నాస్కామ్ సైబర్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్ | Nasscom sets up cyber security task force | Sakshi

నాస్కామ్ సైబర్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్

Published Tue, May 26 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

Nasscom sets up cyber security task force

న్యూఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ రూపకల్పనకు భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తాజాగా సైబర్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ)తో చేతులు కలిపింది. భారత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోతగిన చర్యలు, ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి ఈ టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేసి 12 వారాల్లోగా నివేదికనిస్తుంది. ఎన్‌ఐఐటీ చైర్మన్ రాజేంద్ర పవార్ సారథ్యంలో ఏర్పాటైన సైబర్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్‌లో ఐటీ, బ్యాంకింగ్, టెలికం రంగాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement