలుకాల రుణాలపై 9.05 శాతం ఏడాది రుణాలపై 9.15శాతం రెండేళ్ల కాలపరిమితి రుణాలపై 9.20 శాతం మూడేళ్ల కాల రుణాలపై 9.25శాతం వడ్డీ వర్తిస్తుంది. -
గిఫ్ట్ సిటీలో హెచ్డీఎఫ్సీ లైఫ్ సేవలు
న్యూఢిల్లీ: గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ) నుంచి హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ సేవలను ఆరంభించాయి. ఈ విషయాన్ని హెచ్డీఎఫ్సీ గ్రూప్ గురువారం ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థ ఐఎఫ్ఎస్సీలో ‘హెచ్డీఎఫ్సీ ఇంటర్నేషనల్ లైఫ్ అండ్ ఆర్ఈ’ని ఏర్పాటు చేసింది. ఇదే కేంద్రంలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ను హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ప్రారంభించింది. డాలర్ డినామినేటెడ్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను ఎన్ఆర్ఐలకు ఆఫర్ చేయనున్నట్టు హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది. ఇదే మాదిరి హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఫండ్ సొల్యూషన్లను అందించనుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇంటర్నేషనల్ తన తొలి ఉత్పత్తిని సైతం ప్రకటించింది. ‘యూఎస్ డాలర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్లాన్’ పెట్టుబడులకు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించింది. పిల్లల విదేశీ విద్యకు నిధిని సమకూర్చుకోవాలని అనుకునే వారికి ఇది అనుకూలమని తెలిపింది. కరెన్సీ మారకంలో అస్థిరతలను ఇది నివారిస్తుందని పేర్కొంది. మరోవైపు హెచ్డీఎఫ్సీ ఏఎంసీ సైతం ఆరు కొత్త పథకాలను ప్రారంభించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపింది. -
అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే?
HDFC: ప్రపంచ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకి అమాంతం ముందుకు దూసుకెళుతోంది. ఈ కారణంగా ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో ఒక ఎకరం భూమి ధర ఏకంగా రూ. 100 కోట్లకు చేరిన సంగతి తెలిసింది. కాగా అద్దెలు కూడా భారీగానే పెరిగాయి. దీంతో ఒక బ్యాంకు నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లిస్తూ ఐదు సంవత్సరాల అగ్రిమెంట్తో ఆఫీస్ స్పేస్ లీజుకి తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నెలకు రూ. 1.62 కోట్లు అద్దె.. నివేదికల ప్రకారం.. హెచ్డీఎఫ్సీ ముంబైలోని వన్ ఇంటర్నేషనల్ సెంటర్లో తన ఆఫీస్ కోసం 64,337 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలానికి నెలకు రూ. 1.62 కోట్లు అద్దె చెల్లించడానికి అంగీకరించినట్లు తెలిసింది. దీని కోసం సంస్థ ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తరువాత అగ్రిమెంట్ కాలవ్యవధి పెరుగుతుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. బ్యాంకు 7వ అంతస్తులో మూడు యూనిట్లు, 8వ అంతస్తులో రెండు యూనిట్లను లీజుకు తీసుకుంది. ఇవి టవర్స్ 2, 3లో ఉన్నాయి. ఈ డీల్ కోసం బ్యాంక్ దాదాపు రూ.9.73 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. అయితే అద్దె సంవత్సరానికి 4.5 శాతం పెరగనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పొట్టి మొక్క సాగుతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ఐదు సంవత్సరాలకు అద్దె ఇలా.. దీని ప్రకారం మార్చి 1, 2024 నుంచి జూలై 31, 2024 వరకు అద్దె రూ. 1.62 కోట్లు. 2024 ఆగష్టు 1 నుంచి 2025 జూలై 31 వరకు అద్దె నెలకు రూ.1.69 కోట్లు. 2025 ఆగష్టు 1 నుంచి 2026 జూలై 31 వరకు అద్దె రూ. 1.77 కోట్లు. 2026 ఆగష్టు 1 నుంచి 2027 జులై 31 వరకు అద్దె రూ.1.85 కోట్లు ఉండనున్నట్లు సంస్థ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! గత కొన్ని రోజులకు ముందు హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
బంపర్ ఆఫర్.. ఈ కెడ్రిట్ కార్డ్ ఉండే 10% క్యాష్బ్యాక్, ఇంకా బోలెడు బెనిఫిట్స్!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ, ప్రైవేట్రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ సంయుక్తంగా క్రెడిట్ కార్డును మార్కెట్లోకి విడుదల చేసింది. మాస్టర్ కార్డ్ పేమెంట్ నెట్వర్క్పై ఈ కార్డు పనిచేయనున్నట్లు తెలిపింది. స్విగ్గీ ఫుడ్, గ్రాసరీ డెలివరీలపై 10 శాతం క్యాష్బ్యాక్ అందిస్తుండడం ఈ కార్డు ప్రత్యేకత. అంతేకాకుండా ఇతర కొనుగోళ్లపైనా రివార్డులు, ప్రయోజనాలు లభిస్తాయి. బెనిఫిట్స్ ఇవే హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్విగ్గీ నుంచి వెలువడిన ప్రకటన ప్రకారం.. ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కిరాణా డెలివరీ, డైనింగ్ అవుట్ మరియు మరిన్నింటిలో ఖర్చులపై 10% క్యాష్బ్యాక్తో సహా అనేక రకాల ప్రయోజనాలను ఈ కార్డుదారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.500. వార్షిక రుసుముగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో రూ.2 లక్షలు కంటే ఎక్కువ కొనుగోళ్లు జరిపితే వార్షిక రుసుము రద్దు చేస్తారు. రెంట్ పేమెంట్, యుటిలిటీ బిల్స్, ఫ్యూయల్, ఇన్సురెన్స్, ఈఎంఐ, జ్యువెలరీ కొనుగోళ్లకు క్యాష్ బ్యాక్ వర్తించదు. ఒక నెలలో 10 శాతం క్యాష్బ్యాక్ కింద రూ.1,500 లభిస్తుంది. 5 శాతం క్యాష్బ్యాక్కూ అదే పరిమితి వర్తిస్తుంది. 1 శాతం క్యాష్బ్యాక్కు నెలలో గరిష్ఠ పరిమితి రూ.500గా నిర్ణయించారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా, ఓలా, ఉబెర్, ఫార్మఈజీ, బుక్మైషో ఇంకా మరెన్నో ప్లాట్ఫారమ్లలో షాపింగ్ చేయడంపై కార్డ్ హోల్డర్లు 5% క్యాష్బ్యాక్ను కూడా అందుకుంటారు. ఈ అదనపు 5% క్యాష్బ్యాక్ ప్రయోజనం Nike, H&M, Adidas, Zara మొదలైన బ్రాండెడ్ వెబ్సైట్లకు కూడా వర్తిస్తుంది.ఇంకా, కస్టమర్లు ఇతర ఖర్చులపై 1% తిరిగి పొందుతారు. కార్డ్ హోల్డర్లు స్విగ్గీ మనీ రూపంలో క్యాష్బ్యాక్ పొందుతారు. వీటిని వివిధ లావాదేవీల కోసం స్విగ్గీ అంతటా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా కార్డ్ హోల్డర్లు 3-నెలల కాంప్లిమెంటరీ స్విగ్గీ వన్ మెంబర్షిప్ను పొందగలరు. ఇది ఫుడ్, కిరాణా, డైనింగ్ అవుట్, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్లలో ప్రయోజనాలను అందిస్తుంది. రోజువారీ కొనుగోళ్లపై క్యాష్బ్యాక్ పొందడంతో పాటు, స్విగ్గీ, HDFC కార్డ్ హోల్డర్లు ఉచిత బస, భోజనం, కాంప్లిమెంటరీ లాయల్టీ మెంబర్షిప్లతో పాటు మరిన్ని వంటి ప్రపంచ స్థాయి మాస్టర్కార్డ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. స్విగ్గీ యాప్లో వారం పది రోజుల్లో దశలవారీగా ఈ క్రెడిట్ కార్డు అందుబాటులోకి రానుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు స్విగ్గి యాప్ లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్ నుంచి క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చదవండి ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే? -
హెచ్డీఎఫ్సీ సీఈవో శశిధర్ వార్షిక వేతనం ఎంతో తెలుసా?
HDFC Bank CEO Sashidhar Jagdishan Salary: మెగా మెర్జర్ తరువాత ప్రైవేటు బ్యాంకింగ్దిగ్గజం హెచ్డీఎఫ్సీ ప్రపంచ బ్యాంకింగ్లో 7వ ర్యాంక్ను సాధించింది. అలాగే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. మార్కెట్ అంచనాలను మించి తొలి త్రైమాసిక లాభంలో 30 శాతం పెరిగింది. ఈ సందర్బంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీఈవో శశిధర్ జగదీషన్ వార్షిక వేతనం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సీఈవో వార్షిక వేతనంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6.52 కోట్లతో పోలిస్తే, ఎఫ్వై23లో జగదీషన్ మొత్తం ఆదాయం రూ.10.55 కోట్లుగా ఉంది. రెమ్యునరేషన్ ప్యాకేజీలో రూ. 2.82 కోట్ల బేసిక్ జీతం, రూ. 3.31 కోట్ల అలవెన్సులు , పెర్క్విసైట్లు ఉండగా, రూ. 3.63 కోట్ల పనితీరు బోనస్ ఉన్నాయి.2021-2022కి, జగదీషన్కు మొత్తం రూ. 5.16 కోట్ల నగదు వేరియబుల్ పేను ఆర్బిఐ ఆమోదించింది, అందులో అతను రూ. 2.58 కోట్లు అందుకున్నారు. (లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో) 2020-2021లో క్యాష్ వేరియబుల్ పేలో భాగంగా రూ. 1.05 కోట్లు అందుకున్నారు. అదే సమయంలో, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కైజాద్ భారుచా మార్చి 31, 2023తో ముగిసే సంవత్సరానికి రూ. 10.03 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. ఇది మునుపటి వార్షిక వేతనం రూ. 10.64 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. (Infosys Q1 Results: అంచనాలు మిస్, రెవెన్యూ గైడెన్స్ కోత) హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పుడు సాంకేతిక పరివర్తన సాధనలో ఉందని, భవిష్యత్తులో బ్యాంకును నిర్మించడంతోపాటు, సమర్ధవంతంగా నడపడంపై దృష్టి సారిస్తుందని షేర్హోల్డర్లను ఉద్దేశించి జగదీషన్ పేర్కొన్నారు. 2022-23లో, బ్యాంక్ రికార్డు స్థాయిలో 1,479 శాఖలను జోడించిందని, వీటిలో ఎక్కువ భాగం సెమీ అర్బన్, రూరల్ (ఎస్యుఆర్యు) లో ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం మరో 675ని జోడించాలని యోచిస్తోందని, దీంతో మొత్తం శాఖల సంఖ్య 5,000కి చేరుకుంటుందని వెల్లడించారు. మొత్తం మీద, ఏడాదిలో 1,500 నుండి 2,000 అదనపు శాఖలను జోడించాలని బ్యాంక్ యోచిస్తోందని శశిధర్ చెప్పారు. కాగా ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1లో నికర లాభం 29 శాతం జంప్చేసి రూ. 12,370 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. అలాగే మెగా విలీనం తరువాత బ్యాంకు షేర్లు బాగా లాభపడింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. అలాగే డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసి ఏడో స్థానాన్ని ఆక్రమించింది. -
హెచ్డీఎఫ్సీ విలీనంతో రుణ డిమాండ్ క్షీణత
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనంతో రుణ వితరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 బేసిస్ పాయింట్ల వరకు (3 శాతం) తగ్గి 13–13.5 శాతానికి పరిమితం కావొచ్చని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రుణాల్లో వృద్ధి 15.4 శాతంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. జూన్ 16 నాటికి ముగిసిన పక్షం రోజుల్లో రుణ వితరణ 15.4 శాతం పెరిగి ఈ ఏడాది రూ.140.2 లక్షల కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు ఈ డిమాండ్ను నడిపించినట్టు చెప్పింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 13.2 శాతం వృద్ధి కంటే ఎక్కువ నమోదైంది. డిపాజిట్లు కూడా జూన్ 16తో ముగిసిన పక్షం రోజుల్లో 12.1 శాతం పెరిగాయి. రుణాలు, డిపాజిట్ల మధ్య అంతరం 337 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఇక గడిచిన 12 నెలల్లో డిపాజిట్లు రూ.20 లక్షల కోట్లకు విస్తరించగా, రుణాలు రూ.18.7 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
సెన్సెక్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్.. హెచ్డీఎఫ్సీ స్థానంలో చోటు
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్–30లో జేఎస్డబ్ల్యూ స్టీల్కు చోటు లభించనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనంకానున్న హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ స్థానే ఇండెక్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రాతినిధ్యం వహించనుంది. జూలై 13నుంచి తాజా సవరణలు అమలులోకి రానున్నట్లు ఏషియా ఇండెక్స్ ప్రయివేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఏషియా ఇండెక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈతో భాగస్వామ్యంలో సూచీల కూర్పును చేపట్టే సంగతి తెలిసిందే. హెచ్డీఎఫ్సీ దిగ్గజాల విలీనం నేపథ్యంలో ఇతర ఇండెక్సులలోనూ సవరణలకు తెరతీసినట్లు తెలియజేసింది. వీటి ప్రకారం హెచ్డీఎఫ్సీ స్థానంలో ఎస్అండ్పీ బీఎస్ఈ–500లో జేబీఎం ఆటో కంపోనెంట్స్, బీఎస్ఈ–100లో జొమాటో, సెన్సెక్స్–50లో అపోలో హాస్పిటల్స్ ప్రాతినిధ్యం వహించనున్నాయి. -
హెచ్డీఎఫ్సీ తర్వాత.. ఐడీఎఫ్సీ బ్యాంకులో ఐడీఎఫ్సీ విలీనం
ముంబై: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో మాతృ సంస్థ ఐడీఎఫ్సీ లిమిటెడ్ విలీనం కానుంది. పూర్తిగా షేర్ల మార్పిడి ద్వారా లావాదేవీని చేపట్టనున్నారు. ఇందుకు రెండు సంస్థల బోర్డులూ ఆమోదించినట్లు ఐడీఎఫ్సీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు తాజాగా వెల్లడించాయి. విలీన ప్రతిపాదన ప్రకారం ఐడీఎఫ్సీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 155 ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు షేర్లు జారీ చేయనున్నారు. ప్రధానంగా మౌలిక రంగానికి రుణాలందించే ఐడీఎఫ్సీ 1997లో ఆవిర్భవించింది. 2015లో ఐసీఐసీఐ, ఐడీబీఐ తరహాలో బ్యాంకింగ్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. 2018 డిసెంబర్లో క్యాపిటల్ ఫస్ట్ను టేకోవర్ చేసింది. -
హెచ్డీఎఫ్సీలో చేరినప్పుడు దీపక్ పరేఖ్ జీతం.. ఆన్లైన్లో 1978 నాటి ఆఫర్ లెటర్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో హెచ్డీఎఫ్సీ విలీనం పూర్తయింది. విలీనం తర్వాత జూలై 1 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. ఈ మెగా విలీనానికి ముందు హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ భావోద్వేగ లేఖలో రిటైర్మెంట్ ప్రకటించారు. తాను తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ జూన్ 30న తన పదవీ విరమణను ప్రకటించారు. 1978 నాటి పరేఖ్ ఆఫర్ లెటర్ హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ సంస్థలో చేరినప్పటి ఆఫర్ లెటర్ ఆన్లైన్లో కనిపించింది. 1978 జూలై 19 తేదీతో ఈ ఆఫర్ లెటర్ జారీ అయింది. అప్పట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా హెచ్డీఎఫ్సీ ఆయన ఉద్యోగం ఆఫర్ చేసింది. ఈ ఆఫర్ లెటర్ ప్రకారం పరేఖ్ బేసిక్ జీతం రూ. 3,500. ఫిక్స్డ్ డియర్నెస్ అలవెన్స్ రూ. 500. అలాగే 15 శాతం హౌసింగ్ రెంట్ అలవెన్స్, 10 శాతం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ ఉంటుందని అందులో పేర్కొన్నారు. అదనంగా ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, వైద్య ప్రయోజనాలు, సెలవు ప్రయాణ సౌకర్యాలకు కూడా పరేఖ్ అర్హులు. ఆయన నివాస టెలిఫోన్ ఖర్చును చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హెచ్డీఎఫ్సీ ఆఫర్ లెటర్లో పేర్కొంది. కాగా దీపక్ పరేఖ్ రిటైర్మెంట్ను సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన రోజుతో పోల్చారు ఆర్పీజీ చైర్మన్ హర్ష్ గోయంక. ఆర్థిక ప్రపంచంలో పరేఖ్ను నిజమైన టైటాన్గా ఆయన అభివర్ణించారు. 78 ఏళ్ల దీపక్ పరేఖ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఎలాంటి పాత్రను చేపట్టడం లేదు. హెచ్డీఎఫ్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేకీ మిస్త్రీ మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లియరెన్స్కు లోబడి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులో చేరే అవకాశం ఉంది. -
హెచ్డీఎఫ్సీ విలీనం: వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ బ్యాంక్స్లో స్థానం
న్యూఢిల్లీ: రెండు దిగ్గజాల విలీనం తదుపరి పలు ప్రయోజనాలు చేకూరనున్నట్లు మార్ట్గేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం ద్వారా గ్రూప్ కంపెనీలు మరింత పటిష్టపడనున్నట్లు తెలియజేశారు. అమ్మకాలు, నిర్వహణ(ఎగ్జిక్యూషన్), భారీ అవకాశాలు వంటి అంశాలు లబ్ధిని చేకూర్చనున్నట్లు వివరించారు. నేటి(జూలై 1) నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం కానుంది. ఈ విలీనంతో భారతీయ కంపెనీ తొలిసారి ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకులలో ఒకటి చేరనుంది. దీంతో గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీకి 46 ఏళ్లుగా సేవలందించిన పరేఖ్కు శుక్రవారం చివరి పనిదినంగా మారనుంది. దీంతో వాటాదారులకు చివరి సందేశాన్ని వినిపించారు. బ్యాంకుగల కీలక సమర్థతలు గృహ రుణ విభాగానికి మరింత బలాన్ని అందించనున్నట్లు అభిప్రాయపడ్డారు. గృహ రుణ వినియోగదారుల్లో నిలకడను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్కుగల డిజిటైజేషన్ ప్లాట్ ఫామ్లతో పాటు.. భారీ పంపిణీ నెట్వర్క్ గృహ రుణాలతోపాటు గ్రూప్ కంపెనీలకూ ప్రోత్సాహాన్ని వ్వనున్నట్లు వివరించారు. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) విలీనంలో భాగంగా హెచ్డీఎఫ్సీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 25 షేర్లకు గాను 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు కేటాయించనున్న సంగతి తెలిసిందే. 40 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల మార్పిడి ద్వారా చోటుచేసుకుంటున్న విలీనం దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద లావాదేవీగా నిలవనుంది. హెచ్డీఎఫ్సీ విలీనం సంస్థ రూ. 18 లక్షల కోట్ల ఆస్తులతో ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో భారీ దిగ్గజంగా ఆవిర్భవించనుంది. విలీనానికి బోర్డుల గ్రీన్సిగ్నల్ ఫైనాన్షియల్ రంగ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలీనానికి రెండు సంస్థల బోర్డులూ ఆమోదముద్ర వేశాయి. దీంతో నేటి(జూలై 1) నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనం కానుంది. (టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట) కాగా, బీమా రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ఎర్గోలో మార్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తాజాగా 0.5097శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో వాటాను 50.5 శాతానికి పెంచుకుంది. తద్వారా హెచ్డీఎఫ్సీ ఎర్గోను అనుబంధ సంస్థగా మార్చుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనానికి వీలుగా తాజా కొనుగోలు చేపట్టినట్లు హెచ్డీఎఫ్సీ పేర్కొంది. వారాంతాన బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ షేరు 1.5 శాతం లాభపడి రూ. 2,822 వద్ద నిలవగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం 1.5 శాతం పుంజుకుని రూ. 1,702 వద్ద స్థిరపడింది. -
కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం!
HDFC Merger: భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హొసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) ప్రైవేట్ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో ఈ రోజు (జులై 01) విలీనం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన గతంలోనే వెల్లడైంది, కానీ ఈ రోజు ఇరు కంపెనీల బోర్డుల ఆమోదంతో మర్జర్కు లైన్ క్లియర్ అవుతుంది. దేశంలోనే తొలి హోమ్ ఫైనాన్స్ సంస్థగా పేరు పొందిన హెచ్డీఎఫ్సీ ఇక కనిపించదు. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన విషయం తెలసిందే. కావున రికార్డ్ డేట్ తరువాత హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను కేటాయిస్తారు. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్స్ - వివో వై36 నుంచి వన్ప్లస్ నార్డ్ వరకు..) సంబంధిత అధికారులు నాన్ కన్వర్టెబుల్ డిబెంచర్స్ బదిలీకి జులై 12, హెచ్డీఎఫ్సీ కమర్షియల్ పేపర్స్ను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేరుకు బదిలీ చేసేందుకు జులై 7న డేట్ను ఫిక్స్ చేశారు. గతేడాది ఏప్రిల్ నుంచి హెచ్డీఎఫ్సీ తన పేరెంట్ కంపెనీ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కలవడానికి సుముఖత చూపింది. కాగా ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. (ఇదీ చదవండి: సంచలనం సృష్టించి కనుమరుగైపోయిన భారతీయ బడా కంపెనీలు ఇవే!) నివేదికల ప్రకారం.. మార్చి 2023 నాటికి, హెచ్డీఎఫ్సీ & హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యాపార విలువ రూ. 41 లక్షల కోట్లుగా ఉంది. అదే సమయంలో లాభాలు రూ. 60 వేల కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక త్వరలో హెచ్డీఎఫ్సీలోని ఉద్యోగులందరు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులుగా మారిపోతారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం
దేశీయ హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. ప్రైవేట్ బ్యాంక్ రంగానికి చెందిన హెచ్డీఎఫ్సీలో విలీనం కానుంది. విలీనం ప్రక్రియ జులై 1 నుంచి అమల్లోకి రానుందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీప్క్ పరేక్ తెలిపారు. విలీనానికి ఆమోదం తెలిపేందుకు హెచ్డీఎఫ్సీ, ప్రైవేట్ బ్యాంక్ బోర్డులు జూన్ 30న సమావేశం కానున్నట్లు పరేఖ్ వెల్లడించారు. హెచ్డీఎఫ్సీ వైస్ ఛైర్మన్ , సీఈవో కేకే మిస్త్రీ మాట్లాడుతూ.. కార్పొరేషన్ స్టాక్ డీలిస్టింగ్ జూలై 13 నుండి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దేశ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద లావాదేవీగా పేర్కొందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఏడాది ఏప్రిల్ 4న హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్డీఎఫ్సీని స్వాధీనం చేసుకునేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు 40 బిలియన్ల డాలర్లు. విలీన అనంతరం ఇరు సంస్థల ఆస్తుల విలువ రూ.18 లక్షల కోట్లకు చేరనుంది. విలీనం అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీకి 41 శాతం వాటా ఉంటుంది. హెచ్డీఎఫ్సీకి చెందిన ప్రతి 25 షేర్లకు గానూ హెచ్డీఎఫ్సీ షేర్ హోల్డర్లకు 42 షేర్లు చొప్పున లభిస్తాయి. విలీన సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్గా కొనసాగుతుంది. -
ఎడ్యుకేషన్ లోన్ విభాగం హెచ్డీఎఫ్సీ క్రెడిలా విక్రయం
న్యూఢిల్లీ: విద్యా రుణాల విభాగం హెచ్డీఎఫ్సీ క్రెడిలాను క్రిస్క్యాపిటల్ తదితర పీఈ దిగ్గజాల కన్సార్షియంకు విక్రయించినట్లు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. కంపెనీలో 90 శాతం వాటాను రూ. 9,060 కోట్లకు విక్రయించినట్లు వెల్లడించింది. ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో విలీనం నేపథ్యంలో విద్యా రుణాల సంస్థను హెచ్డీఎఫ్సీ విక్రయించింది. బీపీఈఏ ఈక్యూటీ, క్రిస్క్యాపిటల్ ఇన్వెస్టర్ల కన్సార్షియంకు హెచ్డీఎఫ్సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్ను విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్డీఎఫ్సీ ద్వయం తాజాగా తెలియజేశాయి. దేశ, విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్ధులకు రుణాలందించే హెచ్డీఎఫ్సీ క్రెడిలాలో 9.99% వాటాను కొనసాగించనున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. -
నిధుల సమీకరణకు హెచ్డీఎఫ్సీ
న్యూఢిల్లీ: మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ నిధుల సమీకరణకు తెరతీసింది. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో పెట్టుబడులను సమీకరించనున్నట్లు పేర్కొంది. పదేళ్ల కాలావధితో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఎన్సీడీలను కేటాయించనున్నట్లు తెలియజేసింది. వెరసి దీర్ఘకాలిక నిధులను అందుకునే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. నిధులను గృహ రుణ బిజినెస్కు అవసరమయ్యే ఫైనాన్సింగ్, రీఫైనాన్సింగ్కు వినియోగించనున్నట్లు వివరించింది. నిధుల సమీకరణ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం నీరసించి రూ. 2,643 వద్ద ముగిసింది. -
ఆ స్కీమ్ గడువు మళ్ళీ పెంచిన హెచ్డీఎఫ్సీ - కస్టమర్లకు పండగే!
HDFC Senior Citizen Scheme: ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ ప్రత్యేకంగా తీసుకువచ్చిన సీనియర్ సిటిజన్స్ ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువును మరింత పొడిగించింది. 60 సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న వారికి 'స్పెషల్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ' ద్వారా గరిష్ఠ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ స్కీమ్ 2020లోనే అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దాని గడువును 2023 జులై 7 వరకు పెంచింది. ఈ స్కీమ్ ద్వారా సీరియర్ సిటిజన్ ఇన్వెస్టర్లకు అదనంగా 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు లభిస్తుంది. అంటే దీని ప్రకారం సాధారణ కస్టమర్లకు ఇప్పటికే అందించే 50 బేసిస్ పాయింట్లకు అదనంగా సీనియర్ సిటిజన్లకు 25 బేసిస్ పాయింట్లు కలుస్తాయి. అంటే దీని ప్రకారం సీనియర్ సిటిజన్స్ 0.75 శాతం ఎక్కువ వడ్డీని పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో సీనియర్ సిటిజన్ ఐదు సంవత్సరాలకంటే ముందే ప్రీమెచ్యూర్ చేస్తే వారికి 1% వడ్డీ లభిస్తుంది. 5 ఏళ్ల తరువాత దీనిపైన 1.25% శాతం వడ్డీ లభిస్తుంది. (ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్యువి700 సన్రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్డీ రేట్లు.. 7 రోజుల నుంచి 14 రోజులకు & 15 నుంచి 29 రోజులకు వడ్డీ 3.50 శాతం 30 రోజుల నుంచి 45 రోజుల వరకు వడ్డీ 4.0 శాతం 46 రోజుల నుంచి 60 రోజుల & 61 రోజుల నుంచి 89 రోజుల వరకు వడ్డీ 5.0 శాతం 90 రోజుల నుంచి 6 నెలల లోపు వరకు వడ్డీ 5.0 శాతం 6 నెలల ఒక రోజు నుంచి 9 నెలల లోపు 6.25 శాతం 9 నెలల ఒక రోజు నుంచి ఒక సంవత్సరం లోపు 6.50 శాతం ఒక సంవత్సరం నుంచి 15 నెలల లోపు 7.10 శాతం 15 నెల్ల నుంచి 18 నెలల లోపు 7.60 శాతం 18 నెలల నుంచి 21 నెలల లోపు 7.50 శాతం 21 నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు 7.50 శాతం రెండు సంవత్సరాల ఒక రోజు నుంచి రెండు సంవత్సరాల 11 నెలల వరకు 7.50 శాతం 2 ఏళ్ల 11 నెలలు (35 నెలలకు) వడ్డీ 7.70 శాతం 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల వరకు వడ్డీ 7.75 శాతం -
హెచ్డీఎఫ్సీ ఖాతాదారులకు భారీ షాక్!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన టెన్యూర్ కాలానికి 15 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్( (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల )ను పెంచింది. పెంచిన ఈ రేట్లు మే 8 నుంచే అమల్లోకి వచ్చాయి. తాజాగా పెరిగిన ఈ ఎంసీఎల్ఆర్ రేట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్లోని పర్సనల్, వెహికల్ లోన్స్ పాటు ఇతర రుణాలు తీసుకున్న ఖాతాదారులు నెలనెలా చెల్లించే ఈఎంఐలు భారం కానున్నాయి. ఇక కొత్తగా అమల్లోకి వచ్చిన ఎంసీఎల్ఆర్ రేట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ ఆర్ రేటు 7.95 శాతం, ఒక నెల టెన్యూర్ కాలానికి 8.10శాతం, 3 నెలల టెన్యూర్ కాలానికి 8.40శాతం, 6 నెలల టెన్యూర్ కాలానికి 8.80శాతం, ఏడాది టెన్యూర్ కాలానికి 9.05 శాతం, రెండు సంవత్సరాల టెన్యూర్ కాలానికి 9.10 శాతం, 3ఏళ్ల టెన్యూర్ కాలానికి 9.20శాతం విధిస్తుంది. -
కష్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన HDFC బ్యాంక్
-
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు గుడ్ న్యూస్..!
ప్రైవేట్ రంగంలో అతి పెద్దగా బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన హెచ్డీఎఫ్సీ (HDFC) ఇప్పుడు కస్టమర్లకు మరింత చెరువుగా ఉండటానికి మరిన్ని కొత్త బ్రాంచిలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఇప్పటికే దేశంలోనో అనేక ప్రధాన నగరాల్లో విస్తరించి కస్టమర్లకు సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు పట్టణ వాసులకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి కూడా చేరువవ్వాలని మరో 675 కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయడం వల్ల 'హెచ్డీఎఫ్సీ'లో అకౌంట్ ఉన్న వారు దూరంగా ఉన్న బ్రాంచిలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది ఖాతాదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా బ్యాంకు తన ఉనికిని మరింత విస్తరించడంలో కూడా అనుకూలంగా ఉంటుంది. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు దేశ వ్యాప్తంగా 675 బ్రాంచిలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా హెచ్డీఎఫ్సీ ముందుకు సాగుతోంది. పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మెరుగైన బ్యాంకింగ్ సేవలను కోరుకుంటున్న కారణంగా HDFC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మరిన్ని శాఖలతో విరాజిల్లుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఊరట..
ముంబై: మాతృసంస్థ హెచ్డీఎఫ్సీతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ముందు కొంత ఊరట లభించింది. కొన్ని అంశాల్లో ఆర్బీఐ స్వేచ్ఛను కల్పించగా, కొన్నింటి విషయంలో ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. రెండు సంస్థల విలీనం జూలై నాటికి పూర్తవుతుందని అంచనా. తాము దరఖాస్తు చేసిన కొన్ని అంశాల్లో ఆర్బీఐ నుంచి సమాచారం వచ్చిందని, మరికొన్ని అంశాలు పరిష్కృతం కావాల్సి ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) విషయంలో వెసులుబాట్లకు ఆర్బీఐ తిరస్కరించింది. ప్రాధాన్య రంగాలకు రుణాలు (పీఎస్ఎల్), పెట్టుబడుల విషయంలో మాత్రం ఉపశమనం కల్పించింది. విలీనం తేదీ నుంచి సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎల్సీఆర్ను నిబంధనలకు అనుగుణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇక హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ తదితర సంస్థలు ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థలు (సబ్సిడరీలు)గా ఉండగా.. విలీనం తర్వాత ఇవి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సబ్సిడరీలుగా కొనసాగేందుకు ఆర్బీఐ అనుమతించింది. విలీనానికి ముందే హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్లో వాటాని హెచ్డీఎఫ్సీ లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 50 శాతానికి పైగా పెంచుకోవచ్చు. ఉన్నత విద్యకు రుణాలు అందించే హెచ్డీఎఫ్సీ క్రెడాలియా ఫైనాన్షియల్ సర్వీసెస్లో నూరు శాతం వాటా హెచ్డీఎఫ్సీకి ఉంది. రెండేళ్లలో ఈ వాటాని 10 శాతానికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు తగ్గించుకోవాలి. కొత్త కస్టమర్లను తీసుకోవడాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఈ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్: రుణాలపై భారీగా తగ్గనున్న భారం
సాక్షి,ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. ఇటీవలి కాలంలో రుణాలపై వడ్డీరేట్ల పెంపుతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు తాజా నిర్ణయంతో వడ్డీ రేట్లను తగ్గించి భారీ ఊరటనిచ్చింది.మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ని 85 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఫలితంగా ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరించిన రుణ రేట్లు ఏప్రిల్ 10 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎంసీఎల్ఆర్ రేటు తగ్గింపు తర్వాత బ్యాంకు ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 7.8 శాతానికి తగ్గింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 40 బేసిస్ పాయింట్లు తగ్గి 8.30 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు తగ్గి 8.7 శాతానికి దిగొచ్చింది. మరోవైపు 1-3 ఏళ్ల కాలానికి చెందిన ఎంసీఎల్ఆర్ స్థిరంగా ఉంటాయని బ్యాంకు ప్రకటించింది. కాగా రివ్యూలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లనుయథాతథంగానే ఉంచిన సంగతి తెలిసిందే. (‘ఆడి చాయ్వాలా’ ఏమైంది భయ్యా? వైరల్ వీడియో) ఇదీ చదవండి: Lava Blaze-2: అదిరిపోయే ఫీచర్లు: పరిచయ ఆఫర్ చూస్తే ఫిదా! -
సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?
ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే నైతికత, నిబద్ధత చాలా అసవరం. కానీ చాలా సంస్థలు దీన్ని పెద్దగా పట్టించుకోవు. కానీ రతన్ టాటా ఆధ్వర్యంలోని టాటా గ్రూప్, తమ కార్పొరేట్ పాలనలో, వ్యాపారం చేసే విధానంలో నైతికతను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తుంది. ఇటీవలికాలంలో కంపెనీ సుదీర్ఘ చరిత్రలో తొలిసారి చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ నియమించుకుంది. తాజాగా హెచ్డీఎఫ్సీ ఈ కోవలో చేరింది. కంపెనీ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్గా మాజీ ఈడీ అధికారి ప్రసూన్ సింగ్ను నియమించింది. అసలు ఏవరీ ప్రసూన్ సింగ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ పోస్టును సృష్టించి మరీ ప్రసూన్ సింగ్కు కీలక పోస్ట్ను ఇవ్వడం విశేషం. రూ. 9,24,235 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంకుకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న ప్రసూన్ సింగ్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్గా ఎలా ఎదిగారు. (సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్లో వీడియో హల్చల్) ప్రసూన్ సింగ్ ఎవరు? బిహార్లోని ముజఫర్ లోని సెయింట్ జేవియర్స్ స్కూల్ నుండి పాఠశాల విద్యను,. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత ఇక్కడ నుంచే బీఏ ఆనర్స్ చేశారు. నవీ ముంబైలోని సీఎస్ఎంయూలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అతను MIT స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ నేర్చుకున్నారు. (రోజుకు కేవలం రూ.73: యాపిల్ ఐఫోన్ 12మినీ మీ సొంతం!) ప్రసూన్ సింగ్ కరియర్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్ మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అతను ముంబైలో పోస్టింగ్ పొందారు. ఏడేళ్లు పనిచేసిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కి వెళ్లారు. ఆతరువాత ఏడేళ్లకు పైగా ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. జూలై 2013ల ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా చేరారు. నాలుగేళ్ల తర్వాత ప్రైవేట్ రంగంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా చేరారు. అక్కడ కూడా ఏడేళ్లపాటు ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. దీని తర్వాత, అతను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ఈడీకి మారారు. అక్కడ కూడా సుమారు నాలుగేళ్లపాటు అధికారిగా పనిచేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సివో)గా, 9సంవత్సరాల 9 నెలలకు పైగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సేవలందించారు ప్రసూన్. తాజాగా బ్యాంక్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్గా ఎంపియ్యారు. ♦ 2009, నవంబరు నుంచి జూలై 2013 మధ్య ఈడీ అధికారిగా ♦ 2002 జూలై - 2009 నవంబర్ మధ్య ఇంటెలిజెన్స్ అధికారి ♦ 1995 మే- 2002 జూలై మధ్య ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నైతికత గురించి రతన్ టాటా ఏమన్నారంటే కంపెనీలు లాభాలు ఆర్జించడం తప్పు కాదు, ఈ పనిని నైతికంగా చేయడం కూడా అవసరమని టాటా గ్రూప్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా నమ్ముతారు. లాభం పొందడానికి మీరు ఏమి చేస్తున్నారో ఈ ప్రశ్న చాలా ముఖ్యమనీ. లాభాలను ఆర్జిస్తున్నప్పుడు, కస్టమర్లు వాటాదారులకు ఎలాంటి ప్రయోజ నాందిస్తున్నామో కంపెనీలు గుర్తుంచు కోవడం కూడా ముఖ్యం. అలాగే ప్రస్తుత పరిస్థితిలో, నిర్వాహకులు తాము తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవా? కాదా? అని తమను తాము ప్రశ్నించు కోవాలి. కంపెనీ ఎక్కువ కాలం మనుగడ సాగించదని, అది ఉద్యోగుల పట్ల సున్నితంగా ఉండదని కూడా ఆయన అన్నారు. వ్యాపారం గురించి తన ఆలోచనను వివరిస్తూ, వ్యాపారం అంటే లాభాలు సంపాదించడం మాత్రమే కాదని అన్నారు. మీతో అనుబంధం ఉన్న వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగుల ప్రయోజనాలు చాలా ముఖ్యమని రతన్ టాటా చెబుతారు. (అమెరికా ఫైనాన్స్లో ఇండో-అమెరికన్ మహిళల సత్తా) -
మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్పై: రూ. కోటి దాకా కవరేజ్
సాక్షి,ముంబై: దేశీయంగా ప్రధాన బ్యాంకులు తమ డెబిట్కార్డులపై వినియోగదారులకు ఉచిత ప్రమాద బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తాయి. అలాగే పోయిన సామాన్లు, లావాదేవీలకు రక్షణ కల్పిస్తాయి. డెబిట్ కార్డులతో, మెజారిటీ బ్యాంకులు కాంప్లిమెంటరీ బీమా కవరేజీని అందిస్తాయి. డెబిట్ కార్డులకు ఉచిత బీమా ఉంటుంది. వాస్తవానికి ఈ విషయం చాలామంది కస్టమర్లకు తెలియదు. ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తోపాటు, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే కవరేజ్ని ఒకసారి చూద్దాం. (కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!) కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద మరణ ప్రయోజనాన్ని రూ. 25 లక్షల వరకు అందిస్తుంది. బీమా కవరేజీని యాక్టివేట్ చేయడానికి, ఏటీఎం లావాదేవీ, పాయింట్-ఆఫ్-సేల్ లావాదేవీ లేదా ఆన్లైన్ కొనుగోలు లాంటి విషయాల్లో ఘటనకు, లేదా ప్రమాద తేదీకి 90 రోజుల ముందు కనీసం ఒక్క సారైనా కార్డ్ని ఉపయోగించి ఉండాలి. అంతేకాకుండా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీని అందజేస్తుంది. దీని రూ. 6 లక్షల వరకు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన కార్డ్లతో మర్చంట్, ఆన్లైన్ పోర్టల్లలో చేసిన కొనుగోళ్లకు రక్షణ కల్పిస్తుంది. (మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు గుడ్న్యూస్: నామినీ నమోదు ఎలా?) ఎస్బీఐ ఎయిర్లైన్ అందించే కవరేజీకి అదనంగా, ఎస్బీఐ డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి విభిన్న విమానయాన ప్రమాద మరణ బీమాను అందిస్తుంది. స్థానిక, అంతర్జాతీయ విమానాలకు బ్యాగేజ్ నష్ట బీమాను కూడా అందిస్తుంది. అయితే ఎయిర్లైన్ టిక్కెట్ను కొనుగోలుకు బ్యాంకు డెబిట్ కార్డ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అదీ ప్రమాదం జరిగిన 90 రోజులలోపు ఉపయోగించాలి. అలా చేయడంలో విఫలమైతే బీమా ప్రయోజనం ఉండదు. ఒక వేళ కార్డ్ దారుడు విమాన ప్రమాదంలో మరణిస్తే, బీమా కవరేజ్ దాదాపు రెట్టింపు అవుతుంది. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) ఎస్బీఐకి సంబంధించి వివిధ రకాల కార్డులపై ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఎస్బీఐ గోల్డ్కు రూ. 2 లక్షలు, ప్లాటినం కార్డ్కు రూ. 5 లక్షలు, ప్రైడ్ కార్డ్కు రూ. 2 లక్షలు, ప్రీమియం కార్డ్కు రూ. 5 లక్షలు, వీసా, సిగ్నేచర్, మాస్టర్కార్డ్కు రూ. 10 లక్షలు బీమా కవరేజ్ ఉంటుంది. అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డ్లతో కొనుగోలు చేసిన 90 రోజులలోపు, రూ. 1 లక్షల వరకు నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. (సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 1 కోటి వరకు లభించే ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మినహా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే ప్రమాద బీమా కవరేజీ రూ. 5 లక్షలు. -
ఎన్సీడీల జారీతో రూ. 57,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 57,000 కోట్లు సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు తాజాగా బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అన్సెక్యూర్డ్, రిడీమబుల్, నాన్కన్వర్టిబుల్ డిబెంచర్ల జారీకి బోర్డు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలియజేసింది. షెల్ఫ్ ప్లేస్మెంట్ మెమొరాండంకింద మొత్తం రూ. 57,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు వివరించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా వివిధ దశలలో వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. గతేడాది(2022) జూన్ 30న నిర్వహించిన 45వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఇందుకు అనుమతించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. మరోవైపు కంపెనీ మొత్తం రుణ సమీకరణ సామర్థ్యాన్ని రూ. 6 లక్షల కోట్ల నుంచి రూ. 6.5 లక్షల కోట్లకు పెంచేందుకు సైతం బోర్డు ఆమోదించినట్లు తెలియజేసింది. ఈ అంశంపై ఎప్పుడైనా పోస్టల్ బ్యాలట్ ద్వారా సభ్యుల నుంచి అనుమతి కోరేందుకు బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. ప్రస్తుతం సుమారు రూ. 5.7 లక్షల కోట్లుగా ఉన్న ఔట్స్టాండింగ్ రుణాలను బిజినెస్ అవసరాలరీత్యా పెంచుకునేందుకు వీలున్నట్లు తెలియజేసింది. గ్రూప్లోని మరో దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో విలీనంకానున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే రుణ సమీకరణ చేపట్టవచ్చని తెలియజేసింది. ఈ ఏప్రిల్తో ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో విలీనం పూర్తికావచ్చని అంచనా. విలీనం తదుపరి ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐతో పోలిస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలువ రెట్టింపుకానుంది! -
హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగం గడిచిన పదిహేనేళ్లుగా అతిపెద్ద బూమ్ను చూస్తోందని హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ, సీఈవో విపుల్ రూంగ్తా తెలిపారు. ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక స్థోమత (అఫర్డబులిటీ), సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష తదితర ఎన్నో అంశాలు బూమ్ను నడిపిస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రూంగ్తా మాట్లాడారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన ‘‘గత 15 ఏళ్లలో అతిపెద్ద బూమ్ను నేను వ్యక్తిగతంగా చూస్తున్నాను. నివాస విభాగంలో మధ్యాదాయ, అందుబాటు ధరల విభాగం అయినా, ప్రీమియం విభాగం అయినా ఇదే పరిస్థితి నెలకొంది’’అని రూంగ్తా అన్నారు. ఫిక్కీ రియల్ ఎస్టేట్ కమిటికీ కో చైర్మన్గానూ రూంగ్తా వ్యవహరిస్తున్నారు. రెరా కింద సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ డెవలపర్లపై ఉందని గుర్తు చేస్తూ, ఈ విషయంలో విఫలమైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. బడ్జెట్ ఇళ్లకు డిమాండ్.. దేశంలో హౌసింగ్ డిమాండ్ ప్రధానంగా అందుబాటు ధరల, మధ్యాదాయ వర్గాల కేంద్రంగా ఉన్నట్టు విపుల్ రూంగ్తా చెప్పారు. కనుక ఈ విభాగాల్లో హౌసింగ్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఇదే సరైన తరుణమని సూచించారు. వడ్డీ రేట్లు గత ఏడాది కాలంలో పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ ఉత్సాహంగానే ఉన్నట్టు చెప్పారు. అఫర్డబుల్ హౌసింగ్లో హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ 3.2 బిలియన్ డాలర్ల ఫండ్ను ప్రారంభించినట్టు తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణ, గృహ ఆదాయంతో నివాస గృహాలకు అసాధారణ స్థాయిలో డిమాండ్ ఉన్నట్టు ఇదే సదస్సులో పాల్గొన్న ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా ధరల వృద్ధి ఉన్న టాప్–10 హౌసింగ్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో 3.65 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీకి, ఐజీహెచ్ హోల్డింగ్స్కు భారీ షాకిచ్చిన ఆర్బీఐ
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్డీఎఫ్సీ) కి భారీ షాకిచ్చింది. నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించినందుకు శుక్రవారం 5 లక్షల రూపాయల జరిమానా విధించింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆదేశాలు నిబంధనలను పాటించనందుకు సెంట్రల్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీకి ఈ జరిమానా విధించింది. దీంతోపాటు IGH హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఏకంగా రూ. 11.25 లక్షల ద్రవ్య పెనాల్టీని విధించింది. 2019-20లో కొంతమంది డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను కంపెనీ వారి నిర్దేశిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయలేక పోయిందని తమ పరిశీలనలో వెల్లడైందని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పెనాల్టీ ఎందుకు విధించకూడదో తెలపాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసిన ఆర్బీఐ కంపెనీ వివరణ తర్వాత, నిబంధనలకు అనుగుణంగా లేదని నిర్ధారించి జరిమానా విధించింది. వారి డిపాజిటర్ల మెచ్యూర్డ్ డిపాజిట్లను వారి నామినేట్ చేసిన బ్యాంకు ఖాతాలకు కంపెనీ బదిలీ చేయలేకపోయిందని తనిఖీలో వెల్లడైనట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది. అలాగే నిబంధనలు పాటించని కారణంగా ముంబైలోని ఐజీహెచ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై రూ.11.25 లక్షల పెనాల్టీ విధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను లాభ, నష్టాల ఖాతాలో వెల్లడించిన నికర లాభంలో 20 శాతాన్ని రిజర్వ్ ఫండ్కు బదిలీ చేయాలనే చట్టబద్ధమైన నిబంధనను పాటించడంలో కంపెనీ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) సహా అన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ విలీనాన్ని వాటాదారులు కూడా ఆమోదించారు. ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ.. పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా? హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్హోల్డర్ల యాజమాన్యంలో ఉంటుంది. హెచ్డీఎఫ్సీకి చెందిన ప్రస్తుత వాటాదారులకు బ్యాంక్లో 41 శాతం వాటా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కంటే పెద్దది ఈ విలీనం తర్వాత ప్రతి హెచ్డీఎఫ్సీ వాటాదారు ప్రతి 25 షేర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లను పొందుతారు. 2021 డిసెంబర్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం.. ఈ విలీనం తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ. 17.87 లక్షల కోట్లు. నికర విలువ రూ. 3.3 లక్షల కోట్లకు చేరుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెట్టింపు పరిమాణంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? -
షాకింగ్..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల డేటా లీక్?
ప్రముఖ దేశీయ ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన హెచ్డీఎఫ్సీ బ్యాంకు వినియోగదారుల డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఓ హ్యాకర్ వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన 7.5 జీబీ డాటాను డార్క్ వెబ్లో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డేటా గల్లంతుపై వస్తున్న వరుస కథనాల్ని హెచ్డీఎఫ్సీ యాజమాన్యం కొట్టిపారేసింది. ఓ ప్రముఖ అండర్గ్రౌండ్ హ్యాకర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల సమాచారాన్ని డార్క్ వెబ్లో పోస్ట్ చేశాడు. పైగా అందులో ఎలాంటి పేమెంట్ చెల్లించకుండానే డేటాను తీసుకోవచ్చని తెలిపారు. ఈ డేటా గల్లంతుపై ఓ మీడియా సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి వివరణ కోరింది. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారి ప్రతినిధి మాట్లాడుతూ.. మా సంస్థలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించలేరు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను వేరేవాళ్లు యాక్సెస్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు. మా కస్టమర్ల వ్యక్తిగత గోప్యతే లక్ష్యంగా.. సంబంధిత వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. -
హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, బీవోఐ రుణ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: గృహ రుణాల ప్రముఖ సంస్థ హెచ్డీఎఫ్సీతోపాటు, ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) రుణాల రేట్లను పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించాయి. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి. కనీస రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును హెచ్డీఎఫ్సీ 0.25 శాతం పెంచి 9.20 శాతానికి చేర్చింది. అయితే, 760 కంటే మించి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 8.70 శాతానికే గృహ రుణాన్ని ఆఫర్ చేస్తోంది. పీఎన్బీ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.10% పెంచింది. దీంతో పీఎన్బీ ఏడాది కాల ఎంసీఎల్ఆర్ రేటు 8.5%కి చేరింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలను ఈ రేటు ఆధారంగానే బ్యాంకు జారీ చేస్తుంటుంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎంసీఆర్ఎల్ రేటును 0.10% పెంచుతున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ ఎంపీసీ ఫిబ్రవరి సమీక్షలో రెపో రేటును 0.25 శాతం పెంచడం తెలిసిందే. ఇక గతేడాది మే నెల నుంచి చూసుకుంటే మొత్తం పెంపు 2.50 శాతంగా ఉంది. -
సామాన్యులపై ఈఎంఐల మోత.. వడ్డీ రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ
ఓ వైపు ఆర్ధిక మాద్యం.. మరోవైపు బ్యాంకులు పెంచుతున్న వడ్డీ రేట్లు సామాన్యులకు భారంగా మారాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లబ్ధిదారులకు ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్ల(ఎంసీఎల్ఆర్)ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హెచ్డీఎఫ్సీ ప్రతినిధులు తెలిపారు. ఇక హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఎంసీఎల్ఆర్ వడ్డీరేట్లు 10 బేసిస్ పాయింట్ల పెరిగాయి. దీంతో ప్రస్తుతం మొత్తం ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.60 శాతంగా ఉన్నాయి. నెల వ్యవధి కాలానికి ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.60శాతం, మూడు నెలల టెన్యూర్ కాలానికి 8.65శాతం, ఆరునెలల కాలానికి 8.75శాతం, ఏడాది కాలానికి కన్జ్యూమర్ లోన్స్ 8.85శాతం నుంచి 8.90శాతానికి పెరిగాయి. రెండేళ్ల టెన్యూర్ కాలానికి 9శాతం, మూడేళ్ల టెన్యూర్ కాలానికి ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 9.10శాతంగా ఉన్నాయి. కాగా, గత 9 నెలలుగా పెరుగుతోన్న వడ్డీరేట్ల మోతకు ఈసారి కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) ఆర్థిక రంగ వృద్ధి కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరుగుతున్న మొదటి పాలసీ సమీక్ష ఇది. ఆర్బీఐ సమావేశంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 25 బేసిస్ పాయింట్ల (0.25 శాతం) మేర పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ లాభం అప్ క్యూ3లో రూ. 7,078 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్- డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం పుంజుకుని రూ. 7,078 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 3,261 కోట్ల నుంచి రూ. 3,691 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం మెరుగై రూ. 4,840 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.32 శాతం నుంచి 1.49 శాతానికి దిగివచ్చాయి. వడ్డీ రేట్ల ఎఫెక్ట్ ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో లాభదాయకత మందగించినట్లు హెచ్డీఎఫ్సీ వైస్చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ వెల్లడించారు. అయితే రుణాలను కొత్త రేట్లకు వేగంగా అనుసంధానిస్తున్నట్లు, ఈ ప్రభావం రుణాలపై తదుపరి త్రైమాసికం నుంచీ ప్రతిఫలించనున్నట్లు తెలియజేశారు. వ్యక్తిగత రుణ విభాగం 26 శాతం వృద్ధిని సాధించగా.. సగటు టికెట్(రుణ) పరిమాణం రూ. 35.7 లక్షలకు బలపడినట్లు వెల్లడించారు. రూ. 18 లక్షలకుపైగా వార్షిక ఆదాయంగల రుణగ్రహీతలు 52 శాతంగా తెలియజేశారు. గ్రూప్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలీనంపై ఆర్బీఐ, ఎన్సీఎల్టీ నుంచి నిర్ణయాలు వెలువడవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ3 గుడ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతం జంప్చేసి రూ. 12,698 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 19 శాతం బలపడి రూ. 12,260 కోట్లయ్యింది. ఈ కాలంలో 20 శాతం రుణ వృద్ధి కారణంగా నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 22,988 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం రూ. 300 కోట్లు పెరిగి రూ. 8,540 కోట్లకు చేరింది. రుణ నాణ్యత అప్: క్యూ3లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) నిలకడను చూపుతూ 1.23%గా నమోదైంది. నిర్వహణ వ్యయాలు 27 శాతం పెరిగి రూ. 12,464 కోట్లకు చేరగా.. 4,000 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,66,890ను తాకింది. . కాగా.. అనుబంధ సంస్థలలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నికర లాభం రూ. 258 కోట్ల నుంచి రూ. 203 కోట్లకు తగ్గింది. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ. 304 కోట్ల నుంచి రూ. 501 కోట్లకు జంప్చేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1% బలహీనపడి రూ. 1,586 వద్ద ముగిసింది. చదవండి: సేల్స్ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నంబర్ వన్! -
హెచ్డీఎఫ్సీకి ఐఎఫ్సీ రుణాలు
ముంబై: దేశీ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీకు తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్సీ) అదనపు రుణాలు అందించనుంది. పర్యావరణహిత అందుబాటు ధరల హౌసింగ్ యూనిట్లకు మద్దతుగా 40 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,300 కోట్లు)ను విడుదల చేయనుంది. వాతావరణ పరిరక్షణా లక్ష్యాలకు అనుగుణంగా తాజా రుణాలను మంజూరు చేయనుంది. దీంతో పట్టణాలలో హౌసింగ్ అంతరాలను తగ్గించేందుకు అవకాశమున్నట్లు రెండు సంస్థలూ విడిగా పేర్కొన్నాయి. పర్యావరణహిత చౌక గృహాల ఏర్పాటుకు మద్దతివ్వడం ద్వారా గ్రీన్ హౌసింగ్కు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు తెలియజేశాయి. వెరసి తాజా రుణాలు పర్యావరణ అనుకూల వృద్ధి, ఉపాధి కల్పన తదితర దేశీ లక్ష్యాలకు ఆలంబనగా నిలవనున్నట్లు వివరించాయి. తద్వారా దీర్ఘకాలిక బిజినెస్ వృద్ధికి హామీ లభిస్తుందని అభిప్రాయపడ్డాయి. 75 శాతానికి రెడీ ఐఎఫ్సీ నుంచి లభించనున్న నిధుల్లో 75 శాతాన్ని అంటే 30 కోట్ల డాలర్లను పర్యావరణహిత చౌక హౌసింగ్ యూనిట్లకు కేటాయించనున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. దేశీయంగా 27.5 కోట్లమంది ప్రజలు లేదా 22 శాతం ప్రజానీకం తగినస్థాయిలో ఇళ్లను పొందలేకపోతున్నట్లు అంచనా వేసింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇళ్ల కొరత రెట్టింపుకాగా.. 2018కల్లా పట్టణాల్లో 2.9 కోట్ల యూనిట్ల గృహాల కొరత నమోదైనట్లు తెలియజేసింది. 2012తో పోలిస్తే ఇది 54 శాతం పెరిగినట్లు వివరించింది. దేశీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు 2010 నుంచీ ఐఎఫ్సీ 170 కోట్ల డాలర్ల రుణాలను అందించడం గమనార్హం! -
న్యూ ఇయర్ ముందు.. కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ!
ముంబై: గృహ రుణాలకు సంబంధించి దిగ్గజ సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ రేటు భారీగా 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 8.65 శాతానికి ఎగసింది. పెరిగిన రేటు మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన తెలిపింది. మే నెల నుంచి హెచ్డీఎఫ్సీ రుణ రేటు 225 బేసిస్ పాయింట్లు పెరిగింది. కాగా, 800 అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే 8.65 శాతం కొత్త రేటు అందుబాటులో ఉంటుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యల్ప రేటు అని కూడా వివరించింది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
హెచ్డీఎఫ్సీ ఏఎంసీలో వాటాలు విక్రయం!
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో (ఏఎంసీ) తనకున్న మొత్తం 10.21 శాతం వాటాలను విక్రయించాలని ఏబీఆర్డీఎన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ (ఏఐఎం) యోచిస్తోంది. ప్రతిపాదిత లావాదేవీ తర్వాత నుంచి హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కో–స్పాన్సర్గా ఏఐఎం పక్కకు తప్పుకోనుంది. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఈ విషయాలు వెల్లడించింది. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ), ఏఐఎం (గతంలో స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్) జాయింట్ వెంచర్గా హెచ్డీఎఫ్సీ ఏఎంసీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఆగస్టులో ఏఐఎం 5.58 శాతం వాటాలను సుమారు రూ. 2,300 కోట్లకు బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా విక్రయించింది. ప్రస్తుతం మిగిలిన 10.21 శాతం వాటాల్లో 9.9 శాతం వాటాలను ఒకే కొనుగోలుదారుకు విక్రయించాలని, మిగతాది వేరుగా అమ్మాలని భావిస్తోంది. -
హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్
-
మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్డ్రా నిబంధనలు
కెనరా బ్యాంక్ ఖాతా దారులకు ముఖ్య గమనిక. ఖాతాదారులు నిర్వహించే రోజూ వారీ ఏటీఎం లావాదేవీలపై మార్పులు చేసింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రాల్, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), ఈకామర్స్ ట్రాన్సాక్షన్లలో ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది ► క్లాసిక్ డెబిట్ కార్డుల కోసం రోజువారీ ఏటీఎం విత్డ్రాల్ పరిమితిని ప్రస్తుతం రూ.40వేలు ఉండగా.. రూ.75వేలకు పెంచింది. ► ప్రస్తుతం ఉన్న పీఓఎస్,ఈ కామర్స్ పరిమితిని రూ.1 లక్ష నుండి రోజుకు రూ. 2లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ► రూ.25వరకు లిమిట్ ఉన్న ఎన్ఎఫ్సీ (కాంటాక్ట్లెస్)ని తటస్థంగా ఉంచింది. కాంటాక్ట్లెస్ లావాదేవీలు ఒక్కో సందర్భంలో రూ. 5000 వరకు, రోజుకు 5 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమితిలో మార్పులు చేసింది. పీఎన్బీ వెబ్సైట్ ప్రకారం.. ప్లాటినం మాస్టర్ కార్డ్, రూపే, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్లతో పాటు రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్ల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు షాక్ ఇచ్చింది. థర్డ్ పార్టీ పద్దతుల ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే..సదరు వినియోగదారులు చేసిన లావాదేవీ మొత్తంలో 1శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 మారనున్న నిబంధనలు!, పాన్ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం? -
హెచ్డీఎఫ్సీ విలీనానికి 10 నెలలు
ముంబై: మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీని విలీనం చేసుకునేందుకు మరో 8–10 నెలల సమయం పడుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. విలీనం వల్ల హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 0.20–0.30 శాతం మేర పెరుగుతుందని తెలిపారు. ఈ రెండు సంస్థలు విలీనంపై ఆమోదం కోసం శుక్రవారం వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాయి. దేశ చరిత్రలో ఇది అతిపెద్ద విలీనం కానుంది. అయితే, విలీనం వల్ల బ్యాలన్స్ షీటు పెద్దగా మారనుంది. దీంతో ఆర్బీఐ నియంత్రణలకు అనుగుణంగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన నగదు నిల్వలు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అవసరాలను వాటాదారులు ప్రస్తావించారు. ఈ విషయంలో ఆర్బీఐ నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఉందా? అనేది తెలుసుకోవాలని అనుకున్నారు. దీనిపై హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పందిస్తూ.. ఈ విషయంలో వాటాదారులు ఆందోళన చెందవద్దంటూ, ఆర్బీఐతో సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ ఆర్బీఐ నుంచి ఏదైనా మినహాయింపు రాకపోయినా, విలీన సంస్థ వద్ద తగినంత లిక్విడిటీ ఉంటుందని.. తప్పనిసరి నిధుల అవసరాలను చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నట్టు తెలిపారు. కొన్నింటిని విక్రయిస్తాం.. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థలన్నీ కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ కంపెనీలుగా మారతాయని.. బ్యాంక్ చైర్మన్ అతాను చక్రవర్తి తెలిపారు. అదే సమయంలో బ్యాంకు కిందకు రాని కొన్ని వ్యాపారాలను (నిబంధనల మేరకు) విక్రయిస్తామని చెప్పారు. సబ్సిడరీల విలీనానికి ఆర్బీఐ, ఐఆర్డీఏఐ అనుమతి కోరతామన్నారు. వయసు రీత్యా తాను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులో చేరబోనని, చక్రవర్తి చైర్మన్గా సేవలు అందిస్తారని దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు. విలీనంతో హెచ్డీఎఫ్సీ డిపాజిట్లు అన్నీ బ్యాంక్ కిందకు వస్తాయని, వాటికి వడ్డీ చెల్లింపులు ఎప్పటి మాదిరే చేస్తామని జగదీశన్ తెలిపారు. -
వారెవ్వా.. ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు!
ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (Fixed Deposits) మరోసారి వడ్డీ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 15 రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ఇది రెండో సారి. తాజాగా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం నవంబర్ 7 నుంచి అమలులోకి రానున్నాయి. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలకు ఈ పెంపు వర్తిస్తుంది. 15 నెలల ఒక రోజు నుంచి 18 నెలల లోపు కాలవ్యవధి ఎఫ్డీలు 6.40% వడ్డీని పొందుతారు. 18 నెలల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఎఫ్డీపై 6.50% వడ్డీని పొందనున్నారు. సీనియర్ సిటిజన్స్ హెచ్డీఎఫ్సీ తన కస్టమర్లకు ఎఫ్డీల వడ్డీ రేటు పెంచిన సంగతి తెలిసింతే. అయితే 60 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం పెంచిన వడ్డీ రేటుపై మరో 0.50 శాతం అదనపు రేటు ప్రయోజనాన్ని అందిస్తోంది. దీంతో ఈ బ్యాంక్ ఖాతాదారులకు ఒకే సారి రెండు శుభవార్తలను అందించింది. బ్యాంక్లో వీరికి వడ్డీ రేటు 3.5 శాతం నుంచి ప్రారంభం కాగా గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీ వస్తుంది. వీటితో పాటు రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను పెంచేసింది. 15 నెలల ఒక రోజు నుండి 18 నెలల కంటే తక్కువ కాల వ్యవధికి ఇప్పుడు 6.90% వడ్డీని అందిస్తోంది. చదవండి: ఆ ఐఫోన్ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’! -
RBI CBDC: డిజిటల్ రూపీ ట్రయల్స్ షురూ
ముంబై: దేశీయంగా తొలిసారి డిజిటల్ రూపాయి (సీబీడీసీ) ప్రాజెక్టు నేడు (మంగళవారం) ప్రారంభం కానుంది. బ్యాంకుల స్థాయిలో నిర్వహించే హోల్సేల్ లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెడుతోంది. నెల రోజుల వ్యవధిలో సాధారణ కస్టమర్లు, వ్యాపారస్తుల కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్ రూపీ – రిటైల్ సెగ్మెంట్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనుంది. ‘డిజిటల్ రూపీ (హోల్సేల్ విభాగం) తొలి పైలట్ ప్రాజెక్టు నవంబర్ 1న ప్రారంభమవుతుంది‘ అని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ బాండ్లకు సంబంధించి సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన 9 బ్యాంకులు ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి. సీమాంతర చెల్లింపులకు కూడా పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. సీబీడీసీతో ప్రయోజనాలు..: ప్రస్తుతం పేపర్ రూపంలో ఉన్న కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రించి, వ్యవస్థలోకి జారీ చేస్తుంది. ఇలా పేపర్ రూపంలో కాకుండా డిజిటల్ రూపంలో అధికారికంగా జారీ చేసే కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా (సీబీడీసీ) వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పేటీఎం, గూగుల్పే వంటి యాప్స్ ద్వారా డిజిటల్ రూపంలో చెల్లించగలుగుతున్నప్పటికీ, ఇందుకోసం వివిధ బ్యాంకుల్లో ఖాతాలు, వాటిలో భౌతికమైన నోట్ల నిల్వలు తప్పనిసరిగా అవసరమవుతోంది. లావాదేవీల సెటిల్మెంట్ రెండు బ్యాంకుల మధ్య, ఆర్బీఐ దగ్గర జరగాల్సి ఉంటోంది. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తి సెటిల్మెంట్లో అంతరాయాలు ఏర్పడటంతో పాటు ఈ విధానం కొంత ఖర్చుతో కూడినది. సీబీడీసీ విధానంలో థర్డ్ పార్టీ బ్యాంకు ఖాతాల ప్రస్తావన, అవసరం లేకుండా నేరుగా ఆర్బీఐ నిర్వహించే ఖాతాల ద్వారా డిజిటల్ రూపంలో లావాదేవీల సెటిల్మెంట్ పూర్తయిపోతుంది. దీనితో సమయం, వ్యయాలూ ఆదా అవుతాయి. అలాగే ప్రత్యేకంగా పేపర్ కరెన్సీని ముద్రించాల్సిన వ్యయాల భారమూ ఆర్బీఐకి కొంత తగ్గుతుంది. డిజిటల్ రూపంలో ఉంటుంది కాబట్టి భౌతిక రూపంలోని నగదు చోరీ భయాలు ఉండవని పరిశీలకుల విశ్లేషణ. అంతే గాకుండా ప్రభుత్వ పథకాల నిధులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆర్బీఐ ద్వారా లబ్ధిదారులకు చేర్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని అంచనా. సీబీడీసీ అనేది పేపర్ రూపంలోని కరెన్సీ నోట్లకు బదులు కాకుండా చెల్లింపు విధానాలకు మరో ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా.. 2022–23లో డిజిటల్ రూపీని అందుబాటులోకి తేనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం ప్రకటించినప్పటి నుండి సీబీడీసీ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. అటు అంతర్జాతీయంగా పలు దేశాలు సీబీడీసీల జారీ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నాయి. దాదాపు 90 పైగా సెంట్రల్ బ్యాంకులు వీటిని అధ్యయనం చేస్తున్నాయి. బహమాస్, నైజీరియా, డొమినికా వంటి కొన్ని దేశాలు ఇప్పటికే సీబీడీసీలను ప్రవేశపెట్టాయి. -
హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 61 రోజుల నుంచి 89 నెలల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. గతంలో ఇంట్రస్ట్ రేట్లు 4శాతం ఉండగా ఇప్పుడు (50బేసిస్) 4.50 శాతానికి పెంచింది. ► 90 రోజుల నుంచి 6 నెలల కాలానికి.. గతంలో 4.25 శాతం ఉండగా ఇప్పుడు 4.50 శాతానికి పెంచింది. ►1 రోజుల నుంచి 9 నెలల కంటే తక్కువ 6 నెలల తగ్గకుండా చేసిన ఎఫ్డీలపై నిన్న వరకు 5 శాతం వడ్డీని చెల్లించేది. ఇప్పుడు ఆ వడ్డీని 5.25 శాతానికి పెంచింది. ►1 రోజు నుంచి ఏడాదికి కాలానికి 9 నెలలు ఎఫ్డీని కొనసాగిస్తే.. వాటిపై 5.50శాతం వడ్డీని పొందవచ్చు. గమనిక : పెరిగిన పిక్స్డ్ రేట్లు ►ఒక సంవత్సరం నుండి 15 నెలల ఎఫ్డీ టెన్యూర్ కాలానికి 6.10 శాతం, 15 నెలల నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్డీలపై 6.15 శాతం ఇంట్రస్ట్ పొందవచ్చు. ►ఒక రోజు నుండి ఐదేళ్ల లోపు అంటే (రెండేళ్ళ టెన్యూర్ కాలానికి) చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం, ఐదు నుంచి పదేళ్ల టెన్యూర్ కాలానికి 6.20 శాతం వడ్డీని పొందవచ్చు. ►60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు 0.50 శాతం అదనపు వడ్డీని పొందుతారు. గమనిక : పెరిగిన రికరింగ్ డిపాజిట్ రేట్లు ►హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 నెలల నుంచి 120 నెలల కాలానికి చేసే సాధారణ రికరింగ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. చదవండి👉 భారత్లో అదరగొట్టిన ధంతేరాస్ సేల్స్, చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం! -
3.13 లక్షల మంది కస్టమర్లు: హెచ్డీఎఫ్సీ
ముంబై: క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) వినియోగదార్ల సంఖ్య 3.13 లక్షలు దాటిందని గృహ రుణ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. ప్రధాన మంత్రి అవాస యోజన (పీఎంఏవై) పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సీఎల్ఎస్ఎస్ కస్టమర్లు రూ.67,000 కోట్ల రుణాలను అందుకున్నట్టు సంస్థ ఎండీ రేణు సూద్ కర్నాడ్ వెల్లడించారు. ‘ప్రభుత్వం ఈ పథకం కింద సబ్సిడీ రూపంలో రూ.48,250 కోట్లు సమకూర్చింది. ఇందులో హెచ్డీఎఫ్సీ కస్టమర్లు 15 శాతంపైగా వాటాతో రూ.7,200 కోట్లు అందుకున్నారు. 92 శాతానికి పైగా కొత్త రుణ దరఖాస్తులు డిజిటల్ మార్గాల ద్వారా వచ్చాయి. మహమ్మారికి ముందు ఇది 20 శాతం కంటే తక్కువగా ఉంది. గుజరాత్ నుంచి అత్యధిక వినియోగదార్లు ఉన్నారు. సీఎల్ఎస్ఎస్ కింద ఉత్తమ పనితీరు కనబర్చిన గృహ రుణ సంస్థగా అవార్డు పొందాం’ అని వివరించారు. చదవండి: వివో బిగ్ దీపావళి ఆఫర్స్: రూ.101లకే స్మార్ట్ఫోన్ మీ సొంతం! -
నిఫ్టీ సూచీ నుంచి హెచ్డీఎఫ్సీ తొలగింపు!
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. విలీనానికి రికార్డ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది డిసెంబర్ లేదంటే వచ్చే జనవరిలో ఇది ఉండొచ్చు. ఈ రికార్డ్ తేదీకి ముందే నిఫ్టీ–50 సూచీ నుంచి హెచ్డీఎఫ్సీని ఎన్ఎస్ఈ తొలగించొచ్చని తెలుస్తోంది. ఈ విలీనం దేశంలోనే పెద్దదిగా నిలవనుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనానికి దాదాపు అన్ని రకాల అనుమతులు లభించాయి. ఇంకా కంపెనీ వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంది. వాటాదారుల సమావేశం నవంబర్ 25న నిర్వహించనున్నారు. అలాగే, ఆర్బీఐ నుంచి తుది ఆమోదం కూడా రావాల్సి ఉంది. హెచ్డీఎఫ్సీకి నిఫ్టీ ఇండెక్స్లో 5.5 శాతం వెయిటేజీ ఉంది. దీంతో 1.3–1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు హెచ్డీఎఫ్సీ నుంచి వెళ్లిపోవచ్చని అంచనా. దీంతో నిఫ్టీ సూచీలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. విలీనానంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు నిఫ్టీ ఇండెక్స్లో 13 శాతం వెయిటేజీ రానుంది. ఇది పెద్ద మొత్తం కావడంతో ఇండెక్స్పై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ఎస్ఈ దీనిపై ఓ చర్చా పత్రం విడుదల చేసింది. దీనిపై నవంబర్ 2 నాటికి అభిప్రాయాలు తెలియజేయాలని మార్కెట్ భాగస్వాములను కోరింది. విలీనం నేపథ్యంలో స్టాక్ ధరలు తీవ్ర అస్థిరతలకు గురి కాకుండా చూడడమే ఎన్ఎస్ఈ ఉద్దేశ్యం. -
హెచ్డీఎఫ్సీ ఏఎంసీ లాభం రూ.364 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సేవలు అందించే హెచ్డీఎఫ్సీ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి రూ.364 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ.344 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం సైతం 7 శాతం వృద్ధితో రూ.649 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.608 కోట్లుగా ఉంది. ఈ సంస్థ నిర్వహణలోని సగటు ఆస్తులు (ఏయూఎం) సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నిర్వహణ ఆస్తులు రూ.4.38 లక్షల కోట్లతో పోలిస్తే 2 శాతానికి పైగా తగ్గాయి. మార్కెట్ వాటా 11 శాతం కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ షేరు ఒక శాతానికి పైగా లాభపడి రూ.1,960 వద్ద ముగిసింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 22%ఎగసి రూ. 11,125 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 20 శాతం పుంజుకుని రూ. 10,606 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 8,834 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 19 శాతం బలపడి రూ. 21,201 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ 4.1 శాతంగా నమోదయ్యాయి. ఎన్పీఏలు మెరుగు ప్రస్తుత క్యూ2లో స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.35 శాతం నుంచి 1.23 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీల కేటాయింపులు రూ. 3,925 కోట్ల నుంచి తగ్గి రూ. 3,240 కోట్లకు పరిమితమయ్యాయి. కాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనంపై వాటాదారుల సమావేశ నిర్వహణకు ఎన్సీఎల్టీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 40 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్కు 2022 ఏప్రిల్ 4న తెరలేచిన విషయం విదితమే. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
అన్లిమిటెడ్ ఫ్యాషన్ ఆఫర్: రూ. 399 లకే పిజియాన్ గ్రైండర్
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా అన్లిమిటెడ్ ఫ్యాషన్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.7వేల కొనుగోలుపై రెండు జార్ల పిజియాన్ మిక్సర్ గ్రైండర్(రూ.3,175 విలువైన)ను రూ.399లకే పొందవచ్చు. అలాగే 3,500 కొనుగోలుపై రూ.2వేలు విలువ చేసే 10 పీసుల సెల్లో డిన్నర్ సెట్ రూ.199లకే అందిస్తుంది. ప్రారంభ ధర రూ.200తో అన్ని రకాల బ్రాండెడ్ ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెచ్చింది. హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ గొప్ప అవకాశాన్ని కస్టమర్లందరూ వినియోగించుకోవాలని కంపెనీ సీవోవో వినీత్ జైన్ కోరారు. -
ఫెస్టివ్ బొనాంజా: హోం లోన్లపై ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఆఫర్స్
ముంబై: ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 1.9 శాతం మేర పెంచడంతో రుణాలపై వడ్డీ రేట్లు పెరిగిపోయాయి. అయినప్పటికీ పండుగల దృష్ట్యా ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ తక్కువ రేటుకే గృహ రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఎస్బీఐ పావు శాతం మేర గృహ రుణాలపై రేటు తగ్గింపును అందిస్తున్నట్టు ప్రకటించింది. 2023 జనవరి 31 వరకు తీసుకునే గృహ రుణాలపై 8.40 శాతం రేటు అమలవుతుందని తెలిపింది. (Jio True 5G: అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో సేవలు) ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. టాపప్ లోన్లపైనా 0.15 శాతం తక్కువ రేటును ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. తన గృహ రుణాల విలువ రూ.6 లక్షల కోట్ల మార్క్ను దాటినట్టు వెల్లడించింది. పరిశ్రమలో ఈ మార్క్ను సాధించిన తొలి సంస్థగా పేర్కొంది. గృహ రుణాల్లో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ అయిన హెచ్డీఎఫ్సీ సైతం 0.20% తక్కువగా, 8.40శాతం కే గృహ రుణాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. పండుగ ఆఫర్ నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని హెచ్డీఎఫ్సీ తన వెబ్సైట్లో పేర్కొంది. కనీసం 750 క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 8.40శాతం రేటు వర్తిస్తుందని తెలిపింది. జూన్ నాటికి గృహ రుణాల విలువ రూ.5.36 లక్షల కోట్లుగా ప్రకటించింది. (5జీ కన్జ్యూమర్ సేవల్లోకి రావడం లేదు) -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిజిటల్ జర్నీ సగం పూర్తి
ముంబై: డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కార్యక్రమం సగం పూర్తయినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రకటించింది. రెండేళ్ల క్రితం దీన్ని బ్యాంకు చేపట్టగా.. టెక్నాలజీపై చేసే వ్యయాలు ఆదాయంలో నిర్ణీత శాతానికి చేరాయని, ఇకమీదట ఇంతకుమించి నిధుల అవసరం ఉండదని పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిజిటల్ సేవల విషయంలో కస్టమర్లు తరచూ సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటుండడంతో ఆర్బీఐ పలు చర్యలు తీసుకోవడం తెలిసిందే. కొత్త క్రెడిట్ కార్డులు విక్రయించకుండా, కొత్త డిజిటల్ సేవలు, సాధనాలు ఆరంభించకుండా నిషేధం విధించింది. దిద్దుబాటు చర్యలతో తర్వాత నిషేధాన్ని ఎత్తివేసింది. డిజిటల్కు మారే క్రమంలో 50–60 శాతం పని పూర్తయినట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేమెంట్స్, టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ పరాగ్రావు తెలిపారు. బ్యాంకుకు సంబంధించి ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. టెక్నాలజీపై చేసే వ్యయాల విషయంలో గరిష్ట స్థాయిని చేరుకున్నామని చెప్పారు. 2018 నుంచి చూస్తే డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయని.. దీంతో అప్పటి వరకు ఉన్న బ్యాంకింగ్ సదుపాయాలు వాటిని తట్టుకోలేకపోయినట్టు బ్యాంకు చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రమేశ్ లక్ష్మీనారాయణన్ పేర్కొన్నారు. -
ఖాతాదారులకు హెచ్డీఎఫ్సీ శుభవార్త
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. కోవిడ్ విజృంభణ సమయంలో అత్యధికంగా వడ్డీ చెల్లించేలా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ స్కీమ్ గడువును పెంచుతున్నట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్ల కోసం హెచ్డీఎఫ్సీ మే 18, 2020లో ‘సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ’ అనే స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఆ ఎఫ్డీ పథంలో చేరిన ఖాతాదారులకు .. సాధారణ డిపాజిట్ల కంటే ఎక్కువగా వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఆ పథకంలో చేరే గడువు సెప్టెంబర్ 30,2022తో ముగియగా..తాజాగా ఆ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. 0.25శాతం అదనపు వడ్డీతో మే 18, 2020 నుండి మార్చి 31, 2023 మధ్య కాలంలో సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీలో చేరిన ఖాతాదారులకు ఐదేళ్ల టెన్యూర్, లేదంటే ఒక రోజు నుంచి 10 ఏళ్ల టెన్యూర్ కాలానికి రూ.5కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.25శాతం అదనంగా వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. తేడా ఎంతంటే ఐదు సంవత్సరాలు, ఒక రోజు నుండి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు సాధారణ వడ్డీ రేటు 5.75 శాతం అందిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద అదనంగా 6.50 శాతం వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లు పొందుతారు. టెన్యూర్ లోపు డ్రా చేస్తే అయితే, పైన పేర్కొన్నట్లుగా ఐదేళ్లలోపు డిపాజిట్లను ప్రీ క్లోజ్ చేసుకుంటే బ్యాంకు లబ్ధి దారులకు చెల్లించే వడ్డీరేటులో ఒకశాతం తగ్గుతుందని, లేదా డిపాజిట్ ఉన్న కాలానికి వర్తించే బేస్ రేటు ఉంటుందని బ్యాంక్ తెలిపింది. చదవండి👉 బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కంపెనీలు.. మాఫీ అయిన లక్షల కోట్ల జాబితా ఇదే! -
హెచ్డీఎఫ్సీ ఎర్గోతో నర్చర్ ఒప్పందం
అగ్రిటెక్ స్టార్టప్ ‘నర్చర్డాట్ఫార్మ్’ హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన ప్లాట్ఫామ్ పరిధిలోని 23 లక్షల మంది రైతులకు బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. ‘‘పంటల సాగు కాలంలో రైతులు ఎన్నో రిస్క్లు ఎదుర్కొంటుంటారు. వాతావరణంలో అనూహ్య మార్పులు పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తాయి. రైతుల సహజ పనితీరు దృష్ట్యా వారి ఆరోగ్యానికి రిస్క్ ఉంటుంది. పంట ఉత్పత్తుల ధరలు కూడా అస్థిరతలకు గురవుతుంటాయి. ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. అయినా కానీ, ఖరీదైన ప్రీమియంను చూసి ఎక్కువ మంది రైతులు బీమాను ఎంపిక చేసుకోరు. వారికి మా ప్లాట్ఫామ్ ద్వారా బీమా పరిష్కారాలను అందించనున్నాం’’అని నూర్చర్ తెలిపింది. చదవండి: Airtel 5g: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
ప్రాప్టెక్ స్టార్టప్లకు హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ దన్ను
ముంబై: ప్రాపర్టీ టెక్నాలజీ స్టార్టప్లకు ఊతమిచ్చేందుకు హెచ్డీఎఫ్సీ క్యాపిటల్, ఇన్వెస్ట్ ఇండియా ప్రత్యేక ప్లాట్ఫాం ఆవిష్కరించాయి. అఫోర్టబుల్ హౌసింగ్కు సంబంధించి నిర్మాణం, అమ్మకాలు, ఫిన్టెక్, అంశాల్లో కొత్త ఆవిష్కరణలను వెలికితీసేందుకు హెచ్డీఎఫ్సీ రియల్ ఎస్టేట్ టెక్ ఇన్నోవేటర్స్ 2022 వేదికను ఏర్పాటు చేసినట్లు సంస్థ ఎండీ విపుల్ రుంగ్టా తెలిపారు. దీని ద్వారా మూడు అత్యంత వినూత్న కంపెనీలు లేదా సొల్యూషన్స్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగం అయ్యేందుకు దేశవ్యాప్తంగా ఇన్నోవేటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వివరించారు. దీనికి అనరాక్, సెకోయా, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్, యాక్సెల్ తదితర సంస్థలు తోడ్పాటు అందిస్తున్నాయి. చదవండి: అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే! -
హౌసింగ్ ప్రాజెక్టులకు రూ. 350 కోట్లు: ఎల్డెకో, హెచ్డీఎఫ్సీ క్యాపిటల్
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ క్యాపిటల్తో చేతులు కలిపినట్లు రియల్టీ సంస్థ ఎల్డెకో గ్రూప్ తాజాగా పేర్కొంది. తద్వారా దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో హౌసింగ్ ప్రాజెక్టుల అభివృద్ధిని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 350 కోట్లతో నిధి(ఫండ్) ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వెరసి అందుబాటు ధరల రెసిడెన్షియల్ ప్రాజెక్టుల అభివృద్ధికి వీలుగా హెచ్-కేర్3 పేరుతో రియల్టీ ఫండ్కు తెరతీసినట్లు ఎల్డెకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ తెలియజేసింది. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ప్రస్తుతం ఎల్డెకో గ్రూప్ ఢిల్లీ-ఎన్సీఆర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో నాలుగు హౌసింగ్ ప్రాజెక్టులను గుర్తించింది. వీటిపై రూ. 175 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. కాగా.. ఇంతక్రితం కూడా హెచ్డీఎఫ్సీ క్యాపిటల్తో భాగస్వామ్యంలో ఎల్డెకో గ్రూప్ హెచ్-కేర్1 పేరుతో రూ. 150 కోట్ల రియల్టీ ఫండ్ను ఏర్పాటు చేసింది. తద్వారా తక్కువ ఎత్తులో, ప్లాటెడ్ అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతోంది. తొలిగా ఈ ఏడాది మార్చిలో ఎల్డెకో ప్యారడైజో పేరుతో పానిపట్లో 35 ఎకరాల ప్లాటెడ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. (క్లిక్: Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్) -
ఆ లోన్ తీసుకున్నవారికి భారీ షాక్.. .. ప్చ్, ఈఎంఐ మళ్లీ పెరిగింది!
దేశంలో ద్రవ్యోల్పణాన్ని కట్టడి చేసేందుకు ఇటీవల ఆర్బీఐ రెపో రేటుని పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచే పనిలో పడ్డాయి. తాజాగా ప్రముఖ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. హోమ్ లోన్స్పై ఉన్న రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ రుణాల బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. కాగా పెంచిన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు ఆగస్టు 9 నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ నెలలో ఇది రెండవ పెంపు కావడం గమనార్హం. మూడు నెలల్లో హెచ్డిఎఫ్సి చేపట్టడం ఇది ఆరోసారి. మే 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం రేటు 140 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపుతో గృహ రుణాలు తీసుకున్న కస్టమర్ల ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. మే నుంచి ఆర్బీఐ ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్ల పెంపుదలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరోసారి సెప్టెంబరుతో పాటు డిసెంబర్లో కూడా ఆర్బీఐ సమావేశం కానుంది. ఏది ఏమైనా భారం మాత్రం తప్పట్లేదని సామన్య ప్రజలు వాపోతున్నారు. మూడు నెలల కాలంలోనే ఆర్పీఎల్ఆర్ (RPLR) చాలా అధికంగా పెరగడంతో హోం లోన్స్ తీసుకున్న వారు అధిక ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోంది. చదవండి: Revised ITR: రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేయాలా? చివరి తేదీ ఎపుడు? -
హెచ్డీఎఫ్సీ ట్విన్స్ విలీనానికి ఎన్హెచ్బీ ఆమోదం!
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనమయ్యేందుకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) నుంచి తమకు ఆమోదముద్ర లభించిందని గృహ రుణాల సంస్థ హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. అలాగే రెండు అనుబంధ సంస్థలు.. హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్ విలీనానికి కూడా అనుమతి దక్కిందని పేర్కొంది. ఆగస్టు 8న ఎన్హెచ్బీ ఈ మేరకు నిరభ్యంతర పత్రం జారీ చేసినట్లు వివరించింది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల విలీన ప్రతిపాదనకు ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో పాటు స్టాక్ ఎక్ఛేంజీలు (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ) కూడా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. విలీన సంస్థకు దాదాపు రూ. 18 లక్షల కోట్ల మేర అసెట్లు ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు లేదా మూడో త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కావచ్చని అంచనా. ఇది పూర్తయితే హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో పబ్లిక్ షేర్హోల్డింగ్ 100 శాతానికి చేరుతుంది. హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్ల వాటా 41 శాతంగా ఉంటుంది. చదవండి👉 వాడకం మామూలుగా లేదుగా! పెరిగిపోతున్న క్రెడిట్ కార్డ్ల వినియోగం..ఎంతలా అంటే? -
అంచనాలు మించిన హెచ్డీఎఫ్సీ లైఫ్ పనితీరు!
ముంబై: జీవిత బీమా రంగంలోని హెచ్డీఎఫ్సీ లైఫ్ పనితీరు జూన్ త్రైమాసికంలో అంచనాలకు అందుకుంది. నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.365 కోట్లకు చేరుకుంది. పాలసీల రెన్యువల్ నిష్పత్తి గరిష్ట స్థాయిలో ఉండడం మార్జిన్లు పెరిగేందుకు దారితీసింది. మొత్తం ప్రీమియం ఆదాయం 23 శాతం పెరిగి రూ.9,396 కోట్లుగా నమోదైంది. ఇది అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.7,656 కోట్లుగా ఉంది. దీన్ని మరింత వివరంగా చూస్తే.. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి) 27 శాతం పెరిగి రూ.4,776 కోట్లకు చేరింది.