మార్కెట్లోకి ఫియట్ అవెంచురా | Fiat launches compact SUV Avventura | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ఫియట్ అవెంచురా

Oct 22 2014 12:41 AM | Updated on Sep 2 2017 3:13 PM

మార్కెట్లోకి ఫియట్ అవెంచురా

మార్కెట్లోకి ఫియట్ అవెంచురా

కార్ల తయారీ దిగ్గజం ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా మంగళవారం భారత మార్కెట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) అవెంచురాను ఆవిష్కరించింది.

ధర రూ. 5.99 - రూ. 8.17 లక్షలు

న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా మంగళవారం భారత మార్కెట్లో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) అవెంచురాను ఆవిష్కరించింది. దీని ధర రూ. 5.99- రూ. 8.17 లక్షల శ్రేణిలో (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. పెట్రోల్ వేరియంట్ రేటు రూ. 5.99-రూ. 7.05 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ ధర రూ. 6.89- రూ. 8.17 లక్షల శ్రేణిలో ఉంటుందని వివరించింది. మహారాష్ట్రలోని రంజన్‌గావ్ ప్లాంటులో అవెంచురాను ఉత్పత్తి చేస్తామని, ప్రాథమికంగా దేశీ మార్కెట్లోనే విక్రయిస్తామని సంస్థ భారత విభాగం ఎండీ నగేశ్ బసవనహళ్లి తెలిపారు. ఇప్పటిదాకా 500 ప్రీ-లాంచ్ బుకింగ్స్ జరిగాయని.. 15,000 పైచిలుకు ఎంక్వైరీలు వచ్చాయని నగేశ్ వివరించారు.

ఈ ఏడాది మొత్తం అయిదు మోడల్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్న ఫియట్... త్వరలో లగ్జరీ కారు అబార్త్ 500ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఇక, రాబోయే అయిదేళ్లలో 12 మోడల్స్‌ను ఆవిష్కరించాలని, 2015 నాటికి జీప్ బ్రాండ్ వాహనాలను భారత్‌లో ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం కంపెనీ వార్షిక వాహన ఉత్పత్తి సామర్థ్యం 1,35,000గా ఉంది. దీన్ని 2018 నాటికల్లా 2,45,000 యూనిట్లకు పెంచుకోవాలని ఫియట్ నిర్దేశించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement