Sale
-
లగ్జరీ అపార్ట్మెంట్ను అమ్మేసిన సోనాక్షి సిన్హా, లాభం భారీగానే!
హీరోయిన్ సోనాక్షి సిన్హా మొత్తానికి తన లగ్జరీ అపార్ట్మెంట్ను విక్రయించింది. సంజయ్ లీలా భన్సాలీ పీరియాడికల్ డ్రామా హీరామండి: ది డైమండ్ బజార్లో చివరిసారిగా కనిపించిన సోనాక్షి సిన్హా, సముద్రం వైపున ఉన్నతన బాంద్రా అపార్ట్మెంట్ను రూ.22.50 కోట్లకు విక్రయించినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ (81 Aureate) 16వ అంతస్తులో 4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందీ అపార్ట్మెంట్. దీన్ని 2022, మార్చి దాదాపు రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే తాజా విక్రయం ద్వారా దాదాపు 61 శాతం లాభాన్ని ఆర్జించిందిఆధునిక సౌకర్యాలతో కూడిన విశాలమైన 4-BHK అపార్ట్మెంట్ను reD ఆర్కిటెక్ట్స్కు చెందిన రాజీవ్ , ఏక్తా పరేఖ్ 1.5-BHKగా సొగసైన రీతిలో తీర్చిదిద్దారు. ఎంతో స్పెషల్గా, అందంగా ఈ ఇంటిలో వాక్-ఇన్ వార్డ్రోబ్, ప్రత్యేక జిమ్, అందమైన కళాకృతులు, అరేబియా సముద్రాన్ని వీక్షించేలా విశాలమైన బాల్కనీ ఉన్నాయి. చదవండి: లూపస్ వ్యాధి గురించి తెలుసా? చికిత్స లేకపోతే ఎలా?!ముఖ్యంగా గత ఏడాది (2024, జూన్ 23న ) సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్ను వివాహం చేసుకున్న ఇల్లు కూడా ఇదే. ఇటీవల సోనాక్షి, జహీర్ పెళ్లి వేడుకలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ ఇంటిని రూ.25 కోట్లకు అమ్మకానికి పెట్టడం వార్తల్లో నిలిచింది.కాగా బాలీవుడ్ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. ప్రారంభంలో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. తరువాత బాగా బరువు తగ్గించుకుని, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన యాక్షన్-డ్రామా దబాంగ్ (2010)మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఉత్తమ డెబ్యూనటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. వరుస ఆఫర్లతో చాలా బిజీగా మారింది. ముఖ్యంగా దక్షిణాదిన రజినీకాంత్ నటించిన లింగ సినిమాతో తమిళం సినిమాకి పరిచయం అయినది. సహనటుడు జహీర్ ఇక్బాల్తో సుదీర్ఘ కాలం ప్రేమలో ఉన్న సోనాక్షీ ఎట్టకేలకు గత ఏడాది పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భర్తతో మూడు హనీమూన్లు, ఆరు టూర్లు అన్నట్టుగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. -
రిలయన్స్ జ్యువెల్స్ డ్రీమ్ డైమండ్ సేల్
ప్రముఖ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్, వార్షిక ‘డ్రీమ్ డైమండ్ సేల్’ను మళ్లీ తీసుకొచ్చింది. ఈ సేల్ ఫిబ్రవరి 16 వరకు అందుబాటులో ఉంటుందని రిలయన్స్ జ్యువెల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టైల్కి, సందర్భానికి త గినట్టుగా డైమండ్ ఆభరణాలను తీసుకొచ్చినట్టు వెల్లడించింది.ఈ ప్రత్యేకమైన ఆఫర్ కస్టమర్లకు డైమండ్ విలువ మరియు మేకింగ్ ఛార్జీలపై 30శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. వివిధ వజ్రాభరణాలతో, ఈ సంవత్సరం డ్రీమ్ డైమండ్ సేల్ కొనుగోలుదారుల జీవితాల్లోని ప్రతీ సందర్బంలో విలువైన క్షణాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో స్టేట్మెంట్ బ్రైడల్ సెట్స్, ఉంగరాలు, చెవిపోగులు, బ్యాంగిల్స్ , గ్రాండ్ నెక్లెస్ల ఉంటాయని రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ తెలిపారు. దేశవ్యాప్తంగా 180+ స్వతంత్ర షోరూమ్లలో డైమండ్ కలెక్షన్ను దుకాణదారులు పొందవచ్చన్నారు. ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప చేసే డైమండ్ నగలు మెరుపు పోకుండా షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్ మీకోసం!స్నానం చేసేటప్పుడు డైమండ్ ఆర్నమెంట్స్ను తీయాలి. మైల్డ్ సోప్, మైల్డ్ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్లెట్లు ఎక్కువగా సొల్యూషన్ బారిన పడుతుంటాయి. వాతావరణంలో సొల్యూషన్ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్ మెరుపు తగ్గుతుంది. వేడి నీటిలో లిక్విడ్ సోప్ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ఎలిమెంట్. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడకూడదు. పైన చెప్పుకున్నవి కట్ డైమండ్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్కట్ డైమండ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తయారీలో అన్కట్ డైమండ్ వెనుక సిల్వర్ ఫాయిల్ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్కట్ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.ఇటీవల వేడుకల్లో ఎయిర్కూలర్లో పెర్ఫ్యూమ్ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్కట్ డైమండ్ ఆర్నమెంట్స్ నల్లబడే ప్రమాదముంది. అన్కట్ డైమండ్ ఆర్నమెంట్ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్ చేయించుకోవాలి.ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్ బాక్సులకు ముఖమల్ క్లాత్ని గమ్తో అతికిస్తారు. డైమండ్ ఆర్నమెంట్స్ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్ మీద అమర్చి భద్రపరుచుకోవాలి. -
గవర్నమెంట్ స్కూల్ నే అమ్మకానికి పెట్టేశారు!
-
నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ ఇస్తారని తెలుసా..?
సాక్షి, హైదరాబాద్: సొంతింటి కల సాకారంలో కస్టమర్తో బిల్డర్ చేసుకునే సేల్ అగ్రిమెంట్ అత్యంత కీలకం. ఒప్పందపత్రంలోని నిబంధనలు, షరతులను బట్టి మన కల తీరుతుందో లేక మధ్యలోనే పటాపంచలవుతుందో ఇట్టే చెప్పేయొచ్చు. అందుకే మనిషికి హృదయ స్పందనలాగే డెవలపర్కు, కొనుగోలుదారులకు మధ్య జరిగే సేల్ అగ్రిమెంట్ అంతకంటే ముఖ్యమని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా) సభ్యులు కె.శ్రీనివాస రావు అంటున్నారు. ఆయనతో ‘సాక్షి రియల్టీ’ ఇంటర్వ్యూ విశేషాలివీ..బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థలన్నీ తమకు అనుకూలమైన నిబంధనలను, షరతులను పొందుపరిచి కస్టమైజ్డ్ అగ్రిమెంట్లను రూపొందించి కస్టమర్లతో సేల్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటిపట్ల గృహ కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పెట్టుబడులకు భద్రత, రక్షణ ఉండాలంటే రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్ల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. తక్కువ ధరకు వస్తుందనో, ఆఫర్లు ఇస్తున్నారనో ప్రీలాంచ్, బై బ్యాక్ స్కీమ్స్ వలలో చిక్కితే రోడ్డున పడతారు. నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సిందే.. నిర్మాణ దశలను బట్టి డెవలపర్లకు బ్యాంక్ నిధులను విడుదల చేస్తుంది. రెరా నిబంధనల ప్రకారం ఆయా నిధులను ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమ చేసి, ఆ నిర్మాణ పనుల కోసం మాత్రమే వినియోగించాలి. అయితే డెవలపర్లు నిధులను ఇతర ప్రాజెక్ట్లు, అవసరాలకు మళ్లిస్తుండటంతో ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకునే సరికి నిధులు సరిపడాలేక అది ఆగిపోతుంది. మరోవైపు నిధులు పూర్తిగా విడుదల కాగానే కస్టమర్కు బ్యాంక్ నుంచి నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లించడం ప్రారంభమవుతుంది. కానీ, కస్టమర్కు ఆ టైంకు ఫ్లాట్ చేతికి రాదు. గృహప్రవేశం చేయలేరు. దీంతో బయట అద్దె, ఫ్లాట్కు ఈఎంఐ చెల్లించడం కస్టమర్కు అదనపు భారంగా మారుతుంది. గడువులోగా ప్రాజెక్ట్లను పూర్తి చేయని డెవలపర్లు ఆలస్యం అయిన కాలానికి 10.25 శాతం వడ్డీని కస్టమర్కు చెల్లించాల్సిందే. ఒకవేళ సమయానికి కస్టమర్లు బిల్డర్కు సొమ్ము చెల్లించకపోతే వారు కూడా 10.25 శాతం వడ్డీని డెవలపర్కు అందజేయాల్సిందే. కార్పస్ ఫండ్ అందజేయాలి.. సెమీ ఫర్నిష్ ఫ్లాట్ను రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ.2 లక్షలు, 3 లక్షల మేర రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గుతాయనే బిల్డర్ల ఉచిత సలహాకు చాలామంది కస్టమర్లు చిక్కుతున్నారు. అయితే సెమీ ఫర్నీష్ ఫ్లాట్ను పూర్తి ఫర్నీష్గా ఎప్పుడు చేస్తారనే విషయంపై బిల్డర్తో సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకోవాలి. లేకపోతే రిజిస్ట్రేషన్ అయిపోయిందంటూ టైల్స్, పెయింటింగ్ వంటి తుది మెరుగులు దిద్దకుండా అసంపూర్తి ఫ్లాట్నే కస్టమర్కు అప్పగించి బిల్డర్లు చేతులు దులుపుకుంటారు. కస్టమర్ల నుంచి వసూలు చేసే కార్పస్ ఫండ్ను బిల్డర్ తీసుకోరాదు. అసోసియేషన్కు ప్రత్యేకంగా ఎస్క్రో బ్యాంక్ ఖాతాను తెరిచి, వడ్డీతోసహా కార్పస్ ఫండ్ను అందులో జమ చేయాలి. కస్టమర్ల అనుమతి తప్పనిసరి.. కస్టమర్తో ఒప్పందం చేసుకున్నాక ప్రాజెక్ట్ లేదా ఫ్లాట్ డిజైనింగ్, ఎలివేషన్ వంటి వాటిల్లో బిల్డర్ ఏమైనా మార్పులు చేయాలంటే 2/3 వంతు కస్టమర్ల అనుమతి తప్పనిసరి. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బిల్డర్ బ్యాంక్ రుణంతోనే కడుతున్నప్పుడు కస్టమర్లు బిల్డర్కు పోస్ట్ డేటెడ్ చెక్స్ అందజేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా డెవలపర్లు కస్టమర్ల నుంచి 10 శాతానికి మించి టోకెన్ అమౌంట్ను వసూలు చేయకూడదు. భూ యజమానికి చిక్కులు.. నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్ పొజిషన్కు కస్టమర్కు రెరా చట్టం ప్రకారం 2 నెలల సమయం ఉంటుంది. కానీ, 15 రోజుల్లోనే పొజిషన్ తీసుకోవాలని బిల్డర్లు కస్టమర్లను ఒత్తిడి చేస్తుంటారు. ఇంటీరియర్ పనులు, వ్యక్తిగత కారణాల వల్ల కొందరు కస్టమర్లు పొజిషన్ తీసుకోవడంలో ఆలస్యం చేస్తుంటారు. మరికొందరు పొజిషన్ తీసుకుంటే అపార్ట్మెంట్ నిర్వహణ వ్యయం చెల్లించాల్సి ఉంటుందని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి స్థల యజమానితో బిల్డర్ ఒప్పందం చేసుకుంటే రెరా చట్టం ప్రకారం డెవలపర్ కూడా ప్రమోటరే అవుతారు. కాబట్టి ఇరువురి మధ్య జరిగే అగ్రిమెంట్లు పారదర్శకంగా ఉండాలి. లేకపోతే భూ యజమానికి కూడా చిక్కులు తప్పవు. -
రియల్టీ బూమ్.. రూ. 35,000 కోట్ల ప్రాపర్టీల విక్రయం
న్యూఢిల్లీ: వర్షాలు, నియంత్రణ సంస్థల నుంచి పూర్తిగా అనుమతులు రాకపోవడం తదితర అంశాల కారణంగా 2024–25 రెండో త్రైమాసికంలో కాస్త ప్రతికూల ప్రభావం పడినా లిస్టెడ్ రియల్టీ దిగ్గజాల విక్రయాలు గణనీయంగా నమోదయ్యాయి. 26 సంస్థలు ఏకంగా రూ. 35,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలను విక్రయించాయి.గోద్రెజ్ ప్రాపర్టీస్ అత్యధికంగా రూ. 5,198 కోట్ల బుకింగ్స్ నమోదు చేసింది. నియంత్రణ సంస్థలకు సమర్పించిన వివరాల ప్రకారం 26 దిగ్గజ సంస్థలు రూ. 34,985 కోట్ల ప్రాపర్టీలు విక్రయించాయి. అత్యధికంగా రెసిడెన్షియల్ సెగ్మెంట్లో ప్రీ–సేల్స్ నమోదయ్యాయి. లోధా బ్రాండ్పై కార్యకలాపాలు సాగించే ముంబైకి చెందిన మ్యాక్రోటెక్ డెవలపర్స్ రూ. 4,290 కోట్ల బుకింగ్స్ సాధించింది. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్) సంస్థ మ్యాక్స్ ఎస్టేట్స్ రూ. 4,100 కోట్లు, బెంగళూరు కంపెనీలు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రూ. 4,023 కోట్లు, సిగ్నేచర్ గ్లోబల్ రూ. 2,780 కోట్ల ప్రాజెక్టులు విక్రయించాయి.ఇదీ చదవండి: హైదరాబాద్లో ప్రాపర్టీ కొంటున్నారా? అయితే మీ కోసమే ఈ జాగ్రత్తలుఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో చాలా మటుకు రియల్టీ కంపెనీలు రూ. 500 – రూ. 1,000 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి. అయితే, తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో కొన్ని సంస్థల విక్రయాలు నెమ్మదించాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా అగ్రస్థానంలో ఉన్న డీఎల్ఎఫ్ తొలి త్రైమాసికంలో రూ. 6,404 కోట్ల ప్రీ–సేల్స్ సాధించగా కొత్త ప్రాజెక్టులేమీ ప్రకటించకపోవడంతో రెండో త్రైమాసికంలో రూ. 692 కోట్లు మాత్రమే నమోదు చేసింది. -
కళ్లు చెదిరే ఈ భవనం కొనగలరా?
అమెరికన్ వ్యాపారవేత్త డార్విన్ డీసన్కు చెందిన లా జోల్లా ఎస్టేట్ 'ది శాండ్కాజిల్' రికార్డ్ ధరకు అమ్మకానికి వచ్చింది. 108 మిలియన్ డాలర్లు (సుమారు రూ.907 కోట్లు)కు లిస్టయింది. ఇది శాన్ డియాగో కౌంటీ రియల్ ఎస్టేట్కు రికార్డ్-బ్రేకింగ్ ధర.లిస్టింగ్లో పెట్టిన ధరకు అమ్ముడుపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో డెల్ మార్ ఓషన్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన బిలియనీర్ ఎగాన్ డర్బన్ పేరిట ఉన్న 44 మిలియన్ డాలర్ల ప్రస్తుత రికార్డును ఇది అధిగమిస్తుంది. అఫ్లియేటెడ్ కంప్యూటర్ సర్వీసెస్ (తర్వాత జిరాక్స్ సంస్థకు విక్రయించారు) స్థాపకుడు డార్విన్ డీసన్ 2009లో ఈ ఎస్టేట్ను, దాని పక్కనున్న స్థలాన్ని 26 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. తర్వాత దాని నిర్మాణం కోసం 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ ప్రైవేట్ ఎలివేటెడ్ బీచ్ను కలిగి ఉంది. అలనాటి ఐరోపా శైలిలో బంగారు పరదాలు, పాలరాతి ఫ్లోర్లు, ఆకృతులతో ఇంటీరియర్ను తీర్చిదిద్దారు. హాలీవుడ్ ప్రముఖులు, రాజ కుటుంబాల ఇళ్లకు డిజైన్ చేసిన ప్రఖ్యాత డిజైనర్ తిమోతీ కొరిగాన్ ఈ భవనానికి ఇంటీరియర్లను రూపొందించారు.ఇందులోని ఫర్నిచర్ ఫ్రెంచ్ సొగసుతో ఆకట్టుకుంటుంది. 16 మంది కూర్చునేందుకు వీలుగా రాజసమైన డైనింగ్ రూం, నాటికల్ నేపథ్యంతో తీర్చిదిద్దిన బార్ ఇందులో ఉన్నాయి. ఇక భవనం లోగిలిలో ఒక పూల్, ఫిట్నెస్ సెంటర్, చైనా స్లేట్ రూఫ్ టైల్స్తో కూడిన బీచ్ ఫ్రంట్ బోట్హౌస్ ఉన్నాయి. అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ సిగ్నేచర్ వైట్ షేడ్ లాంటి లుక్ కోసం 40 వేల డాలర్లతో దిగుమతి చేసుకున్న ఇసుక ఈ భవనానికి వినిగియోగించారు. ఇంత విలాసవంతంగా భవనం నిర్మించుకున్నప్పటికీ దీన్ని పెద్దగా ఉపయోగించలేదని డీసన్ చెబుతున్నారు. -
ఐఫోన్ 16 సిరీస్ సేల్స్ నేటి నుంచే..
న్యూఢిల్లీ: ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారత్లో నేటి నుంచి (సెప్టెంబర్ 20) ప్రారంభం కానున్నట్లు యాపిల్ వర్గాలు తెలిపాయి. ప్రో సిరీస్ను భారత్లో తెలిసారిగా అసెంబ్లింగ్ చేసే యోచనలో కంపెనీ ఉందని సమాచారం.ఇటీవలి బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గిన నేపథ్యంలో తొలిసారిగా గత సిరీస్ కన్నా కొత్త ప్రో సిరీస్ ఫోన్లను యాపిల్ తక్కువ రేటుకు విక్రయించనుంది. దేశీయంగా ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,000 నుంచి, ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,44,900 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.గతేడాది ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900 నుంచి, ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,59,900 నుంచి మొదలైంది. మరోవైపు, తాజా ఐఫోన్ 16 రేటు రూ. 79,900 నుంచి, 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి ప్రారంభమవుతుంది. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు 128 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజీతో లభిస్తాయి. -
Hyderabad: మ్యాక్స్ మాన్యా ప్రారంభం..
నగర ఫ్యాషన్ ఔత్సాహికులను అలరించేందుకు మ్యాక్స్ ఫ్యాషన్ ఆధ్వర్యంలో ‘మాన్యా సెల్’ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అధునాతన ఫ్యాషన్కు వేదికైన నగరంతో పాటు దేశవ్యాప్తంగా మ్యాక్స్ ఫ్యాషన్ ప్రియులకు నేటి నుంచి ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ష్యాషన్ రంగంలో ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా రూ.399 లోపే స్పెషల్ మాన్యా సెల్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. -
రియల్ ఎస్టేట్ రికార్డ్.. రూ.1,754 కోట్ల ఇల్లు అమ్మకం
ఓక్లే అనే ఐవేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ జన్నార్డ్ ఇటీవల తన మాలిబు ప్రాపర్టీని 210 మిలియన్ డాలర్లకు (రూ.1,754 కోట్లు) విక్రయించి కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంలో కొత్త రికార్డు నెలకొల్పారు. రియల్ ఎస్టేట్కు ప్రత్యేకమైన మాలిబు ప్రాంతంలో.. డెలావేర్ ఆధారిత లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ద్వారా ఈ విక్రయం జరిగింది. అయితే కొనుగోలుదారు ఎవరన్నది వెల్లడి కాలేదు.లాస్ ఏంజలెస్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. జానార్డ్ 2012లో బిలియనీర్ ఇన్వెస్టర్ హోవార్డ్ మార్క్స్ నుంచి 75 మిలియన్ డాలర్లకు ఈ ఓషన్ ఫ్రంట్ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. అంతకుముందు మార్క్స్ దీన్ని హెర్బాలైఫ్ సహ వ్యవస్థాపకుడు మార్క్ హ్యూస్ నుంచి 2002లో 31 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.ఇంటి ప్రత్యేకతలు ఇవే..15,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీ ఎల్ పెస్కాడోర్ స్టేట్ బీచ్ కు ఆనుకుని ఉంది. దీనికి సొంత ప్రైవేట్ 300 అడుగుల స్ట్రెచ్ ఓషన్ ఫ్రంటేజ్ ఉంది. ప్రధాన నివాసంలో ఎనిమిది పడక గదులు, 14 బాత్ రూమ్ లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా జిమ్, రెండు ప్రత్యేక గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.ఈ అమ్మకంతో, మాలిబు ఇప్పుడు కాలిఫోర్నియా చరిత్రలో మూడు అత్యధిక గృహాల అమ్మకాలను కలిగి ఉంది. ప్రస్తుత అమ్మకపు ధర గత సంవత్సరం జే-జెడ్, బియోన్స్ వారి మాలిబు కాంపౌండ్ పై సాధించిన 200 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. 2021లో మాలిబు ప్యారడైజ్ కోవ్లో విస్తారమైన ఎస్టేట్ను 177 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. -
తల్లిపాలతో వ్యాపారానికి అనుమతించబోము
తల్లిపాలతో వ్యాపారం వద్దే వద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తేల్చి చెప్పేసింది. మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తులను విక్రయించరాదని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.‘మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించి వివిధ రిజిస్టర్డ్ సొసైటీల నుంచి ఈ కార్యాలయానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006 కింద మానవ తల్లిపాలను ప్రాసెసింగ్ చేయడానికి, విక్రయించడానికి ఎఫ్ఎస్ఎస్ఎఐ అనుమతించదు’ ప్రకటనలో ఎఫ్ఎస్ఎస్ఎఐ తెలిపింది.మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006తోపాటు దాని అనుబంధ నియమనిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్బీఓ) హెచ్చరించింది.తల్లి పాలను విక్రయించే ఇలాంటి యూనిట్లకు అనుమతి ఇవ్వవద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సింగ్ అధికారులను కోరింది. 'మదర్స్ మిల్క్/హ్యూమన్ మిల్క్' ప్రాసెసింగ్ లేదా అమ్మకంలో పాల్గొనే ఇలాంటి ఎఫ్బీఓలకు ఎలాంటి లైసెన్స్/ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా రాష్ట్ర, కేంద్ర లైసెన్సింగ్ అథారిటీలు చూసుకోవాలని సూచించింది.జాతీయ మార్గదర్శకాల ప్రకారం డోనర్ హ్యూమన్ మిల్క్ (డీహెచ్ఎం)ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. కాంప్రహెన్సివ్ పాలిటీ మేనేజ్మెంట్ సెంటర్స్ (సీఎల్ ఎంసీ)ల్లోని ఆరోగ్య కేంద్రాల్లో చేరిన శిశువులకు దీన్ని అందించవచ్చు. తల్లిపాలను ఇచ్చే దాత ఇందుకోసం ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా స్వచ్ఛందంగా దానం చేయాలి. దానం చేసిన పాలను ఆసుపత్రిలోని నవజాత శిశువులు, ఇతర తల్లుల శిశువులకు ఆహారం అందించడానికి ఉచితంగా ఉపయోగించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. -
అంగట్లో అమ్మకానికి ఆడ శిశువు
మేడిపల్లి: ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకునేందుకు యతి్నంచిన అమానవీయ ఘటన పీర్జాదిగూడలో బుధవారం కలకలం రేపింది. మూడు నెలల ఆడ శిశువును విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మేడిపల్లి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణా నగర్ కాలనీలో ఐతె శోభారాణి ఆర్ఎంపీగా పని చేస్తూ ప్రథమ చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తోంది. కొంత కాలంగా ఉప్పల్ ఆదర్శనగర్ కాలనీకి చెందిన చింత స్వప్న, రామకృష్ణా నగర్ కాలనీకి చెందిన షేక్ సలీం పాషాతో కలిసి నగరంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు చెందిన చిన్నారుల ఆచూకీ తెలుకుంటున్నారు. ఆయా కుటుంబాలకు డబ్బుల ఆశ చూపిస్తున్నారు. కొంత మొత్తం ముట్టజెప్పి వారి పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన కొందరు మహిళలు తెలుసుకున్నారు. తమకు పిల్లలు లేరని పెంచుకోవడానికి ఆడపిల్ల కావాలని శోభారాణిని సంప్రదించారు. మూడునెలల పసికందును రూ.4.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.10 వేలు అడ్వాన్స్గా ఇచ్చి మిగతా డబ్బులు పాపను తీసుకున్న తర్వాత ఇస్తామని చెప్పారు. బుధవారం మధా్నహ్నం విజయవాడ నుంచి తీసుకు వచి్చన మూడు నెలల ఆడ శిశువును శోభారాణి, స్వప్న, సలీం పాషా స్వచ్ఛంద సంస్థ మహిళలకు చూపించారు. ఈ విషయాన్ని వెంటనే వారు మేడిపల్లి పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్ఎంపీ శోభారాణి, ఆమెకు సహకరించిన స్వప్న, సలీంలను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశు విహార్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. -
అమెజాన్ సేల్లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో స్మార్ట్వాచ్లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్బడ్స్పై 95శాతం, ఇయర్ఫోన్లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్ఫోన్స్పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024తో ప్రారంభమైన ఈ సేల్లో అన్నీ రకాల ప్రొడక్ట్లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్ ధరల్లో ఉన్న ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్ప్లస్తో పాటు ఇతర ఫోన్లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.మీరు ఐసీసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్లు వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది. -
Sanda Island లగ్జరీ దీవి అమ్మకానికి, ధర రూ. 26 కోట్లే
సాధారణంగా సొంతంగా ఒక ఇల్లు, ఓ చిన్న కారు ఇదీ ఓ మధ్య తరగతి జీవి కల. కానీ యూకేలోని స్కాట్లాండ్లో ఒక బంపర్ ఆఫర్ సామాన్యుడ్ని సైతం ఊరిస్తోంది. పశ్చిమ తీరంలో 453-ఎకరాల ప్రైవేట్ లగ్జరీ ఐలాండ్ ఒకటి అతి తక్కువ ధరకే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఏడు బెడ్ రూంలు, బీచ్లు, పబ్,హెలిప్యాడ్ అబ్బో.. ఇలాంటి సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ప్రముఖ నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ దీన్ని అమ్మకానికి పెట్టింది. అయితే ఈ దీవిని సొంతం చేసుకోవాలంటే మీ దగ్గర 26 కోట్లు ఉంటే చాలు. వివరాలు ఇలా ఉన్నాయి..స్కాట్లాండ్ , ఉత్తర ఐర్లాండ్ మధ్య 453 ఎకరాల మేర విస్తరించి ఉందీ సాండా ద్వీపం. పాల్ మాక్కార్ట్నీ , వింగ్స్చే 1977 పాట "ముల్ ఆఫ్ కింటైర్’’ ద్వారా ఇది పాపులర్ అయింది. గత కొన్నేళ్లుగా సన్యాసులు, సాధువులు, రాజులతో చారిత్రక సంబంధాలను కలిగి ఉంది. దీనిని స్కాటిష్ రాజు రాబర్ట్ ది బ్రూస్ , నార్వే రాజు హకోన్ సందర్శించారట. 1946లో ద్వీపం నుండి ధ్వంసమైన ఓడ సాండా పేరునే ఈ దీవికి పెట్టారు. ఈ ద్వీపం అనేక సంవత్సరాల్లో అనేక మంది యజమానుల చేతుల్లో ఉంది. వీరిలో స్కాటిష్ గాయకుడు, రాక్ బ్యాండ్ క్రీమ్కు చెందిన జాక్ బ్రూస్ ప్రముఖుడు. ప్రాపర్టీస్ ఏజెన్సీ నైట్ ఫ్రాంక్ సమాచారం ప్రకారం ఈ దీవిలో ఏడు ఇళ్లు, బీచ్, పబ్తోపాటు హెలికాప్టర్ దిగడానికి వీలుగా హెలిప్యాడ్ కూడా ఉంది. పక్కనే రెండు మరింత చిన్న దీవులు కూడా ఉన్నాయి. సాండా కొనుగోలు చేసినవారు ఈరెండు దీవులను కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్ హౌజ్ కూడా ఉందని సంస్థకు చెందిన స్టీవర్ట్-మూర్ ప్రకటించారు.ఇంకో విశేషంగా ఏమిటంటే ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్ కూడా ఉంది. అందులో బ్లాక్ ఫేస్ 55 గొర్రెలు కూడా ఉన్నాయట. వన్యప్రాణులతో పాటు పశువులకు కూడా ఈ దీవి ఆవాసం. పఫిన్లు, కిట్టివాక్లు, కార్మోరెంట్లు, షాగ్లు, రేజర్బిల్స్, మరెన్నో పక్షులను ఇక్కడ వీక్షించవచ్చు.ఉత్తర ఐర్లాండ్ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చు. ఉత్తర ఐర్లాండ్ లోని క్యాంపెల్ టౌన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. దీని 31 మిలియన్ పౌండ్లు అంటే 26 కోట్ల రూపాయలు మాత్రమే.దీంతో కొనుగోలు ఇప్పటికే క్యూకట్టినట్టు నైట్ ఫ్రాంక్ తెలిపింది. -
లగ్జరీ బంగ్లాను విక్రయించిన ఇషా అంబానీ? ఎవరు కొన్నారు?
రిలయన్స్ అధినేత ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రిలయన్స్ రీటైల్ వ్యాపారాన్ని విజయ వంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా వ్యాపారంలో రాణిస్తోంది. తాజాగా ఇషా, భర్త ఆనంద్ పిరమల్ ఇంటికి సంబంధించి ఒక ముఖ్య సమాచారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఇషా ఖరీదైన ఇంటిని ప్రముఖ హాలీవుడ్ జంట కొనుగోలు చేసిందట. ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, ఈ డీల్ మాత్రం హాట్ టాపిక్గా నిలిచింది. ఇషా-ఆనంద్ పిరమల్ లాస్ ఎంజేల్స్లోని విలాసవంతమైన భవనాన్ని విక్రయించినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ టాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ బెన్ అఫ్లెక్ జంట కొనుగోలు చేసిందట. 38వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇంటిని 'క్వీన్ ఆఫ్ డ్యాన్స్' జెలో,బెన్ దంపతులు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇందులో 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు ఉన్నాయి. ప్రత్యేక జిమ్లు, స్పాలు, సెలూన్లు, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ లాంటి స్పెషల్ వసతులు కూడా లగ్జరీ హౌస్లో కొలువు దీరాయి. దాదాపు 61 మిలియన్ డాలర్ల (రూ. 508కోట్లు) ఇంటిని కొనుగోలు చేశారని కూడా ఇన్స్టా ఫ్యాన్ పేజీ నివేదించింది. కాగా ఇషాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందే అని చెప్పవచ్చు. ఇషా గర్భంతో ఉన్నపుడు తల్లి నీతాతో కలిసి ఆ ఇంట్లోనే గడిపింది. ఇద్దరు పిల్లలకు ఈ ఇంట్లోనే జన్మనిచ్చింది. అయితే ఈ ఇల్లు విక్రయించడానికి గల కారణాలు ఏంటి అనేదానిపై స్పష్టత లేదు. -
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
మూలధన లాభం రూ. 2 కోట్ల లోపు ఉంటే..
మీరు స్థిరాస్తి అమ్మే విషయంలో లాభం .. అంటే దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 2 కోట్ల లోపల ఉంటే ఏం చేయాలి .. ఎలా చేయాలి అనేది ఈ వారం తెలుసుకుందాం. 1. ఇల్లు అమ్మినప్పుడు ఈ లాభం ఏర్పడాలి. 2. మినహాయింపు జీవితంలో ఒకసారే ఇస్తారు. 3. ఇల్లు ఇండియాలోనే కొనాలి. 4. ఒక ఇంటికి బదులుగా రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. 5. ఇల్లు కొనడం .. కట్టించడం, ఒక ఇల్లు కొని మరో ఇల్లు కట్టించడం.. రెండూ కొనడం లేదా రెండూ కట్టించుకోవడం చేయొచ్చు. 6. 2019 ఏప్రిల్ 1 తర్వాతనే ఈ నియమం వర్తిస్తుంది. మిగతా షరతులు గతంలో చెప్పినట్లే వర్తిస్తాయి. కొన్ని ఉదాహరణలు గమనించండి.. 1. ముత్యాలరావుగారికి ముచ్చటగా రూ. 3 కోట్లు లాభం వచి్చంది. విశాఖపట్నంలో రెండు ఇళ్లు కొన్నారు. లాభం రూ. 2 కోట్లు దాటింది కాబట్టి ఒక ఇంటి మీదే మినహాయింపు. 2. ఇదే ముత్యాలరావుగారికి లాభం ఒక కోటి తొంభై లక్షలు వచి్చందనుకోండి.. లాభం రూ. 2 కోట్లు దాటలేదు రెండింటి మీద మినహాయింపు ఇస్తారు. 3. నారాయణరావుగారికి లాభాలు రూ. ఒక కోటి తొంభై ఐదు లక్షలు వచి్చంది. ముగ్గురు పిల్లలకని మూడు ఫ్లాట్లు.. ఒక్కొక్కటి రూ. 65,00,000 చొప్పున కొన్నారు. కానీ, రెండు ఫ్లాట్లకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. 4. సుందరరావుగారికి అంతే లాభం వచ్చింది. ఒకోటి రూ. 80 లక్షలు చొప్పున రెండు ఫ్లాట్లు కొని, మిగతా మొత్తంతో బాండ్లు కొన్నారు. వీరికి రెండు ఫ్లాట్లు కొన్నందుకు మినహాయింపు, అలాగే బాండ్లలో ఇన్వెస్ట్ చేసినందుకు కూడా మినహాయింపు వస్తుంది. 5. సత్యమూర్తిగారికి వచి్చన లాభం రూ. 2.60 కోట్లు. రెండు ఇళ్లు కొన్నారు. ఒకటి రూ. 1.50 కోట్లు, మరొకటి రూ. 90 లక్షలు. మిగతా రూ. 20 లక్షలు పెట్టి బాండ్లు కొన్నారు. మొదటి ఇంటికి, బాండ్లకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. 6. సీతయ్యగారికి లాభం కోటి అరవై లక్షలు వచి్చంది. కానీ ఆయన కొన్న రెండు ఇళ్ల విలువ రెండు కోట్లు దాటింది. అతనికి మినహాయింపు ఉంటుంది. అదనంగా వెచి్చంచిన మొత్తానికి ‘సోర్స్’ ఉండాలి. 7. కాంతారావుగారికి కూడా కోటి అరవై లక్షల లాభం వచి్చంది. కానీ, తాను కొన్న రెండు ఇళ్ళ విలువ కోటి యాభై లక్షలు దాటలేదు. రూ. 10 లక్షలు పన్నుకి గురి అవుతుంది. సత్యమూర్తిగారిలాగా బాండ్లు కొనుక్కోవచ్చు లేదా పన్ను చెల్లించాలి. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయితే, జాగ్రత్తలు ఏమిటంటే .. 1. గత వారం చెప్పిన నియమాలు వర్తిస్తాయి. 2. అన్ని కాగితాలు జాగ్రత్త. 3. బ్లాక్ వ్యవహారాలు వద్దు. 4. మీ బ్యాంకు అకౌంట్లలోనే వ్యవహారాలు చేయండి. 5. మీ కుటుంబసభ్యులను ఇన్వాల్వ్ చేసి ఎటువంటి మినహాయింపు కోసం ప్రయత్నించకండి. ఉదాహరణకు రూ. 2 కోట్ల లాభం మీకు చూపించటానికి ప్రతిఫలం వేరే సభ్యుల అకౌంట్లలోనో జమ చేయించకండి. 6. టీడీఎస్ విషయం ఫాలో అవ్వండి. 7. రిటర్నులు సక్రమంగా వేయండి. 8. రెండు ఇళ్లు మీరు కొంటే.. మీరు ఉంటారా లేక అద్దెకిస్తారా ఆలోచించుకోండి. 9. అవసరం అయితే వృత్తి నిపుణులను సంప్రదించండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
రేపటి నుంచి బిగ్ అప్గ్రేడ్ సేల్ ప్రారంభం
ఫ్లిప్కార్ట్ బిగ్ అప్గ్రేడ్ సేల్ ఈనెల 9 నుంచి ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈవెంట్కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ప్రత్యేక్షమైంది. వారం రోజుల పాటు సాగే ఈ సేల్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్లో భాగంగా పలు ప్రముఖ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫ్లిఫ్కార్ట్ అధికారిక సైట్ బిగ్ అప్డేట్ సేల్ పేజ్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఐఫోన్ 15 ఈ సేల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ హాట్ డివైజ్ ప్రస్తుతం రూ.72,999కి లభించనుంది. ఇదీ చదవండి: బంగారం ధర ఆల్టైమ్హైకు చేరనుందా..? ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, రియల్మి 12 ప్రొ+, వివో టీ2 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ, మోటో జీ34 5జీ, రెడ్మి 12, పోకో ఎం6 ప్రొ, రియల్మి సీ53, పోకో ఎం6, రెడ్మి 13సీ, పోకో సీ51, మోటో జీ54, రియల్మి 11ఎక్స్ వంటి ఫోన్లపైనా ఫ్లిప్కార్ట్ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి?
ఈనెల 22న అయోధ్యలో నూతన రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. అదేరోజున రామాలయంలోని గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య.. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఆవిర్భవించనుంది. రామాలయం ప్రారంభోత్సవం నేపధ్యంలో ఈ ప్రాంతంలో భారీగా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడి భూముల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.. అయోధ్యలో భూములను కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ కంపెనీ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ ద్వారా అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఒక ప్లాట్ను కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ సెవెన్ స్టార్ మల్టీ పర్పస్ ఎన్క్లేవ్ ‘ది సరయూ’లో ఉంది. అమితాబ్ కొనుగోలు చేసిన ప్లాట్ సైజు 10 వేల చదరపు అడుగులు. ఇందుకోసం ఆయన రూ.14.5 కోట్లు వెచ్చించారు. అయోధ్యలో ప్లాట్ కొనుగోలుకు సంబంధించి అమితాబ్ ఒక ప్రకటన కూడా చేశారు. ‘అయోధ్య నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన నగరం. అయోధ్యకున్న కాలాతీత ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపద నాలో భావోద్వేగ సంబంధాన్ని సృష్టించాయి. సంప్రదాయం, ఆధునికత కలగలిసిన అయోధ్య ఆత్మలోకి నా హృదయపూర్వక ప్రయాణానికి ఇది నాంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఎదురు చూస్తున్నానని’ అమితాబ్ పేర్కొన్నారు. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా షేర్ చేసిన బ్రోచర్లోని వివరాల ప్రకారం అయోధ్య నగరంలో 1,250 చదరపు అడుగుల భూమి ధర రూ. 1.80 కోట్లు, 1,500 చదరపు అడుగుల స్థలం ధర రూ. 2.35 కోట్లు. 1,750 చదరపు అడుగుల స్థలం ధర రూ. 2.50 కోట్లుగా ఉంది. అమితాబ్ బచ్చన్ ప్లాట్ను కొనుగోలు చేసిన ప్రదేశానికి 10 నిమిషాల దూరంలో రామాలయం, 20 నిమిషాల దూరంలో అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. సరయూ నది రెండు నిముషాల ప్రయాణ దూరంలో ఉంది. ఇది కూడా చదవండి: నేటి నుంచి ‘ప్రాణప్రతిష్ఠ’ ముందస్తు ఆచారాలు ప్రారంభం! -
‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం!
ఏటా దీపావళి సీజన్లో మద్యం విక్రయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళికి కొద్ది రోజుల ముందు నుంచే మద్యం విక్రయాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. దీపావళి సీజన్లో అత్యధిక మద్యం విక్రయాల కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి సందర్భంగా గత శుక్రవారం నుంచి ఆదివారం వరకు రూ.121 కోట్ల విలువైన 64 లక్షల మద్యం బాటిళ్లను వినియోగదారులు కొనుగోలు చేశారని సమాచారం. అదే సమయంలో దీపావళి పండుగకు వారం రోజుల ముందు కోటికి పైగా మద్యం బాటిళ్లు విక్రయించగా, ప్రభుత్వానికి రూ.234.15 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే దీపావళికి ముందు 17 రోజుల్లో మొత్తం 3 కోట్లకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోవడంతో ప్రభుత్వానికి రూ.525.84 కోట్ల ఆదాయం సమకూరింది. దీపావళి, హోలీ తదితర పండుగల సమయంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మద్యం దుకాణాల్లో గురువారం రూ. 17.33 లక్షలు, శుక్రవారం రూ. 18.89 లక్షలు, శనివారం 27.89 లక్షల రూపాయాల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే 64 లక్షలకు పైగా మద్యం బాటిళ్లు అమ్ముడుపోయి, ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం రూ.120.92 కోట్ల ఆదాయం అందింది. అయితే దీపావళి నాడు కొన్ని చోట్ల మద్యం దుకాణాలను మూసివేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దీపావళి సందర్భంగా 42 శాతం అధికంగా మద్యం బాటిళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దీపావళికి మూడు రోజుల ముందు వరుసగా 13.46 లక్షలు, 15 లక్షలు, 19.39 లక్షల మద్యం బాటిళ్లు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి! -
ఆన్లైన్లో ఏవి ఎక్కువ కొంటున్నారంటే..
పండుగ సీజన్లో ఈకామర్స్ ప్లాట్ఫామ్లు ఆఫర్లు ప్రకటించాయి. అయితే కొందరు వారి ఆర్థికస్థోమత తగినట్లు ఆయా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కొన్నిసార్లు కొనే వస్తువులకు సరిపడా డబ్బు లేకపోయినా అప్పుచేసి మరీ వాటిని తీసుకుంటాం. అయితే కొంచెం ఆలస్యం అయినా ఎక్కువ మంది భారతీయులు ప్రీమియం వస్తువులనే తీసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే అందులో అధికంగా డిమాండ్ ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. ఆఫర్ సీజన్లో మొబైల్ ఫోన్ల కొనుగోళ్లకు ప్రత్యేకస్థానం ఉంది. అయితే ఈసారీ దాని ప్రస్థానం కొనసాగుతుంది. ప్రస్తుతం ఫ్యాషన్ వస్తువులు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. రెండు వర్గాలలోనూ ప్రీమియం ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023లో భాగంగా ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ ద్వారా ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ దశలో సేల్ ప్రారంభమైన మొదటి గంటలో సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారు. మొదటి 48 గంటల్లో విక్రయించిన ప్రతి ఐదు స్మార్ట్ఫోన్లలో నాలుగు 5జీ మోడళ్లు అని సర్వే తెలిపింది. ప్రీమియం స్మార్ట్ఫోన్లు గత ఏడాదితో పోలిస్తే 3 రెట్లు వృద్ధిని సాధించాయి. ల్యాప్టాప్లు కూడా గత సంవత్సరంతో పోలిస్తే 40శాతం అధికంగా అమ్ముడయ్యాయి. ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ల విభాగంలో ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది బిగ్ బిలియన్ డేస్ సేల్తో పోలిస్తే ప్రీమియం స్మార్ట్ఫోన్ సెగ్మెంట్ 1.7 రెట్లు పెరిగింది. పండగ సీజన్ అమ్మకాల్లో భాగంగా 15లక్షల ఐఫోన్లను విక్రయించారు. ధరల తగ్గింపు, ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా అన్ని విభాగాల్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు తెలిసింది. -
నాడు నోటుకు ఓటు..నేడు నోట్లకు సీట్లు
సాక్షి, సిద్దిపేట: ‘టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నాడు నోటుకు ఓటు విషయంలో ప్రసిద్ధి అయితే.. నేడు కాంగ్రెస్ నోట్లకు సీట్లను అమ్ముకుంటోందని గాందీభవన్లో మాట్లాడుతున్నారు’అని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇలాంటి వాళ్లకు అధికారం అప్ప గిస్తే రాష్ట్రాన్ని కూడా అమ్ముతారని ఆరోపించారు. సిద్దిపేటలో మంగళవారం సీఎం సభ జరగనున్న సందర్భంగా సోమవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, బీఫారాల అందజేత, ప్రచారంలో ముందున్నాం రేపు సీట్లు గెలుపొందడంలో కూడా ముందే ఉంటామన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయని, ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో వారు ఉన్నారని తెలిపారు. తమ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీయే తమ పథకాలను కాపీ కొట్టిందని హరీశ్ ఆరోపించారు. రైతు బంధు, పెన్షన్లను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దే అని గుర్తు చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు నాయకులే లేరని మంత్రి ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచి్చన స్క్రిప్ట్ చదువుతుండటంతో కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ నవ్వుల పాలవుతున్నారన్నారు. -
లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాట్ సేల్, ధర ఎంతంటే?
జర్మనీ లగ్జరీ కార్ మేకర్ బీఎండబ్ల్యూ ఇండియా కొత్తరు కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. BMW iX1 ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఇండియాలో ఆవిష్కరించింది. ఫుల్లీ ఎలక్ట్రిక్ BMW iX1 బుకింగ్లు ప్రత్యేకంగా ఆన్లైన్లో తీసుకొచ్చింది. బుకింగ్స్ అలా మొదలు పెట్టిందో లేదో విపరీతమైన డిమాండ్ను నమోదు చేసింది. ఈ హాల్ సేల్లో ఇప్పటికే 2023కి సంబంధించిన మొత్తం యూనిట్లు అందుకుంది. రూ. 66.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో తీసుకొచ్చిన ఈ ఎస్యూవీ డెలివరీలో అక్టోబర్లో ప్రారంభం. లాంచింగ్ రోజే iX1 SUVకి ‘అసాధారణ స్పందన రావడం థ్రిల్లింగ్గా ఉందంటూ BMW ప్రెసిడెంట్ విక్రమ్ పవా సంతోషం ప్రకటించారు. తమకు ఇండియాలో iX1కి గొప్ప అరంగేట్రం అని పేర్కొన్నారు. కానీ ఎన్ని యూనిట్లు సేల్ అయిందీ కచ్చితమైన వివరాలు అందించలేదు. డిజైన్ పరంగా, iX1 ఒక విభిన్నమైన 'I' ఎలక్ట్రిక్ గుర్తింపు,అడాప్టివ్ LED హెడ్లైట్లు LED హెడ్ల్యాంప్లు రన్నింగ్ బోర్డ్లతో పాటు ముందు మరియు వెనుక బంపర్లో బ్లూ యాక్సెంట్లతో దాదాపు చతురస్రాకారంలో గ్రిల్ను అమర్చింది. iX1 66.4kWh బ్యాటరీ ప్యాక్, 80 kms/hr గరిష్ట వేగంతో 5.6సెకన్లలో 100 కి.మీటర్ల వరకు తక్షణ వేగవంతం అందుకుంటుంది. ఇది 313 హెచ్పి పవర్ను గరిష్టంగా 494 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. దాదాపు 6.3 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. ఆల్ఫ్లైన్ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ , స్టార్మ్ బే అనే నాలుగు రంగుల్లో లభ్యం. 10.7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను పొందుతుంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో ఎమ్ స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్లతో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైట్ని కలిగి ఉంది. అలాగే డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్రూఫ్, పవర్ టెయిల్గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్రెస్ట్ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
భారీ తగ్గింపు: రూ. 48,900లకే ఐఫోన్ 15 దక్కించుకునే చాన్స్
యాపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్. అమెరికా దిగ్గజం యాపిల్ లాంచ్ చేసిన లేటెస్ట్ ఐఫోన్ల 15 సిరీస్పై భారీ డిస్కౌంట్ లభించనుంది. Apple iPhone 15పై అమెజాన్ , Flipkartలో రూ.60,000 వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. ఇప్పటికే ప్రీ బుకింగ్లనుమొదలైన సంగతి తెలిసిందే.ఐఫోన్ 15 సెప్టెంబర్ 22 నుండి తొలి సేల్. అలాగే షిప్పింగ్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం. యూజర్లు Apple India వెబ్సైట్లో అలాగే ఢిల్లీ, ముంబైలోని రిటైల్ అవుట్లెట్లలో ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను యాక్సెస్ చేయవచ్చు. HDFC బ్యాంక్ కార్డ్ని ఉపయోగించి వారి వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ. 6,000 వరకు తక్షణ తగ్గింపు లభ్యం. యాపిల్ దేశంలో తన తాజా ఉత్పత్తులపై వరుస డిస్కౌంట్లను ప్రకటించింది. iPhone 15 ఇప్పుడు రూ. 74,900 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 79,900.అలాగే రూ. 89,900 నుంచి దిగి వచ్చిన iPhone 15 Plus రూ. 84,900 వద్ద అందుబాటులో ఉంది. ఇక ఐఫోన్ 15 ప్రో రూ. 128,900కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 1,34,900. iPhone 15 Pro Maxని రూ. 153,900కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు రూ. 159,900. (ఎన్ఆర్ఐలకు ఎస్బీఐ గుడ్ న్యూస్:యోనో యాప్తో ఈజీగా) తాజా నివేదికల ప్రకారం, అమెజాన్లో iPhone 15 ప్రీ-ఆర్డర్లో రూ. 89,900 నుంచి షురూ అవుతాయి. డిస్కౌంట్ తర్వాత, ఐఫోన్ 15 ఫ్లిప్కార్ట్లో రూ. 79,900 నుండి ప్రారంభం అయితే, ఈ సమయంలో వెబ్సైట్లో అన్ని మోడల్లు స్టాక్లో లేవు. ఎంపిక చేసిన HDFC కార్డ్ల ద్వారా వినియోగదారులు రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. (ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్...భయంకర పోరాటం: చివరికి ఇలా..!) మీదగ్గర iPhone 12 ట్రేడ్-ఇన్ ఆఫర్లో భాగంగా రూ. 20,000 అదనపు తగ్గింపు. ఈ డిస్కౌంట్ రావాలంటే ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. దీనికి అదనంగా రూ.6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. ఈ రెండు ఆఫర్లు వర్తించినతరువాత ఐఫోన్ 15 ధర రూ. 48,900కి పడిపోతుంది.ఈ తాజా ఆఫర్ సెప్టెంబర్ 22 నుండి అందుబాటులో ఉంటుంది. మీకు iPhone 12 లేకపోయినా డోంట్వర్రీ. మీ iPhone లేదా Android స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా Cashifyలో లేదా iStore అధికారిక వెబ్సైట్లో తగ్గింపు పొందవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ ఫోన్ వయస్సు ,పరిస్థితిని బట్టి వినియోగదారులు రూ.2వేల రూ.67,800 వరకు ధర దిగి వస్తుంది. (Disclaimer: తాజా iPhone 15 స్మార్ట్ఫోన్పై ఉత్తమమైన డీల్స్కోసం ఆయా ప్లాట్ఫారమ్లలో అన్ని డిస్కౌంట్లు అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్లను చెక్ చేసుకోవడం ఉత్తమం) -
ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి!
Disney India: అమెరికన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'డిస్నీ' (Disney) ఇండియన్ మార్కెట్లో తన వ్యాపారానికి సంబంధించిన ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే భారతదేశంలో డిస్నీ ఒక ప్రముఖ కంపెనీ సొంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముందు వరుసలో రిలయన్స్.. నివేదికల ప్రకారం.. డిస్నీ ఇండియాను ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ కొనుగోలు చేయనున్నట్లు.. ఈ వరుసలో ఇదే ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ డిస్నీని సొంతం చేసుకుంటే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో సరైన కొనుగోలుదారు లభిస్తే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ వంటి వాటిని ఒకేసారి విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ IPLకి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ కోల్పోయింది. ఈ హక్కులను రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది. దీంతో భారతదేశంలో ఈ బిజినెస్ మరింత డెవలప్ చేయడానికి కంపెనీ అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. ఇదీ చదవండి: వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. డిస్నీ ఇండియా వ్యాపారానికి సమందించిన చర్చలు ఇప్పటికే జరుపుతున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. కాగా ఈ చర్చలు డీల్ వరకు వెళ్లే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. అంతే కాకుండా ప్రస్తుతం ఐపీఎల్ స్ట్రీమింగ్తో జియో టీవీకి సబ్స్క్రైబర్స్ సంఖ్య భారీగా పెరిగింది. ఈ సమయంలో డిస్నీ ఇండియాను రిలయన్స్ సొంతం చేసుకుంటే.. ఈ రంగంలో కూడా అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. -
ఇలా అమ్ముకోండి.. అలా కొనుక్కోండి
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లు, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ముగిసిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో)లు కరెంటును నేరుగా ఎవరికైనా అమ్ముకొనే అవకాశం కల్పించింది. ఏదైనా జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినప్పుడు డిస్కంలతో పీపీఏ కుదర్చుకుంటుంది. ఇది సాధారణంగా 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ ఒప్పందం గడువు ముగిసిన తరువాత కూడా డిస్కంలు అదే రేటుకి అదే జెన్కో ద్వారా విద్యుత్ను తీసుకునే వెసులుబాటు ఇప్పటివరకూ ఉంది. ఇప్పుడు కేంద్రం ఈ వెసులుబాటు లేకుండా చేసింది. గడువు ముగిసిన తరువాత కూడా అదే రేటుకి కొంటే జెన్కోలకు నష్టం వాటిల్లుతుందన్నది కేంద్రం చెబుతున్న కారణం. దీంతో జెన్కోలు పీపీఏల గడువు ముగిసిన తరువాత ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్ (ఐఈఎక్స్)లోగానీ, ఎక్కువ ధర ఇచ్చే డిస్కంలకు గానీ విద్యుత్ను విక్రయించుకోవచ్చు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటును పీపీఏలు ముగిసిన తరువాత విక్రయించేందుకు సెంట్రల్ పూల్ విధానాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చింది. కేంద్రానికి చెందిన పదహారు ప్లాంట్లలో విద్యుత్ను డిస్కంలు ముందస్తు దరఖాస్తు ద్వారా కొనుక్కొనే అవకాశం కలి్పంచింది. కొనుగోలు ఒప్పందాన్ని కూడా ఐదేళ్లకు పరిమితం చేసింది. పీపీఏలు చేసుకోగా మిగిలిన విద్యుత్ను ఐఈఎక్స్లో విక్రయిస్తారు. అంతా ఐఈఎక్స్లోనే విద్యుత్ను అమ్మాలన్నా, కొనాలన్నా ఇప్పుడు జెన్కోలు, డిస్కంలకు ఉన్న ప్రధాన మార్కెట్ ఇండియన్ ఎనర్జీ ఎక్సే్ఛంజ్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనుమతితో 2008 జూన్ 27న ప్రారంభమైన ఐఈఎక్స్ 2017లో స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీగా మారింది. అప్పటినుంచి విద్యుత్ క్రయ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 55కు పైగా విద్యుత్ పంపిణీ సంస్థలు, 600కుపైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 1800కుపైగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, 4,600కు పైగా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఐఈఎక్స్లో చేరాయి. గత నెలలో ఐఈఎక్స్లో 8,469 మిలియన్ యూనిట్ల లావాదేవీలు జరిగాయి. యూనిట్ సగటు ధర రూ.6.89గా ఉంది. బహిరంగ మార్కెట్లో విద్యుత్ లావాదేవీలకు జెన్కోలు, డిస్కంల నుంచి గరిష్టంగా యూనిట్కు 2 పైసలు రుసుమును (ఐఈఎక్స్) వసూలు చేస్తోంది. -
బైజూస్ సరికొత్త ప్లాన్స్: విదేశీ విభాగాల విక్రయంలో
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్ 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,956 కోట్లు) రుణ మొత్తాన్ని పూర్తిగా చెల్లించేసే ప్రయత్నాల్లో ఉంది. ఆరు నెలల్లోపు తిరిగి చెల్లించేందుకు యోచిస్తోంది. తదుపరి మూడు నెలల్లో 300 మిలియన్ల డాలర్లను తిరిగి చెల్లించాలన్న ప్రతిపాదనను ప్రతిపాదనకు రుణదాతలు ఆమోదించడంతో సంస్థకు కొంత ఊరటనివ్వనుంది. (ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!) ఇందులో భాగంగా విదేశీ విభాగాలైన ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ సంస్థలను విక్రయించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రెండింటి విక్రయంతో దాదాపు 800 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు సమకూర్చుకోవచ్చని బైజూస్ భావిస్తున్నట్లు వివరించాయి. అలాగే వాటాల విక్రయం ద్వారా తాజాగా మరిన్ని పెట్టుబడులు కూడా సమీకరించడంపైనా కంపెనీ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్బీ) మొత్తం మీద ఆరు నెలల వ్యవధిలో తీర్చేయొచ్చని బైజూస్ ఆశిస్తోంది. 2021 నవంబర్లో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి బైజూస్ ఈ రుణాన్ని తీసుకుంది. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ) -
తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా?
కొన్ని రోజుల క్రితం పాముల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషాన్ని సేకరించడం కోసమే వాటిని పెంచుతారు. ఇప్పుడు తాజాగా తేళ్ల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక గదిలో తేళ్లను పెంచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. నిజానికి తేలు కరిస్తే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. తేలు విషం ప్రాణాంతకం. అందుకే ఎవరైనాసరే తేళ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఒకేచోట కొన్ని వేల తేళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తేళ్లను ప్రత్యేక అరలలో ఉంచి పెంచుతుండటం కనిపిస్తుంది. వాటికి ఆహారం వేయడాన్ని కూడా చూడవచ్చు. తేళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాలమీదకు వస్తుంది. ఇంతకీ తేళ్లను ఎందుకు పెంచుతారు? వీటి వలన ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఔషధాల తయారీ తేళ్లను రెండు ప్రయోజనాల కోసం పెంచుతారు. మనిషిని చంపగల తేలు విషాన్ని అనేక రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తేలు విషాన్ని క్యాన్సర్తో సహా అనేక ప్రాణాంతక వ్యాధులలో వినియోగిస్తారు. వాటి విషాన్ని ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. పలు దేశాలలో తేళ్లను తింటారు. కాగా ఒక్కో తేలు ప్రతిరోజూ 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని తేళ్ల పెంపకందారులు ఎంతో జాగ్రత్తగా సేకరిస్తారు. తేలు విషం లీటరు ధర 10 మిలియన్ డాలర్లు (రూ. 74 కోట్ల 15 లక్షలు) తేలు విషాన్ని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు కొన్ని మిలియన్ల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు Did you know? Scorpions farms do exist. Each scorpion produces about 2 milligrams of venom daily, which is milked using a pair of tweezers and tongs. A liter is worth $10 million, used for cosmetics and medicines [📹 King Scorpion / efre812]pic.twitter.com/PGdbpdpG8h — Massimo (@Rainmaker1973) September 2, 2023 -
ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. అయితే ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. అతని తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ ) ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ శాంతికి మద్దతు ప్రకటిస్తున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న పని చూస్తుంటే గర్వంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం చాలా గొప్పది.. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద, స్టేటస్ ఏది ఉండదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ని రోజులు నాకోసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాకు లేకుండా పోతోంది.. కానీ ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. (ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!) View this post on Instagram A post shared by Jabardasth Shanthi Swaroop (@jabardasthshanti) -
ఎయిరిండియా ఆఫర్: రూ. 1471లకే విమానం ఎక్కేయొచ్చు!
AirIndia Sale: గతవారం ఎయిర్క్రాఫ్ట్ లివరీ, కొత్త బ్రాండింగ్ తరువాత టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా తన ప్యాసింజర్ల కోసం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో ప్రయాణిలకు ఆకర్షణీయమైన ఛార్జీలతో విమాన టికెట్లను అందిస్తోంది. తాజా ప్రకటన ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎకానమీ విమాన టికెట్ల ఛార్జీలు రూ. 1470, బిజినెస్ క్లాస్ ఛార్జీలు రూ.10.130 లనుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాలకు ఆకర్షణీయమైన ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా ఎంపిక చేసిన ప్రాంతాల ఎకానమీ క్లాస్ టికెట్లు (అన్నీ ఛార్జీలు కలిపి) రూ.1470, బిజినెస్ క్లాస్కు రూ.10,130 నుండి ప్రారంభమవుతాయి. ఆగస్టు 20వరకు అందుబాటులో ఉండే నాలుగు రోజుల సేల్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ప్రయాణించవచ్చు. ఎయిరిండియా వెబ్సైట్, మొబైల్ యాప్తో పాటు, అధీకృత ట్రావెల్ ఏజెంట్లు , ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్లు చేయవచ్చు. పరిమిత సీట్లు, పరిమిత కాలఆఫర్గా అందిస్తున్న ఈసేల్లో టికెట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్సర్వ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటాయని ఎయిరిండియా తెలిపింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు సంబంధించి ఎయిరిండియా విమాన టికెట్ చార్జ్ కేవలం రూ.1931గా ఉంటుంది.ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా సర్వీస్ ఛార్జ్ లేకుండా బుకింగ్ చేసుకోవచ్చు. వెబ్సైట్,మొబైల్ యాప్తో పాటు నేరుగా అధీకృత ట్రావెల్ ఏజెంట్లు,ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల (OTAలు) ద్వారా కూడా విక్రయం కింద బుకింగ్లు చేసుకోవచ్చు. కాగా ఎయిరిండియా తొలి ఎయిర్బస్ A350 కొత్త లైవరీలో విమానాల్లోకి ప్రవేశించినఅనంతరం డిసెంబర్ 2023 నుండి ప్రయాణికులు తమ ప్రయాణంలో కొత్త లోగోను చూడొచ్చని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. రెడ్, గోల్డెన్, పర్పుల్ రంగులతో కూడిన కొత్త లోగో ఎయిర్లైన్ భవిష్యత్తు దృక్పథాన్ని సూచిస్తుందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. -
అమ్మకానికి ఎల్&టి మెట్రోరైల్ భూములు?
-
నాడు కుక్క మాంసంపై నిషేధం.. నేడు ఎత్తివేత.. మధ్యలో ఏం జరిగింది?
రాష్ట్రంలో కుక్క మాంసం అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ను గౌహతి హైకోర్టు ఆమధ్య రద్దు చేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2011పై ఈ సందర్భంగా పలు ప్రశ్నలు లేవనెత్తింది. కుక్క మాంసం అమ్మకాల నిషేధం వెనుక.. నాగాలాండ్ ప్రభుత్వం2020, జూలై 4న కుక్క మాంసాన్ని నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేశారు. కుక్క మాంసం కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు. నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం వాణిజ్య, రెస్టారెంట్లు వంటి ప్రదేశాలలో కూడా కుక్క మాంసం అమ్మకాలను నిషేధించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ 2014 సర్క్యులర్ను అనుసరించి నాగాలాండ్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లో పేర్కొన్న జంతువులు మినగా ఇతర జాతుల జంతువులను వధించడాన్ని నిషేధించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్, 2011లోని రూల్ 2.5.1(a)లోని వివరాల ప్రకారం గొర్రెలు, మేకలు, పందులు,పౌల్ట్రీ, చేపలను ఆహారంగా భావించి, వాటిని వధించేందుకు అనుమతి కల్పించారు. ‘ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ హైకోర్టులో జస్టిస్ మార్లీ వాన్కుంగ్ సింగిల్ జడ్జి ధర్మాసనం కేసును విచారిస్తూ ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ- 2011లో కుక్క పేరు చేర్చకపోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎందుకంటే ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కుక్క మాంసం కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో దాని పేరును జాబితాలో చేర్చకపోవడం ఊహకు అతీతమేమీ కాదని వివరించింది. కుక్క మాంసం అంటే ఎంతో ఇష్టం నాగా ప్రాంతాల్లో నేటికీ కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటున్నారని, ఇది శతాబ్దాలుగా కొనసాగుతోందని హైకోర్టు పేర్కొంది. ది అంగామి నాగాస్, ది ఏఓ నాగాస్ ది రెంగ్మా నాగాస్ తదితర పుస్తకాలు, వివిధ పత్రాలను పరిశీలిస్తే నాగాలాండ్లోని వివిధ గిరిజన సమూహాలలో కుక్క మాంసం వినియోగం శతాబ్దాలుగా వస్తున్నదని హైకోర్టు పేర్కొంది. ‘కుక్కలను హింసిస్తున్నారు’ విచారణ సందర్భంగా యానిమల్స్ అండ్ హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్/ఇండియా తరఫు న్యాయవాది తన వాదనలో కుక్కలను స్మగ్లింగ్ చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నదన్నారు. కుక్కల కాళ్లకు తాడు కట్టి, దాని నోటికి కూడా తాడు కట్టి గోనె సంచిలో వేస్తారని పేర్కొన్నారు. వీటికి రోజుల తరబడి ఆహారం, నీరు ఇవ్వరని ఆరోపించారు. ఇది జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించడం కిందకు వస్తుందన్నారు. అయితే తాము కుక్క మాంసంపై నిషేధం విధించడాన్ని సమర్థించలేదని హైకోర్టు ముందు విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు జంతువులపై క్రూరత్వానికి సంబంధించిన కేసుల్లో ఐపీసీని ఆశ్రయించవచ్చని తెలిపింది. ఇది కూడా చదవండి: బజరంగ్ దళ్ ఎప్పుడు, ఎలా ఆవిర్భవించింది? కాంగ్రెస్తో దీనికి కనెక్షన్ ఏమిటి? -
ట్రైన్ లో వాటర్ బాటిల్ కొంటున్నారా..ఇది మీ కోసమే
-
అసైన్డ్ భూములను లాక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఈ ప్రభుత్వం లాక్కుంటోందని సీఎల్పి నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రామాల్లో శ్మశానవాటికలు, ఇతర అవసరాలకు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ, పారిశ్రామికవాడల నిర్మాణం కోసం వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అరకొర పరిహారం చెల్లించి తీసుకుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం సేకరించిందన్నారు. ఈ ప్రాంతంలో ఎకరా రూ.4–5 కోట్ల విలువ చేస్తుందన్నారు. బుద్వేల్లో 164 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించిన ప్రభుత్వం ప్లాట్లు వేసి అమ్ముతోందని ఆరోపించారు. అసైన్డ్ భూములు అసైనీల వద్దే ఉండనీయాలని, ధరణిలో వారికి హక్కులు కల్పిం చాలని కోరారు. తెలంగాణ ప్రగతిపై ఆదివారం శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఇటీవల నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం లక్షల మంది ప్రజలు నిరీక్షిస్తున్నారని, ప్రతి గ్రామంలో భూములను సేకరించి ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలని అన్నారు. అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులందరికీ పోడు పట్టాలు అందలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. దీనిపై అధికార బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఉద్యోగాలు లేక కష్టాల్లో యువత.. ఎమ్మెస్సీ, ఎంఏ, బీఈడీ వంటి ఉన్నత చదువులు చదివిన యువత ఉద్యోగాలు లభించక గ్రామాల్లో ఇస్త్రీ షాపులు, సోడా దుకాణాలు నడుపుకుంటూ తీవ్ర ఆవేదనలో ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొనగా, మళ్లీ బీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం కలగజేసుకుని.. ‘భట్టి గారూ..మీరు ఆరు మాసాల పాదయాత్ర మొత్తం చెప్పడానికి సమయం సరిపోదు’అని సూచన చేశారు. అనంతరం భట్టి ప్రసంగం కొనసాగిస్తూ.. వర్సిటీల్లో అధ్యాపకులను భర్తీ చేయాలని, ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు లేక బడులు మూతబడుతున్నాయని, తక్షణమే డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సరే.. కాల్వలు ఏవీ? రాష్ట్రంలో వివిధ కొత్త ప్రాజెక్టులను నిర్మించిన ప్రభుత్వం వాటి కింద కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో నీళ్లు ఉన్నా ఆయకట్టుకు సరఫరా కావడం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు. కాళేశ్వరం కింద కాల్వలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కడెం వంటి పాత ప్రాజెక్టులు, కాల్వల నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపునకు గురి అవుతున్న చెన్నూరు, భూపాలపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ప్రజలకు పునరావాసం కల్పిం చి, పరిహారం చెల్లించాలని కోరారు. గిరిజనబంధు, బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి.. గిరిజనబంధుతో పాటు బీసీలకు సబ్ప్లాన్, మైనారిటీలకు సచార్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్కి 15 కేజీల వరకు తరుగు తీస్తున్నారని, పంట రుణమాఫీ సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయించాలని డిమాండ్ చేశారు. -
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్, ఆఫర్లను అందిస్తోంది అమెజాన్. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే ఈ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా షావోమీ, ఒప్పో, శాంసంగ్ వంటి బ్రాండ్ల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకు ఇప్పుడే కొనుక్కోవచ్చు. ప్రైమ్ సబ్స్క్రైబర్లు కానివారు మాత్రం అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➤ మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై అందుబాటులోకి వచ్చిన బెస్ట్ డీల్స్లో కొన్నింటి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.. ఐఫోన్ 14 (iPhone 14) అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 విక్రయానికి ముందు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా ఐఫోన్ 14 రూ. 67,499లకే అందుబాటులోకి వచ్చింది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్తో కూడిన ఈ ఫోన్ కార్ క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ గత ఏడాది భారత్లో రూ. 79,900 ధరతో లాంచ్ అయింది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎంపికచేసిన మోడల్స్కు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ షావోమీ 12 ప్రో 5జీ (Xiaomi 12 Pro 5G) Snapdragon 8 Gen 1 చిప్సెట్తో వచ్చే షావోమీ 12 ప్రో 5జీ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో భాగంగా తగ్గింపు ధర రూ. 41,999లకే లభిస్తోంది. లాంచింగ్ సమయంలో దీని బేస్ మోడల్ ధర రూ.62,999 ఉండగా తర్వాత రూ.52,999లకు తగ్గింది. కొనుగోలుకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ. 1,250 తగ్గింపు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ.36,000 డిస్కౌంట్ లభించే ఆస్కారం ఉంది. ఐకూ 9 5జీ (iQoo 9 5G) ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉంటే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ సమయంలో ఐకూ 9 5జీ స్మార్ట్ఫోన్ని రూ.29,990లకే కొనుక్కోవచ్చు. భారతదేశంలో ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 42,990. ఈ హ్యాండ్సెట్ 5nm స్నాప్డ్రాగన్ 888+ చిప్సెట్పై పనిచేస్తుంది. 120 వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. మీ ప్రస్తుత ఫోన్ని ఎక్సేంజ్కు ఇస్తే రూ. 26,650 వరకు తగ్గింపు లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ (Samsung Galaxy M33 5G) 6.6-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, Exynos 1280 చిప్సెట్, 5జీ కనెక్టివిటీతో వచ్చే ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ లాంచింగ్ ధర రూ.18,999. ఇది ఇప్పుడు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా రూ.16,999లకే అందుబాటులో ఉంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ.1,000. పాత హ్యాండ్సెట్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.16,100 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. రెడ్మీ 12సీ (Redmi 12C) MediaTek Helio G85 ప్రాసెసర్, 6.72-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్తో వచ్చే ఎంట్రీ లెవల్ రెడ్మీ 12సీ హ్యాండ్సెట్ని ప్రైమ్ ఎర్లీ డీల్స్ సమయంలో రూ.7,699లకే కొనుగోలు చేయవచ్చు. అయితే దీని అసలు లాంచ్ ధర రూ. రూ.8,999. పాత హ్యాండ్సెట్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.7,300 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేస్తోంది: ఫోన్లు, గృహోపకరణాలపై ఆఫర్లే ఆఫర్లు
Flipkart Big Saving Days Sale: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసేల్ను ప్రకటించింది. ఇండిపెండెన్స్డే సేల్కంటే ముందు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ చేయ నుంది. ఆగస్టు 4 నుంచి 9వ తేదీవరకు నిర్వహించే ఈసేల్లో స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్పై తగ్గింపు ధరలను అందించనుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేందు భారీ తగ్గింపులను ప్రకటించనుంది.డిస్కౌంట్లపై అదనపు వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్ తదితర టాప్ దిగ్గజ కంపెనీల స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్ను అందించనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 11 తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం,ఇవి రూ. 68,999 రూ. 41,999కి జాబితా చేయగా, జనాదరణ పొందిన 5జీ స్మార్ట్ఫోన్లపై గణనీయమైన ధరల తగ్గింపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే సేల్లో ఎక్కువ తగ్గింపులను అందిస్తుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) అదేవిధంగా పిక్సెల్ 6ఏ, శాసంగ్ జెడ్ ఫ్లిప్ 3, గూగుల్, నథింగ్, పోకో, ఒప్పో, వివో, రియల్మీ వంటి అనేక ఇతర స్మార్ట్ఫోన్లు కూడా ధర తగ్గింపులను అందుకోనున్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కస్టమర్లు ఐదు శాతం క్యాష్బ్యాక్ను ఆశించవచ్చు.ఐసీఐసీఐ, కోటక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐపై గరిష్టంగా 4,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా?) అలాగే ఫ్యాషన్తోపాటు టీవీలు, ఉపకరణాలు, ఆహారం, పానీయాలు, క్రీడలు & ఫిట్నెస్, కారు & బైక్ ఉపకరణాలు, బేబీ కేర్ ప్రొడక్ట్స్ తదితరాలపై 60 శాతం వరకు భారీ తగ్గింపు పొందవచ్చు . ఇంకా బైక్లు & స్కూటర్లు (ఎలక్ట్రిక్ స్కూటర్లతో సహా) రూ.56,500 నుండి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. టీవీలు, ఇతర గృహోపకరణాలపై 75 శాతం డిస్కౌంట్. స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. -
యాపిల్ ఐఫోన్14పై భారీ తగ్గింపు, ఈ రోజే చివరి రోజు
Flipkart Big Saving Days Sale Apple iPhone 14: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈరోజు (జూలై 19)తో ముగియనుంది. ఈ సేల్ యాపిల్ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. యాపిల్ ఐఫోన్ తక్కువ ధరలో లభిస్తోంది అంటే ఐఫోన్ లవర్స్కు పండగే పండగ. అలాంటి వారు.. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్14ను సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే మంచి తరుణం. వివరాలేంటో చూద్దాం రండి! (యాపిల్ వాచ్ కొత్త ఫీచర్ వచ్చేసింది: క్రానిక్ హార్ట్ కండిషన్ ఈజీ ట్రాక్) ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్లో ఐఫోన్ 14 రూ. 47,501 తగ్గింపు తర్వాత కేవలం రూ. 32.399కి అందుబాటులో ఉంది. ఇంత తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ను కొనుగోలు చేయడానికి అవకాశం నేటితో ముగియనుంది. యాపిల్ ఐఫోన్ 14 రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, యాక్సిస్ బ్యాంక్ , సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , EMI లావాదేవీలపై రూ. 1000 తగ్గింపును పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ.67,999కి తగ్గింది. దీంతోపాటు పాత స్మార్ట్ఫోన్కు బదులుగా ఫ్లిప్కార్ట్ రూ. 35,600 దాకా తగ్గింపు లభిస్తుంది. అలా ఫ్లిప్కార్ట్ సేల్లో రూ. 47,501 తగ్గింపు తర్వాత రూ. 32,399కి లభిస్తుంది. గత ఏడాది చివర్లో లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 14 ఐఫోన్ 13 లానే ఉంది,పెద్దగా అప్డేట్ లేదనే అంచనాల నేపథ్యంలో ప్రారంభ అమ్మకాల సమయంలో పెద్దగా స్పందనను పొందడంలో విఫలమైంది. అయితే ఇటీవలి ఫ్లిప్కార్ట్ సేల్లో ఆదరణ పొందుతోన్నట్టు తెలుస్తోంది. -
షాప్సి యాప్ డౌన్లోడ్లు 20 కోట్లు
బెంగళూరు: ఫ్లిప్కార్ట్కు చెందిన హైపర్ వ్యాల్యూ ప్లాట్ఫామ్ ‘షాప్సి’ మొబైల్ అప్లికేషన్ (యాప్) 20 కోట్ల డౌన్లోడ్ మైలురాయిని అధిగమించినట్టు ప్రకటించింది. ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా మెగా సేల్ను ఈ సంస్థ ఇటీవలే ప్రారంభించింది. ఈ సేల్లో అమ్మకాలు రెండింతలు అధికంగా నమోదయ్యాయని తెలిపింది. (జీల్ ప్రమోటర్లకు శాట్ షాక్ ) చీరలు, పురుషుల టీ షర్ట్లు, కుర్తీలు ఎక్కువగా అమ్ముడుపోయినట్టు వివరించింది. ఈ సంస్థకు మహారాష్ట్ర, యూపీ, పశి్చమబెంగాల్ టాప్–3 మార్కెట్లుగా ఉన్నాయి. 60 శాతం డిమాండ్ టైర్–3 పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపింది. షాప్సి ప్లాట్ఫామ్పై ఆకర్షణీయమైన ధరలకే ఉత్పత్తులు అందుబాటులో ఉండడం, కస్టమర్ అనుకూల ఫీచర్లతో ఈ సంస్థ ఎక్కువ మందికి చేరువ అవుతుండడం గమనార్హం. (ఐటీఆర్ ఫైలింగ్లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) ఇదీ చదవండి: అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్ -
వేదాంతా చేతికి ట్విన్ స్టార్ బిజ్
న్యూఢిల్లీ: సహచర సంస్థ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ లిమిటెడ్ (టీఎస్టీఎల్) నుంచి సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్లను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా లిమిటెడ్ వెల్లడించింది. తద్వారా సమీకృత సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్లు కలిగిన తొలి కంపెనీగా వేదాంతా ఆవిర్భవించనుంది. వేదాంతాకు అల్టిమేట్ హోల్డింగ్ కంపెనీ అయిన టీఎస్టీఎల్.. వోల్కన్ ఇన్వెస్ట్మెంట్స్కు పూర్తి అనుబంధ సంస్థకావడం గమనార్హం! కాగా.. షేర్ల బదిలీ ద్వారా టీఎస్టీఎల్ సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్ యూనిట్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా వెల్లడించింది. దీంతో వేదాంతా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోకు సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ బిజినెస్ జత కలవనున్నాయి. -
డేంజర్: ఇది జరిగితే మీ బ్యాంక్ అకౌంట్ ప్రమాదంలో ఉన్నట్టే..
ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. అమాయక ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు అత్యంత తేలికగా స్కామర్ల చేతికి చేరుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. పలు అక్రమ వైబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, కార్డ్ హోల్డర్ పేర్లు, సీవీవీతో సహా వివరాలను స్కామర్లకు విక్రయిస్తున్నాయి. అదీ కూడా ఒక్కో కార్డు వివరాలు కేవలం 5 యూఎస్ డాలర్లు. అంటే రూ.410లకు మాత్రమే. పశ్చిమ దేశాలలో చెల్లింపులు ప్రాసెస్ చేయడానికి కార్డు వివరాలు ఉంటే సరిపోతుంది. ఓటీపీ అవసరం ఉండదు. అందుకే ఆయా దేశాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కానీ భారత్లో వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) ద్వారా రెండు-కారకాల ప్రామాణీకరణ తప్పనిసరి. అయినప్పటికీ దీన్ని కూడా అధిగమించడానికి స్కామర్లు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఉన్నట్టుండి సిమ్ డీయాక్టివేట్ అయితే.. బాధితుల ఒరిజినల్ సిమ్ను డీయాక్టివేట్ చేయడం ద్వారా స్కామర్లు ఓటీపీని ఎలా యాక్సెస్ చేస్తున్నారో భారతీయ పోలీసు అధికారులను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉటంకిస్తూ పేర్కొంది. హ్యాకర్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలను బాధితుడి పేరు, ఫోన్ నంబర్తో సహా షాడో వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. సైబర్ మోసగాళ్లు ఈ వివరాలను కొనుగోలు చేసి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి బాధితుల సిమ్ కార్డ్ డీయాక్టివేట్ చేయిస్తున్నారు. తర్వాత డూప్లికేట్ సిమ్ పొంది ఓటీపీలను సునాయాసంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. నష్టం జరిగేంత వరకు బాధితుడి ఈ మోసం గురించి తెలియదు. కాబట్టి మీ సిమ్ కార్డ్ ఉన్నట్టుడి డీయాక్టివేట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్ని నిమిషాల్లోనే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ వెబ్సైట్లను నిర్వహిస్తున్నదెవరు? నివేదిక ప్రకారం.. అక్రమ వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్లను రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన హ్యాకర్లు నిర్వహిస్తున్నట్లుగా తేలింది. వీళ్లు వెబ్సైట్లు, టెలిగ్రామ్ చానెళ్ల ద్వారా కార్డ్ వివరాలను హ్యాక్ చేసి విక్రయిస్తున్నారు. సంపన్న పాశ్చాత్య దేశాలకు చెందిన వారి కార్డు వివరాలకు ఒక్కో కార్డుకు 10 డాలర్లు (రూ.820) చొప్పున తీసుకుంటుండగా భారత్ సహా ఆసియా దేశాలకు చెందిన బాధితుల కార్డుల వివరాలకు చవగ్గా కేవలం 5 డాలర్లు (రూ.410)కే అమ్మేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. 2022 జనవరిలో అటువంటి అక్రమ వెబ్సైట్ ఒకదానిని అధికారులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. కానీ అలాంటి అక్రమ వెబ్సైట్లు, టెలీగ్రామ్ చానెళ్లు లెక్కకు మించి పుట్టుకొస్తున్నాయి. ఇదీ చదవండి: ఇంటర్నెట్ షట్డౌన్: ఆరు నెలల్లో ఇన్ని వేల కోట్ల నష్టమా? -
50% డిస్కౌంట్: అన్లిమిటెడ్ స్టోర్స్లో ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: వివిధ ఉత్పత్తులపై అత్యుత్తమ రాయితీలు, ఆఫర్లతో ‘రెడ్ అలర్ట్ సేల్’ ప్రారంభించినట్లు అన్లిమిటెడ్ స్టోర్స్ ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వస్త్రాలపై 50% ఫ్లాట్ ఆఫర్ అందిస్తుంది. అలాగే రూ. 3 వేల షాపింగ్పై అంతే విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఈ ఆఫర్ జూలై రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. -
ఇకపై డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు.. ట్రైల్ సేల్స్కు అనుమతి!
జపాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ఇకపై దేశంలో డాక్టర్ చీటీ లేకుండానే గర్భనిరోధక మాత్రలు విక్రయించేందుకు అనుమతినిచ్చింది. అయితే ముందుగా వీటిని ట్రయల్ రూపంలో విక్రయించాలని నిర్ణయించింది. అత్యవసర గర్భనిరోధక మాత్రల విషయమై జపాన్లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఉన్న నియమం ఇదే.. జపాన్ ఆరోగ్యశాఖ తాజాగా అత్యవసర గర్భనిరోధక మాత్రలు ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్’ విక్రయాలకు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకూ వీటిని కొనుగోలు చేయాలంటే పలు నిబంధనలు ఉన్నాయి. ఎవరైనా మహిళ, లేదా అత్యాచార బాధితురాలు ఈ మాత్రలను కొనుగోలు చేయాలంటే, తప్పనిసరిగా అందుకు సంబంధించిన డాక్టర్ చీటీ చూపించడం తప్పనిసరి. ఆరేళ్ల క్రితం రాజుకున్న వివాదం 2017లో ఎటువంటి డాక్టర్ చీటీ లేకుండా గర్భనిరోధర మాత్రలు విక్రయించడంపై వివాదం చెలరేగింది. ఈ నేపధ్యంలో జపాన్ ప్రభుత్వం కొద్దిపాటి సడలింపుతో డాక్టర్ చీటీ లేకుండా వీటి విక్రయాలకు అనుమతినిచ్చింది. అయితే ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్స్’ మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంచడం తగినది కాదనే వాదన కొందరిలో మొదలయ్యింది. దీనివలన సమస్యలు పెరుగుతాయిని వారు పేర్కొన్నారు. 90వ దశాబ్ధంలో సులభంగా లభ్యం 90వ దశాబ్ధంలో జపాన్లో గర్భనిరోధక మాత్రలు డాక్టర్ చీటీ లేకుండానే విక్రయించేవారు. అయితే పలు పరిశోధనల్లో అత్యవసర గర్భనిరోధక మాత్రలతో ముప్పు పొంచి ఉన్నదని వెల్లడయ్యింది. 46 వేల మంది వినతి మేరకు.. 2020 చివరిలో లింగసమానత్వానికి జాపాన్ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపధ్యంలో మరోమారు అత్యవసర గర్భనిరోధక మాత్రల విక్రయాలపై తిరిగి వాదనలు మొదలయ్యాయి. తాజాగా వీటి విక్రయాలపై ప్రభుత్వానికి 46,312 మంది సలహాలు, సూచనలు అందించారు. వీరిలో చాలామంది గర్భనిరోధక మాత్రలను ట్రయల్ రూపంలో విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: పాపం పసివాడు:16 రోజులు కోమాలో ఉండి.. -
కొండను కొంటారా? అమ్మకానికి సిద్ధంగా ఉంది!
కొండను కొంటారా?! ఖాళీ స్థలాలను కొనుక్కుంటారు. చక్కని స్థలాల్లో నిర్మించిన ఇళ్లు, భవంతులు కొనుక్కుంటారు. అంతేగాని, కొండలు గుట్టలు కొనుక్కుంటారేమిటి? అయినా, వాటిని ఎవరైనా అమ్ముతారా అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి! తాజాగా ఒక కొండ అమ్మకానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో కాదులెండి. ఇంగ్లండ్లోని యార్క్షైర్ డేల్స్ నేషనల్ పార్క్లో ఉన్న 170 అడుగుల పొడవైన ‘కిల్న్సే క్రేగ్’ అనే కొండను ఇటీవల అమ్మనున్నట్లు ప్రకటించారు. దీని ధర 1.50 లక్షల పౌండ్లు (రూ.1.55 కోట్లు). యార్క్ డేల్స్లోని వార్ఫడేల్ ప్రాంతంలో సున్నపురాతితో ఏర్పడిన ఈ కొండ పర్యాటక ఆకర్షణగా పేరుపొందింది. చాలామంది పర్యాటకులు దీనిపైకెక్కి ఫొటోలు దిగుతుంటారు. దీని మీద నుంచి చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తుంటారు. ఈ కొండ సహా దీని చుట్టూ ఉన్న 18.76 ఎకరాల స్థలంలో ప్రభుత్వం వ్యవసాయ పర్యావరణ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆసక్తిగల ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నట్లు ప్రకటించింది. (చదవండి: ఆన్లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా! రోజులు కాదు ఏకంగా నాలుగేళ్లు పట్టింది డెలివరీకి!) -
రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు
విలాసవంతమైన టవర్స్; లగ్జరీ భవనాలు, ఎత్తైన శిఖరాలకు పెట్టింది పేరైన దుబాయ్లో రియల్ ఎస్టేట్కున్న డిమాండ్ మామూలుది కాదు. వెర్సైల్స్ను తలపించే మార్బుల్ ప్యాలెస్ ధర వింటే షాక్వుతారు. మార్కెట్లో దీని ధర రూ. 1,600 కోట్లు (750 మిలియన్ దిర్హామ్ల) పలుకుతోంది. విలాసవంతమైన భవనాలు ఎక్కువగా ఉండే నగరంలో మార్కెట్లో అత్యంత ఖరీదైన ఇల్లు అమ్మకానికి వుంది. ఇలాంటి ఇంద్రభవనంపై మోజుపడుతున్నవారిలో భారతీయుడు ఉండటం విశేషం. మార్బుల్ ప్యాలెస్ అదిరిపోయే ఫీచర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లచే "మార్బుల్ ప్యాలెస్" గా పిలుస్తున్న ఈ భవనాన్ని అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్తో నిర్మించారు. Luxhabitat Sotheby's International Realty విక్రయిస్తున్న ఈ భవన నిర్మాణం దాదాపు 12 సంవత్సరాలు పట్టిందట. 60వేల చదరపు అడుగుల ఇంటిలో ఐదు బెడ్రూమ్లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ 4,000 చదరపు అడుగులు ఒక పెద్ద భవనాన్ని మించిఅన్నమాట. (ఫేస్బుక్ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు) ఇంకా 15-కార్ల గ్యారేజ్, 19 రెస్ట్రూమ్లు, ఇండోర్ అలాగే అవుట్డోర్ పూల్స్, రెండు రూఫ్లు, 80,000 లీటర్ (21,000 గాలన్లు) కోరల్ రీఫ్ అక్వేరియం, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్లు తదితర ఫీచర్లలో ఉన్నాయి. ఇది 70 వేల చదరపు అడుగుల స్థలంలో గోల్ఫ్ కోర్స్కి ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఈ ఆస్తిని ఎవరైనా కొనుక్కెవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు, లేదా టెన్నిస్ లేదా పాడెల్ బాల్ కోర్ట్ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు. బ్రోకర్ కునాల్ సింగ్. ఈయన అంచనా ప్రకారం, కేవలం ఐదు నుండి పది మంది సంపన్నులు దీన్ని కొనుగోలు చేయగలరు. అంతేకాదు గత మూడు వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూశారు. ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్లో ఇప్పటికే మూడు నివాసాలను కలిగి ఉన్న ఇండియన్ కావడం గమనార్హం. ఆయన భార్య ఇంకొంచెం మెరుగైన దాని కోసం చూస్తోందని అందుకే నిర్ణయం తీసుకోలేదని సింగ్ పేర్కొన్నాడు. -
పీనాసి ప్రియుడు: అరటి పండు తొక్కతీసి..
ప్రియురాలికి ఖరీదైన గిఫ్టులు ఇచ్చి ఆమెను ఇంప్రెస్ చేయాలని చాలామంది యువకులు తపన పడిపోతుంటారు. అయితే దీనికి భిన్నంగా ప్రవర్తించిన ఒక యువకునికి సంబంధించిన ఉదంతం ఇప్పుడు వైరల్గా మారింది. చాలామంది డబ్బులు ఆదా చేసేందుకు వివిధ పద్దతులను ఆశ్రయిస్తుంటారు. సాధారణంగా అరటిపండ్లను తొక్కతోనే విక్రయిస్తుంటారు. అయితే తూకానికి అరటి పండ్లను కొనుగోలు చేసినప్పుడు తొక్కతో పాటు బరువు చూస్తే.. అది కాస్త అధిక బరువు ఉంటుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువకుడు డబ్బులను ఆదా చేసేందుకు అరటి పండ్ల తొక్కలను తీసి, దానిలోని పండు భాగానికి తూకం వేసి, తన ప్రియురాలి కోసం కొనుగోలు చేశాడు. తన బాయ్ ఫ్రెండ్ పీనాసితనాన్ని అందరికీ చూపించేందుకు ఆ యువతి ఈ ఘటనను వీడియోలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక యువకుడు అరటిపండు తొక్కలను వేరుచేసి, తరువాత వాటి బరువును తూచడం కనిపిస్తుంది. ఇలా చేయడం వలన అరటి పండు బరువు తగ్గుతుందని, ఫలితంగా వాటి ఖరీదు కూడా తగ్గుతుందని అతని ఆలోచన. ఈ వీడియో చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్.. ‘మీరు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే జీవితాంతం రోదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని రాయగా, మరొకరు ‘మీరు ఈ బాధల నుంచి బయపడండి. వెంటనే ఆ వ్యక్తి దూరంకండి’ అని రాశారు. ఇది కూడా చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ! -
సూపర్ ఆఫర్: ఐపోన్13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్ ప్రకారం 'బెస్ట్ సెల్లర్' ఐఫోన్ 13పై దాదాపు 36వేల దాకా తగ్గింపుతో రూ.25,900కి వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 14 ను పోలిన స్పెసిఫికేషన్సే ఐఫోన 13లో కూడా ఉన్నాయి. 2021లో లాంచ్ అయినపుడు ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 79,900. తాజాగా ఫ్లిప్కార్ట్లో రూ. 36,099 తగ్గింపు తర్వాత రూ. 25,900కి అందుబాటులో ఉంది. (తక్కువ ధరలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ధర ఎంతంటే?) ప్రస్తుతం రూ. 7,901 తగ్గింపుతో రూ. 61,999 వద్ద లిస్ట్ అయింది. అయితే కొనుగోలుదారులు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై 5శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. రూ. 33 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆపర్ కూడా లభ్యం. ఈ ఆఫర్లన్నీ వర్తిస్తే యాపిల్ ఐఫోన్ 13 రూ. 25,900కే సొంతం చేసుకోవచ్చు. (మస్క్కు మరో ఝలక్: కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్బై) ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే A15 బయోనిక్ చిప్సెట్ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 3227 ఎంఏహెచ్ బ్యాటరీ ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? -
అమెజాన్ సేల్.. 5జీ స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్.. సమ్మర్ ఆఫర్ గురూ!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ 5జీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మే 27 నుంచి మే 31 వరకు జరిగే ఈ సేల్లో 5జీ స్మార్ట్ఫోన్లు వన్ప్లస్, రియల్మీ, శాంసంగ్తో పాటు ఇతర బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. కొనుగోలు దారులు ఈ ప్రత్యేక సేల్లో రూ.1,666 నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ ృపొందవచ్చని వెల్లడించింది. అదనంగా, అమ్మకాలు జరిగే సమయంలో ఎక్ఛేంజ్ ఆఫర్లో రూ.10,000 వేల వరకు బోనస్ పొందవచ్చు. ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లకు 24 నెలల పాటు ఎంపిక చేసుకున్న ఫోన్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని ఓ ప్రకటనలో పేర్కొంది. ఐక్యూ 11 5జీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2ప్రాసెసర్ అందుబాటులో ఉన్న ఐక్యూ 11 5జీ స్మార్ట్ ఫోన్పై రూ.5వేల వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ఈ ఫోన్ 2కే ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. రెడ్మీ నోట్15 జీ రెడ్మీ నోట్12 5జీ కొనుగోలు దారులకు రూ.2,000 వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్తో పాటు పలు బ్యాంక్లు అందించే ఆఫర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ రెడ్మీ 5జీ ఫోన్ 120 హెచ్జెడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4జనరేషన్ 1 5జీ ప్రాసెసర్, 48 ఎంపీ ఏఐ ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తుంది. షావోమీ 13 ప్రో షావోమీ 13 ప్రో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2, 4 ఎన్ఎం ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.71,999 ఖరీదైన ఈ ఫోన్ను అమెజాన్, బ్యాంక్లు ఇచ్చే మొత్తం ఆఫర్లను కలుపుకొని ఎక్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ.10,000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్లో 6.73 అంగుళాల 2కే 120 హెచ్జెడ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 4,820 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వన్ప్లస్ 10 ప్రో 5జీ వన్ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ ధర రూ.55,499 కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్ఛేంజ్ బోనస్ కింద రూ.10,000 వరకు తగ్గింపు ఆఫర్ను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 9 నెలల పాటు నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ఈ ఫోన్లో 48 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో లెన్స్లు ఉన్నాయి. వన్ ప్లస్ 10 ఆర్ 5జీ వన్ ప్లస్ 10 ఆర్ 5జీ ధర రూ. 32,999గా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ సేల్లో ఈ ఫోన్పై రూ. 3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్తో పాటు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ లభిస్తుంది. 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా ఫోన్ వెనుక భాగంలో ఉంది. శాంసంగ్ ఎం14 5జీ శాంసంగ్ ఎం14 5జీ 6.6 ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5ఎన్ఎం ప్రాసెసర్, 50ఎంపీ ట్రిపుల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అమెజాన్లో ఈ ఫోన్ రూ. 15,490 కి కొనుగోలు కొనుగోలు చేయొచ్చు. రూ. 500 ఎక్స్చేంజ్ ఆఫర్లతో పాటు బ్యాంక్లు అందించే ఆఫర్లు ఉన్నాయి . రియల్మీ నార్జో 50 5జీ రియల్మీ నార్జో 50 5జీ 6.6 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 810 5జీ, పవర్ ఫుల్ గేమింగ్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో 3,000 డిస్కౌంట్ లభిస్తుండగా.. రూ.14,249 కే కొనుగోలు చేయొచ్చు. చదవండి👉 అంతా బాగుంది అనుకునేలోపు యూట్యూబర్లకు ఊహించని షాక్! -
Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ ఆఫర్స్
సాక్షి,ముంబై: రియల్మీ ఐదో వార్షికోత్సవ సేల్ను ప్రకటించింది. రియల్మే మార్కెట్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. రియల్మీ అఫీషియల్ వెబ్సైట్తో పాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్ల్లో కూడా ఈ యానివర్సరీ సేల్ సందర్భంగా రియల్మీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు సహా , ఇతర రియల్మీ ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. మే 3 వరకు కస్టమర్లు భారీ ఆఫర్లను అందుకోవచ్చు. స్మార్ట్ఫోన్లు రియల్మీ జీటీ నియో 3టీ సుమారు రూ.8,000 డిస్కౌంట్తో రూ.19,999కే లభ్యం. ఫ్లాగ్షిప్ రియల్మీ జీటీ 2 ప్రో.. రూ.14వేల డిస్కౌంట్తో రూ.35,999కు లభిస్తోంది. ఈ సేల్లో రియల్మీ 10 ప్రో 5జీ, రియల్మీ 10 మొబైళ్లపై రూ.2,000 వరకు ఆఫర్ ఉంది. దీంతోపాటు రియల్మీ 9ఐ 5జీ, రియల్మీ సీ55, రియల్మీ సీ30 ,రియల్మీ సీ35, రియల్మీ జీటీ2, రియల్మీ 9 ప్రో+ 5జీ సహా మరిన్ని మొబైళ్లపై ఈ సేల్ సందర్భంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ల్యాప్టాప్స్: రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ల్యాప్టాప్ డిస్కౌంట్తో ప్రస్తుతం రూ.47,999, రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్ రూ.32,999కు ఫ్లిప్కార్ట్ ఈ ఆఫర్లతో ల్యాప్టాప్లు లభ్యం. స్మార్ట్ టీవీలు రియల్మీ 32, 43 అంగుళాల 4కే యూహెచ్డీ టీవీలపై రూ.3,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రియల్మీ స్మార్ట్ టీవీ నియో 32 ఇంచుల టీవీ రూ.1,000 డిస్కౌంట్తో రూ.11,999కే అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) It's your time to grab the leap-forward deals! Don't miss the chance to catch the 5th-anniversary bonanza at https://t.co/HrgDJTHBFX. Head straight to the website now! pic.twitter.com/pVaIJliwPU — realme (@realmeIndia) May 1, 2023 -
Infinix INBook Y1 Plus Neo రూ. 20వేలకే ల్యాప్ట్యాప్, ఎట్రాక్టివ్ ఫీచర్స్!
సాక్షి, ముంబై: బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు,స్మార్ట్ టీవీలు, ఇతర ఉత్పత్తులతో ఆకట్టుకున్నఇన్ఫినిక్స్ ఇపుడిక ల్యాప్టాప్ విభాగంలో క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా పోర్టబుల్ కంప్యూటర్ లాంటి సరికొత్త ల్యాప్టాప్ను ఆవిష్కరించింది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో పేరుతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. అల్యామినియమ్ అలాయ్ మెటల్ బాడీ, 15.6 ఇంచుల ఫుల్హెచ్డీ డిస్ప్లే, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 (Intel Celeron N5100) క్వాడ్కోర్ ప్రాసెసర్ లాంటి ఫీచర్లను ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియోలో అందించింది. ఈ ల్యాప్టాప్ ఫస్ట్ సేల్లో లాంచింగ్ ధరను ఆఫర్ చేస్తోంది. (బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?) ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో స్పెసిఫికేషన్లు 15.6 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, ఇంటెల్ సెలెరోన్ ఎన్5100 క్వాడ్కోర్ బడ్జెట్ ప్రాసెసర్, 260 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఇంటెల్ యూహెచ్డీ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో,డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్బీ పోర్టులు, ఓ హెచ్డీఎంఐ పోర్టు, రెండు యూఎస్బీ టైప్-సీ పోర్టులు, ఓ మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, 3.5mm హెడ్ఫోన్ జాక్,బ్యాక్లిట్ కీబోర్డ్ ,యాంటీ-గ్లేర్ గ్లాస్ టచ్ప్యాడ్ లాంటి ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ల్యాప్టాప్ బరువు 1.76 కేజీలుగా ఉంది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్డీ వెబ్క్యామ్ , 2 వాట్ల సౌండ్ ఔట్పుట్ ఇచ్చే స్పీకర్లు, 40Wh బ్యాటరీ45 వాట్ల పీడీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 75 శాతం చార్జ్ అవుతుందని ఇన్ఫినిక్స్ వెల్లడించింది. ఇక ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ ల్యాప్టాప్ 7 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుంది. ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో ధర, సేల్ 8 జీబీ ర్యామ్, 256 జీబీఎస్ఎస్డీ స్టోరేజ్ వేరియంట్ ఇన్ఫినిక్స్ ఇన్బుక్ వై1 ప్లస్ నియో ల్యాప్టాప్ ధర రూ.20,990గా ఉంది.అలాగే 8 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.22,990లు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఈనెల 26వ తేదీ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సిల్వర్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో లభ్యం. -
అమెజాన్లో ఆగని ఆఫర్లు.. ఈ వస్తువులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్!
Amazon Blockbuster Value Days Sale: మీరు ఓ కంపెనీకి చెందిన బ్రాండెడ్ టీవీ కొనాలనుకుంటున్నారు? అయితే ఆ టీవీ డిస్కౌంట్కే వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. అందుకోసం ఏయే ఈ - కామర్స్ సంస్థలు టీవీలపై డిస్కౌంట్లు ఇస్తున్నాయోనని అని ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ‘బ్లాక్బ్లస్టర్ వ్యాల్యూ డేస్’ సేల్ను ప్రారంభించింది. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు ప్రత్యేకంగా సేల్ నిర్వహించ నుంది. ఈ సేల్లో పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాదు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్పై జరిపే కొనుగోళ్లు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ సైతం అందిస్తుంది. (పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్ వీడియో) ఇక ఈ ప్రత్యేకమైన సేల్లో 32 అంగుళాల స్మార్ట్ టీవీలపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ‘4కే, ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ’ టీవీలపై 60 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఏడాది పాటు నో - కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. (క్రెడిట్కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) వన్ ప్లస్, ఎల్జీ, సోనీతో పాటు ఇతర టీవీ ఉత్పత్తులపై 70శాతం డిస్కౌంట్కే సొంతం చేసుకోవచ్చు. వన్ ప్లస్, రెడ్మీ, శాంసంగ్తో పాటు ఇతర గేమింగ్ డివైజ్లపై 25శాతం, గేమ్ టైటిల్స్పై 50 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. అమెజాన్ ఉత్పత్తులైన ప్లే స్టేషన్ డివైజ్లపై 70 శాతం తగ్గింపుకే సొంతం చేసుకోవచ్చు. ఫోన్లపై డిస్కౌంట్లు బ్యాంక్ ఆఫర్లతో పాటు ధరల విభాగాలలో ప్రసిద్ధ మోడళ్లపై తగ్గింపు ధరలకే అమెజాన్ విక్రయిస్తుంది. విక్రయ సమయంలో, ఫ్యాషన్, గృహోపకరణాలు, కిచెన్లో వినియోగించే వస్తువులు ఇలా ఇతర విభాగాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉండనున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
రూ.10వేలయాపిల్ ఎయిర్పాడ్స్ రూ. 549కే: చెక్ యువర్ లక్!
సాక్షి, ముంబై: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న యాపిల్ కంపెనీకి చెందిన ఎయిర్పాడ్స్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఫ్లిప్కార్ట్ సేల్పై ఓ లుక్కేయాల్సిందే. తాజా ఫ్లిప్కార్ట్ సేల్లో యాపిల్ ఎయిర్ పాడ్లు కేవలం రూ. 549కి అందుబాటులో ఉన్నాయి. Apple AirPod (2nd Gen) లు కంపెనీ అధికారిక ఆన్లైన్ స్టోర్లో రూ. 9,999కి రీటైల్ చేస్తుండగా ఫ్లిప్కార్ట్ సేల్లో కేవలం రూ. 549కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలుకు, పాత స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నట్టే, ఫ్లిప్కార్ట్సేల్లో ఇయర్బడ్స్ కొనుగోలు చేయాలంటే పాతస్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే సరిపోతుంది. తద్వారా నిబంధనల మేరకు రూ. 9,450 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో సుమారు పది వేల రూపాయల యాపిల్ ఇయర్ బడ్స్ను రూ.549కి సొంతం చేసుకోవచ్చు. (దిగుమతులు: పసిడి వెలవెల, వెండి వెలుగులు) -
రోజుకు కేవలం రూ.73: యాపిల్ ఐఫోన్ 12మినీ మీ సొంతం!
సాక్షి, ముంబై: ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్, ముచ్చటైన యాపిల్ ఐఫోన్ 12 మినీ సొంతం చేసుకోవాలనేకునే కస్టమర్లకు గుడ్ న్యూస్. ఫ్లిప్కార్ట్ సేల్లో డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ కూడా ఉంది. అంతేకాదు ఈఎంఐ ఆప్షన్ ద్వారా రోజుకు కేవలం 73 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదెలా అంటారా? (సల్మాన్ బ్రాండ్ న్యూ బుల్లెట్ ప్రూఫ్ కార్: ఇంటర్నెట్లో వీడియో హల్చల్) ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర రూ. 69,900, అయితే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 5,901 తగ్గింపు తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీ రూ.53,999గా ఉంది. దీనికి అదనంగా, హెచ్డీఎఫ్సీ డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై బ్యాంక్లో రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. దీంతో ధర రూ.51,999 దిగి వచ్చింది. కొనుగోలుదారులు 24 నెలల వరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ కార్డ్పై నో కాస్ట్ EMIని పొందవచ్చు.ఐఫోన్ 12 మినీ కోసం నెలకు కేవలం రూ. 2250 చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం రోజుకు కేవలం రూ.73 అన్నమాట. (గుడ్ న్యూస్: యథాతథంగా కీలక వడ్డీరేట్లు) Apple iPhone 12, Apple iPhone 12 Pro, Apple iPhone 12 Pro Maxతో పాటు 2020లో లాంచ్ చేసింది యాపిల్.దీన్ని యాపిల్ అమ్మకాలను నిలిపివేసినా , ఫ్లిప్కార్ట్, ఇదితర ఈకామర్స్ ప్లాట్ఫారమ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ ఐఫోన్ 12 మినీ: 5.4-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే, A14 బయోనిక్ చిప్, 12ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. -
ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: ఐఫోన్ 14 పై రూ. 44వేల భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: యాపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది.ఈ రోజు (మార్చి 31) ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో అనేక ఉత్పత్తులపై స్మార్ట్డీల్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఖరీదైన ఐఫోన్ 14 స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్. దాదాపు రూ. 44,901 తగ్గింపు తర్వాత కేవలం రూ. 34,999కి అందుబాటులో ఉంది. (సంక్షోభ సమయంలో హెచ్సీఎల్ టెక్ గుడ్న్యూస్) మార్చి 31 నుండి ఏప్రిల్ 3 వరకు జరిగే బిగ్ బచత్ ధమాల్ సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ మొబైల్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ.10,901 తగ్గింపుతో రూ.68,999కి విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.4000 తక్షణ తగ్గింపు, స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్లో రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా రూ. 44,901 తగ్గింపు తర్వాత యాపిల్ 14 ఫ్లిప్కార్ట్లో రూ. 34,999కి లభించనుంది. (ఇదీ చదవండి: హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) యాపిల్ ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే 12 ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా,12 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (అచ్చం యాపిల్ స్మార్ట్వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) -
లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!
న్యూఢిల్లీ: లగ్జరీ అపార్టుమెంట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.దేశీయ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ దూసుకుపోతోంది. తాజాగా మూడు రోజుల్లో రూ. 8వేల కోట్లకుపైగా విలువైన లగ్జరీ ఫ్లాట్లను విక్రయించింది. లాంచింగ్ ముందే వీటిని విక్రయించడం విశేషం. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ప్రీ-ఫార్మల్ లాంచ్ సేల్స్లో భాగంగా గురుగ్రామ్లోని సెక్టార్ 63లో గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ వద్ద నిర్మించిన ‘ది అర్బర్’ డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ ఈ ఫీట్ సాధించింది. లాంచింగ్కు మూడు రోజుల ముందుగానే పూర్తి సేల్స్ను నమోదు చేసింది. 25 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్లో ఐదు టవర్లు, 38/39 అంతస్తులున్నాయి. ఇందులో 4 BHK 1137 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటి ధరలు యూనిట్కు రూ. 7 కోట్ల నుండి ప్రారంభం. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) తమ ప్రాజెక్ట్కు అద్భతమైన స్పందన లభించిందనీ, డీఎల్ఎఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి సంతోషం ప్రకటించారు. లగ్జరీ గృహాలు, జీవనశైలి సౌకర్యాలకు పెరుగుతున్న ఆదరణకు ఇది సంకేతమన్నారు. 75 ఏళ్లుగా కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా శ్రద్ధ, నిబద్ధతతో అందిస్తున్న సేవలు, కొనుగోలుదారుల విశ్వాసం నేపథ్యంలో ప్రాజెక్ట్ కోసం అధిక స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా, 95 శాతం మంది కొనుగోలు దారులు తమ తుది వినియోగం కోసం కొనుగోలు చేశారన్నారు.గురుగ్రామ్లో అర్బర్ నిస్సందేహంగా తమకొక మైలురాయి లాంటిదన్నారు. -
అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే?
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లోని హెచ్ఎండీఏ స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అందుబాటు ధరల్లో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎమ్మెస్టీసీ ఈ వేలం ప్రక్రియను నిర్వహించనుంది. మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు ఈ ల్యాండ్ పార్సిళ్లను కొనుగోలు చేసేందుకు అనుగుణంగా స్థలాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఔటర్రింగ్ రోడ్డుకు దగ్గరలో 39 ల్యాండ్ పార్సిళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 ప్లాట్లు, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిళ్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ స్థలాల వివరాలను కేఎంఎల్ ఫైల్ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది. 121 నుంచి 10,164 గజాల వరకు ఈ స్థలాలు ఉన్నాయి. గండిపేట వద్ద 3 ప్లాట్లు, శేరిలింగంపల్లిలో 5, ఇబ్రహీంపట్నంలో 2 ప్లాట్లు, అమ్మకానికి ఉన్నాయి. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో 4, ఘట్కేసర్లో 1, బాచుపల్లిలో 1 చొప్పున ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో 16, ఆర్సీపురంలో 6 ప్లాట్లు, జిన్నారంలో ఒకటి చొప్పున స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఆన్లైన్ వేలం.. 39 స్థలాలను వచ్చే నెల మార్చి 1న ఎమ్మెస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్ కలిగిన ఈ స్థలాలను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది. ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెస్టీసీలో నమోదు చేసుకోవాలి. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన ఈఎండీ (ధరావత్తు) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా పరిధిలోని స్థలాలకు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని స్థలాలకు ఆర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్లో 23న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్థలాలపై ఉప్పల్ సర్కిల్ ఆఫీసులో ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహించనున్నారు. చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి! -
కరీబియన్ దీవి కారుచౌక
ఫొటోలో కనిపిస్తున్నది కరీబియన్ సముద్రంలోని దీవి. దక్షిణ అమెరికా దేశం నికరగ్వా తీరానికి ఆవల పన్నెండు మైళ్ల దూరంలో ఉందిది. చుట్టూ నీలి కడలి, నడి మధ్యన పచ్చదనంతో అలరారే ఈ ప్రైవేటు దీవి పేరు ‘ఇగ్వానా దీవి’. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవిలో అధునాతన సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తున ఉన్న అబ్జర్వేటరీ టవర్తో కూడిన ఒక మూడు పడకగదుల ఇల్లు, దీవి పడమటి వైపున చక్కని ఈతకొలను, వైఫై, మొబైల్, టీవీ తదితర సౌకర్యాలు, చుట్టూ ఎటుచూసినా పచ్చని అరటి, కొబ్బరిచెట్లతో ఉన్న ఈ దీవి ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని ధర 3.76 లక్షల పౌండ్లు మాత్రమే! లండన్ నగరంలోని ఒక సామాన్యమైన ఫ్లాట్ ధర కంటే ఇది చాలా చౌక. దీనిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరి! -
ఎయిర్ షో సందర్భంగా నాన్వెజ్ అమ్మకాలు బంద్!
ఏరో ఇండియా షో సందర్భంగా బెంగళూరులో నాన్వెజ్ అమ్మకాలను నిషేధించారు. ఈ మేరకు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు మాంసం దుకాణాలు, మాంసాహార హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని బెంగళూరు పౌర సంస్థ ఆదేశించింది. అంతేగాదు యలహాంక ఎయిర్ఫోర్స్ స్టేషన్కు సుమారు 10 కిలోమీటర్లు పరిధిలో మాంసాహార వంటకాలు అందించడం, అమ్మడంపై నిషేధం ఉంటుందని బృహత్ మహానగర పాలికే(బీబీఎంపీ) తన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఏరో ఇండియా షో నిర్వహించనున్నారు. దీన్ని ఉల్లంఘిస్తే బీబీఎంపీ చట్టం 2020 తోపాటు ఇండియన్ ఎయిర్ క్రాప్ట్ రూల్ ప్రకరాం శిక్షార్హులని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో నాన్వెజ్ ఫుడ్ చాలా స్కావెంజర్ పక్షులను ఆకర్షిస్తోందని, మరీ ముఖ్యంగా గాలి పటాలు ఎయిర్ ప్రమాదాలకు కారణమని తెలిపింది. ఈ ఎయిర్ షో కోసం దాదాపు 731 మంది ఎగ్జిబిటర్లు, 633 మంది భారతీయులు, 98 మంది విదేశీయులు నమోదు చేసుకున్నట్లు ఏరో ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఏరో ఇండియా 1996 నుంచి బెంగళూరులో ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఏరోస్పేస్ ఎగ్జిబిషన్లను విజయవంతంగా 13 సార్లు నిర్వహించి తనకంటూ ఒక ప్రత్యేక సముచిత స్థానాన్నిసంపాదించుకుంది. (చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్లైన్కు భారీ పెనాల్టీ) -
పాక్ ఆర్థిక కష్టాలు.. అమ్మకానికి అమెరికాలోని ఎంబసీ ఆస్తులు
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పాకిస్థాన్. చేసిన అప్పులు తీర్చేందుకు, ఉద్యోగులకు జీతాలు సైతం ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతూ ఆస్తులు అమ్ముకుంటోంది. తమకు సాయం చేయాలని అంతర్జాతీయ సంస్థలతో పాటు వివిధ దేశాలను వేడుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టింది. వాషింగ్టన్లోని పాత ఎంబసీ బిల్డింగ్ను అమ్మకానికి పెట్టగా కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు పాకిస్థాన్ స్థానిక మీడియా వెల్లడించింది. భారత సంస్థ బిడ్.. వాషింగ్టన్లోని పాక్ ఎంబసీ భవనాన్ని కొనుగోలు చేసేందుకు అత్యధికంగా 6.8 మిలియన్ డాలర్లకు జువిష్ సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఆ భవనం స్థానంలో ప్రార్థనా మందిరం నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత రెండోస్థానంలో భారత్కు చెందిన ఓ రియాల్టీ సంస్థ బిడ్ వేసింది. 5 మిలియన్ డాలర్లకు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే.. పాకిస్థాన్కు చెందిన రియాల్టీ సంస్థ 4 మిలియన్ డాలర్లకు కోట్ చేసినట్లు పాక్ డాన్ పత్రిక వెల్లడించింది. మరోవైపు.. ప్రైవేటీకరణపై ఏర్పడిన పాకిస్థాన్ కేబినెట్ కమిటీ ఆర్థిక మంత్రి ఇషాక్ డార్ నేతృత్వం సోమవారం భేటీ అయింది. న్యూయార్క్లోని రూసెవెల్త్ హోటల్ సైట్ను లీజుకు ఇచ్చేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్ను నియమించాలని ప్రైవేటీకరణ కమిషన్కు సూచించినట్లు డాన్ పత్రిక తెలిపింది. పాకిస్థాన్కు వాషింగ్టన్లో రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. ఆర్ స్ట్రీట్లో ఉన్న భవనాన్ని 1956లో కొనుగోలు చేశారు. 2000 వరకు అందులో కార్యకలాపాలు సాగాయి. పాత భవనాన్ని అలాగే అమ్మేయాలా? లేక పునరుద్ధరణ పనులు చేయించి విక్రయించాలా? అనే అంశంపై ఎంబసీ అధికారులు చర్చిస్తున్నట్లు పాక్ పత్రిక పేర్కొంది. ఇదీ చదవండి: ‘ఏ దోస్త్ మేమున్నాం’.. పాకిస్థాన్కు జిన్పింగ్ భరోసా -
ఆ గ్రామానికి యజమాని కావాలట.. కారుచౌకగా అమ్మేస్తున్నారు!
స్పెయిన్ నైరుతి ప్రాంతంలోని ఒక ఊరు కారుచౌకగా అమ్మకానికి ఉంది. సాల్టో డి క్యాస్ట్రో అనే ఊరి ధర 2.60 లక్షల యూరోలు మాత్రమే! అంటే, రూ.2.24 కోట్లు అన్నమాట. బ్రిటన్లోని సగటు ఇంటి ధర కంటే ఈ ఊరి ధర చాలా తక్కువ. పోర్చుగీసు సరిహద్దుల్లో ఉన్న ఈ ఊరి నుంచి మాడ్రిడ్ నగరానికి మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ ఊళ్లో 44 ఇళ్లు, ఒక హోటల్, ఒక చర్చి, ఒక స్కూలు, మునిసిపల్ స్విమింగ్ పూల్, బ్యారక్స్ బిల్డింగ్ ఉన్నాయి. ఇన్ని వసతులు ఉన్నా, ఈ ఊరు దాదాపు ముప్పయ్యేళ్లుగా ఖాళీగానే ఉంది. నిజానికి ఇక్కడ సాల్టో డి క్యాస్ట్రో ఊరిని ఒక విద్యుదుత్పాదక సంస్థ తన ఉద్యోగులు, కార్మికుల కోసం నిర్మించింది. ఊరికి దగ్గర్లోనే రిజర్వాయర్ ఉంది. ఇక్కడ జలవిద్యుత్తు ప్రాజెక్టు పూర్తికావడంతో, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఇక్కడి నుంచి తరలిపోయారు. అప్పటి నుంచి ఊరు ఖాళీగానే ఉంటోంది. జనాలు లేని ఈ ఊరిని తిరిగి జనావాసంగా మార్చడానికి ఇరవయ్యేళ్ల కిందటే స్పెయిన్ ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేసినా, అవేవీ సఫలం కాలేదు. చివరకు ఈ ఊరిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇదివరకు 6.5 మిలియన్ యూరోల (రూ.560.63 కోట్లు) ధర నిర్ణయించగా, కొనడానికి ఎవరూ రాలేదు. ఆ తర్వాత విడతల వారీగా ధర తగ్గిస్తూ వచ్చినా ఫలితం లేకపోయే సరికి, ఇప్పుడు కారుచౌకగా ఊరిని తెగనమ్మేందుకు సిద్ధపడ్డారు. -
జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం
సాక్షి, ముంబై: చైనాకు చెందిన అలీబాబా కంపెనీ అలీపే ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో తనకున్న వాటాల నుంచి 3.07 శాతాన్ని (26,28,73,507 షేర్లు) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూపంలోనే ఈ విక్రయం జరిగింది. (జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు, టాప్లో ఆ రెండు) కెమాస్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కొనుగోలు చేసిన రూ.608 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన అమ్మకం ద్వారా అలిపే మొత్తం రూ.1,631 కోట్లను ఆర్జించింది.సగటున ఒక్కో షేరు విక్రయం ధరం రూ.62,06గా ఉంది. సెప్టెంబర్ చివరికి జొమాటోలో అలీబాబా గ్రూపునకు 13 శాతం వాటా ఉండగా, విక్రయం తర్వాత కూడా ఇంకా 10 శాతం వాటా మిగిలి ఉంది. సింగపూర్ సావరీన్ వెల్త్ ఫండ్ టెమాసెక్కు చెందిన కెమాస్ ఇన్వెస్ట్మెంట్స్ పీటీఈ 9.80 కోట్ల జొమాటో షేర్లను కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: CNN layoffs షాకింగ్: ఉద్యోగులకు ముప్పు నేడో, రేపో నోటీసులు! -
తిరుపతి జిల్లా చంద్రగిరి బాలికల పాఠశాల వద్ద గంజాయి అమ్మకాల కలకలం
-
వాట్సాప్ డేటా బ్రీచ్ కలకలం: ఆ మెసేజెస్ కాల్స్కి, స్పందించకండి!
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ మెటా యాజమాన్యంలోని వాట్సాప్లో డేటా బ్రీచ్ యూజర్లకు భారీ షాకిస్తోంది. ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్లైన్ సేల్ అయ్యాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. యూఎస్, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారతదేశంతో సహా 84 వేర్వేరు దేశాల వాట్సాప్ వినియోగదారుల మొబైల్ నంబర్లను ఆన్లైన్లో విక్రయానికి పెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 50 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు విక్రయానికి సైబర్న్యూస్ నివేదిక ప్రకారం అతిపెద్ద డేటా ఉల్లంఘనలలో ఒకటిగా భావిస్తున్న ఈ వ్యవహారంలో దాదాపు 500 మిలియన్ల వాట్సాప్ వినియోగదారుల ఫోన్ నంబర్ల డేటాబేస్ ఆన్లైన్లో విక్రయానికి ఉంచారు. 2022 డేటాబేస్లో 487 మిలియన్ల యూజర్ల మొబైల్ నంబర్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంటూ ఒక థ్రెట్యాక్టర్ ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. డేటా బ్రీచ్ ద్వారా సేకరించిన సమాచారంతో ఫిషింగ్ ఎటాక్స్ చేసే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో వాట్సాప్ వినియోగ దారులు తెలియని నంబర్ల కాల్స్, మెసేజ్లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ డేటాసెట్ ఈ డేటా బ్రీచ్లో మనదేశంలో 61.62 లక్షల మంది, అమెరికాకు చెందిన 32 మిలియన్ మంది ఉన్నట్టు నివేదిక పేర్కొంది. ఈజిప్ట్ నుంచి 45 మిలియన్లు, ఇటలీ నుంచి 35 మిలియన్లు సౌదీ నుంచి 29 మిలియన్లు, ఫ్రాన్స్నుంచి 20 మిలియన్, టర్కీ నుంచి 20 మిలియన్ల మంది డేటా ఉన్నట్టు పేర్కొంది. రష్యాకు చెందిన 10మిలియన్ల యూజర్లు, యూకే నుంచి 11మిలియన్ పౌరుల ఫోన్ నంబర్ల డేటా లీక్ అయినట్టు తెలిపింది. అమెరికా యూజర్ల డేటాను 7వేల డాలర్లు (సుమారు రూ. 5,71,690)కి విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. యూకే, జర్మనీ డేటాసెట్ల ధర వరుసగా 2,500 డాలర్లు (సుమారు. ₹2,04,175) 2వేల డాలర్లు (సుమారుగా ₹1,63,340) అమ్మకానికిపెట్టినట్టు నివేదించింది. కాగా మెటా, తన ప్లాట్ఫారమ్స్లో డేటా బ్రీచ్ ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం, 500 మిలియన్లకు పైగా ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఆన్లైన్లో లీకయ్యాయి. లీకైన డేటాలో ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు లీకైన సంగతి తెలిసిందే. -
ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి!
మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రస్తుతం భారత ప్రజలు డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు అంతా ఆన్లైన్ వైపు మళ్లారు. ఇటీవల ఇంటర్నెట్ వినియోగం పెరగడం, మరో వైపు ఆన్లైన్ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. పుడ్, దుస్తులు, వస్తువులు ఇలా ప్రతీది నెట్టింట చెల్లిస్తూ ఇంటికే పరిమితం అవుతున్నారు ప్రజలు. వీటి కారణంగా దేశంలోని ఇ-కామర్స్ కంపెనీల వ్యాపారంలో నిరంతర వృద్ధి నమోదు అవుతోంది. ఈ క్రమంలో అమెజాన్ (Amazon), ఫ్లిప్కార్ట్ (Flipkart), మింత్రా ( Myntra), జియో మార్ట్ (Jio Mart) కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు , డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. కొన్నిసార్లు కస్టమర్లు ఈ ఆన్లైన్ షాపింగ్లో మోసాలకు గురవుతుంటారు. అయితే మనం నేరుగా షాపింగ్ చేసిన వాటిలో మోసాలకు పాల్పడితే ఫలానా వ్యక్తిని వెళ్లి ప్రశ్నించవచ్చు. కానీ ఆన్లైన్ అలా కుదరుదు. వీటికంటూ ప్రత్యేక నియమాలు ఉంటాయి. ఈ క్రమంలో ఫిర్యాదుకు సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఓ సారి చూద్దాం! ఇవే నిబంధనలు... ఈ తరహా మోసాలకు సంబంధించి భారత ప్రభుత్వ వినియోగదారుల విభాగం కొన్ని నిబంధనలను రూపొందించింది. దీని ప్రకారం, ఈ-కామర్స్ వెబ్సైట్కు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే, అతను దీన్ని సులభంగా చేయగల హక్కు కస్టమర్కు ఉంది. నిబంధనల ప్రకారం, ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ ఏదైనా కస్టమర్ ఫిర్యాదుపై 48 గంటల్లోగా స్పందించాలి. కస్టమర్ ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, సదరు కంపెనీ ఆ ఫిర్యాదును ఒక నెలలోపు పరిష్కరించడం కూడా తప్పనిసరి. కస్టమర్లు తమ ఫిర్యాదులను కంపెనీ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయడం ద్వారా, సందేశం పంపడం ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. చదవండి: అమ్మకానికి బంకర్.. అణుదాడి జరిగినా తప్పించుకోవచ్చు! -
అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరీ అంత తక్కువెందుకంటే?
మ్యాండ్రిడ్: చాలా మందికి ఒక ఇల్లు లేదా విల్లా కొనుగోలు చేయలానే కల ఉంటుంది. కానీ, ఎవరికైనా ఒక గ్రామాన్ని కొనుగోలు చేయాలనుంటుందా? బాగా డబ్బు ఉన్న వాళ్లు రెండు మూడు ప్రాంతాల్లో నివాస గృహాలు కొనుగోలు చేయటం సహజమే. అయితే, ఒక గ్రామం మొత్తం అమ్మకానికి ఉంటే.. అది కేవలం ఒక ఇంటి ధరకే వస్తే..? ఆ ఆలోచనే నమ్మశక్యంగా లేదు కదా! స్పానిస్లోని ఓ గ్రామం ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. దాని ధర కేవలం 227,000 యూరోలు(రూ.2,16,87,831) మాత్రమే. సాల్టో డీ కాస్టో అనే ఈ గ్రామం జమోరా రాష్ట్రంలో పోర్చుగల్ సరిహద్దుల్లో ఉంటుంది. మ్యాండ్రిడ్ నుంచి కేవలం మూడు గంటల ప్రయాణం మాత్రమే. ఆ గ్రామంలో 44 ఇళ్లు, ఒక హోటల్, ఒక చర్చి, ఒక స్కూలు, ఒక మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి. 2000 తొలినాళ్లలో ఓ వ్యక్తి ఆ గ్రామాన్ని కొనుగోలు చేసి.. దానిని ప్రధాన టూరిస్ట్ ప్రాంతంగా మార్చాలనుకున్నాడు. అయితే, ఆర్థిక సంక్షోభంతో అది సాధ్యం కాలేదు. రాయల్ ఇన్వెస్ట్ యజమానికి రోని రోడ్రిగౌజ్ ఇప్పటికీ అక్కడ పర్యాటకం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు. ఐడియాలిస్టా అనే స్పానిస్ స్థిరాస్తి రిటైల్ వెబ్సైట్లో ఈ గ్రామాన్ని అమ్మకాన్ని ఉంచారు. తాను పట్టణవాసినని, గ్రామం నిర్వహణను చూసుకోలేకపోతున్నందునే అమ్మకాని పెట్టినట్లు యజమాని పేర్కొన్నారు. ఈ గ్రామంపై పెట్టుబడి పెడితే 100 శాతం అభివృద్ధి సాధించవచ్చని, అందుకు 2 లక్షల యూరోలకు మించి ఖర్చు కాదని తెలిపారు. వెబ్సైట్లో ఈ ప్రాపర్టీని ఇప్పటి వరకు 50వేల మంది వీక్షించారు. బ్రిటన్, ఫ్రాన్స్ బెల్జియం, రష్యాల నుంచి 300 మందికిపైగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: USA Airshow: ఎయిర్ షోలో ఘోర ప్రమాదం.. ఆకాశంలోనే ఢీకొన్న యుద్ధ విమానాలు -
నోకియా జీ60 5జీ సేల్స్ షురూ, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: నోకియా లేటెస్ట్ స్మార్ట్ఫోన్ జీ60 5జీ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభమైంది. గత వారం లాంచ్ చేసిన నోకియా జీ60 5జీ ఇండియాలో నేటి(మంగళవారం)నుంచి ఫస్ట్ సేల్కు సిద్ధం. 5జీ నెట్వర్క్ సపోర్ట్(నాన్-స్టాండలోన్, స్టాండలోన్) 50 మెగాపిక్సెల్ కెమెరా తోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి కీలక ఫీచర్లతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. నోకియా ఇండియా సైట్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ నలుపు, ఐస్ రంగుల్లో లభ్యం. ధర: 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్స్ 6.58 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే నోకియా G60 5G స్నాప్డ్రాగన్ 695 5G SoC 120Hz రిఫ్రెష్ రేట్,1,080x2,400 పిక్సెల్స్ రిజల్యూషన్ 50+5+2 ట్రిపుల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్పీ కెమెరా 4500mAh బ్యాటరీ -
అపార్ట్మెంట్లతో పోలిస్తే ఓపెన్ ప్లాట్లే ముద్దు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ తెలిపింది. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13-21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2-6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. (ప్రాపర్టీలకు డిమాండ్. రూ 2 కోట్లు అయినా ఓకే!) 2018-21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 2018-21 మధ్య ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. (ఉడాన్లో రెండో రౌండ్ కోతలు, భారీగా ఉద్యోగులపై వేటు) -
అద్భుతమైన ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ‘ఫినాలే డేస్’ సేల్
కొనుగోలు దారులకు ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ శుభవార్త చెప్పింది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగియడంతో ..‘ఫినాలే డేస్’ పేరుతో మరో ఎగ్జైటింగ్ సేల్ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా కొనుగోలు దారుల కోసం ‘ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్’ పేరుతో ఫినాలే డేస్ సేల్ను ప్రారంభించింది. అక్టోబర్ 17నుంచి ప్రారంభమై అక్టోబర్ 24 వరకు జరిగే సేల్లో ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ట్యాప్స్, టీవీలు, హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, బేబీ ప్రొడక్ట్స్తో పాటు పలు రకాల ఉత్పత్తులపై ఢీల్స్, ఆఫర్స్ను సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా టెక్నో, ఐక్యూ, మైక్రోసాఫ్ట్, ప్యాంపర్స్, షావోమీ స్మార్ట్ ఫోన్స్, టీవీ, పీ అండ్ జీ ప్రొడక్ట్లపై స్పెషల్ ఆఫర్లను పొందవచ్చు. రివార్డ్ పాయింట్లు అమెజాన్ ఫినాలే డేస్ సేల్లో ఐసీఐసీఐ, సిటీ, కొటాక్, రూపే క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లు నిర్వహించే కస్టమర్లకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, షాపింగ్ బడ్జెట్ను బట్టి బజాజ్ ఫిన్ సర్వ్, అమెజాన్ పే లేటర్ వంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై జీరోకాస్ట్ ఈఎంఐ, అమెజాన్ పే ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేసే చెల్లింపులపై రివార్డు పాయింట్లను సొంతం చేసుకోవచ్చు. డైమండ్స్ ధమాకా అక్టోబర్ 15 నుంచి కస్టమర్లకు డైమండ్ ధమాకా ఆఫర్ అందుబాటులోకి తెచ్చామని అమెజాన్ ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుండి కస్టమర్లు 750 డైమండ్స్ని రీడీమ్ చేయడం ద్వారా రూ. 1500 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే, రూ. 150 క్యాష్బ్యాక్ డైమండ్స్ ధమాకా ఆఫర్ను పొందవచ్చు. రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ షాపింగ్పై 1000 డైమండ్లను రీడమ్ చేయడం ద్వారా రూ. 300 క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఆఫర్లు అక్టోబర్ 24న ముగుస్తాయి. ఎగ్జిస్టింగ్ ఆఫర్లు,డైమండ్స్ను సంపాదించేందుకు డైమండ్స్ పేజీని సందర్శించండి గాడ్జెట్లను అప్గ్రేడ్ చేసుకోండి దివాళీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కొనుగోలు దారులకు మొబైల్స్, యాక్సెసరీస్పై 40 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. వన్ ప్లస్, షావోమీ, శాంసంగ్, ఐక్యూ, రియల్ మీ, యాపిల్, టెక్నో తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ల ప్రారంభ ధర రూ.5219 కొనుగోలుతో రూ. 499 విలువైన ఇయర్ ఫోన్స్ ఉచితంగా పొందవచ్చు. ప్రారంభ ధర రూ.10799తో 5జీ ఫోన్ కొనుగోళ్లపై ఇతర ఆఫర్లను దక్కించుకోవచ్చు. రూ. 17990తో ప్రారంభమయ్యే ల్యాప్టాప్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, రూ.999తో ప్రారంభమయ్యే స్మార్ట్వాచ్లపై 75 శాతం డిస్కౌంట్, రూ. 6999తో ప్రారంభమయ్యే టాబ్లెట్లపై 60 శాతం డిస్కౌంట్ , డీఎస్ఎల్ఆర్లో 70శాతం వరకు తగ్గింపుతో కెమెరాలు, రూ.4999 ప్రారంభ ధరతో మిర్రర్ లెస్, యాక్షన్ & డ్యాష్ కెమెరా యాక్సెస్లపై డిస్కౌంట్, ప్రారంభ ధర రూ.5199 లభించే హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ (టీవీలు, ప్రొజెక్టర్ల)పై 60 శాతం డిస్కౌంట్లు, రూ.10499 తో ప్రారంభమయ్యే సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలైన వన్ ప్లస్, మి, శాంసంగ్, ఎల్జీ, సోనీలపై ప్రత్యేక మైన ఆఫర్లు ఈ సేల్ ఉన్నాయి. మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి పండుగ రోజుల్లో ఇంటిని అందంగా అలకరించేందుకు ఇష్ట పడుతుంటాం. అలాంటి వారి కోసం అమెజాన్ సంస్థ యురేకా ఫోర్బ్స్, హావెల్స్, స్టోరీ@హోమ్, అజంతా, విప్రో, ప్రెస్టీజ్, బటర్ఫ్లై, మిల్టన్, సోలిమో వంటి బ్రాండ్లకు చెందిన హోమ్, కిచెన్ & అవుట్డోర్ ప్రొడక్ట్లపై 70శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. బెడ్రూమ్ రీడెకరేషన్/అప్గ్రేడ్ కోసం, 350K+ ఎంపిక చేసిన ఫర్నిచర్ & పరుపులపై 85% వరకు తగ్గింపు, ఫర్నీచర్, టాప్ బ్రాండ్ల నుండి బాత్ & కిచెన్ ఫిట్టింగ్లపై 70శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. స్టైలిష్గా తయారవ్వండి 4.5 లక్షల స్టైల్స్పై డీల్లతో అమెజాన్ ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్లపై 50శాతం నుంచి 80 శాతం తగ్గింపు, బిబా, డబ్ల్యూ ఫర్ ఉమెన్, మ్యాక్స్, అలెన్ సోలీ, వాన్ హ్యూసెన్ లాంటి మరెన్నో ప్రసిద్ధ బ్రాండలకు చెందిన పురుషులు, మహిళల ఫ్యాషన్ ఉత్పత్తులపై 50శాతం నుండి 80శాతం వరకు తగ్గింపు! లగ్జరీ బ్యూటీ, పెర్ఫ్యూమ్లపై 60శాతం డిస్కౌంట్, మేకప్..గ్రూమింగ్ ప్రొడక్ట్లపై 70శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇవి కాకుండా ప్రీమియం దుస్తులు, గడియారాలు, హ్యాండ్బ్యాగ్లు 60శాతం తగ్గింపు, ది డిజైనర్ బోటిక్ నుంచి 80శాతం వరకు అమెజాన్ సేల్లో పొందవచ్చు. స్పెషల్ ఆఫర్ మీకోసమే అమెజాన్ బిజినెస్ కస్టమర్లు జీఎస్టీ ఇన్ వాయిస్తో 28శాతం అదనంగా, 40శాతం ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.ఇప్పటికే అమెజాన్.ఇన్ వంటి ఆఫర్లతో పాటు డీల్స్, బ్యాంక్ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్, బిజినెస్ ఎక్స్క్లూజివ్ ద్వారా బిజినెస్ కస్టమర్లు 10% వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ www.amazon.in/business లో జీఎస్టీ నెంబర్ లేదా పాన్కార్డుతో లాగిన్ అవ్వండి. లబ్ధి పొందండి. (అడ్వర్టోరియల్) -
ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలీ సేల్: ఐఫోన్13పై కళ్లు చెదిరే ఆఫర్
సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ రానున్న దీపావళి సందర్భంగా బిగ్ సేల్ ప్రకటించింది. ఈ సందర్బంగా 30వేల లోపు స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్స్ అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ సాధారణ యూజర్లకు సంబంధించిన ఈ సేల్ అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా నథింగ్, గూగుల్, శాంసంగ్, రియల్ మీ, పోకోతో పాటు పలు బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్కార్ట్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎస్బీఐ కార్డుకొనుగోళ్లపై అదనపు తగ్గింపు కూడా లభ్యం. (Maiden Pharma వివాదాస్పద మైడెన్కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు) ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ 13పై కళ్లు చెదిరే అఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్కార్ట్ అధికారిక వెబ్సైట్లో ఆపిల్ ఐఫోన్ 128 జీబీ ధర రూ. 58,900. దీనికి రూ. 2 వేల అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే రూ.16,900 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ డిస్కౌంట్ల తరువాత ఐఫోన్ 13ని దాదాపు రూ. 45,000కి సొంతం చేసుకోవచ్చన్న మాట. రెండు నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్కార్ట్ దీపావళి సేల్లో దాదాపు రూ. 27,000కి అందుబాటులో ఉంది. దీనికి ఎస్బీఐ ఆఫర్ కూడా అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ తగ్గింపు తర్వాత రూ.59,999కి అందుబాటులో ఉంది. ఇంకా గూగుల్ పిక్స్ల్ 6ఏ ఫోను రూ. 27,999కి అందుబాటులో ఉంది. వీటి కొనుగోళ్లపై అదనంగా ఎస్బీఐ 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. గృహోపకరణాలపై 75 శాతం, టీవీలపై కూడా ఆఫర్ ఫ్లిప్కార్ట్ దీపావళి సేల్టీ సందర్భంగా టీవీలు, ఆడియో ఉత్పత్తులపై తగ్గింపులను కూడా అందిస్తుంది. గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ తెలిపింది. వినియోగదారులు రూ. 17,249కే 4కె టీవీలను కొనుగోలు చేయవచ్చు. అలాగే సాధారణ హెచ్డీ స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. -
స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి!
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల అమ్మకానికి ముందే ఐఎంఈఐ నంబర్ నమోదు తప్పనిసరి చేస్తూ టెలికం శాఖ ఆదేశాలు వెలువరించింది. 2023 జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి రానుంది. దేశీయంగా తయారైన లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్స్కూ ఈ నిబంధన వర్తిస్తుంది. అమ్మకానికి ముందే టెలికం శాఖకు చెందిన ఇండియన్ కౌంటర్ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ పోర్టల్ నుంచి ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ) నంబర్ ధ్రువీకరణ పొందాల్సిందే. ప్రతి మొబైల్కూ 15 అంకెల ఐఎంఈఐ సంఖ్య ఉంటుంది. మొబైల్ పరికరాల గుర్తింపు సంఖ్యను తారుమారు చేయడాన్ని నిరోధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెలికం నెట్వర్క్లో ఒకే ఐఎంఈఐతో నకిలీ పరికరాలు ఉండటం వల్ల పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయడం సాధ్యం కావడం లేదు. కోల్పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడానికి, ట్రేస్ చేయడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రాజెక్ట్ను ప్రభుత్వం ప్రారంభించింది. అలాంటి హ్యాండ్సెట్ల విస్తరణను అరికట్టడానికి నకిలీ పరికరాల నియంత్రణకై ఇండియన్ కౌంటర్ఫీటెడ్ డివైస్ రెస్ట్రిక్షన్ వ్యవస్థను జోడించింది. దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్స్ను నిరోధించే సౌకర్యం మాత్రమే ప్రస్తుతం పోర్టల్లో అందుబాటులో ఉంది. చదవండి: బ్లాక్ బస్టర్ హిట్: రికార్డు సేల్స్, నిమిషానికి వేలల్లో, ఒకే రోజున 87 లక్షలు! -
అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే జేబుకి చిల్లే!
దసరా పండుగ వచ్చేస్తోంది. ఇంకేముంది ఫెస్టివల్ సీజన్ వచ్చినట్లే. ఇప్పటికే దేశీయ ప్రముఖ ఈకామర్స్ సంస్థలు.. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ డే అని, మరో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ని నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 23నుంచి ప్రారంభమవుతున్నా ఈ ఆఫర్ సేల్లో మనకు కావాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ల్యాప్ ట్యాప్స్,స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. ఇంత వరకు అంతా బాగానే ఉంది గానీ ఇక్కడే మనం ఓ విషయాన్ని గుర్తించుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ►కంపెనీ ఇస్తున్న డీల్స్లను చెక్ చేయండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉన్న డీల్ల వైపు ఆకర్షితులయ్యే ముందు, అవి ఎంత నిజమైనవో చెక్ చేయండి. లాంచ్ సమయంలో కంపెనీ దాని ధర ఏమిటో చూడండి. కొన్నిసార్లు నకిలీ డిస్కౌంట్లు కూడా జాబితాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో కొందరు అమాయక కస్టమర్లు మోసపోతారు. ►డిస్కౌంట్లు ఆఫర్లు మాత్రమే కాదు ఆ వస్తువులు మనకి అవసరమా కాదా అని కూడా చూసుకోవాలి. లేదంటే కొన్న తర్వాత వాటిని వాటిని వాడకుండా ఇంట్లో ఓ మూలనా ఉంచాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆ వస్తువు నిరుపయోగంగా మారుతుంది. ►మీ కార్ట్లో త్వరగా మంచి డీల్లను ఉంచుకోండి. లేదంటే ఆఫర్ ముగిసిపోతుందనే తొందరలో మంచి వస్తువులను మిస్ చేసుకునే చాన్స్ ఉంది. కొనుగోలు చేసే ముందు మీరు కొందామని అనుకుంటున్న వస్తువుని ఇతర వాటితో పోల్చి చూడడం ఉత్తమం. ►బ్యాంక్ ఆఫర్లను సరి చూసుకోవాలి అలాగే వస్తువులపై కంపెనీ ఇస్తున్న తగ్గింపు ధరలను సరిగా చెక్ చేసుకోవాలి. వీటితో పాటు బయటి మార్కెట్లో, ఇతర వెబ్సైట్లో వాటి ప్రస్తుత ధర ఎంత ఉందనేది కూడా తెలసుకోవాలి. మీరు కొనుగోలు చేయదలుచుకున్న ప్రాడెక్ట్ మీ బడ్జెట్లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవడం ఉత్తమం. ►షిప్పింగ్ చార్జ్ల విషయంలోనూ తనిఖీ చేయండి. ఈఎంఐ(EMI) ఆఫర్ను సరిగా లెక్కించుకోండి. చదవండి: ఇన్ఫినిక్స్ నుంచి తొలి 55 ఇంచెస్ టీవీ.. తక్కువ ధరకే వావ్ అనిపించే ఫీచర్లు! -
అజియో ‘ఆల్స్టార్స్ సేల్’ ఆఫర్..ఇంకా చాలా సర్ప్రైజెస్!
బెంగళూరు: ఆన్లైన్ ఈ-ఫ్యాషన్ రీటైలర్ ఆజియో ఫెస్టివ్ సీజన్లో ‘ఆల్స్టార్స్ సేల్’ పేరుతో సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్స్కు చెందిన 10 లక్షలకు పైగా భిన్న వస్త్రాలపై 50శాతం నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. అంతేకాదు తొలిసారి యాప్ సైన్ అప్ ద్వారా రూ.500 తక్షణ క్యాష్బ్యాక్ను పొందవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్ సెప్టెంబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. చదవండి : iphone14: గుడ్ న్యూస్.. భారీ ఆఫర్ ఎక్కడంటే? Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్ -
నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ సంస్థ యజమాని తల్లిదండ్రుల పేరుతో ఉన్న ఇంటిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో విక్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ అధికారులు ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ అరెస్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెల్లాపూర్కు చెందిన విజయ్కుమార్ సాఫ్ట్వేర్ సంస్థ నిర్వహిస్తున్నాడు. అతడి తల్లిదండ్రులకు నల్లకుంటలో ఇల్లు ఉంది. దానికి ప్రతి సంవత్సరం ఆస్తిపన్ను, ఇతర పన్నులు చెల్లిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు అక్కడే నివసించిన విజయ్ తల్లిదండ్రులు కోవిడ్ నేపథ్యంలో కుమారుడి వద్దకే వెళ్లిపోయారు. దీంతో ఈ ఇంటిపై కన్నేసిన నాగ నాయక్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి ముఠా కట్టాడు. నకిలీ పత్రాలు సృష్టించి రూ.2 కోట్ల విలువైన ఆ ఇంటిని రూ.75 లక్షలకు అమ్మేశారు. ఇంటిని ఖరీదు చేసుకున్న వారు జీహెచ్ఎంసీలో మ్యూటేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేసుకున్నారు. ఇవేమీ తెలియని విజయ్ ఈ ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్ను ఆన్లైన్లో చెల్లించేందుకు ప్రయత్నించారు. దీనికోసం పీటిన్ ఎంటర్ చేయగా... ఆ ఇల్లు బత్తిని భాస్కర్గౌడ్, బత్తిని భువనేశ్వరీ పేర్లతో ఉన్నట్లు కనిపించింది. వెబ్సైట్లోనే లభించిన నెంబర్కు ఫోన్ చేయగా భాస్కర్ మాట్లాడారు. తమకు కొడవత్ నాగ నాయక్ అనే వ్యక్తి ఇంటిని విక్రయించాడంటూ అతడి నెంబర్ ఇచ్చారు. అతడికి ఫోన్ చేయగా తన తండ్రి కొడావత్ సూక్య ద్వారా వచ్చిన ఆ ఆస్తిని భాస్కర్కు విక్రయించానని, 1978లో మీ తల్లి మాకు అమ్మిందంటూ చెప్పాడు. దీంతో బాధితుడు ఇదంతా అవాస్తవమని, మా తల్లి ఎవరికీ విక్రయించలేదని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి క్రయ విక్రయాలు చేశారంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ దామోదర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. అనేక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో నాగ నాయక్ సూత్రధారని, మరికొందరు సహకరించినట్లు గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. నాగ నాయక్పై వాడపల్లి పోలీసుస్టేషన్ ఓ డబుల్ మర్డర్ కేసు ఉందని, అందులో జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: హీటెక్కిన స్టేట్..!) -
మరో సంస్థను అమ్మకానికి పెడుతోన్న కేంద్రం!
న్యూఢిల్లీ: మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్లో ప్రభుత్వానికిగల వాటా విక్రయ నిర్వహణను చేపట్టేందుకు మర్చంట్ బ్యాంకర్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. హింద్ జింక్లో ప్రభుత్వానికి 29.53 శాతం వాటా ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ జాబితాలో ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థలు శుక్రవారం(12న) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాటా విక్రయ నిర్వహణపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. కంపెనీలో ప్రస్తుతం వేదాంతా గ్రూప్ 64.92 శాతం వాటాను కలిగి ఉంది. చదవండి👉 రెండు బ్యాంకులకు కేంద్రం మంగళం..అమ్మకానికి సర్వం సిద్ధం? -
మార్కెట్లో పెళ్లి కొడుకుల విక్రయం.. ఎక్కడో కాదు మన దేశంలోనే!
పట్నా: పెళ్లైన కొత్తలో మూవీలో హైటెక్ మ్యారేజ్ బ్యూరో పేరుతో సునీల్ పెళ్లికొడుకులను విక్రయానికి పెడతాడు. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసినట్లు పెళ్లి కొడుకులను కొనుగోలు చేయటం వింటే వింతగా ఉంది కదా?. అయితే.. అలాంటి మార్కెట్ ఒకటి నిజ జీవితంలో ఉందని మీకు తెలుసా? బిహార్లోని మధుబని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్ నిర్వహిస్తారు. స్థానిక మార్కెట్ ప్రాంతంలోని చెట్ల కిందే ప్రతిఏటా 9 రోజుల పాటు ఈ పెళ్లి కొడుకుల విక్రయాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం సుమారు 700 ఏళ్ల నుంచి వస్తున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. స్థానికులు ఈ పద్ధతిని సౌరత్ సభా అని పిలుస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందిన వారు తమ కుమార్తెలను తీసుకుని ఈ మార్కెట్కు వస్తారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ మార్కెట్లో వేల మంది పెళ్లి కొడుకులు వారి కుటుంబ సభ్యులతో వస్తారు. సంప్రదాయ ధోతి, కుర్తా లేదా షీన్స్, టీషర్ట్ ధరిస్తారు. వారి ఆస్తులు, విద్యా అర్హతలను బట్టి వారికి రేటు నిర్ణయిస్తారు. పెళ్లి కొడుకును కొనుగోలు చేసే ముందు అతడి అర్హతలు, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తారు ఆడపిల్లల కుటుంబ సభ్యులు. అలాగే జన్మదినం, పాఠశాల ధ్రువపత్రాల వంటివి అడుగుతారు. వరుడిని వధువు ఎంపిక చేసుకున్న తర్వాత ఇరువురి కుటుంబాలు మిగతా కార్యక్రమాలు చేపడతాయి. వివాహాన్ని ఆడపిల్ల కుటుంబమే నిర్వహిస్తుంది. కర్నాత్ వంశపాలన కాలం నుంచి ఈ సంప్రదాయం వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విభిన్న గోత్రాల ప్రజల మధ్య పెళ్లిళ్లు చేసేందుకు రాజా హరిసింగ్ దీనిని ప్రారంభించినట్లు వెల్లడించారు. మరోవైపు.. వివాహాలు కట్నం లేకుండా చేయటమే దీని లక్ష్యంగా మరికొందరు తెలిపారు. Groom market’ In this unique 700-year-old tradition, the aspiring husbands stand in public display, Village famous for its ” annual “groom market” in India’s Bihar state -in Madhubani district Dowry though illegal in India, is prevalent and has a high social acceptance pic.twitter.com/G5428fE2Kz — Elmi Farah Boodhari (@BoodhariFarah) August 4, 2022 ఇదీ చదవండి: కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు -
స్వీట్ 16: త్వరపడండి అంటూ ఊరిస్తున్న ఇండిగో!
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరలో విమాన టికెట్లను సందించే ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణీకుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘స్వీట్ 16’ అంటూ తన కస్టమర్లను ఊరిస్తోంది. కేవలం రూ. 1616 ప్రారంభ ధరతో విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. యానివర్సరీ ఆఫర్గా అందిస్తున్న ఈ సేల్ ఆగస్ట్ 5 వరకే ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఇండిగోట్వీట్ చేసింది. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) ఇండిగో సర్వీసులు ప్రారంభించి 16 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ ఆఫర్ తీసుకు రావడం విశేషం. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఆగస్ట్ 3న ప్రారంభమై ఆగస్ట్ 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్లో రూ. 1616 ప్రారంభ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. ఇది కూడా చదవండి: నిర్మలా సీతారామన్పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ అలాగే హెచ్ఎస్బీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారు రూ. 800 వరకు క్యాష్బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆగస్ట్ 18 నుంచి 2023 జూలై 16 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని ఇండిగో ట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే పలు విమానయాన సంస్థలు తక్కువ ధరల్లో విమాన టికట్ల ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. Our #Sweet16 is here and we’ve got a sweet deal for you. 🎉🎉 Book your flights with fares starting at ₹1,616*. Don’t wait up, offer only valid till 5th August, 2022 for travel between 18th August, 2022 and 16th July, 2023. https://t.co/ViwbeYHuhQ#6ETurns16 #LetsIndiGo pic.twitter.com/CsekvQJtsx — IndiGo (@IndiGo6E) August 3, 2022 -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్:స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్
సాక్షి, హైదరాబాద్: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022కు తెరతీసింది. నేటి (జూలై 23న) అర్థరాత్రి నుంచిబిగ్ సేవింగ్డేస్ సేల్ షురూ కానుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్లో కస్టమర్లు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్స్పై డిస్కౌంట్లు, స్పెషల్ డీల్స్ను పొందవచ్చు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్పై 80 శాతం వరకు తగ్గింపును, టీవీలు, ఇతర ఉపకరణాలపై 70 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఒప్పో, ఆపిల్, వివో, మోటరోలా తదితర స్మార్ట్ఫోన్లపై తగ్గింపు రేట్లు అందిస్తోంది. అలాగే హెడ్ఫోన్లపై 70 శాతం వరకు తగ్గింపును కూడా అందజేయనుంది. మౌస్, రూటర్లు, కీబోర్డులు తదిర కంప్యూటర్ ఉపకరణాలు రూ.99 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. బిగ్ స్క్రీన్ టాబ్లెట్ కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లు 45 శాతం తగ్గింపుతో దీన్ని సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్లపై 65 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. అంతేకాదు సేల్ ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటలకు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు తాజా డీల్స్ను కూడా ప్రకటిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంకు, కోటక్ బ్యాంక్ ,ఆర్బిఎల్ బ్యాంక్ కార్డ్లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ‘ప్లస్’ సభ్యుల కోసం ఇప్పటికే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ డే సేల్ కూడా జూలై 23 అర్ధరాత్రి నుండి ప్రారంభం కానుంది. ఇది కూడా చదవండి: ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు -
ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: భారీ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ ఏడాది కూడా బిగ్ బచత్ ధమాల్ సేల్ను ప్రారంభించింది. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు ఈ ధమాకా సేల్ కొనసాగనుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. దీంతోపాటు ఫోన్ ఉపకరణాలు, ల్యాప్టాప్లు, గాడ్జెట్లు, దుస్తులు, గృహోపకరణాలను కూడా తగ్గింపు ధరల్లో అందిస్తోంది. భారీ తగ్గింపులతో పాటు, తన కస్టమర్లకు నోకాస్ట్ ఈఎంఐ, ఉచిత డెలివరీ కూడా ఉంది. అలాగే వినియోగదారుల షాపింగ్ సౌలభ్యం కోసం, ఫ్లిప్కార్ట్ కొత్త పేజీని సృష్టించింది. ఈజీగా ఇక్కడ పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. వివో ఎక్స్ 70 ప్రో: 8జీబీ ర్యామ్, 128 స్టోరేజ్ వేరియంట్ రూ.46,990. అందమైన ఫోటోలకు కేరాఫ్ ఎడ్రస్ ఈ ఫోన్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఇన్-బిల్ట్ గింబల్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అందిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 20 ప్రొ 5జీ: ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో ఈ మొబైల్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999కి అందుబాటులో ఉంది. దీనివాస్తవ ధర 45,999. స్మార్ట్ఫోన్లో 108+16 +8ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లభ్యమవుతున్న ఈ ఫోన్ ఫోటోలంటే ఇష్టపడే వారికి కూడా ఇది మంచి ఆప్షన్. పోకో 5జీ ప్రొ: బడ్జెట్ ధరలో లభించే 5జీ స్మార్ట్ఫోన్. 6 జీబీ వేరియంట్ ధర 14,499లకే లభ్యం. దీని అసలు ధర 16,499. ఐఫోన్ 12 మినీ: ఐఫోన్ 12 మినీ 128 జీబీ స్టోరేజ్ మోడల్ ఈ సేల్లో రూ. 49,999కి అందుబాటులో ఉంది. దీని వాస్తవ ధర 59,900. ఐఫోన్ 13 లాంటి ఇతర ఆపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. పోకో ఎఫ్4 5జీ: పోకో లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ పోకో ఎఫ్4 5జీ ఫ్లిప్కార్ట్ సేల్లో రూ.27,999కి అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, అదనంగా 3 వేల తగ్గింపు లభిస్తుంది. -
తక్కువ ధరలో టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఎలక్ట్రానిక్స్ సేల్ ఉందిగా!
సాక్షి, ముంబై: వాషింగ్మెషీన్లు, ఏసీలు,టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లపై ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తగ్గింపు ధరల సేల్ ప్రారంభించింది. ముఖ్యంగా టీవీలపై భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ఈ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 23 నుంచి 27 వరకు కొనసాగనుంది. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ సేల్లో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1500 తగ్గింపు కూడా లభ్యం. వూ ప్రీమియం అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 అంగుళాల అల్ట్రా హెచ్డీ (4కే ) ఎల్ఈడీ టీవీ ఎలక్ట్రానిక్స్ సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్లో రూ. 26,999లకే లభ్యం. దీని ఎంఆర్పీ ధర రూ. 45,000. యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై 5 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ను కూడా అందిస్తోంది. ఎంఐ 5 ఎక్స్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 అంగుళాల అల్ట్రా హెచ్డీ (4కే)టీవీని ఫ్లిప్కార్ట్ ఇపుడు రూ. 31,999 దీని ఎంఆర్పీ ధర రూ. 49,999. 8 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్. HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై 2,000 తగ్గింపు. రియల్మీ హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32-అంగుళాల హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని ఫ్లిప్కార్ట్ రూ. 15,999లకే సొంతంచేసుకోవచ్చు. దీని ఎంఆర్పీ ధర రూ. 17,999. దీంతోపాటు 8 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభ్యం. Axis Bank కార్డ్పై 5 శాతం క్యాష్బ్యాక్ను కూడా అందిస్తోంది. వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC వోల్టాస్ 1.5 టన్న 5 స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ తక్కువ ధర రూపాయలలో ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. రూ. 67,990 ల ఏసీని ఈ సేల్ లో కేవలం రూ. 37,999లకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 2022 సందర్భంగా. Axis బ్యాంక్ కార్డ్పై 5 శాతం క్యాష్బ్యాక్. శాంసంగ్ సింగిల్ డోర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ శాంసంగ్ 198 లీటర్ల 198 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ రూ. 18,000 (ఎంఆర్పీ ధర రూ. 21,990). 12 వేల రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై 5 శాతం క్యాష్బ్యాక్ను కూడా అందిస్తోంది. ఒనిడా 7కేజీ 5 స్టార్ వాషింగ్ మెషీన్ ఒనిడా 7కేజీ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ తగ్గింపు ధరలో రూ.13,490కి లభ్యం. దీని ఎంఆర్పీ ధర. రూ. 21,990 ఎక్స్ఛేంజ్ ఆఫర్తో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. -
నేటి నుండి పసిడి బాండ్ల విక్రయం
న్యూఢిల్లీ: తదుపరి విడత సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) విక్రయం సోమవారం ప్రారంభమై అయిదు రోజుల పాటు కొనసాగనుంది. ఇష్యూ ధరను గ్రాము బంగారానికి రూ. 5,091గా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ బాండ్ల విక్రయం చేపట్టడం ఇదే తొలిసారి. ఆన్లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్ విధానంలో చెల్లిస్తే గ్రాముకు రూ. 50 చొప్పున డిస్కౌంటు లభిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2015 నవంబర్లో ప్రారంభమైనప్పట్నుంచీ ఈ స్కీము ద్వారా ప్రభుత్వం రూ. 38,693 కోట్లు (సుమారు 90 టన్నుల బంగారం విలువ) సమీకరించింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో (2020–21, 2021–22) ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఏకంగా రూ. 29,040 కోట్ల మేర బాండ్లను కొనుగోలు చేశారు. ఈ స్కీము ద్వారా ఇప్పటిదాకా ప్రభుత్వం సమీకరించిన నిధుల్లో ఇది దాదాపు 75 శాతానికి సమానం కావడం గమనార్హం. -
ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్టాప్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. జూన్ 11నుంచి మొదలైన ఈ సేల్ 17వ తేదీవరకు కొనసాగనుంది. తాజాగా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2022 సేల్లో ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ వినియోగదారుల కోసం డీల్లు, డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్లో భాగంగా ల్యాప్టాప్లు, కంప్యూటర్లతో సహా ఎలక్ట్రానిక్స్పై డిస్కౌంట్స్ ప్రకటించింది. ప్రధానంగా లెనోవా, ఆసుస్, హెచ్పీ, షావోమీ, ఎంఎస్ఐ ఏసర్ లాంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్టాప్స్ తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై 10 శాతం తక్షణ తగ్గింపు. అలాగే పేటీఎం Paytm వాలెట్ , యూపీఐ లావాదేవీలపై 10 శాతం క్యాష్బ్యాక్ను కూడా అందిస్తోంది. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆసుస్ వివో బుక్ కే15 ఓఎల్ఈడీ ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం రూ. 52,990కే లభ్యం. ఎంఆర్పీ ధర రూ.78,990. అంటే సుమారు 32 శాతం తగ్గింపు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై 10 శాతం తగ్గింపు, రూ. 18,100 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లెనోవా థింక్బుక్ 13ఎస్ ఫ్లిప్కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్లో భారీ తగ్గింపు లభిస్తున్న వాటిల్లో ఇది కూడా ఒకటి. 51 శాతం డిస్కౌంట్తో లెనోవా థింక్బుక్ 13ఎస్ ను కేవలం 54,990 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. దీనికి ఎంఆర్పీ ధర రూ. 1,12,608. దీనికి 10 శాతం తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్ అదనం. రెడ్మీబుక్ ప్రో ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో 28శాతం డిస్కౌంట్తో రూ. 42,990 ధరకే లభిస్తోంది రెడ్మీబుక్ ప్రో. దీని ఎంఆర్పీ ధర రూ. 59,990. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఎంఎస్ఐ మోడ్రన్ 14 ఈ ల్యాప్టాప్ను రూ. 43,990 అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై 10 శాతం తగ్గింపును 18,100 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభ్యం. -
రియల్టీ చరిత్రలో ఇదో రికార్డ్.. భారీ ధరకు అమ్ముడైన దయ్యాల కొంప
ఓ ప్రాపర్టీ మంచిది కాదనే పేరు పడితే చాలు ఎంత ప్రైమ్ లోకేషన్లో ఉన్నా, వాస్తు దోషాలు లేకున్నా, ఎమినిటీస్ బాగున్నా ఆ ప్రాపర్టీ అమ్ముడుపోదు. కొనేందుకు ఒక్కరూ ముందుకు రారు. కానీ అమెరికాలో ఈ భయంగొలిపే ఓ భవనం మాత్రం రియల్టీ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తూ రికార్డు రేటుకు అమ్ముడై పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు వాల్స్ట్రీట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూత్బంగ్లా హాలీవుడ్ సినిమా ప్రియులకు ఆమాట కొస్తే హరర్ మూవీ లవర్స్కి కంజ్యూరింగ్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. దెయ్యాలు, భూతాలు, ప్రేతాలకు సంబంధించి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా కంజ్యూరింగ్ సిరీస్లో సినిమాలు వస్తున్నాయి. ఆండ్రియా పెరాన్ (67) అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులు 1971 నుంచి 1980 వరకు రోడే ఐలాండ్లో ఓ ఫార్మ్హౌజ్లో నివసించారు. కంజ్యూరింగ్ కొంప 1736లో కట్టిన ఆ ఫార్మ్హౌజ్లో పెరాన్ కుటుంబానికి దెయ్యాలతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఆ ఫార్మ్హౌజ్లో జరిగిన సంఘటనల ఆధారంగా 2013లో కంజ్యూరింగ్ సినిమాను తెరకెక్కించగా బాక్సాఫీసు దగ్గర దుమ్మురేపింది. అయితే అప్పటి వరకు ఆ ఫార్మ్హౌజ్ గురించి స్థానికులకు మాత్రమే తెలుసు. కంజ్యూరింగ్ పుణ్యమా అని ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి ఆ ఇళ్లు అంటే హడల్ అందరికీ. దయ్యాలపై ప్రయోగాలు అయితే ఇటీవల దెయ్యాల కొంపగా పేరుపొందిన తన ఫార్మ్హౌజ్ను అమ్మేందుకు ఎంతగా ప్రయత్నించినా ఎవరూ కొనలేదు. రెండు దశబ్ధాల తర్వాత 2019లో అమ్మగలిగాడు. ఈ ఇంటిని జెన్, కోరి హైన్జన్ అనే ఇద్దరు వ్యక్తులు కంజూరింగ్ దయ్యాల కొంపను సొంతం చేసుకున్నారు. ఎందుకంటే వీరిద్దరు అప్పటికే ఆత్మల పరిశోధనలు చేస్తున్నారు. దీంతో ఈ ఇళ్లు తమ పరిశోధనలకు పనికి వస్తుందని 4,39,00 డాలర్లకు కొనుగోలు చేశారు. ఏం జరిగిందో మరి ఆ దయ్యాల కొంపలో జెన్, కోరి హైన్జన్ ప్రయోగాలు పూర్తయ్యాయో లేదా వాళ్లకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాలో తెలియదు కానీ వాళ్లు రెండేళ్లు మించి ఈ ఇంటిని తమతో అట్టిపెట్టుకోలేకపోయారు. 2021 సెప్టెంబరులో ఈ ఇంటిని 1.2 మిలియన్ డాలర్లు ఆస్కింగ్ ప్రైజ్గా నిర్ణయించి అమ్మకానికి పెట్టారు. ఆ దెయ్యాల కొంపను ఫ్రీగా ఇచ్చినా ఎవరూ కొనరు. అలాంటిది 1.2 మిలియన్ డాలర్లు చెల్లించి ఎవరు సొంతం చేసుకుంటారనే మాటలు అంతటా వినిపించాయి. ఎవరతను? అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కొద్ది రోజుల్లోనే ఈ భూత్బంగ్లాను సొంతం చేసుకునేందుకు చాలా మంది పోటీ పడ్డారు. ఆస్కింగ్ ప్రైజ్ను మించి చెల్లించేందుకు రెడీ అయ్యారు. దీంతో ఏకంగా 1.52 (రూ. 12 కోట్లు) మిలియన్ డాలర్లకు ఇళ్లు అమ్ముడైపోయింది. 3100 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ భూత్బంగ్లా కొత్త ఓనర్ ఎవరనేది మాత్రం గోప్యంగా ఉంచారు. చదవండి: లగ్జరీ హోమ్స్కే డిమాండ్ ఎక్కువ: 3 బీహెచ్కే సేల్స్ జూమ్ -
వామ్మో ఆ కారుకి అంత డిమాండా? ఏడాదిన్నర వెయిటింగ్ పీరియడ్!!
రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందంటూ వరుసగా ఆటో మొబైల్ కంపెనీలు ధరలు పెంచుతూ పోతున్నాయి. ఐనప్పటికీ కార్లకున్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. ఇక లేటెస్ట్ ఫీచర్లతో విడుదలైన కార్లను కొనుగోలు చేసేందుకయితే ప్రజలు పోటీ పడుతున్నారు. దీంతో వెయిటింగ్ పీరియడ్ పెరుగుతూ పోతోంది. కరెన్స్ కావాలి ఈ ఏడాది రిలీజైన కార్లలో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న కారుగా కియా కరెన్స్ నిలుస్తోంది. ఈ కారుని 2022 ఫిబ్రవరి 15న ఇండియా మార్కెట్లో లాంచ్ చేశారు. ప్రారంభ ధరగా రూ.8.99 లక్షలుగా నిర్ణయించగా ఆ వెంటనే ధరలను సవరించి రూ.9.59 లక్షలకు పెంచారు. ఐనప్పటికీ ఈ కారుకి డిమాండ్ తగ్గడం లేదు. ఏప్రిల్ వరకు 12 వేల యూనిట్లు దేశీయంగా అమ్ముడైపోగా 50వేల కార్లకు బుకింగ్ జరిగింది. కనీసం 23 వారాలు కియా కరెన్స్లో ఐదే వేరియంట్లు ఉన్నాయి. ఇందులో పెట్రోల్/ డీజిల్, మాన్యువల్/ఆటో గేర్ షిఫ్ట్, 6/7 సీటర్ వేరియంట్లు ఉన్నాయి. ఇందులో ధర తక్కుగా ఉన్న బేసిక్ వేరియంట్ అయిన ప్రీమియం 1.5 లీటర్ పెట్రోల్ మాన్యువల్ను సొంతం చేసుకోవాలంటే గరిష్టంగా 75 వారాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని కియా ప్రతినిధులు తెలిపారు. ఇక ఇందులో హైఎండ్ వేరియంట్ అయిన లగ్జరీ ప్లస్ అయితే 23 వారాల వెయింటింగ్ పీరియడ్ ఉంది. మహీంద్రా ఇక ఇండియాలో అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉన్న మోడల్గా మహీంద్రా ఎక్స్యూవీ 7ఓఓ మోడల్ ఉంది. లేటెస్ట్ ఫీచర్లతో మహీంద్రా గతేడాది రిలీజ్ చేసిన ఈ మోడల్ను సొంతం చేసుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ముందస్తుగా బుకింగ్స్ చేసుకుంటున్నారు. దీంతో ఈ కారు పొందాలంటే 20 నెలల నుంచి రెండేళ్ల వరకు వెయింటింగ్ పీరియడ్ ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, టయోటా వేలకోట్ల పెట్టుబడులు! -
జూన్ నాటికి పవన్హన్స్ అమ్మకం
న్యూఢిల్లీ: హెలికాప్టర్ సేవల సంస్థ పవన్హన్స్ను స్టార్9 మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్కు జూన్ నాటికి అప్పగించడం పూర్తవుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. బిగ్ చార్టర్ ప్రైవేటు లిమిటెడ్, మహారాజ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్, ఆల్మాస్ గ్లోబల్ అపార్చునిటీస్ ఫండ్ ఎస్పీసీతో కూడిన కన్సార్షియమే స్టార్ 9 మొబిలిటీ. పవన్ హన్స్ కొనుగోలుకు రూ.211.14 కోట్లను కోట్ చేసి గరిష్ట బిడ్డర్గా ఈ సంస్థ నిలవడం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్ ధర రూ.199.92 కోట్లుగా ఉంది. స్టార్9 మొబిలిటీ కొన్ని అంశాల్లో అర్హతల ప్రమాణాలను చేరుకోలేదన్న ఆరోపణలను ఆ అధికారి ఖండించారు. ప్రభుత్వం కనీసం రూ.300 కోట్ల నెట్వర్త్ ఉండాలని నిర్ధేశించగా, గరిష్ట బిడ్డర్ స్టార్9 మొబిలిటీకి రూ.691 కోట్ల నెట్వర్త్ ఉన్నట్టు చెప్పారు. కన్సార్షియంలోని మహారాజ ఏవియేషన్ 2008లో ఏర్పాటు కాగా, బిగ్చార్టర్ 2014లో ఏర్పడినట్టు గుర్తు చేశారు. ఆల్మాస్ గ్లోబల్ అపార్చునిటీస్ ఫండ్ సైతం 2017 నుంచి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ మూడు సంస్థలు భారతీయులకు చెందినవేనని పేర్కొన్నారు. చదవండి: ఓఎన్జీసీకే మెజారిటీ ఆయిల్, గ్యాస్ బ్లాకులు -
బీపీసీఎల్ ప్రయివేటైజేషన్, కొత్త దారిలో అమ్మకానికి సన్నాహాలు!
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రయివేటైజేషన్ను సరికొత్త రీతిలో చేపట్టవలసి ఉన్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. వాటా అమ్మక నిబంధనల సవరణ తదితర చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. వెరసి బీపీసీఎల్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ అంశంలో తిరిగి డ్రాయింగ్ బోర్డుకు వెళ్లవలసి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. కన్సార్షియం ఏర్పాటు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఇంధన మార్పులు తదితర సవాళ్లున్నట్లు తెలియజేశారు. కంపెనీలో ప్రభుత్వం 52.98 శాతం వాటా విక్రయానికి సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వేదాంతా గ్రూప్సహా మూడు కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ఫైనాన్షియల్ బిడ్స్ను ఆహ్వానించవలసి ఉంది. పర్యావరణ అనుకూల, పునరుత్పాదక ఇంధనాలవైపు ప్రపంచం దృష్టిసారించిన నేపథ్యంలో బీపీసీఎల్ ప్రస్తుత ప్రయివేటైజేషన్ ప్రక్రియకు సవాళ్లు ఎదురుకానున్నట్లు ప్రభుత్వ అధికారి వివరించారు. -
అమ్మకానికి సీతాకోక చిలుక ఇల్లు, సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్న జనం!
సొంతిల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. అందుకే ఆ కలను నిజం చేసుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటాం. అదిగో అలా కట్టుకుందే ఈ సీతా కోక చిలుక ఇల్లు. ప్రపంచంలోనే విలక్షణమైన ఇల్లుగా ప్రసిద్ధి చెందిన..ఈ బటర్ ఫ్లై హౌస్ను అమ్మకానికి పెట్టారు. ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశమైన 'గ్రీస్'దేశంలోని వౌలియాగ్మెని బీచ్ సరిహద్దుల్లో ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటిని ఎవరు నిర్మించారు. ఎప్పుడు నిర్మించారనే విషయాలు వెలుగులోకి రాకున్నా.. ప్రస్తుతం ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 5381 స్కైర్ ఫీట్లో నిర్మాణం వౌలియాగ్మెని బీచ్ సరిహద్దుల్లో 5381 స్కైర్ ఫీట్లో ఇంటి నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాంటి వాల్స్ లేకుండా నిర్మించిన ఈ ఇల్లు ఫ్లోర్ ఫోర్ల్ ఎలివేటర్(లిఫ్ట్)సౌకర్యం ఉంది. సీతాకోక చిలుక ఇన్స్పిరేషన్తో నిర్మించిన ఈ ఇంటికి షేడింగ్, గోప్యత ఉండేలా ఆర్కిటెక్చర్లు డిజైన్ చేశారు. దిగువ అంతస్తులో హోమ్ థియేటర్, మూడు అదనపు బాత్రూమ్లతో మూడు బెడ్రూమ్లు కూడా ఉన్నాయి. నిజంగా స్మార్ట్ హోమే! స్మార్ట్ హోమ్గా ప్రసిద్ధి చెందిన ఈ బటర్ ఫ్లై హోంలో ఐదు బెడ్ రూమ్లు, నాలుగు బాత్రూంలు, ఇల్లు ఐదు బెడ్రూమ్లు, నాలుగు బాత్రూమ్లు, ప్రైవేట్ బేస్మెంట్ ఉంది. ఈ ప్రైవేట్ బేస్మెంట్ను స్టోరేజ్, డార్క్ రూమ్, పార్కింగ్ ఏరియాలుగా ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఒక గడపలో నుంచి లోపలికి వెళితే గోడలు, డోర్లను ఏర్పాటు చేస్తూ కిచెన్ , లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ ఉండేలా ఓపెన్ ప్లాన్ లివింగ్ ఏరియా, జియో మెట్రిక్ షేప్లో నిర్మించిన ఇండోర్ పూల్తో ఈ స్మార్ట్ హోమ్ చూపరులను కట్టిపడేస్తుంది. క్యూ కడుతున్నారు! చిత్రంలో చూపించినట్లుగా.. పై నుంచి చూస్తే సీతాకోక చిలుకలా కనిపిస్తుంది. సీతాకోక చిలుక డిజైన్ వచ్చేలా ఇంటిని నిర్మించేందుకు ఇంటిపై కప్పులు ఓవల్ ఆకారపు హోల్స్తో అందంగా తీర్చిదిద్దారు. ఇక ఈ ఇల్లును $6.78 మిలియన్లకు (రూ. 52 కోట్లు) అమ్మకానికి పెట్టినట్లు వెలుగోలోకి వచ్చిన రిపోర్ట్లు పేర్కొన్నాయి. అయితే ప్రపంచంలో విభిన్నంగా సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఇంటిని సొంతం చేసుకునేందుకు స్థానికంగా ఉండే ధనికులతో పాటు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు క్యూ కడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చదవండి: షాకింగ్,హైదరాబాద్లో చదరపు అడుగు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు! -
చేతులు మారిన ల్యూమినస్ ఎలక్ట్రికల్!
న్యూఢిల్లీ: ల్యూమినస్ పవర్కు చెందిన హోమ్ ఎలక్ట్రికల్ బిజినెస్(హెచ్ఈబీ)ను కొనుగోలు చేసినట్లు వైర్లు, కేబుళ్ల తయారీ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ తాజాగా పేర్కొంది. ఫ్రెంచ్ ఇంజినీరింగ్ దిగ్గజం ష్నీడర్ నుంచి ల్యూమినస్ హెచ్ఈబీని సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. తద్వారా తమ కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ బిజినెస్ మరింత పటిష్టంకానున్నట్లు టీపీజీ క్యాపిటల్కు పెట్టుబడులున్న ఆర్ఆర్ కేబుల్ అభిప్రాయపడింది. ల్యూమినస్ పోర్ట్ఫోలియోలో ఫ్యాన్లు, లైట్లు, అప్లయెన్సెస్ తదితరాలున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఐపీవోకు వచ్చే యోచనలో ఉన్నట్లు ఆర్ఆర్ కేబుల్ ఎండీ శ్రీగోపాల్ కాబ్రా విలేకరుల వర్చువల్ సమావేశంలో తెలియజేశారు. ల్యూమినస్ పవర్ డీల్ ఈ ఏడాది మే నెలకల్లా పూర్తికావచ్చని అంచనా వేశారు. అటు ల్యూమినస్, ఇటు ఆర్ఆర్ అన్లిస్టెడ్ కంపెనీలు కావడంతో డీల్ విలువను వెల్లడించలేమన్నారు. ల్యూమినస్ కొనుగోలు ద్వారా ఫ్యాన్లు, లైట్లు తదితరాల ప్రీమియం విభాగంలోకి ప్రవేశించినట్లు వివరించారు. బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం నాలుగేళ్లపాటు ల్యూమినస్ను ప్రొడక్టులకు వినియోగించుకునే వీలున్నట్లు వెల్లడించారు. ల్యూమినస్ పవర్లో 74% వాటాను ష్నీడర్ 2011లో కొనుగోలు చేసింది. 2017లో మిగతా 26% వాటా సొంతం చేసుకుంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్...స్మార్ట్ఫోన్స్,ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!
Flipkart Big Saving Days Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలుదారుల కోసం బిగ్ సేవింగ్ డేస్ సేల్ - 2022ను ప్రకటించింది. ఈ సేల్ ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, ఆఫర్స్ను ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులు 12 గంటల ముందుగానే బిగ్ సేవింగ్ డేస్ సేవింగ్స్లో పాల్గొనే అవకాశాన్ని ఫ్లిప్కార్ట్ కల్పిస్తోంది. ఈ సేల్ భాగంగా ఐసీఐసీఐ బ్యాంకుతో కొనుగోలుచేసే ఉత్పత్తులపై 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఇక పలు స్మార్ట్ఫోన్స్ కొనుగోలుపై భారీ తగ్గింపును ప్రకటించింది ఫ్లిప్కార్ట్. శాంసంగ్, రెడ్మీ, షావోమీ, రియల్మీ, మోటరోలా, ఇన్ఫీనిక్స్ కంపెనీల స్మార్ట్ఫోన్స్ కొనుగోలుపై తగ్గింపు వర్తించనుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్-2022లో పలు మొబైల్ ఫోన్స్పై ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న డీల్స్.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లలోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ సేల్లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ఫోన్ రూ. 15, 999కు లభించనుంది. దీని లిస్టెడ్ ధర రూ. 22, 999. ఇదిలా ఉండగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో ఈఎంఐలో కొనుగోలుచేస్తే అదనంగా రూ. 1,000 తగ్గింపున పొందవచ్చును. రెడ్మీ నోట్ 10టీ 5జీ భారత్లో అత్యంత సరసమైన 5G స్మార్ట్ఫోన్లలో రెడ్మీ నోట్ 10టీ 5జీ కూడా ఒకటి. ఈ స్మార్ట్ఫోన్ రూ. 13,999 కు రానుంది. దీని అసలు ధర రూ.16,999. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే...రూ. 1000 వరకు తక్షణ తగ్గింపు కూడా రానుంది. ఈ స్మార్ట్ఫోన్పై ఎక్సేఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ ధర రూ. 19,499 కు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 25,999. పోకో ఎం4 ప్రో 5జీ పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ కొనుగోలుదారులకు రూ. రూ. 12, 999 అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 16,999 గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్పై ఎక్సేఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ ధర రూ. 19,999కు రానుంది. దీని అసలు ధర రూ. 27, 999. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ రూ. 24,999కు రిటైల్ అవుతోంది. చదవండి: ఫ్లిప్కార్ట్ బంపరాఫర్..! రూ. 60 వేల విలువైన ఐఫోన్ రూ.15 వేలకే..ఇంకా మరెన్నో ఆఫర్స్ -
ఫ్లిప్కార్ట్ మరో సరికొత్త సేల్.. వాటిపై అదిరిపోయే ఆఫర్స్!
Flipkart Big Bachat Dhamaal: ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఈ ఏడాది వరుస పెట్టి ఒక సేల్ తర్వాత మరొక సేల్ తీసుకొని వస్తుంది. తాజాగా బిగ్ బచత్ ధమాల్ పేరుతో మరొక సేల్ తీసుకొని వచ్చింది. మార్చి 4 నుంచి మార్చి 6 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సేల్లో యుపీఐ లావాదేవీలపై రూ.1000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్, వేరబుల్స్, టీవి మోడల్స్, ఫ్యాషన్, గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. మోటరోలా ఎడ్జ్ 30 ప్రో వంటి ఫోన్ల అమ్మకాలు కూడా ఈ సేల్లో భాగంగా ప్రారంభమవుతాయి. అలాగే, కస్టమర్లు ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ మీద ప్రత్యేక డీల్స్ పొందవచ్చ. ఇంకా, వినియోగదారులు బ్యాంకు ఆఫర్లు, నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్లను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలకు చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉండే 'లూట్ బజార్' కూడా ఇందులో ఉంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ ప్లాన్, పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ఛేంజ్ పై డీల్స్, ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ అప్ గ్రేడ్ ఆప్షన్, మొబైల్ ప్రొటెక్షన్ ఆఫర్లను కూడా తీసుకురానున్నారు. (చదవండి: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!) -
జుకర్బర్గ్కు భారీ దెబ్బ..! తగ్గేదేలే అన్నాడు...ఇప్పుడు పూర్తిగా అమ్మేసే పరిస్థితి..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీపై నెలకొన్న ఆదరణను క్యాష్ చేసుకునేందుకుగాను మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ కూడా భారీ ప్రణాళికలను రచించాడు. స్వంత క్రిప్టోకరెన్సీని నిర్మించాలనే జుకర్బర్గ్ ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక పూర్తిగా నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పడు పూర్తిగా అమ్మేసే పరిస్థితి..! బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం...డైమ్ డిజిటల్ కరెన్సీ అభివృద్ధిని పర్యవేక్షిస్తోన్న డైమ్ (Diem) అసోసియేషన్కు చెందిన ఇన్వెస్టర్ల మూలధనాన్ని తిరిగి ఇచ్చేందుకు కంపెనీ సిద్దమైందని పేర్కొంది. అంతేకాకుండా ఈ సంస్థ ఆస్తుల విక్రయం కూడా పరిశీలనలో ఉందని తెలిపింది. ఇందులో పనిచేసిన ఇంజనీర్ల కోసం కొత్త గమ్యాన్ని కనుగొనడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని బ్లూమ్బెర్గ్ పేర్కొంది. ఈ విషయంపై డైమ్ అసోసియేషన్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై మెటా కూడా స్పందించలేదు. యూఎస్ కాంగ్రెస్కు ఎదురెళ్లి మరీ..! జుకమ్ బర్గ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్ను ఒకానొక సమయంలో యూఎస్ కాంగ్రెస్ ముందు సమర్థించుకున్నాడు. స్వంత క్రిప్టోకరెన్సీ విషయంలో మార్క్ వెనకడుగు వేసేదిలేదంటూ మందుకు వెళ్లాడు. ఇప్పుడు అది కాస్త బెడిసి కొట్టింది. వారి ఒత్తిడి కారణంగానే..! డైమ్ అసోసియేషన్లో జుకర్బర్గ్కు చెందిన మెటా సంస్థ మూడింట ఒక వంతు వాటాలను కల్గి ఉంది. మిగిలినది ఆండ్రీసెన్ హోరోవిట్జ్, యూనియన్ స్క్వేర్ వెంచర్స్, రిబ్బిట్ క్యాపిటల్ వంటి అసోసియేషన్ సభ్యులు భాగస్వాములుగా ఉన్నారు. జుకర్బర్గ్ స్వంత క్రిప్గోకరెన్సీని జూన్ 2019లో మొదటిసారిగా ప్రకటించినప్పటి నుంచి క్రిప్టోప్రాజెక్టు పూర్తిగా చిక్కుల్లో పడిపోయింది. ఆ సమయంలో డైమ్ డిజిటల్ కరెన్సీకి లిబ్రా అని నామకరణం కూడా చేశారు. యూఎస్ సెంట్రల్ బ్యాంకర్లు, రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా లిబ్రా డిజిటల్ కరెన్సీ పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఏర్పాడయని సమాచారం. చదవండి: పాలపుంతలోని ఆ మిస్టరీ ఏంటబ్బా? 18 నిమిషాలకొకసారి రేడియో తరంగాలు, చేధించే పనిలో రీసెర్చర్లు -
అమ్మకానికి ఒంటరి మేడ.. ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే..
ఎక్కడో దూరంగా కొండకోనల్లో ఉన్న గ్రామంలో ఉంటున్నారా? అయినా కూడా ఏకాంతంగా ఉన్నట్టు అనిపించడం లేదా! అయితే ఈ సముద్రం మధ్యలోని బిల్డింగ్ మీకోసమే. పేరు స్పిట్బాంక్ ఫోర్ట్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. పోర్టులు, ఓడల రక్షణ కోసం ఇంగ్లండ్లో 1870ల్లో కట్టిన కొన్ని పోర్టుల్లో ఇదీ ఒకటి. ఇందులో 9 బెడ్రూమ్లు, బాత్రూమ్లు, ఓ సినిమా రూమ్, ఓ గేమ్ రూమ్, ఓ వైన్ సెల్లార్ ఉన్నాయి. బిల్డింగ్ పైన ఒక వేడి టబ్, మంట కాచుకునే గదులున్నాయి. అద్భుతమైన సముద్రం వ్యూ కనబడుతుంది. దీని వ్యాసం 50 మీటర్లు. లండన్ నుంచి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర దాదాపు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్లు. చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు! -
స్థానిక మహిళతో వివాహం.. రాత్రి పూట బయటి కాలనీల్లో తిరుగుతూ..
సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట రెక్కీ నిర్వహిస్తారు. పార్కింగ్ చేసిన కార్లను అపహరిస్తారు. రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తారు. ఈ అంతర్రాష్ట్ర ఆటోమొబైల్ గ్యాంగ్ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మల్కాజిగిరి డీసీపీ రక్షితకే మూర్తి, డీసీపీ క్రైమ్స్ యాదగిరిలతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ► మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన ఉదయ్ మారుతీ పాటిల్, ఫర్మాల్ అలీఖాన్, ఇమ్రాన్ ఖాన్ పఠాన్, సోహ్రబ్ అలీ, యెవరుల్లా ఖాన్, సంతోష్ జగన్నాథ పవార్ ముఠాగా ఏర్పడ్డారు. ఇమ్రాన్ ఖాన్ పఠాన్ (36) కుషాయిగూడ హెచ్బీ కాలనీలో స్థానికంగా ఓ మహిళను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటున్నాడు. ► రాత్రిపూట కాలనీల్లో తిరుగుతూ బయట కార్లు ఎక్కడ పార్క్ చేశారు? కెమెరాలు ఉన్నాయా? రాత్రి వేళల్లో జన సంచారం ఉంటుందా? వంటి వాటిపై రెక్కీ నిర్వహించి.. సమాచారాన్ని మహారాష్ట్రల్లోని తన గ్యాంగ్కు చేరవేస్తాడు. ► సమాచారం అందుకున్న ఉదయ్ మారుతీ పాటిల్ ప్లాన్ చేసి.. అనుచరులను రంగంలోకి దింపుతాడు. ఇమ్రాన్ఖాన్ సూచించిన ప్రాంతంలో రాత్రికి వెళ్లి కార్ను చోరీ చేస్తారు. ► మారుతీ స్విఫ్ట్, హోండా ఐ 10, అమేజ్ కార్లను మాత్రమే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. రిపేరు లేదా స్క్రాప్లో వచ్చిన కార్ల నంబర్ ప్లేట్లను తీసుకొని అలాంటి రంగు ఉండే కార్లనే చోరీ చేస్తారు. వాటికి అసలు కార్ నంబర్ ప్లేట్ను తగిలించి కస్టమర్కు విక్రయిస్తారు. ► వీళ్ల ప్రత్యేక మెకానిజం కారణంగా కార్ డోర్ను ఓపెన్ చేసినప్పుడు అలారం కూడా మోగదు. కారు డోర్ను ఓపెన్ చేసి నకిలీ తాళం చెవితో స్టార్ట్ చేసి రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తరలిస్తారు. అక్కడికి వెళ్లాక కారు ఇంజిన్, చాసిస్ నంబర్లను మార్చేస్తారు. ఒక్కో కారుకు రూ.2 లక్షల నుంచి 3 లక్షల లాభం చూసుకొని విక్రయిస్తుంటారు. ► ఈ గ్యాంగ్ ఐదేళ్లుగా వేర్వేరు రాష్ట్రాల్లో చోరీలు చేస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ, ఏపీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 50కి పైగా కార్లను చోరీ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ► ఇద్దరు నిందితులు ఇమ్రాన్ఖాన్ పఠాన్, సంతోష్ జగన్నాథ పవార్లను కస్టడీకి తీసుకొని లోతుగా విచారణ చేస్తే అసలు ఎన్ని కార్లు దొంగిలించారు? ఎవరెవరికి విక్రయించారో బయటపడుతుందని మల్కాజిగిరి డీసీపీ రక్షిత కే మూర్తి తెలిపారు. చదవండి: నాలుగేళ్ల క్రితం వివాహం.. పురుగులమందు తాగిన వివాహిత -
600 ఎకరాల అటవీ భూమి అమ్మకానికి సిద్ధం..?!
సాక్షి, వరంగల్: ఏండ్లుగా అటవీ శాఖ అధీనంలో ఉన్న భూమి తన భూమి అంటూ ఓ వ్యక్తి కోటి రూపాయాలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వైనం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్కు చెందిన భూమి తమ దానం(హిబా) ద్వారా తనకు సంక్రమించిందని పేర్కొంటూ సదరు వ్యక్తి భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కొంత మంది వ్యక్తులకు విక్రయించినట్లు జోరుగా ప్రచారం నడుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 41లో 1298.03 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 41 సర్వే నంబర్లోను పూర్తి విస్తీర్ణం అటవీ(మహాసూర) భూమిని రెవెన్యూ అధికారులో రికార్డులో నమోదు చేశారు. సంవత్సారాలుగా పహణీ రికార్డులో, ధరణిలో సైతం మొత్తం ఎకరాలు అటవీ భూమిని అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. సదరు భూమి మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అని రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. సర్వే నంబర్ 41 పరిధిలోని 600ఎకరాల భూమి తనదంటూ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగిరిగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. సేత్వార్ రికార్డులో అప్పటి అధికారులు 41 సర్వేనంబర్ ఎవరికీ కేటాయించకపోవడంతోనే ఈ తతంగం అంత నడించిందని పలువురు చర్చించుకుంటున్నారు. ధరణిలో అడవి పేరుతో ఉన్న రికార్డు -
మన చేప మన ఆరోగ్యం
-
CM KCR: కేసీఆర్ గుడి అమ్మబడును!
సాక్షి, మంచిర్యాల (ఆదిలాబాద్): ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానంతో ఓ వ్యక్తి గుడి కట్టించాడు. అయితే తనకు పార్టీలో గుర్తింపు లేదని, కనీసం కేసీఆర్, కేటీఆర్లను కలిసే అవకాశం కూడా రాలేదని గుడిని, గుడిలోని కేసీఆర్ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్ కేసీఆర్పై ఉన్న అభిమానంతో తన ఇంటి ఆవరణలో గుడి కట్టించాడు. అందులో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేస్తున్నాడు. అంతలా అభిమానం చాటుకున్న తనకు కేసీఆర్, కేటీఆర్ను కలిసే అవకాశం కూడా రావడం లేదని, టీఆర్ఎస్ పార్టీలోనూ గుర్తింపు దక్కలేదని నిరాశ చెంది కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరాడు. అప్పటి నుంచి కేసీఆర్ విగ్రహానికి ముసుగు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొని అప్పుల పాలయ్యానని, అప్పులు తీర్చేందుకు కేసీఆర్ గుడిని, విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు ఫేస్బుక్లో పోస్టు చేశాడు. చదవండి: డ్రగ్స్ వార్: రేవంత్పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా -
అమ్మకానికి కేసీఆర్ గుడి
-
అమ్మకానికి విరాట్ కోహ్లి కారు ? ధర ఎంతంటే
Virat Kohli Lamborghini Gallardo Spyder: టీమిండియా స్కిప్పర్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ముచ్చటపడి కొనుకున్న సూపర్కారు ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. లగ్జర్లీ కార్లంటే మోజున్న వారు, సెలబ్రిటీలు ఉపయోగించిన వస్తువులు సొంతం చేసుకోవాలనే ఇంట్రస్ట్ ఉన్న వారు రెడీగా ఉండాల్సిన సమయం వచ్చింది. 2015లో క్రికెట్లో తన బ్యాటుతో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న సమయంలో 2015లో లగ్జరీ సెగ్మెంట్కి చెందిన లంబోర్గిని గలార్డో స్పైడర్ మోడల్ కారుని కొనుగోలు చేశాడు. కొద్ది రోజులు ఈ కారుని వాడిన తర్వాత విరాట్ దాన్ని 2017లో అమ్మేశాడు. అలా ఆ కారు చాలా కాలం పాటు కొల్కతాకు చెందిన ఓ ప్రీమియం కార్ల డీలర్ దగ్గర ఉండిపోయింది,. రాయల్ డ్రైవ్ తాజాగా విరాట్ కాడిన కారు గురించి తెలిసిన రాయల్ డ్రైవ్ సంస్థ ఆ కారుని కోల్కతాకు చెందిన డీలర్ నుంచి 2021 జనవరిలో కొనుగోలు చేసింది, ప్రస్తుతం ఈ కారుని అమ్మాలని ఆ సంస్థ నిర్ణయించింది. కారుకి రూ.1.35 కోట్లు ధరగా నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ మేరకు రాయల్డ్రైవ్ వెబ్సైట్లో ఈ కారు అమ్మకానికి సిద్ధంగా ఉంది. కండీషన్డ్ కారు విరాట్ ఉపయోగించినట్టుగా చెబుతున్న లంబోర్గిని కారు 2013 మోడల్కి చెందినది. ఈ కారు ఇప్పటి వరకు కేవలం 10,000 కిలోమీటర్ల మాత్రమే తిరిగింది. కేవలం నాలుగు సెకన్లలోనే వంద కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఈ సూపర్ కారు పెట్రోల్ ఇంజన్లో ఆటోమేటిక్ వెర్షన్కి సంబంధించినది. లీటరు పెట్రోలుకి 5 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ ఏడాది చివరితో ఇన్సురెన్సు ముగిసిపోనుంది. గలార్డో స్పైడర్ లంబోర్గిని గలార్డో మోడల్ని 2005లో ప్రవేశ పెట్టగా చివరి మోడల్ని 2014లో రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఈ మోడల్ని డిస్కంటిన్యూ చేసింది. చివరి సారి ఈ మోడల్ ధర రూ. 2.78 కోట్లుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లంబోర్గిని ఊరూస్ మోడల్ రన్నింగ్లో ఉంది. ఈ సూపర్ లగ్జరీ కారు ధర రూ. 3.5 కోట్ల వరకు ఉంటుంది. వాస్తవమేనా? లంబోర్గిని కారుని విరాట్ కోహ్లీ 2015లో కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్, ఇన్స్టాలలో వాటి ఫోటోలను షేర్ చేశారు. అందులో కారు నలుపు రంగులో కనిపిస్తుంది. తాజాగా కోహ్లీ వాడినట్టుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న కారు ఆరెంజ్ రంగులో ఉంది. రిజిస్ట్రేషన్ నంబరు సైతం పుదుచ్చేరి మీద ఉంది. విరాట్ ఈ కారుని అమ్మేసిన తర్వాత తాజాగా వార్తల్లో నిలిచే వరకు ఈ కారుకు సంబంధించిన వివరాలు పూర్తిగా అందుబాటులో లేవు. చదవండి : టి20లకు సారథ్యం వహించను: కోహ్లి -
ఓలా ఎలక్ట్రిక్ బైక్ అమ్మకాలు మళ్లీ ఎప్పుడంటే..!
ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్లతో సంచలనాన్ని ఆవిష్కరించింది. ప్రి బుకింగ్స్లో ఓలా ఎలక్ట్రిక్ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓలా అమ్మకాలు జరిపిన ఒక్కరోజులోనే రూ. 600 కోట్లకు పైగా విలువైన స్కూటర్లను విక్రయించింది. రెండు రోజుల్లో రూ. 1100 కోట్ల విలువైన స్కూటర్లను ఓలా అమ్మకాలు జరిపింది. కాగా ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు ఒక్కసారిగా ఎగబడడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల ప్రక్రియను నిలిపివేశారు. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారిపోతున్న ఖాకీలు నవంబర్ 1 నుంచి తిరిగి అమ్మకాలు..! తాజాగా భవిష్ అగర్వాల్ తన ట్విటర్లో రెండో దశ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు తిరిగి నవంబర్ 1 నుంచి ప్రారంభం అవుతోందని వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ కొన్ని వారాల క్రితం తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1ను ఈవీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారతీయ ఈవీ మార్కెట్లో ఎన్నో సంచాలనాల మధ్య విడుదలైన ఈ స్కూటర్ వాస్తవానికి సెప్టెంబర్ 8 నుంచి అమ్మకానికి రావాల్సి ఉంది. స్కూటర్ల డెలివరీలు వచ్చే నెల అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. Day 2 of EV era was even better than Day 1! Crossed ₹1100Cr in sales in 2 days! Purchase window will reopen on Nov 1 so reserve now if you haven't already. Thank you India for the love & trust. You are the revolution! https://t.co/oeYPc4fv4M pic.twitter.com/fTTmcFgKfR — Bhavish Aggarwal (@bhash) September 17, 2021 చదవండి: electric highway: త్వరలో దేశంలో ఈ నగరాల మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవే! -
వసతులు లేని కాటేజ్.. ఆ ప్రత్యేకత ఉందని కోట్లు పలుకుతోంది!
ఇల్లు కొనే ముందు కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూసి కాస్త ఎక్కువైనా కొంటాం. అదే వసతులు సరిగా లేకపోతే ధర తక్కువ ఉన్నా అటు వైపు కన్నెత్తి కూడా చూడం. అయితే వసతులు లేని ఓ కాటేజ్ మాత్రం భారీగా ధర పలుకుతోందట. ఎందుకో ఓ సారి చూసేద్దాం. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్లోని డేవాన్ సముద్రం ఒడ్డున ఈ ఆఫ్ గ్రిడ్ హౌస్ ఉంది. ఈ కాటేజ్కు కరెంట్ లేదు. నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్ కూడా ఉండదు. అయినప్పటికీ దాని ధర మాత్రం రూ.5.56 కోట్లట. అదేంటి కనీస వసతులు ఏవీ లేకపోయినా ఇంత రేటు ఎందుకు అనుకుంటున్నారా? దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. నీలి సముద్రం కొండపై ఉన్న కుటీరానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ఇల్లు ఎంతగానో నచ్చుతుంది. ఈ కాటేజ్ నేషనల్ ట్రస్ట్ యాజమాన్యంలోని మన్సాండ్ బీచ్పైన ఉన్న రిమోట్ గేట్అవేలో ఉంది. ప్రకృతితో మమేకమై ప్రశాంతమైన జీవనాన్ని గడపాలనుకునే వారికి ఈ కాటేజ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందుకే అంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఆ కాటేజ్ను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారంట. ఈ కాటేజ్లో రెండు పెద్ద బెడ్ రూమ్లు, పైన గడ్డితో చేసిన గది ఉంది. ఇందులో లాంజ్, డైనింగ్ రూం, ఫ్రంట్ అండ్ బ్యాక్ వరండా, రెండు గెస్ట్ బెడ్రూంలు, పవర్రూం, వంట గది ఉందంట. దీనిని 1,345 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. వర్షపు నీటిని నిల్వ చేసి తాగునీటిగా మార్చే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కాటేజ్కు వెళ్లేందుకు బీచ్ నుంచి రోడ్డు ఉందని, కారు పార్కింగ్ నుంచి 15 నిమిషాల్లో నడిచి చేరుకోవచ్చునని దీని ఆస్తి విక్రేత మిచెల్ స్టీవెన్స్ తెలిపారు. చదవండి: ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ -
ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు..
సాక్షి, ముంబై: మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా) ఇళ్లలో ఉంటున్న మిల్లు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యజమానులు తమ మాడా ఇళ్లను ఐదేళ్ల తరువాత అమ్ముకోవడానికి అనుమతినిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇదివరకు ఈ ఇళ్లను పదేళ్ల తరువాత మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండేది. కానీ, మిల్లు కార్మికులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, వారి డిమాండ్లను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలను సడలించడానికి అంగీకరించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మిల్లు కార్మికులు, వారి వారసులు, కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో సుమారు 56 వస్త్ర మిల్లులు ఉండేవి. రెండు దశాబ్దాల కిందటి వరకు మిల్లు కార్మికులతో ముంబై నగరం కళకళలాడేది. అయితే, 2000-2005 సంవత్సరాల మధ్య కాలంలో దశలవారీగా వస్త్ర మిల్లులన్నీ మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆ తరువాత మూతపడిన మిల్లుల స్థానంలో కార్మికులకు ఇళ్లు నిర్మించి, చౌక ధరకే అందజేయాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ మేరకు అనేక ఆందోళనలు జరిగాయి. మిల్లు కార్మికుల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాయి. కార్మికుల డిమాండ్లకు ఇతర రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకడంతో అప్పటి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం దిగివచ్చింది. మిల్లుల స్థానంలో కార్మికులకు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిశీలన ప్రక్రియ పూర్తిచేసింది. లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేసి చౌక ధరకే వారికి ఇళ్లను అందజేసింది. అయితే, పదేళ్ల వరకు ఆ ఇళ్లను విక్రయించరాదని, అద్దెకు కూడా ఇవ్వరాదని నిబంధనలు విధించింది. దీంతో కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తీవ్రం అయ్యాయి. ఇక్కడ ఎక్కువ ధరకు అద్దెకిచ్చి మరోచోట తక్కువ అద్దెకు ఉందామనుకున్న అనేక పేద కుటుంబాల ఆశలకు ప్రభుత్వ నిబంధనలు అశనిపాతంగా మారాయి. దీంతో కార్మిక సంఘాలు ఈ అంశాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలో ఇళ్లను అద్దెకు ఇచ్చుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ, ఇళ్లు వచ్చిన కార్మికుల్లో కొందరు చనిపోగా, వారి కుటుంబ సభ్యులు సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. మరికొందరు పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేసి అప్పుల పాలయ్యారు. ఉన్న ఇంటిని అమ్ముకొనైనా అప్పులు తీరుద్దామని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడదామని అనుకున్న వారి ఆశలకు ప్రభుత్వ నిబంధనలు అడ్డుగా నిలిచాయి. పదేళ్ల వరకు ఆ ఇళ్లను విక్రయించడానికి వీలు లేకపోవడంతో గత్యంతరం లేని అనేక మంది గుట్టుచప్పుడు కాకుండా దళారుల ద్వారా అమ్ముకోవడం మొదలు పెట్టారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లినప్పటికీ తగిన రుజువులు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది. దళారీ వ్యవస్థ వల్ల కార్మికులు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. అంతేగాక, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయనికి కూడా గండి పడుతోంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇళ్లు కేటాయించిన ఐదేళ్ల తరువాత అమ్ముకునేందుకు వీలు కల్పించింది. ఇళ్లను విక్రయించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతినివ్వడంతో దళారుల బెడద తప్పనుంది. అధికారికంగా క్రయ, విక్రయాలు జరగడం వల్ల రిజిస్ట్రేషన్, స్టాంపు ద్వారా ప్రభుత్వ ఖజానాలోకి అదనంగా ఆదాయం కూడా రానుంది. -
అమెజాన్ మరో సేల్..! ఈసారి ల్యాప్ట్యాప్, టీవీలపై భారీ తగ్గింపు...!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకోసం మరో సేల్ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఇండియా 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 22 నుంచి ఆగస్టు 24 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. గ్రాండ్ గేమింగ్ సేల్స్లో భాగంగా ల్యాప్టాప్స్, టీవీలు డెస్క్టాప్లు, మానిటర్లు, అధునాతన హెడ్ఫోన్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్ కార్డులు, లెనోవో, ఏసర్, ఆసూస్, ఎల్జీ, హెచ్పీ, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ టీవీలకు ఆఫర్లు, డీల్స్ను అమెజాన్ తన కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..! డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్ మరిన్ని కంపెనీల ఉత్పత్తులపై సుమారు 30 శాతం మేర తగ్గింపును ప్రకటించాయి. అధిక ర్యామ్, అధిక రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీలపై కూడా 30 శాతం తగ్గింపును అమెజాన్ తన కస్టమర్లకు అందిస్తోంది. అదనంగా కొనుగోలుదారలు ఎంచుకున్న మోడళ్లపై తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్సేఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చును. పలు ల్యాప్టాప్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు హెచ్పీ కంపెనీకి చెందిన విక్టస్ 15.6-అంగుళాల ఎఫ్హెచ్డీ గేమింగ్ ల్యాప్టాప్ రూ. 66,990 కి అందుబాటులో ఉంది. ఏసర్ కంపెనీకి చెందిన నైట్రో 5 ఏఎన్515-56 గేమింగ్ ల్యాప్టాప్ రూ. 69,990 అందుబాటులో ఉంది . ఎమ్ఎస్ఐ కంపెనీకి చెందిన బ్రావో 15 ఎఫ్హెచ్డీ మోడల్ను రూ. 74,990 అందుబాటులో ఉంది. లెనోవా ఐడియా ప్యాడ్ ల్యాప్టాప్ను రూ . 67, 557 కు లభించనుంది. పలు టీవీలపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు.. సోనీ బ్రావీయా 55 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ గూగుల్ టీవీ రూ. 83,990కు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ 55 ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీను రూ . 45,999కు అందుబాటులో ఉండనుంది. చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్బెజోస్...! -
అమెజాన్ మరో సేల్..! మొబైల్స్పై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్ల కోసం అమెజాన్ ఇండిపెండెన్స్ సేల్ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమెజాన్ తన కస్టమర్లకోసం మరో సేల్ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ పేరిట సేల్ను ప్రారంభించింది. ఈ సేల్ ఆగస్టు 16 నుంచి ఆగస్టు 19 వరకు జరగనుంది. ఈ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లపై ఇతర మొబైల్ యాక్సెసరీలపై సుమారు 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. మొబైల్ కొనుగోళ్లపై పన్నెండు నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్ఐలను అమెజాన్ ఇవ్వనుంది. పలు మొబైల్ కొనుగోళ్లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ డీల్స్ను కూడా అమెజాన్ తన కస్టమర్లకు అందించనుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలుదారులకు 10 శాతం సుమారు రూ. 1250 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా 'అడ్వాంటేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్' ప్లాన్ కింద ప్రైమ్ కస్టమర్లకు ఆరునెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, హెచ్డీఎఫ్సీ కార్డులపై మూడు నెలల అదనపు నో కాస్ట్ ఈఎమ్ఐ వంటి అదనపు ఆఫర్లను అమెజాన్ అందిస్తుంది. అమెజాన్ మొబైల్ సేవింగ్స్ డేస్ భాగంగా వన్ప్లస్ ,షావోమీ , శాంసంగ్ , ఐక్యూ , రియల్మీ కంపెనీల స్మార్ట్ఫోన్లపై సుమారు 10 శాతం తగ్గింపు ధరను అమెజాన్ ప్రకటించింది. వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్ ధర రూ. 45,999 నుంచి ప్రారంభమవ్వనుంది. ఈ మొబైల్ కొనుగోలుపై సుమారు రూ .4000 వరకు డిస్కౌంట్ను అమెజాన్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కూపన్రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వన్ప్లస్ 9 స్మార్ట్ఫోన్ కొనుగోలుపై పన్నెండు నెలల నో కాస్ట్ ఈఎమ్ఐతో పాటు అదనంగా రూ. 3000 డిస్కౌంటును పొందవచ్చును. ఎమ్ఐ 11 ఎక్స్ కొనుగోలు ఎక్సేచేంజీ పై అదనంగా రూ. 5,000 తగ్గింపును అందిస్తుంది. మొబైల్ యాక్సెసరీస్ ప్రారంభ ధర రూ. 69 కాగా పవర్ బ్యాంకులు రూ.399 నుంచి ప్రారంభంకానున్నాయి. -
ధమాకా ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా సేల్ను రిలయన్స్ ప్రారంభించింది. ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లతో రిలయన్స్ డిజిటల్ ఈ సేల్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇందులో 300లకు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, 500లకు పైగా టీవీలు, ల్యాప్ట్యాప్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు రిలయన్స్ డిజిటల్లో అందుబాటులో ఉంటాయి. దేశంలోని 80 నగరాల్లో ఉన్న 460 స్టోర్లలో ఈ సేల్ ప్రారంభం కానుంది. స్టోర్లతో పాటు మై జియోస్టోర్స్తో పాటు www.reliancedigital.in లో ఈ సేల్ ఆగస్టు 16 వరకు ఉంటుంది. ఆఫర్లు - ఆగస్టు 16 వరకు జరిగే కొనుగోళ్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ని అందిస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.3,000 వరకు తగ్తింపు పొందవచ్చు - కనీసం రూ.9999 కొనుగోళ్లపై పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే ఆగస్టు 31 వరకు రూ.500 వ్యాలెట్ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రూ.10,000 ఆ పైన జరిపే కొనుగోళ్లపై జెస్ట్మనీ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. క్యాష్బ్యాక గరిష్ట పరిమితి రూ.5,000లుగా ఉంది. ఫైనాన్సింగ్ సులభమైన ఫైనాన్సింగ్, ఈఎంఐ ఆప్షన్స్తో డిజిటల్ ఇండియా సేల్స్ ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా మారింది. కొనుగోలు చేసిన భారీ వస్తువులను ఇన్స్టా డెలివరి కింద మూడు గంటల్లోనే డెలివరీ చేయనున్నారు. వినియోగదారులు తమ వీలుని బట్టి సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్ పికప్ ఆప్షన్ను కూడా పొందవచ్చు. -
ఐడిబిఐ వ్యూహాత్మక విక్రయానికి అంతా సిద్ధం
-
గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. అదిరిపోయే ఆఫర్లతో పండగే పండగ
ఈకామర్స్ దిగ్గజం అమెజాన్లో ఆఫర్ల పండుగ మొదలైంది. పంద్రాగస్ట్ను పురస్కరించుకొని అమెజాన్ ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 9 వరకు 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్' ను అందుబాటులోకి తెచ్చింది. ఒక వేళమీరు జులైలో జరిగిన ప్రైమ్ డేల్ సేల్ మిస్ అయితే.. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో గాడ్జెట్స్ తో పాటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని అమెజాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సేల్ సందర్భంగా కష్టమర్లకు ఆఫర్లను అందించేందుకు అమెజాన్ ఎస్బీఐతో టై అప్ అయ్యింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ సేల్ లో ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే ( గరిష్టంగా రూ.1750) కొనుగోలు చేస్తే 10 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ తో పాటు ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్లో స్మార్ట్ ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం. ఆపిల్ ఐఫోన్ 11 అమెజాన్ సేల్ లో ఆపిల్ ఐఫోన్ రూ.49,999కే సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి దీని ధర రూ.54,900 ఉండగా.. ఆఫర్ లో రూ.4,500 తగ్గుతుంది. దీంతో పాటు అమెజాన్ ఎక్సేంజ్ ఆఫర్ లో రూ.13,400 తగ్గింపుతో ఐఫోన్ 11ను కొనుగోలు చేసుకోవచ్చు. కొనుగోలు కోసం పేరొందిన క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ను లభిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 12 రూ.79,900విలువైన ఆపిల్ ఐఫోన్ 12ను ఈ ఆఫర్ లో 11,901 తగ్గుతుంది. ఒకవేళ మీ వద్ద స్మార్ట్ ఫోన్ ఉంటే.. ఎక్సేంజ్ ఆఫర్లో రూ.13,400 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.వీటితో పాటు వన్ ప్లస్ 9జీ, శాంసంగ్ గెలాక్సీ నోట్ 20, నోకియా జీ 20 స్మార్ట్ ఫోన్లపై అఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ బ్రాండ్లపై ఆఫర్లు అమెజాన్కు చెందిన డివైజ్ ఫైర్ టీవీ స్టిక్, కిండ్లే ఈ బుక్ రీడర్స్ పై ఆఫర్లు లభిస్తాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ ఎస్ఈ సోనీ డబ్ల్యూహెచ్ ఎక్స్ఎం3 వైర్ లెస్ హెడ్ ఫోన్ ఆపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో ఆపిల్ వాచ్ సిరీస్ ఆపిల్ ఐపాడ్ ఎయిర్ 2020 హెచ్ పీ పెవిలియన్ గేమింగ్ ల్యాప్ ట్యాప్లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. -
ఇండిగో బంపర్ ఆఫర్..! అతి తక్కువ ధరలో..!
ప్రముఖ ఎయిర్లైన్స్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) 15 వ వార్షికోత్సవ సందర్భంగా విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. తక్కువ ప్రారంభ ధరలో రూ. 915(ఆల్ ఇన్క్లూజివ్) డొమెస్టిక్ విమానప్రయాణాలను ఇండిగో అందించనుంది. ఈ ఆఫర్ 2021 ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ రోజుల్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్య ప్రయాణించాల్సి ఉంటుంది. ఇండిగో ఈ ఆఫర్ పూర్తి వివరాలను కంపెనీ వెబ్సైట్లో పేర్కొంది. ఈ ఆఫర్ విమానాశ్రయ ఫీజులు, ఛార్జీలు, ప్రభుత్వం విధించే పన్నులపై వర్తించదని ఇండిగో పేర్కొంది. అంతేకాకుండా టికెట్ బుక్ చేసుకునే సమయంలో యాడ్-ఆన్ సేవలపై డిస్కౌంట్లు కాకుండా, ఎంపిక చేయబడిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, కా-చింగ్ కార్డ్లపై అదనపు క్యాష్బ్యాక్ కూడా ఉందని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో వెబ్సైట్ లేదా హెచ్ఎస్సీబీఎస్ క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే ప్రయాణికులకు గరిష్టంగా 5 శాతం క్యాష్బ్యాక్ రూ. 750 వరకు పొందవచ్చును. ఈ ఆఫర్ కేవలం రూ. 3000విలువైన టికెట్ బుకింగ్పై మాత్రమే వర్తించనుంది. Time for SALE-brations! Grab the best fares, pack your bags and make that much awaited trip happen. Book now https://t.co/i2TT16rSey #15YearsOfBeing6E #LetsIndiGo #Aviation pic.twitter.com/Enb8a6UpFV — IndiGo (@IndiGo6E) August 4, 2021 -
Apple Days Sale: ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్..!
భారత ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ దిగ్గజం విజయ్ సేల్స్ ఆపిల్ ఉత్పత్తులపై భారీగా క్యాష్బ్యాక్ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆపిల్ డేస్ సేల్ను విజయ్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ మంగళవారం ఆగస్టు 3 న మొదలై ఆగస్టు 9 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఆపిల్ డేస్ సేల్లో భాగంగా ఐఫోన్ల నుంచి మాక్బుక్స్తో పాటు ఇతర ఆపిల్ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుల ద్వారా భారీగా క్యాష్బ్యాక్ను కూడా అందిస్తోంది. దేశ వ్యాప్తంగా కంపెనీ రిటైల్ అవుట్లెట్లలో ఈ ఆఫర్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కంపెనీకి చెందిన వెబ్సైట్ విజయ్సేల్స్. కామ్లో కూడా కొనుగోలు చేయవచ్చును. ఆపిల్ ఉత్పత్తులపై విజయ్ సేల్స్ అందిస్తోన్న ఆఫర్లు..! ఐఫోన్ 11 ప్రారంభ ధర రూ. 50,999. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 ప్రో ధర రూ. 1,09,900 నుంచి ప్రారంభంకానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ధర రూ.1,19,999 నుంచి ప్రారంభంకానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 ధర ప్రారంభ ధర రూ. 73,400. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 6000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ 12 మినీ ప్రారంభ ధర రూ. 63.499. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 6000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ ఎస్ఈ ప్రారంభ ధర రూ. 35,990. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐఫోన్ ఎక్స్ఆర్ ప్రారంభ ధర రూ. 43,199. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. ఐపాడ్ ప్రారంభ ధర రూ. 24,500 కాగా, ఐపాడ్ ప్రో ప్రారంభ ధర రూ. 55,900 కాగా చ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు అదనపు క్యాష్బ్యాక్ పొందవచ్చును. మాక్బుక్ ఎర్ ఎమ్1, మాక్బుక్ ప్రో విత్ ఎమ్1 చిప్ సెట్ కొనుగోలుపై వరుసగా రూ. 6000, రూ 7000 క్యాష్ బ్యాక్ను అందిస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 6, ఆపిల్ వాచ్ ఎస్ఈ కొనుగోలుపై వరుసగా రూ. 3000, రూ. 2000 క్యాష్ బ్యాక్ను అందిస్తోంది. -
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ : భారీ డిస్కౌంట్లు
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా "గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్" తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 రాత్రి వరకు కొనసాగుతుంది. ఈ సేల్లో భాగంగా అమెజాన్ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ల్యాప్ టాప్స్, కెమెరాలు, ఫ్యాషన్, బ్యూటీ ఎసెన్షియల్స్, హోమ్ & కిచెన్, టీవీలు వంటి ఉత్పత్తుల పాటు నిత్యావసర వస్తువుల ధరలపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. ఈ కామర్స్ కంపెనీ ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. అలాగే, యూజర్ అమెజాన్ పేతో ద్వారా కొనుగోలు చేస్తే ₹1000 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కొనుగోలుదారులు ఎంపిక చేయబడ్డ బ్యాంక్ కార్డులపై 3 నెలల అదనపు నో కాస్ట్ ఈఎమ్ఐ సౌకర్యం లభిస్తుంది. షియోమీ, శామ్ సంగ్, ఐక్యూవో, మరిన్ని మొబైల్స్ పై 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ సదుపాయం పొందవచ్చు. స్మార్ట్ ఫోన్లు & యాక్ససరీలపై 40% వరకు తగ్గింపు లభిస్తుంది. వన్ ప్లస్ నార్డ్ 2 5జి, వన్ ప్లస్ నార్డ్ సిఈ 5జి, రెడ్ మి నోట్ 10టి 5జి, రెడ్ మి నోట్ 10లు, మి 11ఎక్స్, శామ్ సంగ్ ఎమ్ 21 2021, శామ్ సంగ్ ఎమ్32, శామ్ సంగ్ ఎమ్ 42 5జి, ఐక్యూవోయూ 7, టెక్నో కామోన్ 17 సిరీస్, టెక్నో స్పార్క్ గో వంటి స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. అమెజాన్ ఇండియా తీసుకొచ్చిన ఈ సేల్లో తీసుకొచ్చిన కొన్ని ఒప్పందాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటర్లపై ఆఫర్లు కెమెరాలపై 60% వరకు తగ్గింపు ట్రైపాడ్ లు, రింగ్ లైట్లు వంటి వాటిపై 60% వరకు తగ్గింపు స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలపై 60% వరకు తగ్గింపు హెడ్ ఫోన్ లపై 60% వరకు తగ్గింపు సంగీత వాయిద్యాలు, ప్రొఫెషనల్ ఆడియోపై 60% వరకు తగ్గింపు స్పీకర్లపై 60% వరకు తగ్గింపు ల్యాప్ టాప్ లపై ₹30,000 వరకు తగ్గింపు ప్రింటర్లపై 30% వరకు తగ్గింపు గేమింగ్ యాక్ససరీలపై 50% వరకు తగ్గింపు హై-స్పీడ్ వై-ఫై రూటర్ పై 60% వరకు స్మార్ట్ వాచీలపై 60% వరకు తగ్గింపు హార్డ్ డ్రైవ్లు, బాహ్య ఎస్ఎస్ డీలపై 50% వరకు తగ్గింపు మొబైల్, కెమెరా మెమొరీ కార్డులపై 60% వరకు తగ్గింపు టాబ్లెట్లపై 45% వరకు తగ్గింపు సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లపై 50% వరకు తగ్గింపు ఐటి యాక్ససరీలపై 60% వరకు తగ్గింపు స్టేషనరీ, ఆఫీస్ ఎలక్ట్రానిక్స్ పై 60% వరకు తగ్గింపు మానిటర్లపై 55% వరకు తగ్గింపు పీసీ కాంపోనెంట్లపై 50% వరకు తగ్గింపు డెస్క్ టాప్ లపై ₹40,000 వరకు తగ్గింపు అంతర్గత ఎస్ ఎస్ డిలపై 50% వరకు తగ్గింపు -
ఆదుకోండి, నన్ను అమ్మొద్దు ప్లీజ్
రుణ భారాలను తగ్గించుకోడానికి ఎయిర్ ఇండియా 2015 నుంచి 2021 జూలై నాటికి 115 ఆస్తులను విక్రయించిందని, తద్వారా రూ.738 కోట్లు సమకూర్చుకుందని పౌర విమానయాన శాఖమంత్రి వీకే సింగ్ లోక్సభకు తెలిపారు. లీజ్ రెంటల్ ఆదాయంగా ఎయిర్ ఇండియాకు వార్షికంగా రూ.100 కోట్లు అందుతున్నట్లు కూడా వెల్లడించారు. ప్రాజెక్ట్ రాయల్ అప్పుల ఊబిలో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాను అమ్మేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే. 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రూ.60,074 వేల కోట్ల అప్పుల్లో ఉంది. అయితే ఆ రుణ భారం నుంచి బయటపడేందుకు కేంద్రం ఎయిరిండియాను అమ్మేందుకు ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించింది. అందుకు 64రోజుల సమయం ఇచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు. ఇదే సమయంలో 'ప్రాజెక్ట్ రాయల్' పేరుతో ఎయిర్ ఇండియా వ్యాల్యూ ఎంత ఉందనేది తెలుసుకుంటున్నారు. ఈ వ్యాల్యూషన్ అంతా నాలుగు పద్దతుల్లో జరుగుతుంది. ఇతర విమాన సంస్థలు వ్యాల్యూ ఎలా ఉంది? ఎయిరిండియా సర్వీసుల కోసం చేసిన ఖర్చు ఎంత? ఎయిరిండియాకు వచ్చిన మొత్తాన్ని ఏ పర్పస్ కింద ఖర్చు చేశారు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? నికర ఆస్తులు ఎంత? వాటి మొత్తం వ్యాల్యూ ఎంత అనే విషయాల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. మరోవైపు ఎయిరిండియా అమ్మకాలతో ఆ సంస్థలో పనిచేస్తున్న పదివేల మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నష్టాల నుంచి బయటపడేలా భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేయాలని కోరుతున్నారు. మరి ఎంతమేరకు సఫలం అవుతుందో చూడాల్సి ఉండగా.. ఎయిరిండియా ను సొంతం చేసుకునేందుకు టాటా, స్పైస్జెట్ ప్రమోటర్ అయిన అజయ్సింగ్ తో పాటు మరో నాలుగు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఏఏఐకు రూ.30,069 కోట్ల ఆదాయం తన జాయింట్ వెంచర్ ఎయిర్పోర్టులు లేదా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ఎయిర్పోర్టుల నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ.30,069 కోట్ల ఆదాయాన్ని పొందినట్లు పౌర విమానయాన శాఖ సహాయమంత్రి లోక్సభుకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. హైదరాబాద్సహా ఢిల్లీ, బెంగళూరు, ముంబై, నాగపూర్లలో పీపీపీ నమూనాలో ఏఏఐ ఎయిర్పోర్టులను నిర్వహిస్తోంది. 2020–21లో ప్రభుత్వం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల నుంచి రూ.856 కోట్లను రాయితీ ఫీజుగా పొందిందనీ ఆయన తెలిపారు. ఏఏఐ పౌర విమానయాన శాఖ కింద పనిచేసే సంగతి తెలిసిందే. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్: స్మార్ట్ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 25 ఆదివారం నుంచి జూలై 29 వరకు కొనసాగుతుంది. బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్,రియల్మి, పోకో, మోటరోలా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్తో సహా పలు రకాల ఉత్పత్తులలో భారీ తగ్గింపులు, భారీ ఆఫర్లను అందించనుంది. బిగ్ సేవింగ్ డేస్లో భాగంగా ఈ రోజు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ డెబిట్ కార్డుపై కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. ప్రస్తుతం సేల్ లైవ్లో కొనసాగుతుంది. స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న డిస్కౌంట్ ధరలు ఆపిల్ ఐఫోన్ 12 మినీ తగ్గింపు ధర రూ. 57,999, అసలు ధర రూ. 69,990 ఆపిల్ ఐఫోన్ 12 తగ్గింపు ధర రూ. 67,999, అసలు ధర రూ. 79,990 మోటోరోలా రేజర్ తగ్గింపు ధర రూ. 54, 999 అసలు ధర రూ. 1,49,999 ఆసుస్ రాగ్ ఫోన్ 3 తగ్గింపు ధర రూ. 39,999 అసలు ధర రూ. 55,999 మోటోరోలా జీ10 పవర్ తగ్గింపు ధర రూ. 9,999 అసలు ధర రూ. 12,999. రియల్ మీ 8 తగ్గింపు ధర రూ. 13,999, అసలు ధర రూ 16, 999. శాంసంగ్ ఎఫ్62 తగ్గింపు ధర రూ. 17,999 అసలు ధర రూ. 29,999. ఎలక్ట్రానిక్స్పై ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న డిస్కౌంట్ ధరలు గో ప్రో 9 తగ్గింపు ధర రూ. 37, 499, అసలు ధర రూ. 47,000 శాంసంగ్ గెలాక్సీ వాచ్ ఆక్టివ్ 2 తగ్గింపు ధర రూ. 14, 990 అసలు ధర రూ. 25,990 నోకియా మీడియా స్ట్రీమర్ తగ్గింపు ధర రూ 1,899 అసలు ధర రూ. 4,999 ఆసుస్ వివోబుక్ గేమింగ్ కోర్ ఐ5 ల్యాప్టాప్ తగ్గింపు ధర రూ. 52, 490, అసలు ధర రూ. 76, 990. -
డార్క్ వెబ్లో ఈ సోషల్మీడియా యూజర్ల డేటా అమ్మకం..!
గత కొన్ని రోజుల నుంచి బాగా ప్రాచుర్యం పొందిన సోషల్మీడియా యాప్ క్లబ్హౌజ్. ఈ యాప్తో ఆడియో రూపంలో యూజర్లు తమ భావాలను ఇతరులతో పంచుకోవచ్చును. ఈ యాప్ తొలుత ఆపిల్ ఐవోఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా క్లబ్హౌజ్పై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. క్లబ్హౌజ్ యూజర్లకు చెందిన 3.8 బిలియన్ల ఫోన్ నంబర్లను హాకర్లు డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. భద్రతా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..తాజాగా క్లబ్హౌజ్ డేటా బేస్ హ్యాక్ గురైనట్లు గుర్తించారు. మార్క్ రూఫ్ అనే సైబర్ నిపుణుడు క్లబ్హౌజ్కు చెందిన యూజర్ల ఫోన్ నంబర్లు డార్క్ నెట్లో ఉంచారనే విషయాన్ని ట్విటర్లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ను ట్విటర్లో పోస్ట్ చేశాడు. కేవలం క్లబ్హౌజ్లో ఉన్న వారివి మాత్రమే కాకుండా యూజర్కు చెందిన కాంటాక్ట్లు యాప్తో అనుసంధానించబడిన వ్యక్తుల ఫోన్ నంబర్లు కూడా డార్క్ నెట్లో అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నాడు. కాగా ఈ డేటా బ్రీచ్పై క్లబ్హౌజ్ ఇంకా స్పందించలేదు. Full phone number database of #Clubhouse is up for sale on the #Darknet. It contains 3.8 billion phone numbers. These are not just members but also people in contact lists that were synced. Chances are high that you are listed even if you haven't had a Clubhouse login. pic.twitter.com/PfAkUJ0BL5 — Marc Ruef (@mruef) July 23, 2021 -
Reliance Digital: ‘డిజిటల్ ఇండియా సేల్’లో బంపర్ ఆఫర్లు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ డిజిటల్ కొనుగోలుదారులకు ‘ ఇండియా బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్-డిజిటల్ ఇండియా సేల్’ పేరిట సేల్ను ప్రకటించింది. ఈ సేల్లో భాగంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, బిగ్ డిస్కౌంట్లను రిలయన్స్ డిజటల్ అందిస్తోంది. డిజిటల్ ఇండియా సేల్ జూలై 26 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్ అన్ని మై జియో స్టోర్స్, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్లో అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా కంపెనీ వెబ్సైట్ www.reliancedigital.in. ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చును. టెలివిజన్లు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, యాక్సెసరీస్ వంటి విస్తృతమైన కేటగిరీల శ్రేణిలో ప్రత్యేకమైన ఆఫర్లు లభించును. జూలై 22 నుంచి ఆగస్టు 5, 2021 వరకు రూ.10,000 కనీస లావాదేవీపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద 10% క్యాష్ బ్యాక్ను అందిస్తోంది.ఈ ఆఫర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఈఎమ్ఐ లావాదేవీలపై కూడా లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ కేటగిరీలో, కస్టమర్లకు డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్లు లభిస్తాయి. జూలై 31 వరకు ఎంపిక చేసిన ఫోన్స్ పై యాక్సిడెంటల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ కవరేజ్ లభించును. వన్ప్లస్ నార్డ్2 స్మార్ట్ఫోన్ సేల్భాగంగా జూలై 28 నుంచి లభిస్తుంది. అంతేకాకుండా ఆపిల్ వాచ్ సీరీస్ 6, శాంసంగ్ గాలక్సీ ఆక్టివ్ 2 స్మార్ట్ వాచ్లు అతి తక్కువ ధరకే లభించనున్నాయి. SpO2 ఫీచర్ కలిగిన ఈ సరికొత్త ఫైర్ బోల్ట్ అగ్ని స్మార్ట్ వాచ్ డిజిటల్ ఇండియా సేల్ లో భాగంగా ఎక్స్ క్లూజివ్ గా రూ. 2,599/ ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది. ల్యాప్ ట్యాప్ కేటగిరీలో బ్యాంక్ క్యాష్ బ్యాక్, బ్రాండ్ వారంటీ ఆఫర్లతో పాటు అదనంగా రూ. 14,990/- విలువైన ప్రయోజనాలు అందుకోగలరు. Asus 10th Gen i5 గేమింగ్ ల్యాప్ టాప్ రూ. 64,999/- ప్రత్యేకమైన ధరలో లభిస్తుంది. దాంతో పాటుగా మ్యాక్ బుక్ ప్రో స్టూడెంట్స్, టీచర్లకు ప్రత్యేకంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి కొనుగోలు చేస్తే రూ. 7000 క్యాష్ బ్యాక్ తో రూ. 1,12,990/- ఫ్లాట్ ధరకు ఎక్స్ క్లూజివ్ గా లభిస్తుంది. ల్యాప్ టాప్లపై స్పెషల్ డీల్ జూలై 26 నుంచి జూలై 27 న మాత్రమే లభించును. ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.32 ఇంచుల స్మార్ట్ టీవీలు రూ. 12,990 నుంచి ప్రారంభం కానున్నాయి. రిఫ్రిజరేటర్లు రూ. 11,990, ప్రారంభం కానున్నాయి. అంతేకాకుంగా కొనుగోలుపై ఉచితంగా రూ. 1,999 విలువైన వస్తువులు లభిస్తాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు రూ. 13,290 ధరతో ప్రారంభం కానున్నాయి. కొనుగోలుదారులు తమకు నచ్చిన స్టోర్ల నుంచి మూడు గంటలలోపు డెలివరీ పొందవచ్చును. -
అనూహ్య నిర్ణయం.. భారత్లోకి టిక్టాక్ రీఎంట్రీ?
వీడియో కంటెంట్ యాప్ టిక్టాక్ మళ్లీ మనదేశంలో అడుగుపెట్టబోతోందా? టిక్టాక్ మాతృక సంస్థ బైట్డ్యాన్స్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అవుననే సంకేతాలు అందుతున్నాయి. అయితే వేరే పేరుతో.. వేరే కంపెనీ నిర్వహణలో ఇది మన దగ్గరకు మళ్లీ చేరనున్నట్లు సమాచారం. టిక్టాక్ మాతృ సంస్థ బైట్డ్యాన్స్ ఊహించని నిర్ణయం తీసుకుంది. యాప్కు సంబంధించిన ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో పాటు అల్గారిథంను కూడా అమ్మేందుకు సిద్ధపడింది. అమ్మకపు ఆఫర్ ప్రకటించిన దేశాల్లో భారత్ పేరును సైతం చేర్చింది. ఆసక్తి ఉన్న కంపెనీలు తమ టెక్నాలజీని కొనుగొలు చేయాలని పిలుపు ఇచ్చింది. ఈ మేరకు బైట్ఫ్లస్ డివిజన్ అమ్మకం వ్యవహారాలను చూసుకుంటుందని పేర్కొంది. కొనేది ఎవరు? టిక్టాక్ సక్సెస్లో అల్గారిథమ్ కీ రోల్ పోషించింది. అలాంటి దానిని అమ్మకానికి బైట్డ్యాన్స్ ఉంచడం విశేషం. అమెరికా నుంచి ఫ్యాషన్ యాప్ గోట్, సింగపూర్కు చెందిన ట్రావెట్ బుకింగ్ వెబ్సైట్ వీగో, ఇండొనేషియాకు చెందిన ఆన్లైన్ స్టార్టప్ కంపెనీ చిలిబెలీ కంపెనీలు బైట్డ్యాన్స్ ప్రత్యేక విభాగంతో కొనుగోలు ఒప్పందాన్ని చేసేసుకున్నాయి.ఇక భారత్ నుంచి వీడియో కంటెంట్తో అలరిస్తున్న ఓ యాప్ తో పాటు షార్ట్ న్యూస్లు అందించే ఒక యాప్ కంపెనీ, ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్, ఓ ఫుడ్ అవుట్లెట్, ఆన్లైన్లో సరుకులు రవాణా చేసే ఓ యాప్.. ఇలా పన్నెండు కంపెనీలు పోటీపడుతున్నట్లు సమాచారం. అయితే బైట్డ్యాన్స్ చైనాకు చెందిన కంపెనీ కావడంతో భారత్లో టిక్టాక్పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాప్ తీరుతెన్నులపై, భద్రతపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కేంద్రం.. మరో రూపంలో దానిని అనుమతి ఇస్తుందా?. తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే. ఒకవేళ అనుమతి దొరికితే మాత్రం.. ఇదివరకులా ఫీచర్లతో అలరించడం ఖాయం. -
ఆన్లైన్ అంగట్లో లింక్డిన్ యూజర్ల డేటా..!
వాషింగ్టన్: ఉపాధి ఆధారిత ఆన్లైన్ సేవలను అందించే లింక్డిన్ యూజర్ల డేటా ఆన్లైన్లో లీకైనట్లు తెలుస్తోంది. సుమారు 700 మిలియన్ల లింక్డిన్ యూజర్ల డేటా ఆన్లైన్లో బహిర్గతమైనట్లు వార్తలు వస్తున్నాయి. హాకర్లు యూజర్ల డేటాను ఆన్లైన్లో అమ్మకానికి ఉంచారని తెలుస్తోంది. లింక్డిన్ సుమారు 756 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉండగా..సుమారు 92 శాతం వరకు వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో లీకైంది. వినియోగదారుల ఈ మెయిల్, ఫోన్ నంబర్, పనిచేసే ఆఫీసు, పూర్తి పేరు, ఖాతా ఐడీలతో పాటుగా యూజర్ల సోషల్ మీడియా ఖాతాల లింకులు, వ్యక్తిగత వివరాలు లీకైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యూజర్ల సాలరీ వివరాలు కూడా లీకైనట్లు తెలుస్తోంది. కాగా తాజాగా లింక్డిన్ డేటా లీక్పై స్పందించింది. లింక్డిన్ ఒక ప్రకటనలో.. ‘యూజర్ల డేటా లీక్ జరగలేదని పేర్కొంది. కానీ ఇతర మ్యాడుల్ నెట్వర్స్క్తో హాకర్లు డేటాను పొందారని లింక్డిన్ తెలిపింది. కాగా డేటా లీక్పై లింక్డిన్ ప్రతినిధులు దర్యాప్తు చేపడుతున్నారని వివరించింది. కంపెనీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో హాకర్లు ఇతర వనరులను ఉపయోగించి డేటాను పొందారని తెలిపింది. లింక్డిన్ తన యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. యూజర్లు తమ ఖాతాలకు కచ్చితంగా 2FA టూ ఫ్యాక్టర్ అథణ్టికేషన్ను ఉండేలా చూసుకోవాలని లింక్డిన్ సూచించింది. సుమారు ఒక మిలియన్ యూజర్ల డేటాను హాకర్లు డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. చదవండి: Reliance: అబుదాబి కంపెనీతో భారీ డీల్ -
ఫ్లిప్కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ల సేల్కు తెర తీసింది. ‘ మాన్సూన్ ధమకా సేల్’ పేరుతో 4 రోజుల అమ్మకాలను ప్రారంభించింది. జూన్ 30 వరకు జరగనున్న ఈ అమ్మకాల్లో స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ, ఎస్బిఐ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్, ఎల్జీ, ప్యానసోనిక్, బ్లూస్టార్, వర్ల్పూల్, కేరియర్, వోల్టాస్, ఒనిడా కంపెనీల ఏసీలపై 41 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. శాంసంగ్: 1.5 టన్నుల 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .34,990 (అసలు రూ. 56,990) 38 శాతం తగ్గింపు 5 స్టార్ బీఇ రేటింగ్, టర్బో కూలింగ్ ఫీచర్తో పాటు డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని సొంతం. క్యారియర్ 4-ఇన్ -1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.5 టన్నుల స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .39,990 (అసలు రూ .61,990) 35శాతం తగ్గింపు వోల్టాస్ 2 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .28,990 (అసలు రూ. 54,990) వద్ద లభిస్తుంది 47శాతం తగ్గింపు వర్ల్పూల్ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ రూ .31,490 (అసలు ధర రూ .53,420) 41 శాతం తగ్గింపు బ్లూ స్టార్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .30,490 (అసలు ధర రూ .50,000). 39 శాతం తగ్గింపు చదవండి : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఊరట -
కరోనాకి బెదరని లంబోర్గిని
కరోనా సెకండ్ వేవ్ ఇండియా మొత్తాన్ని చుట్టేసింది, దాదాపుగా అన్ని రంగాలు కోవిడ్ ఎఫెక్ట్కి లోనయ్యాయి. కరోనా వైరస్ ధాటికి నూటికి తొంభైశాతం అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే లగ్జరీ కార్ల బ్రాండ్ లంబోర్గిని మాత్రం కరోనాకు సవాల్ విసిరింది. కరోనా సంక్షోభ సమయంలోనూ రికార్డు స్థాయి అమ్మకాలు సాగించింది. అంచనాలు తారుమారు జర్మనీకి చెందిన లంబోర్గిని బ్రాండ్కి అంతర్జాతీయంగా మంచి ఫేమ్ ఉంది. ఈ బ్రాండ్ కార్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలో బాగా సేల్ అవుతోన్న లంబోర్గిని ఉరుస్ కారు షోరూమ్ ధరనే రూ. 3.43 కోట్లుగా ఉంది. దీంతో లగ్జరీ బ్రాండ్ కార్ల అమ్మకాలు తగ్గుతాయనే అంచనాలు ఉండేవి. అయితే అవి పటాపంచలయ్యాయి. రెట్టింపు అమ్మకాలు ధర ఎంతున్నా పర్వాలేదు మాకు లంబోర్గిని ఉరుస్ కావాలంటున్నారు సినీ సెలబ్రిటీలు, బిజెనెస్మెన్లు. దీంతో అమ్మకాల్లో లంబోర్గిని ఉరుస్ దూసుకుపోతుంది. గతేడాది కూడా కరోనా ఎఫెక్ట్లో దేశవ్యాప్తంగా కేవలం 13 లంబోర్గిని ఉరుస్ మోడళ్లు ఇండియాలో అమ్ముడు పోయాయి. కానీ ఈసారి కేవలం ఆరు నెలల కాలంలోనే 26 కార్లు ఇండియాలో డెలివరీ చేసింది లంబోర్గిని. కరోనా కల్లోలం, మందగించిన ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలేవి లంబోర్గినిపై ప్రభావం చూపలేదు. లగ్జరీ సెగ్మెంట్లో ఒక్క లంబోర్గినే కాదు మెర్సిడెస్, ఆడి వంటి ఇతర లగ్జరీ బ్రాండ్లలో కూడా కార్ల అమ్మకాలు సూపర్గా ఉన్నాయి. ఇటీవల విడుదలై మెర్సిడెస్ మేహ్బ్యాక్ జీఎల్ఎస్ 400 మోడల్ కార్లు విడుదలకు ముందే దాదాపు స్టాక్ మొత్తం అమ్ముడైపోయింది. ఇండియాలో తమ లగ్జరీ బ్రాండ్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని, త్వరలో మరిన్ని మోడళ్లు ఇండియాలో ప్రవేశపెడతామని మెర్సిడెస్ సీఈవో మార్టిన్ చెబుతున్నారు. ఇండియన్ మార్కెట్లో లగ్జరీ కార్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆడి ఏకంగా ఈ ట్రాన్ పేరుతో లగ్జరీ ఈవీ ని అందుబాటులోకి తెచ్చింది. మరో హై ఎండ్ బ్రాండ్ పోర్షే కార్ల అమ్మకాలు ఈ త్రైమాసికంలో 57 శాతం పెరిగాయి. బైకుల పరిస్థితి దారుణం బిజినెస్ టైకూన్లు, టాప్ ఎగ్జిక్యూటివ్లు, సినీ సెలబ్రిటీలు లగ్జరీ కార్లు కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటే .. కరోనా ఎఫెక్ట్తో స్వంత టూవీలర్ కొనుక్కోవాలనుకున్న సామాన్యులు వెనుకడుగు వేస్తున్నారు. ఏళ్ల తరబడి పొదుపు చేసిన సొమ్మును ఖర్చు పెట్టేందుకు ధైర్యం చేయట్లేదు. దీంతో ఈ ఏడాది బైకుల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ లెక్కల ప్రకారం కరోనాకు ముందు 2019 మేతో పోల్చితే 2021 మేలో బైకుల అమ్మకాలు ఏకంగా 71 శాతం పడిపోయాయి. చదవండి : స్టైలిష్ లుక్తో కట్టిపడేస్తున్న 'యమహా' -
దుకాణం.. ఫర్ సేల్: అమ్మకం బోర్డు పెట్టిన 1,200 మంది!
న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు చిన్న వ్యాపారులు కుదేలయ్యారు! సుదీర్ఘ లాక్డౌన్లు, ఆంక్షలు, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు అన్నీ కలసి చిన్న వ్యాపారాల పాలిట శాపంగా పరిణమించాయి. దీంతో వ్యాపారాలను నడపలేక వాటిని అమ్మేసి బయటపడదామనుకుంటున్నారు. ఒక ఆన్లైన్ మార్కెట్ పోర్టల్లో 1,200 మంది తమ వ్యాపారాలను విక్రయానికి పెట్టడం దీన్నే సూచిస్తోంది. లాక్డౌన్లతో వ్యాపారాలను కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నకాడికి అమ్ముకుని ఊరట పొందేందుకు మొగ్గుచూపిస్తున్నారు. లాక్డౌన్ల ప్రభావం ఎక్కువగా చిన్న టూర్ (పర్యాటక) ఆపరేటర్లు, వ్యాయామ కేంద్రాలు (జిమ్లు), రెస్టారెంట్లు, ఈవెంట్ నిర్వహణ సంస్థలు, సెలూన్లు, ప్లే స్కూళ్లు, క్లౌడ్ కిచెన్లపై ఉన్నట్టు ఎస్మెర్జర్స్ అనే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డేటా తెలియజేస్తోంది. ‘‘సగటున ఒక్కో చిన్న వ్యాపార సంస్థ 2019–20తో పోలిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం మేర ఆదాయం నష్టపోయాయి. ప్రధానంగా రెస్టారెంట్లు, సెలూన్లు, సూపర్మార్కెట్లు, వినోద కేంద్రాలకు అయితే ఆదాయం 90–95% పడిపోయింది’’ అని ఎస్మెర్జర్స్ వ్యవస్థాపకుడు విశాల్ దేవనాథ్ తెలిపారు. 2021లో భారీ మార్పు.. 2018లో ఎస్మెర్జర్స్ వేదికపై 3.37 లక్షల కంపెనీలు నమోదు చేసుకున్నాయి. 2019లో 3.86 లక్షల సంస్థలు సాయం కోరుతూ నమోదు చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత వీటి సంఖ్య 6.10 లక్షలు దాటిపోయింది. ఇందులో 32,000 కంపెనీలు 2019లో విక్రయానికి ఉంచినవి కాగా, 2020లో 36,000, 2021లో తొలి నాలుగు నెలల్లోనే 11,000కు వీటి సంఖ్య పెరిగిపోయింది. డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ ఇటీవలే నిర్వహించిన సర్వే ప్రకారం.. కరోనా కారణంగా 82 శాతానికి పైగా వ్యాపార సంస్థలు సమస్యలను ఎదుర్కొంటుండగా.. వీటిల్లో 70 శాతం సంస్థలు కరోనా ముందు నాటి డిమాండ్ను చేరుకునేందుకు కనీసం మరో ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది. -
రెండో దశకు ఎయిరిండియా విక్రయం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి వీలుగా రెండో దశ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ బిడ్స్కు ఆహ్వానం పలుకుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కంపెనీ విక్రయ డీల్ సెప్టెంబర్కల్లా పూర్తికావచ్చని అంచనా వేశాయి. ఎయిరిండియా కొనుగోలుకి టాటా గ్రూప్ సహా పలు కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేస్తూ బిడ్స్ దాఖలు చేయడం తెలిసిందే. గతేడాది డిసెంబర్కల్లా ప్రాథమిక బిడ్డింగ్ ప్రక్రియ పూర్తికాగా.. వీటిని సమీక్షించిన ప్రభుత్వం అర్హతగల కంపెనీలను వీడీఆర్కు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. (అంచనాలను మించిన పరోక్ష పన్నులు) ఎయిరిండియా కొనుగోలులో భాగంగా ఇన్వెస్టర్ల సందేహాలకు సమాధానాలిచ్చే వీడీఆర్కు బిడ్డర్స్ను అనుమతించినట్లు తెలుస్తోంది. వెరసి ఎయిరిండియా విక్రయం ఫైనాన్షియల్ బిడ్డింగ్ దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. 2007లో ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిరిండియా మధ్య విలీనం జరిగాక కంపెనీ నష్టాలలో నడుస్తుండటం గమనార్హం! కాగా.. ప్రభుత్వం ఎయిరిండియాలో 100శాతం వాటాను విక్రయించనుంది. కొనుగోలుదారుడికి ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో 100శాతం వాటా, గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సేవలు అందించే ఏఐఎస్ఏటీఎస్లో 50శాతం వాటా చొప్పున లభించనుంది. (మారుతీ దూకుడు: టాప్ సెల్లింగ్ కారు ఇదే!) -
షావోమి రిపబ్లిక్ డే సేల్ : డిస్కౌంట్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్లిప్కార్ట్,అమెజాన్ లాంటి దిగ్గజాలకు పోటీగా షావోమి కూడా రిపబ్లిక్ డే సేల్ను ప్రకటించింది. షావోమి వెబ్సైట్ మి.కామ్లో జనవరి 20 నుండి జనవరి 24 వరకు ఈ సేల్ నిర్వహిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంకుకార్డు కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా షావోమి అందించనుంది. అలాగే ఎంఐ వీఐపీ క్లబ్ సభ్యులు ఈ రోజు (జనవరి 19) నుండే అమ్మకాలకు ముందస్తు ప్రాప్యతను పొందవచ్చు. రెడ్మి నోట్ 9 సిరీస్, రెడ్మి 9 ప్రైమ్, రెడ్మి 9ఐ స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తోంది. ఇంకా రెడ్మి స్మార్ట్ బ్యాండ్, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ వాచ్ రివాల్వ్పై కూడా డిస్కౌంట్స్ అందించనుంది. వీటితోపాటు రెడ్మి ఇయర్బడ్స్, ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్, ఎంఐ టివి స్టిక్ సహా ఇతర ఉత్పత్తులపై ఆఫర్లు , డిస్కౌంట్లను ప్రకటించింది. రెడ్మి సిరీస్ లో ఆఫర్లు రెడ్మి 9 ఐ 4 జీబీ + 64 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 7,999 లభ్యం. ఎంఆర్పీ ధర 8,299 రెడ్మి 9 ప్రైమ్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 9,499 రూ. 500 డిస్కౌంట్ రెడ్మి నోట్ 9 6జీబీ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13,999 (రూ. 1,000 తగ్గింపు) రెడ్మి నోట్ 9 ప్రో 4 జీబీ + 128 జీబీ స్టోరేజ్ ప్రస్తుత ధర రూ.13,999, రూ. 2,000. తగ్గింపు రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్ 6 జిబి + 64 జీబీ స్టోరేజ్ రూ. 17,499 అలాగే పాత ఫోన్ల మార్పిడి ద్వారా 2,000 తగ్గింపు లభ్యం. రిపబ్లిక్ డే సేల్లో ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీలపై 1,000 రూపాయల తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫైయర్ (ఆర్ఓ+యువి) వంటి ఇతర ఉత్పత్తులపై రూ. 3,000 డిస్కౌంట్ లభ్యం. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్.. ఆఫర్లే ఆఫర్లు
ఆన్లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ జనవరి 20 నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ జనవరి 24తో ముగుస్తుంది. ఈ సేల్ లో హెచ్డిఎఫ్సి క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఈఎంఐ ద్వారా కొనుగోలు యూజర్లకు 10 శాతం తగ్గింపు లభించనుంది. ఈ సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ల మీద ఉత్తమ ఆఫర్లను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. శామ్సంగ్ ఎఫ్ 41, ఐఫోన్ ఎక్స్ఆర్, మోటో జీ 5జీతో పాటు ఇతర స్మార్ట్ఫోన్ల మీద ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్లో డిస్కౌంట్ లభించనుంది. ఈ సేల్లో భాగంగా ఐఫోన్ 11ను సుమారు 48,999 రూపాయలకు పొందవచ్చు. అలాగే మోటరోలా మోటో జి 5జీ రూ.18,999కు లభిస్తుంది. ల్యాప్టాప్లు, పీసీ, హెడ్ఫోన్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల మీద 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ లో స్మార్ట్ టీవీలు వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఉపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్యాషన్ యాక్సెసరీలపై 50-80శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. అదనంగా, ఫ్లిప్కార్ట్ ప్రత్యేక ఉత్పత్తుల మీద చాలా తక్కువ ధరలో తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. -
అమెజాన్ మరో కొత్త సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్
న్యూఢిల్లీ: అమెజాన్ మరో కొత్త సేల్ తో ముందుకు రాబోతుంది. జనవరి 20 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభంకానునట్లు సంస్థ పేర్కొంది. ఈ సేల్ జనవరి 23 వరకు కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు 24 గంటల(జనవరి 19) ముందుగానే ఈ సేల్ లో పాల్గొనవచ్చు. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో షాపింగ్ చేసే వినియోగదారులు ఎస్బిఐ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ ఈఎంఐలపై 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్ లో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కేవలం బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే లేటర్, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.(చదవండి: నాలుగు ప్లాన్లను తొలగించిన జియో) రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టివి స్టిక్ డివైజ్ లు 40 శాతం వరకు కిండ్ల్ ఇ-రీడర్స్ పై రూ.3,000 వరకు ఆఫ్ లభిస్తుంది. వన్ప్లస్ 8టీ 40,499 రూపాయలకు లభించనుంది. ఈ వన్ప్లస్ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్, 5జీ సపోర్ట్, 120 హెర్ట్జ్ అమోలేడ్ డిస్ప్లే, 65 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ ఉన్నాయి. ఐఫోన్ 12 మీనీ మొబైల్ 59,990కి లభించనుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎం51 కూడా రూ.20,999 ధరకే లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఆపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఇయర్బడ్లు రూ.20,999 ధరకే లభిస్తాయి. అలాగే మొబైల్స్ తో పాటు ఇతర ఉత్పత్తులు మీద కూడా భారీ ఆఫర్లు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో లభించనున్నాయి. -
శామ్సంగ్: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ
శామ్సంగ్ ఇండియా మరో కొత్త సేల్ ను "బిగ్ టీవీ డేస్ సేల్" పేరుతో ముందుకు తీసుకొచ్చింది. ఈ సేల్ లో కేవలం స్మార్ట్ టీవీలు మాత్రమే లభించనున్నాయి. కానీ ఈ సేల్ లో మీరు కొన్న ప్రతి స్మార్ట్ టీవీతో పాటు మొబైల్ ఫోన్స్, సౌండ్బార్లు ఉచితంగా లభించనున్నాయి. 55 అంగుళాల టీవీ నుంచి ప్రీమియం టీవీల వరకు అన్ని స్మార్ట్ టీవీలపైన ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్ 2021 జనవరి 1 నుంచి 31 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శామ్సంగ్ రిటైలర్ స్టోర్లలో ఈ సేల్ నడుస్తుంది. అలాగే వినియోగదారులు 20 శాతం క్యాష్బ్యాక్ కూడా సేల్లో పొందవచ్చు. రూ.1,990 ఈఎంఐకే స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు.(చదవండి: శామ్సంగ్ నుంచి సరికొత్త బడ్జెట్ మొబైల్) 65-అంగుళాల క్యూఎల్ఇడి టివి, 75 అంగుళాల క్రిస్టల్ 4కే యుహెచ్డి టివిలను కొనుగోలు చేసే వినియోగదారులకు శామ్సంగ్ గెలాక్సీ ఎ 51 ఉచితంగా లభిస్తుంది. 55 అంగుళాల క్యూఎల్ఇడి టీవీ, 65 అంగుళాల క్రిస్టల్ 4కె యుహెచ్డి టివిలను ఎంచుకునే కొనుగోలుదారులకు శామ్సంగ్ గెలాక్సీ ఎ31 స్మార్ట్ఫోన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే 75-అంగుళాల, 82-అంగుళాల, 85-అంగుళాల క్యూఎల్ఇడి టీవీలను కొనుగోలు చేసే వ్యక్తులు సౌండ్బార్ HW-Q800T లేదా HW-Q900T ఉచితంగా పొందుతారు. శామ్సంగ్ క్యూఎల్ఇడి టివిలకు 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ, ఒక ఏడాది కాంప్రహెన్సీవ్ వారెంటీ, ప్యానెల్పై ఒక ఏడాది అడిషనల్ వారెంటీ లభిస్తుంది. -
డబ్బున్నోళ్లకు కోపం వస్తే అంతే!
వాషింగ్టన్ : బాగా డబ్బున్న వాళ్లకు కోపం వస్తే అంతే సంగతులు. ముందూ వెనక ఆలోచించకుండా అనుకున్నది చేస్తారు. మన ఎలాన్ మస్క్ అదే చేశారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న ఆయన ఆస్తి విలువ ‘ఫోర్బ్స్’ కథనం ప్రకారం 153.5 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు కోటీ పదమూడు లక్షల కోట్ల రూపాయలు. స్వయంగా ఇంజనీరు చదువుకున్న ఎలాన్ మస్క్ టెస్లా కార్ల తయారీ కంపెనీ పెట్టి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగి ‘స్పేస్ ఎక్స్’ పేరిట రోదసి కంపెనీని కూడా ఏర్పాటు చేసి బాగా సంపాదించారు. చంద్రుడు, అంగారక గ్రహాన్ని చుట్టి వచ్చేందుకు ఆయన దగ్గర అడ్వాన్స్గా పలువురు కుబేరులు టిక్కెట్లు కూడా తీసుకున్నారు. ఇంతకు ఎలాన్ మస్క్కు ఎందుకు కోపం వచ్చిందంటే....అమెరికాలో భీకరంగా విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేయడం కోసం కాలిఫోర్నియా రాష్ట్రంలో పలుసార్లు లాక్డౌన్లు విధిస్తుండడంతో ఆయన తట్టుకోలేక పోతున్నారు. దాంతో గుండెల్లో రగిలిపోయి కాలిఫోర్నియా నుంచి టెక్సాస్కు మారిపోవాలని నిర్ణయించుకున్నారు. ( కిమ్.. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారిలా.. ) అందుకని కాలిఫోర్నియాలోని తన ఏడు సుందనమైన భవనాలను 2020లో అమ్మేస్తానని గత మే నెలలోనే శపథం చేశారు. అన్నట్లుగా అప్పట్లోనే బెల్ ఏర్ ప్రాంతంలోని రెండు భవనాలను విక్రయించగా, సొమేరా రోడ్డులోని మరో మూడు భవనాలను డిసెంబర్ 21, డిసెంబర్ 22 తేదీల్లో 40.9 మిలియన్ డాలర్లకు అంటే, దాదాపు మూడు వందల కోట్ల రూపాయలకు విక్రయించారు. వాటిని ఓ బిల్డరు, మరో డిజైనర్ కొనుగోలు చేసినట్లు తెల్సింది. మరో రెండు అమ్మకానికి పెట్టిన భవనాలను అమ్మారా లేదా ? తెలియడం లేదు. కాలిఫోర్నియాలో కూడా ఆయనకు పారిశ్రామిక కేంద్రాలు ఉండడం వల్ల ఆయన అక్కడికి వెళ్లినప్పుడు ఉండడానికి వీలుగా అమ్మకుండా ఉంచుకునే అవకాశం ఉందని కొందరంటుండగా, ‘మంచయినా, చెడయిన మాట నిలబెట్టుకునే మనిషి మా ఎలాన్ మస్క్’ అని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అమెజాన్ లో మరో సేల్
మీరు అమెజాన్ లో ఇంటి అవసరాల కోసం ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారా? అయితే, ఒక రోజు ఆగండి మీ కోసం మంచి డీల్ ని తీసుకొచ్చింది అమెజాన్. అమెజాన్ ఇండియా తన స్మాల్ బిజినెస్ డే 2020 యొక్క 4వ ఎడిషన్ను 2020 డిసెంబర్ 12 శనివారం నిర్వహిస్తుంది. ఈ సేల్ డిసెంబర్ 12 అర్ధరాత్రి నుండి అదే రోజు రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ ఒక రోజు మాత్రమే కొనసాగనున్నట్లు పేర్కొంది. మహిళా వ్యాపారవేత్తలకు, కళాకారులు, చేనేత దారులు, స్థానిక దుకాణాలను ప్రోత్సహిచేందుకు అమెజాన్ ఈ సేల్ ని నిర్వహిస్తుంది. చిరువ్యాపారులకు మద్దతుగా నిలవడంతో పాటు వారి వ్యాపారం వృద్ధ్ది చెందేలా చేయడమే ఈ సేల్ ముఖ్య లక్ష్యం.(చదవండి: షియోమీ మరో సంచలనం) స్మాల్ బిజినెస్ డే 2020 రోజున మీకు గృహ అవసరాలు, భద్రత, పరిశుభ్రత, గోడల ఆకృతి, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, వంట సామాగ్రి, క్రీడలు అవసరమైనవి వంటి విభాగాలలోని ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులపై 10 శాతం వన్ డే క్యాష్బ్యాక్ కూడా ఆఫర్ చేస్తుంది. క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10 ఇన్స్టాంట్ డిస్కౌంట్ కోసం అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు లక్షల మంది అమ్మకందారుల కోసం మేము గత కొద్దీ నెలలుగా సేల్స్ తీసుకొస్తున్నామని దీని ద్వారా వారి వ్యాపార వృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని మనీష్ తివారీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేల్లో హోమ్ డెకార్పై 50 శాతం, ఫర్నీషింగ్పై 60 శాతం, ఫర్నీచర్పై 50 శాతం, కిచెన్ అప్లయెన్సెస్పై 60 శాతం, డిన్నర్వేర్పై 60 శాతం, స్టోరేజ్ అండ్ ఆర్గనైజేషన్పై 50 శాతం, చీరలపై 70 శాతం, కుర్తీలపై 70 శాతం, మెన్స్వేర్పై 70 శాతం, కిడ్స్ వేర్పై 60 శాతం, జ్యువెలరీ అండ్ యాక్సెసరీస్పై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 2020 జూన్ 27న నిర్వహించిన స్మాల్ బిజినెస్ డే ద్వారా 45,000 మంది అమ్మకందారులకు ఆర్డర్ వచ్చింది. 2,600 మంది అమ్మకందారులు ఇప్పటివరకు అత్యధికంగా అమ్మకాలు చేసారు అని సంస్థ పేర్కొంది. -
టిక్టాక్పై సోషల్ వీడియో దిగ్గజం కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ టిక్టాక్ కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖసోషల్ వీడియో ప్లాట్ఫామ్ ట్రిల్లర్ చైనాకు చెందిన బైట్డాన్స్ను సంప్రదించినట్టు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సెంట్రికస్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్తో సంప్రదించినట్లు రాయిటర్స్ శనివారం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేంలోని టిక్ టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్టు పేర్కొంది. (టిక్టాక్ : రేసులో మరో దిగ్గజం) టిక్టాక్ కాకుండా టిక్టాక్ యజమాన్య సంస్థ బైట్డాన్స్కు నేరుగా బిడ్ చేసినట్లు ట్రిల్లర్ వెల్లడించింది. సెంట్రికస్ ద్వారా బైట్డాన్స్ ఛైర్మన్కు నేరుగా ఆఫర్ను సమర్పించామనీ, స్వీకరణ ధృవీకరణ కూడా తమకు చేరిందని ట్రిల్లర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాబీ సర్నెవెష్ట్ చెప్పారు. డైరెక్టుగా ఛైర్మన్తోనే సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అయితే, ఈ వార్తలను టిక్టాక్ తోసిపుచ్చింది. అలాంటి ఆఫర్ను అందుకోలేదని తెలిపింది. దీంతో ఈ వ్యవహారంలో గందరగోళం నెలకొంది. (వీచాట్ బ్యాన్ : డ్రాగన్ టిట్ ఫర్ టాట్ వార్నింగ్) టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ తన అమెరికా, కెనడియన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కార్యకలాపాలను విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 90 రోజుల గడువు లోపల ఒక ఒప్పందానికి రావాలని భావిస్తోంది. సుమారు. 20-30 బిలియన్ల డాలర్ల పరిధిలో డీల్ ఖాయం చేసుకోవాలని భవిస్తోంది. అటు రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ మైక్రోసాఫ్ట్ తో జతకడుతున్నట్లు ధృవీకరించింది. దీంతో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్ మార్ట్ మూడు దిగ్గజ కంపెనీలతో బైట్డాన్స్ చర్చలు జరుపుతోంది. కాగా జాతీయ భద్రతా సమస్యలరీత్యా టిక్టాక్ ను నిషేధిస్తామని ఇప్పటికే హచ్చరించిన ట్రంప్ అమెరికా కార్యకలాపాలను విక్రయించాలని ఒత్తిడి పెంచారు. ఇందుకు 45 రోజుల్లోపు అమెరికాలో బైట్డాన్స్ ఎటువంటి లావాదేవీలు జరపకుండా నిషేధిస్తూ ట్రంప్ ఆగస్టు 6న ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత దీన్ని 90 రోజులకు పెంచుతూ ఆగస్టు 14 న మరో ఉత్తర్వుపై సంతకం చేశారు. మరోవైపు ట్రంప్ మొదటి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై టిక్టాక్ దావా వేసిన సంగతి తెలిసిందే. -
పసిపాపను అమ్మకానికి పెట్టిన అమ్మమ్మ
సాక్షి, కరీంనగర్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని పసిపాప శుక్రవారం అమ్మకాన్ని గురైంది. వీణవంక మండల కేంద్రంలో నాలుగు నెలల పసికందును అమ్మమ్మ అమ్మేసింది. పసిపాపను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తిరుపతమ్మ సంపత్ దంపతులు లక్షా పదివేలకు కొనుగోలు చేసినట్లు తేలింది. పసిపాప కనిపించకపోయేసరికి తల్లి పద్మ నిలదీయడంతో పాపను అమ్మిన విషయాన్ని పద్మ తల్లి కనకమ్మ తెలిపింది. దీంతో పసి పాప తల్లి తన భర్త రమేష్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి అత్తతో గొడవ పడ్డారు. ఈ విషయంపై స్థానికులు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా పసిపాప అమ్మకం బయటపడింది. పసిపాపను మళ్ళీ తల్లి చెంతకు చేర్చారు విక్రయించిన అమ్మమ్మ కనకమ్మ ను, కొనుగోలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పిల్లలను అమ్మిన కొన్న నేరమని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు అంటున్నారు. -
కన్న కొడుకును ‘అమ్మే’సింది!
నాంపల్లి: పచ్చనోట్లకు అమ్మ ప్రేమ అమ్ముడైపోయింది... పేగు బంధాన్ని మరిచి డబ్బు కోసం కన్న కొడుకును అమ్మేసింది... రెండు నెలల పసికందును తల్లి విక్రయించిన ఘటన హబీబ్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక సుబాన్పురాకు చెందిన అబ్దుల్ జోయాఖాన్, అబ్దుల్ ముజాహిద్ భార్యాభర్తలు. వీరికి షేక్ అద్నాన్ (2 నెలలు) కుమారుడు ఉన్నాడు. భర్త ఎర్రమంజిల్ కాలనీలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో ముజాహిద్ మేనేజర్గా పని చేస్తున్నాడు. దంపతులిద్దరూ మద్యం తాగి తరచు గొడవ పడేవారు. భార్యతో గొడవపడ్డ భర్త ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి 8వ తేదీన తిరిగి వచ్చాడు. ఇంట్లో కుమారుడు అద్నాన్ కనిపించలేదు. దీంతో కుమారుడు ఎక్కడని భార్యను నిలదీయగా అమ్మేశానని చెప్పింది. దీంతో భార్యపై భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగాపురాకు చెందిన షేక్ మహ్మద్, తబుసుమ్ బేగం అనే దంపతుల ద్వారా కాలాపత్తర్కు చెందిన సిరాజ్ అనే మహిళకు రూ.45 వేలకు బాలుడ్ని విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు బాబును విక్రయించిన తల్లిని, కొనుగోలు చేసిన మహిళతో పాటుగా వీరిద్దరి మధ్య బేరం కుదిర్చిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
టిక్టాక్ విక్రయం : చైనా వార్నింగ్?
బీజింగ్: చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ నిషేధం వ్యవహారంలో అమెరికా- చైనా మధ్య వివాదం మరింత ముదురుతోంది. అమ్మకమా, నిషేధమా తేల్చుకోమంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ఇందుకు సెప్టెంబరు 15 వరకు గడువు విధించారు. అంతేకాదు టిక్ టాక్ అమ్మకపు ఒప్పందంలో కొంత భాగం తమ ప్రభుత్వానికి రావాలని కూడా ట్రంప్ మెలిక పెట్టారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవోతో ఫోన్ ద్వారా చర్చించినట్టు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో డైలీ గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన సంపాదకీయం ఆసక్తికరంగా మారింది. అమెరికా బెదిరింపులకు లొంగేదిలేదంటున్న చైనా తాజా వార్నింగ్ మరింత అగ్గి రాజేస్తోంది. (టిక్టాక్ : ట్రంప్ తాజా డెడ్లైన్) టిక్టాక్ విక్రయానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను సాగనీయమని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక వార్తాపత్రిక డైలీ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. టిక్టాక్ ‘చోరీ’కి అమెరికా యత్నిస్తోందని, దీన్ని అంగీకరించ బోమని హెచ్చరించింది. తమ టెక్నాలజీ కంపెనీలను చేజిక్కించుకోవడానికి అమెరికా యత్నిస్తోందనీ, దీన్ని ప్రతిఘటించి తీరుతామని స్పష్టం చేసింది. అంతేకాదు ట్రంప్ సర్కార్ తీసుకోబోయే ప్రణాళికబద్ద ఆక్రమిత చర్యలపై ప్రతిస్పందించడానికి తమ దగ్గర చాలా మార్గాలున్నాయని కూడా పేర్కొంది. కాగా అమెరికాలోని టిక్టాక్ ఆపరేషన్స్ ని కొనుగోలు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందుకు టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్తో చర్చలు జరుపుతున్నామని కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
టిక్టాక్ : ట్రంప్ తాజా డెడ్లైన్
వాషింగ్టన్ : చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్’ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్ను తమ దేశంలో నిషేధిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. (మైక్రోసాఫ్ట్ ‘టిక్టాక్’ షో!) టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చుకోవాలని లేదంటే నిషేధం తప్పదని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ , లేదా మరో పెద్ద సంస్థ ఏదైనా తనకు అభ్యంతరం లేదు కానీ సురక్షితమైన అమెరికన్ సంస్థ కావాలి అని ట్రంప్ అన్నారు. భద్రతతో తమకు ఎటువంటి సమస్య ఉండకూడదని తెలిపారు. అలాగే ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని చెప్పారు. మరోవైపు టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్నట్టు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని, సమాచార భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అమెజాన్ ఆపిల్ డేస్ సేల్ : తగ్గింపు ధరలు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్లైన్ సంస్థ అమెజాన్ ఆపిల్ డేస్ సేల్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆపిల్ డేస్ అమ్మకాలు ఈ రోజు(శనివారం) అర్థరాత్రినుంచి ప్రారంభమై జూలై 25 వరకు కొనసాగుతుంది. ఆపిల్ ఐఫోన్ 11 సిరీస్తో పాటు ఐఫోన్ 8 ప్లస్ వంటి ఫోన్లపై తగ్గింపు ధరలను అందించనుంది. అలాగే ఆపిల్ ఐప్యాడ్ సిరీస్, ఆపిల్ వాచ్ సిరీస్పై కూడా డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనపు తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ లాంటి సదుపాయాలను కూడా అందిస్తుంది. అమెజాన్లో ఆఫర్లు ఐఫోన్ 11 (64 జీబీ స్టోరేజ్ వేరియంట్) 62,900 రూపాయలుకే లభ్యంకానుంది. అసలు ధర 68,300 రూపాయలతో పోలిస్తే ఈసేల్లో 5,400 రూపాయలు తగ్గింపు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఐఫోన్ 11 ప్రో ఐఫోన్ 11 ప్రో మాక్స్ కొనుగోళ్లపై 4వేల రూపాయలు డిస్కౌంట్. ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ ధర 41,500 రూపాయలు. దీంతో పాటు ఐఫోన్ 7 సిరీస్ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్లు అందించనుంది. -
ఆశలన్నీ ఆషాడంపైనే..
కడప కల్చరల్: వస్త్ర వ్యాపారుల ఆశలన్నీ ఆషాడంపైనే ఉన్నాయి. సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం కాగానే వస్త్ర వ్యాపారులు ‘ఆషాడం డిస్కౌంట్ సేల్’ పేరిట తగ్గింపు ధరకు ఇస్తారు. దీంతో మహిళల నుంచి వ్రస్తాలకు మంచి డిమాండ్ ఏర్పడి వ్యాపారులు నాలుగు డబ్బులు కళ్లచూసే అవకాశం లభిస్తుంది. పండుగలు, వివాహాల సీజన్ ముగిసిన తర్వాత ఆషాడం డిస్కౌంట్ సేల్స్పైనే వస్త్ర వ్యాపారులు నమ్మకం ఉంచుతారు. వీలైనంత తక్కువ ధరకు అంతకుముందు వివాహాలు, ఇతర శుభ కార్యాల కోసం తెప్పించిన వస్త్రాలను విక్రయించి కొత్త స్టాకును తెచ్చి పెట్టుకోవాలని భావిస్తారు. అందుకే కొద్దిపాటి మార్జిన్ ఉన్నా వస్త్రాలను డిస్కౌంట్ సేల్స్లో ఉంచి విక్రయిస్తారు. విక్రయాలకు లాక్డౌన్ కరోనా లాక్డౌన్ కారణంగా మంచి సీజన్లో వస్త్ర వ్యాపారాలు మూతపడ్డాయి. మార్చి నుంచి జూన్ మొదటి వారం వరకు పండుగలు, అంతకుమించి వివాహ ముహూర్తాలు ఉండేవి. దీని కోసం వ్యాపారులు కొత్తకొత్త రకాల వ్రస్తాలను పెద్ద ఎత్తున తెచ్చి స్టాక్ ఉంచుకున్నారు. ఊహించని విధంగా లాక్డౌన్తో వ్యాపారాలకు బ్రేక్ డౌన్ కావడం వారి ఆశలపై నీళ్లు చల్లింది. వారం, పదిరోజులు లేదా ఒక నెల మాత్రమే లాక్డౌన్ ఉంటుందని వారు తొలుత భావించినా ఆ తర్వాత వరుసగా దాదాపు మూడు నెలలపాటు దుకాణాలు మూసి ఉంచాల్సి రావడంతో అటు దుకాణ గదుల అద్దెలు చెల్లించలేక, ఇటు దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించలేక మినిమ్ కరెంటు బిల్లులు చెల్లించాల్సి రావడం తదితర కారణాలతో ఆర్థికంగా కుదేలయ్యారు. జూన్ 4 నుంచి షరతులపై దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినా అప్పటికే సీజన్ ముగిసిపోవడంతో ఆషాడ మాసం ఆఫర్లతోనైనా వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నారు. ఆషాడం ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా మునుపటిలా వ్యాపారాలు జరుగుతాయన్న ఆశలేవీ కనిపించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. నిజానికి ఎప్పటిలా ఆషాడం పేరిట వ్రస్తాలకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. కానీ అంతో ఇంతో వ్యాపారం జరుగుతుందన్న విశ్వాసంతో కొందరు వ్యాపారులు మాత్రం డిస్కౌంట్ ప్రకటనలు ఇస్తున్నారు. నాడు కళకళ.. నేడు వెలవెల సాధారణంగా ఆషాడ మాసం ప్రారంభం కాగానే చిన్నా, పెద్ద వస్త్ర దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతాయి. కొన్ని దుకాణాలు 50 శాతం వరకు ఇవ్వజూపడంతో ఆ దుకాణాల్లో మంచి వ్యాపారం జరుగుతుంది. కానీ లాక్డౌన్ కారణంగా ఈసారి ఆ అవకాశం లేదు. మూడు మాసాలపాటు వ్యాపారాలు లేక నష్టపోవడంతో ప్రభుత్వం సాయం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు వస్త్ర వ్యాపారులు విన్నవిస్తున్నారు. లాక్డౌన్ ముందు ఆషాఢం ఆఫర్ మంత్రం పనిచేయడం లేదని, ఈ మాసం కూడా భారీగా నష్టాలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆశలు శ్రావణమాసంలోనేనని భావిస్తున్నారు. ఆషాడమాసం మరో మూడు వారాలు ఉంది గనుక ఈ సమయంలో వ్యాపారాలు పుంజుకునే అవకాశం కూడా ఉందని మరికొందరు వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భవిష్యత్తుపై ఆశ ఆషాడం ఆఫర్లు ఇచ్చే పరిస్థితి పెద్దగా కనిపించకపోయినా భవిష్యత్తుపై ఆశ ఉంది. పెద్దగా లాభాలు ఆశించకపోయినా కార్మికుల జీతాలు, మెయింటెన్స్ ఖర్చులు వస్తే చాలనుకుంటున్నాం. శ్రావణమాసం, ఆపై వచ్చే సీజన్లోనైనా వ్యాపారాలు జరుగుతాయన్న విశ్వాసం ఉంది. – దినేష్సింగ్, వస్త్ర వ్యాపారి, కడప లాక్డౌన్తో తీవ్ర నష్టం లాక్డౌన్ను ఊహించకపోవడం, మూడు నెలలు దుకాణాలు మూసి వేయడంతో వస్త్రాల స్టాకు కొద్దిమేర పాడై నష్టం చేకూరింది. పనిలేకపోయినా బాడుగలు, కరెంటు బిల్లు, ట్యాక్సు, కారి్మకుల జీతాలు కట్టాల్సి రావడంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – చెన్నంశెట్టి మురళి, వస్త్ర వ్యాపారి, కడప -
అమ్మకానికి చే గువేరా ఇల్లు
వాషింగ్టన్: విప్లవ వేగుచుక్క చే గువేరా గురించి ప్రపంచమంతా తెలుసు. చే ప్రసంగాలు, అతని ఆలోచనలు యువతరానికి ఇప్పటికీ ఆదర్శప్రాయమే. అర్జెంటీనాలో చే గువేరా జన్మించిన ఇంటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం వార్తల్లో నిలిచింది. 1928లో అర్జెంటీనాలోని రోసారియోలో నియో క్లాసికల్ అనే భవనంలో చే గువేరా జన్మించాడు. ఈ భవనాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. 2002లో ఫ్రాన్సిస్కో ఫరూగియా ఈ భవనాన్నికొనుగోలు చేశాడు. 240 చదరపుమీటర్ల అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవనాన్ని అతడు సాంస్కృతిక నిలయంగా మార్చుదామనుకున్నాడు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో ఇప్పుడు దీన్ని అమ్మివేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ధర మాత్రం వెల్లడించలేదు. ఇక ఉర్కిజా, ఎంటర్ రియాస్ మధ్య ఉన్న ఈ భవనం ఏళ్ల తరబడి ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తూ వస్తోంది. (ఫేక్ ఫొటో: డిటెన్షన్ సెంటర్లో తల్లి..) ఉరుగ్వే మాజీ అధ్యక్షుడు జోస్ పీపీ ముసికా దీన్ని సందర్శించిన లిస్టులో ఉన్నారు. చేతో కలిసి 1950లో దక్షిణ అమెరికా మొత్తాన్ని బైకుపై చుట్టివచ్చిన అల్బెర్టో గ్రెనడోస్ కూడా దీన్ని సందర్శించినవాడే. కాగా వృత్తిపరంగా డాక్టర్ అయిన చే గువేరా రచయిత, కవి, మేధావి, కమ్యూనిస్టు, సిద్ధాంతకర్త, మానవతావాది కూడా. దోపిడీ విధానాలను నిరసిస్తూ అతడు క్యూబా విప్లవంలో పాల్గొని ప్రాణాలకు తెగించి పోరాడాడు. అనంతరం ఫిడేల్ క్యాస్ట్రో ప్రభుత్వంలో క్యూబా మంత్రిగా పని చేశాడు. అయితే బొలీవియాలో పేదలకు అన్యాయం జరుగుతోందని పదవి వీడి మళ్లీ ఉద్యమం బాట పట్టాడు. ఈ క్రమంలో 1967 అక్టోబర్ 9న బొలివీయన్ దళాలు చేను చుట్టుముట్టి చంపేశాయి. అనంతరం ఆయన మృతదేహాన్ని ప్రపంచానికి కూడా చూపించలేదు. 1997లో అతని అవశేషాలు బయటపడగా క్యూబాకు తీసుకెళ్లి మరోసారి ఖననం చేశారు. (ఆనాటి స్ఫూర్తి ఎక్కడ.. నేడెక్కడ?) -
మింత్రా సేల్ : 5 వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై : ఫ్యాషన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మింత్రా 'ఎండ్ ఆఫ్ రీజన్ సేల్'(ఇఒఆర్ఎస్)కు శ్రీకారం చుట్టింది. నేటి (జూన్19) నుంచి ప్రారంభించిన 12వ ఎడిషన్ అమ్మకాలు జూన్ 22తో ముగియనున్నాయి. ఈ సందర్భంగా సప్లయ్ చెయిన్, కస్టమర్ కేర్ విభాగాల్లో 5 వేల మందిని నియమించుకున్నామని మింత్రా ప్రకటించింది. అంతేకాదు తొలిసారిగా తమ ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారని వెల్లడించింది. ఇఒఆర్ఎస్ అమ్మకాల్లో దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా బ్రాండ్ల నుండి 7 లక్షలకు పైగా వెరైటీలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మహిళలు, పిల్లలు, క్రీడా, ఫ్యాషన్ దుస్తులు, బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగాల్లో ఆకర్షణీయ ధరలు అందుబాటులో ఉన్నాయని మింత్రా ప్రకటించింది. పుంజుకున్న డిమాండ్ కనుగుణంగా నిమిషానికి 20 వేలకు పైగా ఆర్డర్లను తీసుకోవడానికి తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపింది. 30 లక్షల ప్రజలు తమ ప్లాట్ఫామ్లో షాపింగ్ చేస్తారని ఆశిస్తోంది. 'అన్లాక్ 1.0' దశలో సేల్ పుంజుకుందని తాజా సేల్ ద్వారా కూడా భారీ అమ్మకాలను సాధించనున్నామనే ధీమాను సీఈఓ అమర్ నాగారం వ్యక్తం చేశారు. గరిష్టంగా 7.5 లక్షలకు పైగా వినియోగదారులు ఈ సేల్ పాల్గొంటారని అంచనా వేశారు.300 నగరాల్లో 400 కి పైగా బ్రాండ్ల నుండి 3,500కు పైగా భారతీయ చేనేత ఉత్పత్తులను తమ ప్లాట్ఫామ్లో అందిస్తున్నామన్నారు. ప్రధానంగా ఎస్ఎంఇలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు అమర్ చెప్పారు. అంతేకాకుండా ఈ అమ్మకాలు ముగిసిన తరువాత ఉద్యోగులకు రెండు రోజుల "రీఛార్జ్ లీవ్" ను కూడా అందిస్తోంది. కాగా మునుపటి సేల్లో, 2.85 మిలియన్ల కస్టమర్ల ద్వారా 4.2 మిలియన్ ఆర్డర్లతో 9.6 మిలియన్ వస్తువులను మింత్రా విక్రయించింది. చదవండి : అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ -
శాంసంగ్ డేస్ సేల్ : ఆపర్లు
సాక్షి, ముంబై: మొబైల్ దిగ్గజం శాంసంగ్ మరోసారి ‘శాంసంగ్ డేస్’ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో మంగళవారం (జూన్ 9) నుంచి 12 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ముఖ్యంగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. అలాగే, శాంసంగ్ కేర్ ప్లస్, యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్లు కూడా లభ్యం. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, ఎస్20ప్లస్, గెలాక్సీ ఎస్20, గెలాక్సీ నోట్ 10 లైట్, గెలాక్సీ నోట్ 10 ప్లస్, గెలాక్సీ ఎస్ 10 లైట్ వంటి వాటితోపాటు ఇతర స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తోంది. (శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్స్ వచ్చేశాయ్!) శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్ శాంసంగ్ గెలాక్సీ ఎస్20 అల్ట్రా, గెలాక్సీ ఎస్20ప్లస్, ఎస్ 20 కొనుగోళ్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలుపై రూ .4,000 క్యాష్బ్యాక్. 12 నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్. శాంసంగ్ కేర్ + ప్లాన్ను రూ .2,499 అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్ రూ .4,000 వరకు క్యాష్బ్యాక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డుల ద్వారా గెలాక్సీ ఎస్ 10 లైట్ (128 జీబీ) కొనుగోలుపై 12 నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్. గెలాక్సీ ఎస్ 10 లైట్ 512 జీబీ వేరియంట్ పై రూ .2,000 తక్షణ క్యాష్బ్యాక్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్ తక్షణ క్యాష్బ్యాక్ రూ .2000. రూ .2,299 ల శాంసంగ్ కేర్ + ప్యాకేజీ అదనం Time to get a little closer to your favourite brand. Bringing to you, Samsung Days with no cost EMI and other great offers on all your favourite smartphones. Guess what? Get them delivered right at your doorstep. Happy Shopping! https://t.co/fpkWknMtpI#Samsung pic.twitter.com/KVsgZFdmjJ — Samsung India (@SamsungIndia) June 9, 2020 ఇవి కాకుండా, గెలాక్సీ ఏ 71, ఏ 51 ఇటీవల లాంచ్ చేసిన ఏ31 పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లనుపొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్ స్మార్ట్వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్లపైనా ఆఫర్లు ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్వాచ్లపై 10 శాతం తక్షణ క్యాష్ బ్యాక్ లభించనుంది. (శాంసంగ్ గెలాక్సీ ఏ 31 లాంచ్) -
వన్ప్లస్ 8 ఫ్లాష్ సేల్ : ఆఫర్లు
సాక్షి, ముంబై : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ వన్ప్లస్ నూతన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వన్ప్లస్ 8 అమ్మకాలను ఇండియాలో మరోసారి ప్రారంభించనుంది. అమెజాన్ , వన్ప్లస్ వెబ్సైట్ ద్వారా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.. వన్ప్లస్ 8 స్పెసిఫికేషన్లు : 6.55 అంగుళాల ఫుల్హెచ్డి +ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 5జీ, స్నాప్డ్రాగన్ 865 చిప్సెట్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 48 +16+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 టి సపోర్టింగ్ టైప్-సి పోర్ట్ లాంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి. ధరలు 6 జీబీ ర్యామ్ /128 స్టోరేజ్ ధర రూ.41,999 8 జీబీ ర్యామ్ /128 స్టోరేజ్ ధర రూ.44,999 12 జీబీ ర్యామ్ /256 జీబీ ధర రూ 49,999 సేల్ ఆఫర్లు: అమెజాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్లకు రూ .2000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. అలాగే ప్రీపెయిడ్ ఆర్డర్లపై అమెజాన్ పే బ్యాలెన్స్గా అదనంగా రూ.1,000 క్యాష్బ్యాక్ను అందిస్తోంది. అంతేకాకుండా, అన్ని ప్రధాన బ్యాంకులలో చెల్లుబాటు అయ్యేలా వడ్డీ లేని 12 నెలల వాయిదాల పథకం ఉంది. -
ఆర్కామ్ దివాలా ప్రణాళికకు ఆమోదం
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పరిష్కార ప్రణాళికకు ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఆర్కామ్ రుణదాతల కమిటీ (సీవోసీ)లోనూ ఎస్బీఐ బోర్డు సానుకూలంగా ఓటు వేయనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. సీవోసీలో ఆర్కామ్ పరిష్కార ప్రణాళికపై ఓటింగ్ మొదలైందని, ఈ నెల 4న ముగుస్తుందని పేర్కొన్నాయి. పరిష్కార ప్రణాళిక కింద బ్యాంకులకు రూ.23,000 కోట్లు వసూలు కానున్నాయి. యూవీ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ రూ.14,700 కోట్లకు బిడ్ వేయగా, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ టవర్, ఫైబర్ ఆస్తుల కోసం రిలయన్స్ జియో రూ.4,700 కోట్ల బిడ్ వేసింది. -
లేటెస్ట్ ఐఫోన్పై డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ రీ టైలర్ అమెజాన్ ఆపిల్ ఫోన్ల ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ‘ఆపిల్ డేస్’ సేల్ పేరుతో ఆపిల్ ఉత్పత్తులను తక్కువ ధరలకే అందిస్తోంది. ఈ సేల్ ద్వారా వినియోగదారులు తాజా ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్లు, ఆపిల్ వాచ్, మాక్బుక్ తదితర వాటిల్లో అద్భుతమైన డీల్స్, ఆఫర్లను పొందవచ్చు. ఈ సేల్ 17 ఫిబ్రవరి, 2020 వరకు అందుబాటులో వుంటుంది. దేశంలో ఐఫోన్ 11 సిరీస్లో మొదటి తగ్గింపుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా గత ఏడాది సెప్టెంబరులో లాంచ్చేసిన లేటెస్ట్ ఆపిల్ ఐఫోన్ 11 ప్రో ను అతి తక్కువ ధరకే అందిస్తోంది. ఐఫోన్ 11 ప్రో (64 జీబీ స్టోరేజ్ వేరియంట్) రూ. 93,900కు అందిస్తోంది. ఐఫోన్ 11 ప్రో మాక్స్ రూ. 1,03,900కు లభిస్తుంది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై (డెబిట్, క్రెడిట్ కార్డ్)ల ద్వారా జరిపిన కొనుగోళ్లపై ఐఫోన్ 11 ప్రో పై రూ .6 వేలు, ఐఫోన్ 11 ప్రో మాక్స్లో రూ .7 వేల అదనపు తగ్గింపును పొందవచ్చు. అలాగే మ్యాక్బుక్ ఎయిర్పై రూ. 6వేల రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. ఆపిల్ వాచ్ సిరీస్-4 లో 30 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. మరిన్ని వివరాలు అమెజాన్.కామ్ లో లభ్యం. ఐఫోన్ 11 ప్రో ఫీచర్లు 5.8-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డిఆర్ ఓఎల్ఇడి స్క్రీన్ 1125 x 2436 పిక్సెల్స్ రిజల్యూషన్ 4 జీబీ ర్యామ్/ 64 జీబీ/ 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ 12+ 12+12 ట్రిపుల్ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్పీ కెమెరా 3065 ఎంఏహెచ్ బ్యాటరీ సిల్వర్, గోల్డ్, మిడ్నైట్ గ్రీన్, స్పేస్ గ్రే కలర్స్లో లభ్యం. -
అంగట్లో చిన్నారులు
అల్వాల్: సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులతోపాటు మారుమూల ప్రాంతాల నిరుపేద కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా తీసుకొని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. సంతానం కోసం ఆస్పత్రులను వస్తున్న వారిని చూసి కొందరు ముఠాగా ఏర్పడ్డారు. నగరంలోని పేరు మోసిన సంతాన సాఫల్య కేంద్రాలకు అద్దె గర్భాలను అందించే దళారులుగా పని చేస్తూనే శిశువుల అక్రమ రవాణాకు తెర లేపారు. అయితే నవ శిశువులను నేరుగా అమ్మితే లక్షలు సంపాదించ వచ్చనే దుర్భుద్ది వారికి కలిగింది. దీంతో పేద బలహీన వర్గాలను టార్గెట్ చేశారు. పేద మహిళలకు డబ్బు ఆశచూపేవారు. అక్రమ మార్గంలో మహిళలు పిల్లలకు జన్మనిచ్చే స్థాయికి వీరు వ్యాపారం సాగింది. జన్మనిచ్చిన మహిళ కుటుంబాలకు కొంత నగదు ఇచ్చి శిశువును ఇతరులకు లక్షలకు అమ్మడం ప్రారంభమైంది. సాఫల్య కేంద్రాలతో తమకు ఉన్న పరిచయాలతో సంతానం కలగని దంపతులను గుర్తించి వారితో ఒప్పందాలు చేసుకోవడం మొదలు పెట్టారు. 2015 నుంచి ఈ ముఠా మానవ అక్రమ రవాణాను కొనసాగించగా ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. గతనెల 27న అల్వాల్ పైపులైను రోడ్డులో ఇద్దరు మహిళలు పది రోజుల వయస్సున్న శిశువును అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం అల్వాల్ పోలీసులకు అందింది. దీంతో బాలానగర్ ఎస్ఓటి, అల్వాల్ పోలీసులు కోట మారుతి శమంతక మణి(41) కుంతి రేణుక(35)లను అదుపులోని తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో డీసీపీ పద్మజ ప్రత్యే బృందాలను రంగంలోకి దించారు. దమ్మాయిగుడాలో నివాసముంటున్న కడప జిల్లావాసి మేముల బాబురెడ్డి(43), కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో నివసిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లావాసి వాకపల్లి గంగాధర్రెడ్డి(33)లు ముఠాకు నాయకులుగా గుర్తించారు. తూర్పు గోదావారి జిల్లా రాజమండ్రి ప్రాంతానికి చెందిన బిక్కవోలు రమేష్(30), గుంటూరు జిల్లా మానసపెట గ్రామానికి చెందిన రాజానాయక్(26), మూసారాంబాగ్కు చెందిన కోట మారుతి శమంతకమణి, యాప్రాల్ బాలాజీనగర్లో నివసించే కాంతి రేణుక, ముషీదాబాద్ గంగపుత్ర కాలనీ నివాపి జలిగామ సునీత(33), రాంనగర్కు చెందిన వనమాల లక్ష్మీ(25)లను తమ ఏజెంట్లుగా ప్రధాన నిందితులు బాబురెడ్డి, గంగాధర్రెడ్డిలు నియమించుకున్నారు. బిడ్డలు లేని దంపతులకు అప్పటికే శిశువులను విక్రయించారు.వీరు ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రాలకు దళారులుగా వ్యవహరిస్తున్నారు. అమీర్పేట్ రమా ఫెర్టిలిటీ సెంటర్, హబ్సిగూడ పద్మజ ఫెర్టిలిటీ సెంటర్, మారేడ్పల్లిలోని ప్రెటీ–9, కింగ్కోఠి కామినేని ఫెర్టిలిటీ సెంటర్, జీవికే మాల్ సమీపంలోని నేవ ఐవిఎఫ్ సెంటర్, పంజాగుట్ట, సికింద్రాబాద్లోని ఉమెన్స్ ఆసుపత్రి, బేగంపేట్లోని రెయిన్బో ఆసుపత్రిలకు బ్రోకర్లుగా ఉండడం విశేషం. ప్రధాన నిందితుడు బాబురెడ్డిని పోలీసులు గతంలోనే రిమాండ్కు తరలించారు. గంగాధర్రెడ్డిపై పలు స్టేషన్లలలో కేసులు నమోదై ఉన్నాయి.ఈ ముఠా వెనుక ఎవరైన ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ఫర్ సేల్
-
‘మహారాజా’కు మంగళం!
న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయి... ఎగరడానికి ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాను పూర్తిగా వదిలించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలోని మొత్తం 100 శాతం వాటాను వ్యూహాత్మక విక్రయం ద్వారా అమ్మేయాలని నిర్ణయించింది. బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక విధివిధానాలను సోమవారం విడుదల చేసింది. కొనుగోలుకు ముందుకొచ్చే సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి 17ను గడువుగా (డెడ్లైన్) నిర్ధేశించింది. బిడ్డింగ్ పత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం... చౌక ధరల ఎయిర్లైన్స్ ఎయిరిండియా ఎక్స్ప్రెస్లో తనకున్న 100% వాటాలను అదేవిధంగా సింగపూర్ ఎయిర్లైన్స్తో జాయింట్ వెంచర్(జేవీ) ఏఐఎస్ఏటీఎస్లో 50% వాటానూ ఎయిరిండియా విక్రయించనుంది. ఈ జేవీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలందిస్తోంది. బిడ్డింగ్లో విజయం సాధించిన సంస్థకు ఎయిరిండియాతో పాటు ఈ 3 సంస్థల్లో మొత్తం యాజమాన్య నియంత్రణను బదలాయించనున్నారు. వాటికి మాత్రం మినహాయింపు... ఎయిరిండియాకు ఇతర అనుబంధ సంస్థల్లో కూడా వాటాలు ఉన్నాయి. ప్రధానంగా ఎయిరిండియా ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎయిరిండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఎయిర్లైన్ అలైడ్ సర్వీసెస్, హాటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల్లో తనకున్న కీలకమైన వాటాలను మాత్రం తాజాగా ప్రతిపాదించిన వాటా అమ్మకం నుంచి మినహాయిస్తున్నట్లు బిడ్డింగ్ పత్రంలో పేర్కొంది. ఈ సంస్థల్లోని వాటాలను ప్రత్యేక సంస్థ ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్(ఏఐఏహెచ్ఎల్)కు బదలాయించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. కాగా, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లకు ప్రస్తుతం ఉన్న రుణభారంలో రూ.23,287 కోట్లను వీటిని కొనుగోలు చేసే సంస్థలే భరించాల్సి ఉంటుందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. మిగిలిన రుణాన్ని(దాదాపు రూ.36,760 కోట్లు) ఏఐఏహెచ్ఎల్కు కేటాయించనున్నారు. మొత్తం బకాయిలు, రుణాలు కలిసి రూ.56,334 కోట్లను ఈ సంస్థకు బదలాయిస్తారు. దీంతో పాటు రూ.17,000 కోట్ల ఆస్తులు కూడా దీనికి దక్కుతాయి. అమ్మకానికి మూడోసారి... ఎయిరిండియా డిజిన్వెస్ట్మెంట్ ప్రతిపాదనను ప్రకటించడం గడిచిన రెండేళ్లలో ఇది రెండోసారి. సంస్థలోని 76% వాటాను విక్రయించడంతోపాటు యాజమాన్య నియంత్రణను కూడా బిడ్డింగ్లో నెగ్గిన ప్రైవేటు సంస్థలకు కట్టబెడతామంటూ ప్రభుత్వం 2018లో తొలిసారిగా ప్రతిపాదించింది. అయితే, ఇందుకు బిడ్డర్లు ఎవరూ ముందుకురాకపోవడంతో తాజాగా 100% వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. వాస్తవానికి 2001–02లో అప్పటి ఎన్డీఏ హయాంలో ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ విడివిడిగా ఉన్నప్పుడే అమ్మకానికి యత్నించినా.. సాధ్యం కాలేదు. అంటే ప్రస్తుత ప్రతిపాదన మూడోసారిగా లెక్క. నిబంధనల సడలింపు... ఎట్టిపరిస్థితుల్లోనూ ఎయిరిండియాను అమ్మేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం తాజాగా బిడ్డింగ్ నిబంధనలను కూడా సడలించింది. ప్రధానంగా కొనుగోలుకు ముందుకొచ్చే బిడ్డర్లకు కనీస నెట్వర్త్(వ్యాపార విలువ)ను రూ.3,500 కోట్లుగా నిర్ధారించింది. అదేవిధంగా ఒకరికంటే ఎక్కువమంది కన్సార్షియంగా బిడ్డింగ్ వేసేవారికి కూడా భాగస్వామ్య సంస్థకు కేటాయించాల్సిన కనీస వాటాను 10%కి తగ్గించారు. 2018లో అమ్మకం ప్రతిపాదనలో దీన్ని రూ.5,000 కోట్లు, 26%గా కేంద్రం నిర్దేశించింది. కాగా, తాజా బిడ్డింగ్ ప్రకారం కన్సార్షియంలో ప్రధాన భాగస్వామ్య సంస్థకు నెట్వర్త్లో 26% వాటా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కన్సార్షియంలో వ్యక్తులు(ఇండివిడ్యువల్స్) కూడా చేరొచ్చు. కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న బిడ్డర్లకు డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ముసాయిదా వాటా కొనుగోలు ఒప్పందంతో పాటు సంస్థకు చెందిన అన్ని రికార్డులను అందుబాటులో ఉంచనున్నారు. ఎంతో విలువైంది... ఎయిరిండియా ఎక్స్ప్రెస్తో కలిపితే ఎయిరిండియా అనేది చాలా విలువైనదని.. ‘గొప్ప ఆస్తి’గా పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యాఖ్యానించారు. బిడ్డింగ్లో దీన్ని చేజిక్కించుకునే సంస్థ ఎయిరిండియా బ్రాండ్ను నిరాటంకంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎయిరిండియాకు ఉన్న మొత్తం భూములు, భవనాలు ఇతరత్రా స్థిరాస్తులతో పాటు పెయింటింగ్స్ తదితర కళాకృతులు ఈ అమ్మకంలోకి రావని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఢిల్లీ, ముంబై ఎయిర్పోర్టుల్లో కొన్ని భవనాలు, స్థలాలు, కార్పొరేట్ ఆఫీసులను కొత్త ఇన్వెస్టర్లకు ఎయిర్లైన్ నిర్వహన నిమిత్తం కొంతకాలం వినియోగించుకోవడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. కాగా, ఈ అమ్మకంపై బీజేపీకి చెందిన సుబ్రమణ్య స్వామి, యశ్వంత్ సిన్హా వ్యతిరేకతపై మాట్లాడుతూ.. వాళ్లిద్దరివీ వ్యక్తిగత అభిప్రాయాలన్నారు. ప్రభుత్వానికి దాంతో సంబంధం లేదన్నారు. ‘ఎయిరిండియా విక్రయం పూర్తిగా దేశద్రోహ చర్య. దీనిపై కోర్టుకెళ్తా’ అంటూ స్వామి సోమవారం ట్వీట్ చేశారు. ఉద్యోగులకు షేర్లు... వ్యూహాత్మక వాటా విక్రయంలో భాగంగా ఎయిరిండియా ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్రోగ్రామ్(ఎసాప్స్) కింద తక్కువ ధర(డిస్కౌంట్)కు షేర్లను ఇవ్వనున్నట్లు ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న వర్గాల్లోని ఒక వ్యక్తి తెలిపారు. ఎయిరిండియా షేర్లలో 3 శాతాన్ని (సుమారు 98 కోట్ల షేర్లు) ఎసాప్స్ కింద పక్కనబెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాదాపు రూ.1,384 కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించనుంది. ఎయిరిండియాలో అవసరానికి మించి సిబ్బంది ఎవరూలేరని.. రిటైర్ అయ్యే ఉద్యోగుల మెడికల్ ప్రయోజనాలకు సబంధించిన అంశాన్ని త్వరలోనే పరిష్కరించనున్నట్లు ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లోహానీ పేర్కొన్నారు. ►రూ.60,074 కోట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లకు 2019 మార్చి 31 నాటికి ఉన్న మొత్తం రుణ భారం ►రూ.4,800 కోట్లు 2018–19లో ఎయిరిండియా నిర్వహణ నష్టాలు 17,984 ►2019 నవంబర్ 1 నాటికి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్లలో మొత్తం ఉద్యోగులు -
ఐకానిక్ స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు
సాక్షి, ముంబై: ముంబైలోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ (జీపీఎల్) గత ఏడాది కొనుగోలు చేసిన ఐకానిక్ ఆర్కే స్టూడియోలో లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలను ప్రారంభించినట్టు శుక్రవారం తెలిపింది. 'కలెక్టర్ ఎడిషన్ రెసిడెన్సెస్' పేరుతో నిర్మిస్తున్న ఈ సముదాయంలో బొంబాయి ఆర్ట్ డెకో డిజైన్ తరహాలో ఆర్కిటెక్చర్, అత్యాధునిక, విలాసవంతమైనసౌకర్యాలు, అత్యంత కట్టుదిట్ట మైన సెక్యూరిటీ ఫీచర్లు ఈ ఫ్లాట్లలో కల్పించనున్నామని జీపీఎల్ ప్రకటించింది. ఈ మేరకు గోద్రెజ్ పాపర్టీస్ తన అధికారిక వెబ్సైట్లో వివరాలను పొందుపర్చింది. 3, 4 పడక గదుల లగ్జరీ ఫ్లాట్లకోసం ముందస్తు బుకింగ్లను ప్రారంభించింది. 3 బెడ్ రూమ్ ఫ్లాట్ ధర రూ. 5.7 కోట్ల నుంచి, 4 బెడ్రూమ్ ఫ్లాట్ ధర రూ.10.9 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెబ్సైట్ తెలిపింది. చెంబూర్లోని ఐకానిక్ ఆర్కె స్టూడియోలో గోద్రేజ్ ఆర్కెఎస్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని గోద్రేజ్ ప్రాపర్టీస్ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోఝా గోద్రేజ్ ఒక ప్రకటనలో తెలిపారు. విశేషమైన వారసత్వాన్ని, అత్యుత్తమ జీవనశైలిని ఈ ప్రాంగణంలో నివసించబోయేవారికి అందించేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతామన్నారు. కాగా 72 సంవత్సరాల క్రితం, ప్రముఖ బాలీవుడ్ నటుటు రాజ్ కపూర్ ఆర్కే ఫిల్మ్ స్టూడియోను 2.2 ఎకరాల్లో స్థాపించారు. ఎన్నో భారీ చిత్రాలు ఈ స్టూడియోలోనే రూపుదిద్దుకున్నాయి. ఈ స్టూడియోను విక్రయించాలని నిర్ణయించుకున్న కపూర్ కుటుంబం గత ఏడాది జీపీఎల్కు విక్రయించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణలో దుమ్ము రేపిన మద్యం విక్రయాలు
-
ఫ్లిప్కా(స్టా)ర్ట్ సేల్, కొత్త ఏడాది ఆఫర్లు
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ న్యూ ఇయర్ సేల్ను ప్రకటించింది. ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ పేరుతో స్మార్ట్ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. అలా 2020 ఏడాదిలో తొలి సేల్ను ప్రారంభించింది. జనవరి 1 అర్థరాత్రి ప్రారంభమైన మూడు రోజుల సేల్లో వివిధ రకాల ఉత్పత్తులపై స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా రియల్మీ ఎక్స్ 2, రెడ్మి నోట్ 7 ప్రో వంటి స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ, అదనపు డిస్కౌంట్లను అందించడానికి బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది ఫ్లిప్కార్ట్. ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం మినహాయింపుతో పాటు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్లపై కూడా 50 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. స్మార్ట్ఫోన్లపై స్పెషల్ డిస్కౌంట్లు రియల్ మి5 ఎస్ : ఆఫర్ ప్రైస్ : రూ .9,999 (క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, క్వాడ్ కెమెరా 48 ఎంపీప్రైమరీ లెన్స్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2ఎంపీ సూపర్ మాక్రో లెన్స్ 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ ప్రధాన ఫీచర్లు) రియల్మీ ఎక్స్ 2: ధర రూ .16,999 కు విక్రయిస్తోంది. (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 జీ సాక్ ప్రాసెసర్, 64 +82+ 2 ఎంపీ కెమెరా 32 ఎంపీ సెల్ఫీకెమరా ప్రధాన ఫీచర్లు) రెడ్మి నోట్ 7 ప్రో : రూ. 9,999 లభ్యం. (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 6.3-ఇంచ్ ఫుల్ హెచ్డీ + డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 సాక్ డుబుల్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరాప్రధాన ఫీచర్లు) ల్యాప్టాప్లు, ఇతర గాడ్జెట్లపై కూడా ప్రత్యేక తగ్గింపునిస్తోంది. ఏసర్ స్విఫ్ట్ 3 (ఇంటెల్ కోర్ ఐ 5, 2 జీబీ గ్రాఫిక్స్) ను రూ. 44.990. మార్కెట్ ధర రూ. 50,000. -
ఫ్లిప్కార్ట్ దివాలీ సేల్ : ధమాకా ఆఫర్లు
సాక్షి, ముంబై : ఆన్లైన్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ దీపావళి సందర్భంగా మరోసారి ఆఫర్ల వర్షానికి తెరతీయనుంది. ఈ నెల 12 -16 మధ్య ‘బిగ్ దీవాలీ సేల్’ను నిర్వహించనుంది. అదే ఫ్లిప్కార్ట్ ప్లస్ వినియోగదారులకయితే ఈ పండుగ ఒక నాలుగు గంటలముందు అంటే అక్టోబర్11 రాత్రి 8 గంటలనుంచే మొదలుకానుంది. ఈ సందర్భంగా స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలపై, ఇతర ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్లు, దుస్తులపై ధమాకా ఆఫర్లను అందించనుంది. స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ గురించి ఫ్లిప్కార్ట్ ఇంకా ఖచ్చితమైన వివరాలను వెల్లడించకపోయినప్పటికీ, స్మార్ట్ఫోన్లలో భారీ డిస్కౌంట్లు, బైబ్యాక్ గ్యారెంటీ, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ను ఆశించవచ్చని కంపెనీ ప్రకటించింది. అయితే రెడ్మి నోట్ 7 ప్రో, వివో జెడ్ 1 ప్రో, రియల్మే సి 2, రియల్మే 5 ,రెడ్మి నోట్ 7 ఎస్ లాంటి ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించవచ్చని అంచనా. బిగ్ దీపావళి సేల్లో టీవీలు, ఇతర 50 వేల ఉత్పత్తులపై 75 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ఇంకా స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్స్, ల్యాప్టాప్స్లాంటి ఎంపిక చేసిన ఉత్పత్తులపై 90శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేయనుంది. అలాగే ఎస్బిఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపుతోపాటు, నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు అర్థరాత్రి 12 నుండి తెల్లవారుఝామున 2 గంటల మధ్య రష్ అవర్ వ్యవధిలో అదనపు డిస్కౌంట్లను అందిస్తుంది. -
రూ లక్ష కోసం కుమార్తెను అమ్మిన తల్లి
న్యూఢిల్లీ : రూ లక్ష కోసం కన్న కుమార్తె(15)ను వేశ్యా గృహానికి తల్లి విక్రయించగా బాధిత బాలికను ఢిల్లీ మహిళా కమిషన్ కాపాడిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని షెల్టర్ హోంకు తరలించారు. సోదరి ఇంటికి తీసుకువెళతానని చెప్పి కుమార్తె నిషా (పేరు మార్చాం)ను ఈనెల 8న తల్లి నిజాముద్దీన్లో ఓ హోటల్కు తీసుకువెళ్లిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అబ్ధుల్ అనే వ్యక్తితో ఒప్పందం కుదిరిన అనంతరం నిషా తల్లి బాధిత బాలికను అతడితో వెళ్లాలని, షాహిద్ అనే వ్యక్తి ఇంటికి తీసుకువెళతాడని చెప్పింది. అయితే బాలికను ఢిల్లీలోని భవానా గ్రామం ఐశ్వర్ కాలనీలోని తన ఇంటికి షాహిద్ తీసుకువెళ్లాడు. షాహిద్ ఇంటిలో ఉన్న ఇతర బాలికలు బాధితురాలిని అసలు విషయం చెప్పారు. రూ లక్షకు నిషాను ఆమె తల్లి అమ్మేసిందని ఆ సొమ్ము వారికి తిరిగివచ్చేవరకూ ఈ నరకకూపంలో ఉండాలని వెల్లడించారు. ఒక్కరోజులోనే అక్కడి నుంచి తప్పించుకున్న నిషా స్ధానికుల సహకారంతో ఢిల్లీ మహిళా కమిషన్ హెల్ప్లైన్ నెంబర్ను ఆశ్రయించారు. మహిళా కమిషన్ బృందం హుటాహుటిన అక్కడికి చేరుకుని బాలికను స్ధానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ కేసులో నిషా తల్లి సహా నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలని, సవతి తండ్రి పాత్రపైనా దర్యాప్తు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పోలీసులను కోరారు. -
నేటి నుంచి ఇసుక అమ్మకాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా మంగళవారం నుంచి ఇసుకను సరఫరా చేస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ లోతేటి శివశంకర్ వెల్లడించారు. సోమవారం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇసుక కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. ఇసుక గురించి ఎవరిని సంప్రదించాలంటే.. ఇసుక కోసం దరఖాస్తు చేయడంతోపాటు.. నిర్మాణానికి సంబంధించిన ఫొటో, ఫ్లాన్ అప్రూవల్, ఆధార్, రేషన్కార్డులను జత చేసి విశాఖ ఎంవీపీ కాలనీలోని టాస్క్ ఫోర్స్ పోలీసు ఆఫీసు వద్ద మైన్స్ కార్యాలయంలో అందజేయాలి. అక్కడ రెవెన్యూ, పోలీసు, సిటీప్లానర్, మైన్స్శాఖ వారు దరఖాస్తులను పరిశీలన చేస్తారు. ఎంత ఇసుక ఇస్తారు దరఖాస్తును పరిశీలించి ఒక యూనిట్ (మూడు క్యూబిక్ మీటర్లు ఒక ట్రాక్టర్ లోడ్) 4,500 రూపాయలు చెల్లిస్తే రశీదు ఇస్తారు. ఎక్కడ ఇస్తారంటే.. రశీదు తీసుకొని ముడసర్లోవలోని ఇసుక స్టాక్ పాయింట్ వద్ద సిబ్బందికి రశీదు చూపించాలి. అక్కడ లారీ అసోసియేషన్ సెక్రటరీ కె.రమణ ( ఫోన్ నంబరు 7674922888)ను సంప్రదించాలి. రవాణా చార్జీలు లబ్ధిదారులే చెల్లించుకోవాలి. -ఇసుక స్టాక్ పాయింట్ ఫోన్ నంబర్ 9949610479 -సమస్య ఏమైనా వుంటే వారు మైన్స్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోట్ రూమ్ ఫోన్ నంబర్ 9949565479ను సంప్రదించాలి. ఇసుకనిచ్చే సమయం.. మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు. -రెండోసారి ఇసుక కావాలంటే భవనం పని జరిగిన కొత్త ఫొటో తీసి దరఖాస్తుతోపాటు ఎంవీపీ కాలనీలోని ఏడీ మైన్స్ కార్యాలయంలోనే అందజేయాలి. కొత్త ఇసుక విధానం వచ్చే వరకు సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇసుక సరఫరా చేయనున్నట్టు జేసీ వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 84 యూనిట్లు అందుబాటులో ఉందని మైన్స్ఏడీ తమ్మినాయుడు తెలిపారు. -
ఎంఐ డేస్ సేల్: షావోమి బెస్ట్ డీల్స్
సాక్షి, ముంబై : చైనా మొబై ల్దిగ్గజం షావోమి తన బ్రాండ్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భాగస్వామ్యంతో ఎంఐ డేస్ పేరుతో షావోమీ, రెడ్మి ఫోన్లపై బెస్ట్ డీల్స్ అందిస్తోంది. నిన్న (16, సోమవారం) ప్రారంభమైన ఈ సేల్ జూన్ 21 వరకూ కొనసాగనుంది. ఈ సేల్లో ఏకంగా రూ.6,500 వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు మొబైల్స్ ఎక్స్ఛేంజ్పై రూ.4000 వరకూ తగ్గింపు లభించనుంది. అలాగే యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులు అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ను కూడా పొందవచ్చు.ఎంఐ డేస్ సేల్లో భాగంగా రెడ్మి 5, 6, 7 రెడ్మీ 6ఏ, రెడ్మి నోట్ 5 ప్రో, ఎంఐ 2 స్మార్ట్ఫోన్లపై ఈ తగ్గింపు లభిస్తోంది. బెస్ట్ డీల్స్ రెడ్మి 5 : 2 జీబీ ర్యామ్, 16 జీబీ వేరియంట్ ధర 5,999 32 జీబీ 64 జీబీ ధరలు వరుసగా రూ.8,199, రూ.9280గా ఉన్నాయి. రెడ్మి 7: ప్రారంభ ధర రూ.7,999 3 జీబీ ర్యామ్ రూ.8,999 లభ్యం దీని అసలు ధర. రూ.10,999. రెడ్మి వై 3 : ప్రారంభ ధర రూ.9,999 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్వేరియంట్ ధర రూ. 9,999 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999 రెడ్మి 6ఏ : 2 జీబీ ర్యామ్/16 జీబీ స్టోరేజ్ రూ.5,999 3జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.6,499 . అమెజాన్ ఎంఐ డేస్ సేల్లో భాగంగా రెడ్మి6ఏ పై రూ.1,000 డిస్కౌంట్ అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా మరో రూ.500 డిస్కౌంట్. ఎంఐ ఏ2 : ప్రస్తుత ధర రూ.10,999లు. అసలు ధరరూ.16,999 6 జీబీ/128 జీబీ వెర్షన్ను రూ. 15,999కే లభ్యం. దీని అసలు ధర రూ. 20,500. రెడ్ మి 6 : రూ. 7499 రెడ్మి 6ప్రో : 3జీబీ ర్యామ్ వేరియంట్ రూ.8,999 అసలు ధర రూ.11,499 రెడ్మి వై2 : 3జీబీ/32జీబీ స్టోరేజ్ రూ.7999లకే లభ్యం. -
ఫ్లిప్స్టార్ట్ డేస్ సేల్ : భారీ డిస్కౌంట్లు
ఫ్లిప్కార్ట్ మరోసారి డిస్కౌంట్ సేల్కు తెరతీసింది. జూన్ 1 నుంచి-3వతేదీవరకు నిర్వహించే ఈ సేల్లో టీవీలు, ఇతర గృహోపకరణాలతోపాటు ఇతర ప్రొడక్ట్లపై కూడా ఆఫర్లను ప్రకటించింది. నెలవారీ అందించే రూ.1 సేల్తోపాటు పాటు ల్యాప్టాప్స్, హెడ్ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. దీనికి అదనంగా యాక్సిస్ బ్యాంకు కార్డు లావాదేవీలపై 10శాతం డిస్కౌంట్ కూడా లభ్యం. కిరణా సరుకులపై రూ.1 డీల్స్ను అందిస్తోంది టీవీలపై 75శాతం డిస్కౌంట్ ల్యాప్టాప్స్, హెడ్ఫోన్స్, మొబైల్ యాక్ససరీస్పై 80 శాతం డిస్కౌంట్ దీంతోపాటు మరికొన్ని ఉత్పత్తులపై అదనంగా 15శాతం డిస్కౌంట్. హోం అండ్ ఫర్నిచర్పై 30నుంచి 75శాతం దాకా డిస్కౌంట్. ఫ్యాషన్ ఉత్పత్తులపై 40-80శాతం తగ్గింపు. బేబీకేర్, బ్యూటీకేర్, పిల్లల బొమ్మలు, బుక్స్పై 80శాతం దాకా తగ్గింపు -
ఎంఐ సేల్ : డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు
సాక్షి, ముంబై: అమెజాన్ ఇండియాలో షావోమి, ఎంఐ 4 సిరీస్ టీవీలు స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు ( 26 సోమవారం) ప్రారంభమైన ఈ సేల్ మే 31వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. షావోమి రెడ్మి 6ఏ, రెడ్మి 6 ప్రి, రెడ్మి వై2, రెడ్మి 6, రెడ్మి 7 తదితర స్మార్ట్ఫోన్లతో పాటు ఎంఐ టీవీలు కూడా రాయితీ ధరల్లో లభించనున్నాయి. ముఖ్యంగా 10వేల 15వేల రూపాయల మధ్య లభించనున్న స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. అలాగే అమెజాన్ క్యాష్బ్యాక్, ఎక్స్చేంజ్, తాత్కాలిక తగ్గింపులాంటి పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఎంఐ టీవీ 4 సిరీస్ టీవీలపై ఎక్స్చేంజ్, ఆఫర్ అందిస్తోంది. 49, 55, 43 అంగుళాల, ఎంఐ ఆండ్రాయిడ్ టీవీ, ఎల్ఈడీ 4ఏ టీవీపై రూ.2260 దాకా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. -
అముల్ బేబీ లాంటి బిడ్డ కావాలా?
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘పిల్లలు కావాలా బాబు.. బిడ్డను బట్టి రేటు’ అంటూ వాట్సాప్లో సందేశాలిస్తూ చిన్నారులను అమ్మేస్తున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ కేసులో రిటైర్డు నర్సు, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా రాశీపురం కేంద్రంగా రెండ్రోజులుగా ఒక వాట్సాప్ ఆడియో సందేశం వైరలయ్యింది. ‘బాబు కావాలా.. పాప కావాలా.. తెల్లగా ఉండాలా.. నల్లగా ఉన్నా పరవాలేదా? బిడ్డను బట్టి రేటు. మగబిడ్డకు రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షలు, ఆడ బిడ్డయితే రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షలు. అముల్ బేబీ లాగా ఉంటే మరో రేటు. బిడ్డ కోసం కొంత అడ్వాన్సు చెల్లిస్తే వెంటనే సిద్ధం చేస్తాను. సంతానం లేని దంపతులకు 30 ఏళ్లుగా బిడ్డలను అమ్ముతున్నాను. రాశీపురం మున్సిపాలిటీ నుంచి కేవలం 25 నుంచి 30 రోజుల్లో బర్త్ సర్టిఫికెట్ను కూడా పొందేలా చేస్తాను. ఇందుకు మరో రూ.70 వేలు ఖర్చవుతుంది. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దు’’ అని రిటైర్డు నర్సు అముదవల్లి, ఆమె భర్త సేలం జిల్లా ఓమలూరుకు చెందిన దంపతులతో ఇటీవల జరిపిన సంభాషణ వాట్సాప్ ద్వారా వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో అముదవల్లి (50), ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. -
జెట్ విక్రయం టేకాఫ్!!
ముంబై, న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జెట్ ఎయిర్వేస్కు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోమవారం బహిరంగ ప్రకటన ఇచ్చింది. వ్యూహాత్మక ఇన్వెస్టర్స్ (ఎస్ఐ), ఆర్థిక ఇన్వెస్టర్స్ (ఎఫ్ఐ) నుంచి బిడ్స్ను ఆహ్వానించింది. ఈ ప్రతిపాదన ప్రకారం .. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి కనిష్టంగా 3.54 కోట్ల షేర్లు (సుమారు 31.2 శాతం వాటాలు) నుంచి గరిష్టంగా 8.51 కోట్ల దాకా షేర్లను (75 శాతం వాటాలు) విక్రయించే అవకాశం ఉంది. బిడ్ల దాఖలుకు ఆఖరు తేది ఏప్రిల్ 10. అర్హత పొందిన బిడ్డర్లు ఏప్రిల్ 30లోగా తుది బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాగా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సంస్థ ఈ బిడ్డింగ్ నిర్వహణలో తోడ్పాటు అందించనుంది. దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ గత కొన్నాళ్లుగా రుణాల చెల్లింపుల్లో విఫలమవుతోంది. సిబ్బంది జీతభత్యాలు కూడా సకాలంలో చెల్లించలేక సతమతమవుతోంది. పలు విమానాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఎయిర్లైన్ నియంత్రణను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకున్నాయి. మార్చి 25న జెట్ ఎయిర్వేస్ బోర్డు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం.. సంస్థలో మెజారిటీ వాటాలు బ్యాంకుల చేతికి వచ్చాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, ప్రమోటరు నరేష్ గోయల్, ఆయన భార్య జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి నిష్క్రమించారు. సంస్థలో వారి వాటా గతంలో ఉన్న 51 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. ఇక, జెట్ కుప్పకూలకుండా యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగించేందుకు బ్యాంకులు సుమారు రూ. 1,500 కోట్లు సమకూర్చనున్నాయి. ప్రకటన సారాంశం.. ఎస్బీఐ కన్సార్షియం ప్రకటన ప్రకారం.. జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకుల నుంచి రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణాలను పొందింది. తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితిలోకి జారిపోయింది. ఈ నేపథ్యంలోనే సంస్థ విక్రయం చేపట్టడం జరిగింది. ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) రూపకల్పన, సమర్పణకు సంబంధించిన అన్ని వ్యయాలను బిడ్డర్సే భరించాల్సి ఉంటుందని ప్రకటన పేర్కొంది. దేశ, విదేశాల్లో ఇదే తరహా రంగాల్లో అనుభవమున్న కార్పొరేట్లు వ్యూహాత్మక ఇన్వెస్టర్స్ (ఎస్ఐ) కేటగిరీ కింద బిడ్స్ వేయొచ్చు. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ మొదలైన వాటిని ఎఫ్ఐల కేటగిరీ కింద వర్గీకరించారు. ఎస్ఐలకు ఏవియేషన్ వ్యాపారంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. కన్సార్షియంగా ఏర్పడి బిడ్స్ వేసిన పక్షంలో .. అందులో ముగ్గురు సభ్యులకు మించి ఉండకూడదు. కన్సార్షియంలో ఒక్కొక్కరి వాటా 15 శాతానికి పైబడే ఉండాలి. ఆరు అంతర్జాతీయ సంస్థల ఆసక్తి.. జెట్ ఎయిర్వేస్లో వాటాల కొనుగోలుపై ఆరు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో లుఫ్తాన్సా ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్, స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వంటి వ్యూహాత్మక ఇన్వెస్టర్లతో పాటు కేకేఆర్, బ్లాక్స్టోన్, టీపీజీ క్యాపిటల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ కన్సార్షియం ఇప్పటికే జెట్ ఎయిర్వేస్లో వాటాల విక్రయంపై టాటా గ్రూప్, టీపీజీ క్యాపిటల్ వంటి సంస్థలతో కూడా సంప్రదింపులు జరిపింది. సోమవారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు 3% పెరిగి రూ. 264.10 వద్ద క్లోజయ్యింది. -
పుల్వామా ప్రకంపనలు
పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడి ప్రకంపనలు స్టాక్ మార్కెట్లో ప్రతిధ్వనించాయి. ఫలితంగా స్టాక్ సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. స్టాక్ మార్కెట్ నష్టపోవడం ఇది వరుసగా ఎనిమిదో రోజు. పుల్వామా దాడి నేపథ్యంలో భారత, పాక్ల మధ్య ఉద్రిక్త వాతావారణం నెలకొనడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, ముడి చమురు ధరలు భగ్గుమం టుండటంతో స్టాక్ మార్కెట్లో నష్టాలు కూడా కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. 83 పాయింట్లు క్షీణించి 10,641 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 311 పాయింట్లు పతనమై 35,498 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎమ్సీజీ, బ్యాంక్, ఐటీ, వాహన, ఫార్మా షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 2013, ఆగస్టు తర్వాత స్టాక్ సూచీలు వరుసగా ఇన్ని రోజులు నష్టపోవడం ఇదే మొదటిసారి. బ్యాంక్ షేర్లకు రేట్ల దెబ్బ ఆర్బీఐ రెపోరేటును పావు శాతం తగ్గించినప్పటికీ, కొన్ని బ్యాంక్లు మాత్రమే వడ్డీరేట్లను తగ్గించాయి. వడ్డీరేట్లను వినియోగదారులకు బదలాయించే విషయమై ఈ వారంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ అధినేతలతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సమావేశం కానున్నారు. దీంతో బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అక్కడ పండగ... ఇక్కడ దండగ ప్రపంచ మార్కెట్లలో పండగ వాతావరణం ఉన్నా మన మార్కెట్లో మాత్రం దండగ వాతావరణం కొనసాగుతోంది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా– చైనా మధ్య తాజాగా వాషింగ్టన్లో చర్చలు ప్రారంభం కావడంతో ఆసియా మార్కెట్లు సోమవారం మంచి లాభాలు సాధించాయి. హాంగ్కాంగ్ సూచీ హాంగ్సెంగ్ 1.6 శాతం, జపాన్ నికాయ్ 1.8 శాతం, చైనా షాంగై సూచీ 2.6 శాతం, కొరియా కోస్పి 0.7 శాతం మేర పెరిగాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభమైనా, ఆ తర్వాత లాభాల్లోకి ఎగసి, స్వల్ప లాభాలతో ముగిశాయి. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి వరుస ఎనిమిది రోజుల నష్టాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.6 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. ఈ నెల 7న రూ.142.74 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్... సోమవారం నాటికి రూ. రూ.136.33 లక్షల కోట్లకు పడిపోవడం గమనార్హం.