14న బ్యాంకు ఉద్యోగుల చలో పార్లమెంట్ | march 14th bank employments parlament march | Sakshi
Sakshi News home page

14న బ్యాంకు ఉద్యోగుల చలో పార్లమెంట్

Feb 17 2016 12:19 AM | Updated on Oct 8 2018 7:35 PM

14న బ్యాంకు ఉద్యోగుల చలో పార్లమెంట్ - Sakshi

14న బ్యాంకు ఉద్యోగుల చలో పార్లమెంట్

రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకు ఉద్యోగులు మార్చి 14న ‘పార్లమెంట్ మార్చ్’కి పిలుపునిచ్చారు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకు ఉద్యోగులు మార్చి 14న ‘పార్లమెంట్ మార్చ్’కి పిలుపునిచ్చారు. సుమారు 40,000 మంది ఉద్యోగులతో పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన చేయనున్నట్లు  ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీ ఈఏ) ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. రుణ ఎగవేతదారుల నుంచి బకాయిలను వసూలు చేయడం, ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత పటిష్టపర్చాలన్నది తమ ప్రధాన డిమాండని ఏఐబీఈఏ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement