
రిఫండ్పై వడ్డీకి పార్లమెంటు అనుమతి ఏది?: కాగ్
న్యూఢిల్లీ: రిఫండ్స్పై వడ్డీ చెల్లింపుల విషయంలో పార్లమెంటు అనుమతి తీసుకోవడం లేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ– సీబీడీటీకి అనుమతులుమంజురు చేయడం పట్ల ఆర్థిక మంత్రిత్వశాఖను తప్పుపట్టింది. రిఫండ్స్పై వడ్డీ చెల్లింపులకు పార్లమెంటు అనుమతి తప్పనిసరైనా... ఇలాంటిది ఏదీ లేకుండా 2015–16లో సీబీడీటీ రూ.7,700 కోట్ల చెల్లింపులు చేసినట్లుకాగ్ నివేదిక వివరించింది. గత ఎనిమిదేళ్లలో ఈ తరహా చెల్లింపుల పరిమాణం రూ. 55,939 కోట్లని విమర్శించింది. చట్టం ప్రకారం, అప్రాప్రియేషన్మినహా ఇండియన్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి కూడాఉపసంహరించకూడదని రాజ్యాంగం నిర్దేశిస్తున్న విషయాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఒక నివేదికలో కాగ్ ప్రస్తావించింది.