ఎస్యూడీలో వాటా విక్రయించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా | Bank of India sells 18% stake in Star Union Dai-ichi Life for ₹540 cr | Sakshi
Sakshi News home page

ఎస్యూడీలో వాటా విక్రయించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

Published Wed, Jun 22 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

ఎస్యూడీలో వాటా విక్రయించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్యూడీలో వాటా విక్రయించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

18 శాతం వాటా రూ.540 కోట్లకు అమ్మకం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన జాయింట్ వెంచర్ జీవిత బీమా కంపెనీ, ఎస్‌యూడీలో 18% వాటాను ఆ జేవీ విదేశీ  భాగస్వామికి విక్రయించింది. స్టార్ యూనియన్ దై-చి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎస్‌యూడీ)లో 18 % వాటాను జపాన్‌కు చెందిన దై-చి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(డీఐఎల్‌ఐసీ)కు రూ.540 కోట్లకు విక్రయించామని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ వాటా విక్రయం కారణంగా ఈ జేవీలో దైచీ వాటా  26 శాతం నుంచి 44%కి పెరగ్గా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా 48% నుంచి 30%కి తగ్గింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్‌కు మిగిలిన 26% వాటా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement