
న్యూఢిల్లీ: ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 43 శాతం పెరిగింది. గతేడాది క్యూ1లో రూ.345 కోట్లుగా ఉన్న లాభం ఈ క్యూ1లో రూ.492 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.1,377 కోట్ల నుంచి 19% వృద్ధి చెంది రూ.1,633 కోట్లకు ఎగసిందని కంపెనీ చైర్మన్ ఎమ్. జి. జార్జ్ ముత్తూట్ తెలిపారు.
కంపెనీ ఇచ్చిన రుణాలు రూ.27,857 కోట్ల నుంచి 11% వృద్ధితో రూ.30,997 కోట్లకు పెరిగాయని చెప్పారు. ఫలితాల ప్రభావంతో కంపెనీ షేర్ 9.4% లాభంతో రూ.437 వద్ద ముగిసింది.