
సాక్షి, ముంబై : స్మార్ట్ఫోన్ మేకర్ షావోమి తన వినియోగదారులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా ఈ నెల (జూన్) 28 నుంచి ఎంఐ ఫ్యాన్స్ ఉచితంగా షావోమి ష్లాగ్షిప్ ఫోన్లను గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. వారానికి అయిదుగురు చొప్పున 20 రోజుల్లో 20 స్మార్ట్ఫోన్లను ఉచితం అందించనుంది. 5 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ను అందిస్తోంది.
లక్కీ డ్రా ద్వారా జూన్ 28 - జూలై 19 మధ్య కాలంలో విజేతలను ఎంపిక చేయనుంది. వెయ్యి రూపాయలు, ఆపైన ప్రీ పెయిడ్ ఆర్డర్ చేసిన వినియోగదారులు మాత్రమే ఈ లక్కీ డ్రాకు అర్హులు. విజేతలకు రెడ్మి నోట్ 7ఎస్(3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్)ఒకటి, రెడ్మి నోట్ 7 (3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) రెండు, రెడ్ మి 7 (3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) రెండు స్మార్ట్ఫోన్లను వారానికి అందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment