బ్యాంకులకు రూ.1.2 లక్షల కోట్లు అవసరం | PSBs trading far below book values; need Rs 1.2 tn govt support: Moody's | Sakshi

బ్యాంకులకు రూ.1.2 లక్షల కోట్లు అవసరం

Published Sat, Jun 11 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

బ్యాంకులకు రూ.1.2 లక్షల కోట్లు అవసరం

బ్యాంకులకు రూ.1.2 లక్షల కోట్లు అవసరం

ఎస్‌బీఐ సహా తన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2020 నాటికి రూ.1.2 లక్షల కోట్ల తాజా మూలధనం అవసరం అవుతుందని

2020 నాటికి  తప్పదంటున్న మూడీస్ నివేదిక

 న్యూఢిల్లీ: ఎస్‌బీఐ సహా తన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2020 నాటికి రూ.1.2 లక్షల కోట్ల తాజా మూలధనం అవసరం అవుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ శుక్రవారంనాడు విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. బ్యాలెన్స్ షీట్ల పటిష్టతకు అవసరమని పేర్కొన్న ఈ మొత్తం పరిమాణం ప్రభుత్వ ప్రణాళికా పరిమాణానికన్నా అధికంగా ఉండడం గమనార్హం.  2019 మార్చి నాటికి 22 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తాజా మూలధనం సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రణాళిక.

ఇందులో ఇప్పటికే కేంద్రం రూ.25,000 కోట్లు సమకూర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.25,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనకన్నా... అవసరమైతే మరింత సమకూర్చుతామని కూడా కేంద్రం హామీ ఇస్తోంది. కాగా, మార్చి 11వ తేదీ నాటికి ఈ 11 బ్యాంకుల పనితీరును కూడా మూడీస్ సమీక్షించింది. రానున్న 12 నెలల్లో సైతం బ్యాంక్ అసెట్ క్వాలిటీ ఒత్తిడిలో ఉంటుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement