
ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్లతో సంచలనాన్ని ఆవిష్కరించింది. ప్రి బుకింగ్స్లో ఓలా ఎలక్ట్రిక్ రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఓలా అమ్మకాలు జరిపిన ఒక్కరోజులోనే రూ. 600 కోట్లకు పైగా విలువైన స్కూటర్లను విక్రయించింది. రెండు రోజుల్లో రూ. 1100 కోట్ల విలువైన స్కూటర్లను ఓలా అమ్మకాలు జరిపింది. కాగా ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు ఒక్కసారిగా ఎగబడడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల ప్రక్రియను నిలిపివేశారు.
చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారిపోతున్న ఖాకీలు
నవంబర్ 1 నుంచి తిరిగి అమ్మకాలు..!
తాజాగా భవిష్ అగర్వాల్ తన ట్విటర్లో రెండో దశ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు తిరిగి నవంబర్ 1 నుంచి ప్రారంభం అవుతోందని వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్ కొన్ని వారాల క్రితం తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1ను ఈవీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారతీయ ఈవీ మార్కెట్లో ఎన్నో సంచాలనాల మధ్య విడుదలైన ఈ స్కూటర్ వాస్తవానికి సెప్టెంబర్ 8 నుంచి అమ్మకానికి రావాల్సి ఉంది. స్కూటర్ల డెలివరీలు వచ్చే నెల అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.
Day 2 of EV era was even better than Day 1! Crossed ₹1100Cr in sales in 2 days! Purchase window will reopen on Nov 1 so reserve now if you haven't already.
— Bhavish Aggarwal (@bhash) September 17, 2021
Thank you India for the love & trust. You are the revolution! https://t.co/oeYPc4fv4M pic.twitter.com/fTTmcFgKfR
చదవండి: electric highway: త్వరలో దేశంలో ఈ నగరాల మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవే!
Comments
Please login to add a commentAdd a comment