Smartphones
-
ఒప్పో నుంచి ఎఫ్29 స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం ఒప్పో తాజాగా ఎఫ్29 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఎఫ్29 ధర రూ. 23,999 నుంచి, ఎఫ్29 ప్రో మోడల్ రేటు రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి వరుసగా మార్చి 27, ఏప్రిల్ 1 నుంచి లభిస్తాయని సంస్థ తెలిపింది. 6.7 అంగుళాల స్క్రీన్, 50 ఎంపీ కెమెరా, 6,500 ఎంఏహెచ్ వరకు బ్యాటరీ, కలర్ఓఎస్ 15, హంటర్ యాంటెన్నా తదితర ఫీచర్లు వీటిలో ఉంటాయని పేర్కొంది.భారతీయ పరిస్థితులకు తగ్గట్లుగా దుమ్మూ, నీరు, ఇతరత్రా ద్రవాల నుంచి అత్యధిక రక్షణ ఉండేలా రూపొందిచినట్లు ఒప్పో ఇండియా ప్రోడక్ట్ కమ్యూనికేషన్స్ హెడ్ సేవియో డిసౌజా వివరించారు. దేశీయంగా కార్యకలా పాల విస్తరణపై నిరంతరం పెట్టు బడులు పెడుతున్నట్లు చెప్పారు. భారత్లో స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి కోసం నోయిడాలో 110 ఎకరాల్లో తయారీ ప్లాంటును నెలకొల్పినట్లు వివరించారు. తమ ఎఫ్27 ప్రోప్లస్ స్మార్ట్ఫోన్లకు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ తదితర మార్కెట్లలో భారీ స్పందన లభిస్తోందన్నారు. ఎఫ్29 స్మార్ట్ఫోన్ల మీద ఎస్బీఐ కార్డ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొదలైన వాటిపై 10% వరకు క్యాష్బ్యాక్, 10% వరకు ఎక్సే్చంజ్ బోనస్ వంటి ఆఫర్లు ఉంటాయి. -
శాంసంగ్ నుంచి మూడు కొత్త స్మార్ట్ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన గెలాక్సీ ఎ-సిరీస్ లైనప్లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను భారత్లో విడుదల చేసింది. అవి శాంసంగ్ గెలాక్సీ ఎ56, గెలాక్సీ ఎ36, గెలాక్సీ ఎ26. ఆకట్టుకునే ఫీచర్లు, ఆకర్షణీయ ధరలో విస్తృత శ్రేణి వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ డివైజ్ లను రూపొందించారు. వీటిలో ఏయే స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ధరలెంత అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..గెలాక్సీ ఎ56గెలాక్సీ ఎ56 కొత్త లైనప్ లో ఫ్లాగ్ షిప్ మోడల్. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1580 చిప్ సెట్ తో నడిచే ఏ56 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను అందిస్తుంది.. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ డ్యూయల్ 5జీ సిమ్ కార్డులకు సపోర్ట్ చేస్తుంది.కెమెరా సామర్థ్యాల విషయానికి వస్తే, గెలాక్సీ ఎ56లో విభిన్న ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.గెలాక్సీ ఎ56 మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి ఆసమ్ ఆలివ్, ఆసమ్ లైట్గ్రే, ఆసమ్ గ్రాఫైట్. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.41,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.44,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.47,999గానూ కంపెనీ నిర్ణయించింది.గెలాక్సీ ఏ36గెలాక్సీ ఎ36 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో సహా అనేక ఫీచర్లను ఎ56లో మోడల్లో ఉన్నట్లుగానే ఉంటాయి. అయితే ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ను అందించారు. ఏ36లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ను ఇచ్చారు.గెలాక్సీ ఏ36లో కెమెరా సెటప్ విషయానికి వస్తే ఓఐఎస్తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్. ఎ56 మాదిరిగానే ఎ36 కూడా 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ కూడా ఉంది.గెలాక్సీ ఎ36 లావెండర్, బ్లాక్, వైట్ రంగులలో లభిస్తుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.32,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.35,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.38,999గానూ నిర్ణయించారు.గెలాక్సీ ఏ26గెలాక్సీ ఎ26 కొత్త లైనప్ లో అత్యంత చవక మోడల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + సూపర్ అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ పై పనిచేసే ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను అందించారు.గెలాక్సీ ఏ26లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం దీనికి IP67 రేటింగ్ ఉంది.గెలాక్సీ ఏ26 ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బ్లాక్, వైట్, మింట్, పీచ్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. -
రూ.10 వేలకంటే తక్కువే.. ఇదిగో బెస్ట్ స్మార్ట్ఫోన్స్
-
ష్.. మీ ఫోన్ వింటోందా?
మీరేం మాట్లాడుతున్నారు? ఏం చేయాలని అనుకుంటున్నారు?.. ఇవన్నీ మీ వ్యక్తిగతం. వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ మీ స్మార్ట్ ఫోన్ ఇవన్నీ వినేస్తోంది. మనపై మన ఫోన్ ఉంచుతున్న నిఘా గుట్టును తేల్చేయడానికి నిపుణులు 4 సూచనలు చేస్తున్నారు. మన సంభాషణలను రహస్యంగా వినేస్తున్న స్మార్ట్ ఫోన్లు మనం దేని గురించి మాట్లాడితే.. ఆ అంశంపై యాడ్స్ వెబ్సైట్ల నుంచి సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా అవే ప్రకటనల గోల మీరేం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు?.. ఇవన్నీ మీ వ్యక్తిగతం. ఇంట్లో మీ గదిలో కూర్చుని మీ భార్యతోనో, భర్తతోనో, పిల్లలతోనో, తల్లిదండ్రులతోనో ఇవన్నీ మాట్లాడుకున్నారు. వేరే ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. కానీ ఒకరు మాత్రం రహస్యంగా అన్నీ వినేస్తున్నారు.. వినడమే కాదు, మీ మాటలన్నీ విశ్లేషించి... మీ అవసరానికి సూటయ్యేలా సూచనలు చేస్తున్నారు. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతోంది. ఇంతకీ అన్నీ వింటున్న ఆ ఒక్కరు ఎవరు?.. మీ స్మార్ట్ ఫోనే! నిఘా పెట్టేదెలాగో, అది మనకు తెలిసేదెలాగో తెలుసుకుందామా..ఇంటర్నెట్ సెర్చింగ్ నుంచి మైక్రోఫోన్తో నిఘా దాకా..మీరు ఏదైనా ప్రదేశం గురించో, మరేదైనా సమాచారం కోసమో ఇంటర్నెట్లో సెర్చింగ్ చేస్తే.. ఆ తర్వాత మీ ఫోన్లో, కంప్యూటర్లో ఆ ప్రదేశం, సమాచారానికి సంబంధించిన ప్రకటనలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం ఢిల్లీలో మంచి హోటళ్లు ఏమేం ఉన్నాయని సెర్చ్ చేశామనుకోండి. ఆ తర్వాత కొన్నిరోజుల వరకు మనం ఏ వెబ్సైట్లు ఓపెన్ చేసినా.. వాటిలో ఢిల్లీలోని హోటళ్ల సరీ్వసులు, ట్రావెల్ ఏజెన్సీల ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. ఇంతవరకు మనకు తెలిసిందే. కానీ మన ఫోన్ మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నామనేదీ తెలుసుకుంటోంది. ఫోన్లోని మైక్రోఫోన్ ద్వారా నిఘాపెడుతోంది. మరి మన ఫోన్ ఇలా మనపై నిఘా పెట్టిందా లేదా అనేది చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చని ‘నార్డ్ వీపీఎన్’ సంస్థ టెక్ నిపుణులు చెబుతున్నారు.మనపై ఫోన్ నిఘా గుట్టు తేల్చేద్దాం ఇలా..1. మీరు ఇప్పటివరకు ఇంటర్నెట్లో సెర్చ్ చేయని, సోషల్ మీడియాలో పెట్టని, ఎప్పుడూ మాట్లాడని ఒక కొత్త టాపిక్ను ఎంచుకోండి.2. మీ ఫోన్ను మీకు దగ్గరలో పెట్టుకుని ఈ టాపిక్పై నాలుగైదు రోజులు తరచూ మాట్లాడండి. ఎవరితోనైనా చర్చించండి. ఉదాహరణకు ఏదైనా దేశం, అక్కడి నగరాలు, టూరిస్టు ప్లేసులు, రెస్టారెంట్లు వంటి అంశాలను మాట్లాడండి.3. అయితే ఈ టాపిక్కు సంబంధించి ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో ఎక్కడా సెర్చింగ్, పోస్టింగ్ వంటివి చేయకూడదు. కేవలం ఫోన్ను మీకు సమీపంలో పెట్టుకుని సదరు టాపిక్పై మాట్లాడాలి. మిగతా విషయాల్లో మీ ఫోన్ను మామూలుగానే వాడుతూ ఉండాలి.4. 4,5 రోజుల తర్వాతి నుంచి మీ ఫోన్లో, మీ ఈ–మెయిల్తో లింక్ అయి ఉన్న స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, కంప్యూ టర్లలో.. మీరు చూసే వెబ్సైట్లు, సోషల్ మీడియా యాప్స్లో వచ్చే యాడ్స్ను కాస్త గమనిస్తూ ఉండండి.5, ఒకవేళ మీరు మాట్లాడిన అంశానికి సంబంధించి యాడ్స్ తరచూ కనిపిస్తూ ఉంటే.. ఫోన్ మీపై నిఘా పెట్టి, మీ సంభాషణలలోని టాపిక్స్ను యాడ్స్ కోసం వాడుతున్నట్టే.ఈ నిఘా నుంచి బయటపడేదెలా? ⇒ ఫోన్లో సోషల్ మీడియా, ఈ–కామర్స్, బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన యాప్స్ నుంచి.. గేమ్స్, యుటిలిటీస్ యాప్స్ వరకు ఉంటా యి. వాటిని ఇన్స్టాల్ చేసినప్పుడు స్టోరేజీ, మైక్రోఫోన్, కెమెరా వంటి పరి్మషన్లు ఇస్తుంటాం. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ⇒ పెద్ద కంపెనీల యాప్లతో సమస్య ఉండకపోవచ్చుగానీ.. గేమ్స్, యుటిలిటీస్, ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్స్టాల్ చేసుకునే యాప్లు, యాడ్స్పై లింకులను క్లిక్చేయడం ద్వారా డౌన్లోడ్ అయ్యే యాప్లతో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి యాప్లకు ఇచ్చే పరి్మషన్లు దుర్వినియోగమై.. మీ ఫోన్తోనే మీపై నిఘా మొదలవుతుంది. అందువల్ల ముఖ్యమైన యాప్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి. ⇒ యాప్స్కు అవసరమైన పరి్మషన్లు మాత్రమే ఇవ్వాలి. అప్పుడప్పుడూ ఏయే యాప్స్కు ఏ పరి్మషన్లు ఇచ్చినదీ, సెట్టింగ్స్లోకి వెళ్లి పరిశీలించాలి. అనవసర యాప్స్కు ఇచ్చిన పరి్మషన్లను తొలగించాలి. వీలైతే అవసరం లేని యాప్స్ను తొలగించేయడం మంచిది. ⇒ ఫోన్లోని వాయిస్ అసిస్టెంట్ యాప్ సెట్టింగ్స్లో ‘ఆలో వెన్ లాక్డ్’ఆప్షన్ను డిజేబుల్ చేయాలి. దీనితో ఫోన్ లాక్ అయి ఉన్నప్పుడు మైక్రోఫోన్ వాడకుండా ఉంటుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
జోరుగా ఐఫోన్ల ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులను గణనీయంగా పెంచింది. 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో సుమారు రూ.50,400 కోట్ల విలువైన ఎగుమతులను సాధించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విలువ పరంగా 33 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ భారత్లో తయారీ సామర్థ్యాలను పెంపొందించడానికి యాపిల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఈ జోరు చూస్తే భారత్ నుంచి విదేశాలకు సరఫరా అయ్యే ఐఫోన్ల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2023–24లో కంపెనీ సుమారు రూ.84,000 కోట్ల విలువైన ఎగుమతులను నమోదు చేసింది. ప్రభుత్వ రాయితీలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, దేశంలో సాంకేతిక పురోగతి.. వెరశి కంపెనీ భారత్లో తన తయారీ నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా బీజింగ్–వాíÙంగ్టన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనాలో తయారీకి సంబంధించిన నష్టాలను తగ్గించడానికి యాపిల్ యొక్క వ్యూహంలో భారత్ కీలక కేంద్రంగా మారింది. కీలకంగా యాపిల్.. ప్రధాన మార్కెట్ అయిన యూఎస్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్ట్లో రూ.24,192 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ సరఫరా అయ్యాయి. యూఎస్కు ఎగుమతుల పరంగా టాప్–1 సెగ్మెంట్గా మొబైల్స్ నిలవడంతోపాటు భారత స్మార్ట్ఫోన్ ఎగుమతి రంగానికి ఐఫోన్లు వెన్నెముకగా మారాయి. అయిదేళ్ల క్రితం ఇక్కడి నుంచి యూఎస్కు ఎగుమతి అయిన స్మార్ట్ఫోన్స్ విలువ రూ.43.6 కోట్లు మాత్రమే. తాజా ఎగుమతి గణాంకాలు యాపిల్ తయారీ సామర్థ్యాలను ప్రతిబింబిస్తోంది.యాపిల్ కీలక సరఫరాదారులైన తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్ప్, భారత్కు చెందిన టాటా ఎల్రక్టానిక్స్ దక్షిణ భారతదేశంలో చురుకుగా ఐఫోన్లను అసెంబుల్ చేస్తున్నాయి. చెన్నైకి సమీపంలోని ఫాక్స్కాన్ ఫెసిలిటీ అతిపెద్ద సరఫరాదారుగా నిలుస్తోంది. ఇది భారత ఐఫోన్ ఎగుమతుల్లో సగం సమకూరుస్తోంది. టాటా ఎల్రక్టానిక్స్ గతేడాది విస్ట్రన్ కార్పొరేషన్ నుంచి అసెంబ్లీ యూనిట్ను కొనుగోలు చేసింది. ఏప్రిల్–సెపె్టంబర్ కాలంలో కర్ణాటక ఫ్యాక్టరీ నుండి సుమారు రూ.14,280 కోట్ల విలువైన ఐఫోన్లను టాటా ఎల్రక్టానిక్స్ ఎగుమతి చేసింది.కొనసాగుతున్న పెట్టుబడులు..యాపిల్ భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో కేవలం 7 శాతం లోపు మాత్రమే వాటా కలిగి ఉంది. షావోమీ, ఒప్పో, వివో వంటి చైనీస్ బ్రాండ్లదే ఇక్కడ హవా నడుస్తోంది. అయినప్పటికీ ఆపిల్ దేశీయంగా గణనీయంగా పెట్టుబడులు చేస్తోంది. బెంగుళూరు, పుణేలో కొత్త స్టోర్లతో సహా రిటైల్ ఉనికిని విస్తరించే ప్రణాళికలతో భారత్లో యాపిల్ వృద్ధి పథం ఆశాజనకంగా కనిపిస్తోంది. భారత్లో యాపిల్ అమ్మకాలు 2030 నాటికి రూ.2,77,200 కోట్లకు చేరవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. మధ్యతరగతి వర్గాల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి, సులభతర వాయిదా చెల్లింపుల స్కీములు ఇందుకు కారణంగా తెలుస్తోంది.కఠిన కోవిడ్–19 లాక్డౌన్లు, ఆరి్ధక సంక్షోభం కారణంగా మాంద్యంతో చైనాలో యాపిల్ కంపెనీ అనేక సవాళ్లను ఎదుర్కొంది. దేశీయంగా తయారీ సామర్థ్యం పెంచుతున్నప్పటికీ సమీప భవిష్యత్తులో యాపిల్ ప్రధాన మార్కెట్గా చైనాను అధిగమించే అవకాశం భారత్కు లేదు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారత్లో రూ.1,17,600 కోట్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. ఉత్పత్తి సామర్థ్యాలను రెట్టింపు చేసింది. -
కొత్తగా వచ్చాయ్.. లేటెస్ట్ ఫోన్లు.. గ్యాడ్జెట్లు
స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ట్యాబ్స్ వంటి కొత్త గ్యాడ్జెట్స్ ఏవో ఒక ఒకటి మార్కెట్లోకి నిత్యం వస్తూనే ఉంటాయి. వాటిలో ఎలాంటి ఫీచర్స్, ప్రత్యేకతలేంటి అన్న విషయాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఫోన్లు, వాచీలు, గ్యాడ్జెట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈడిస్ప్లే: 6.7 అంగుళాలురిఫ్రెష్రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080×2340 పిక్సెల్స్మెమోరీ: 128 జీబి 8జీబి ర్యామ్/256 జీబి 8జీబి ర్యామ్/ 512జీబి 8జీబి ర్యామ్వోఎస్: ఆండ్రాయిడ్ 14; ఫ్రంట్ కెమెరా: 10 ఎంపీబ్యాటరీ: 4700 ఎంఏహెచ్; కనెక్టివిటి: 5జీనథింగ్ సీఎంఎఫ్ వాచ్ ప్రో2సైజ్: 1.32రిజల్యూషన్: 466×466 పిక్సెల్స్» స్విమ్మింగ్, రన్నింగ్, రాక్ క్లైంబింగ్, జిమ్ సెషన్..మొదలైన యాక్టివిటీలలో ఉపకరిస్తుంది.» స్ట్రెస్ రీడింగ్, స్లీప్ మానిటరింగ్లాంటి ఫీచర్లు ఉన్నాయి.ఫుల్ చార్జ్: (జీరో నుంచి) 100 నిమిషాలుఒప్పో ప్యాడ్ 3 ప్రోసైజ్: 12.5 అంగుళాలురిజల్యూషన్: 2000×3200 పిక్సెల్స్ఇంటర్నల్ మెమొరీ: 256 జీబిబ్యాటరీ కెపాసిటీ: 10000 ఎంఏహెచ్వివో ఎక్స్ 200 ప్రోడిస్ప్లే: 6.78 అంగుళాలు; బరువు: 223 గ్రా.మెమొరీ: 256జీబి 12జీబి ర్యామ్/512జీబి 16జీబి ర్యామ్వోఎస్: ఆండ్రాయిడ్ 15రిజల్యూషన్: 1260×2800 పిక్సెల్స్ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ;బ్యాటరీ: 6000 ఎంఏహెచ్ -
ప్రపంచంలో తొలి ట్రై–ఫోల్డ్ ఫోన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్స్ చరిత్రలో కొత్త అధ్యాయానికి చైనా దిగ్గజం హువావే తెరలేపింది. మేట్ ఎక్స్టీ పేరుతో ప్రపంచంలో తొలి ట్రై–ఫోల్డ్ స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించింది. రెండు దశల్లో ఫోల్డ్ చేసేలా 3కే రిజొల్యూషన్, ఓఎల్ఈడీ స్క్రీన్తో ఇది రూపుదిద్దుకుంది. పూర్తిగా ఫోల్డ్ చేస్తే 6.4 అంగుళాల స్మార్ట్ ఫోన్గా వాడుకోవచ్చు. కొంత భాగం ఓపెన్ చేస్తే 7.9 అంగుళాలు, పూర్తిగా తెరిస్తే 10.2 అంగుళాల ట్యాబ్లెట్ పీసీ మాదిరి సింగిల్ స్క్రీన్గా మారిపోతుంది. 27 లక్షల పైచిలుకు యూనిట్లకు ప్రీ ఆర్డర్లు ఉన్నాయి.ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ ఫోన్లకు ప్రైమరీ స్క్రీన్, కవర్ డిస్ప్లే మాత్రమే ఉన్నాయి. ట్రై–ఫోల్డ్ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 2.35 లక్షలు. ప్రస్తుతానికి చైనాకే పరిమితం. సెపె్టంబర్ 20 నుంచి కస్టమర్ల చేతుల్లోకి రానుంది. బరువు 298 గ్రాములు. పూర్తిగా ఫోల్డ్ చేసినప్పుడు 3.6 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. 16 జీబీ ర్యామ్, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 ఎంపీ టెలిఫోటో లెన్స్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు ఉంది. -
స్మార్ట్ వరల్డ్
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతోంది. కమ్యూనికేషన్, వెబ్ బ్రౌజింగ్, నావిగేషన్, వినోదం వంటి సేవలతోపాటు ఆర్థిక లావాదేవీలు, సామాజిక అవసరాల విషయంలో విస్తృత మార్పులు రావడంతో ప్రతి వ్యక్తికి స్మార్ట్ఫోన్ నిత్యావసర వస్తువుగా మారింది. ఒక వ్యక్తి వద్ద ఒకటి కంటే ఎక్కువ కూడా స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. దీంతో 2023లో ప్రపంచ వ్యాప్తంగా 692 కోట్లు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. పట్టణాల్లో 83 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 78 శాతం స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.ఇదే ఒరవడి కొనసాగితే 2025 నాటికి ప్రపంచ జనాభాలో 90.33 శాతం మంది స్మార్ట్ఫోన్లు కలిగి ఉంటారని యూరప్కు చెందిన ఈ–కామర్స్ సేవలు అందిస్తున్న ఒబెర్లో అనే సంస్థ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడించింది. 2026 నాటికి 752 కోట్ల వరకు స్మార్ట్ఫోన్లు వినియోగదారుల చేతుల్లో ఉంటాయని ఆ సంస్థ అంచనా వేసింది. చైనాలో గత ఏడాది వరకు అత్యధికంగా 97.46 కోట్లు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. బంగ్లాదేశ్లో అత్యల్పంగా 5 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయితే అమెరికా(27.61కోట్లు) కన్నా దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా మనదేశంలో 65.90 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. – సాక్షి, అమరావతిఫోన్లోనే ఇంటర్నెట్ వినియోగం అత్యధికం...స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ఇంటర్నెట్ వినియోగం సులభమైంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల్లో 200 కోట్ల మంది (57.14శాతం) స్మార్ట్ఫోన్ల ద్వారా యాక్సెస్ చేశారు. ఇది 2025 నాటికి 72.6శాతాకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2023లో నెలవారీ సగటు డేటా వినియోగం 14 జీబీగా ఉంటే.. 5జీ అందుబాటులోకి రావడంతో 2026 నాటికి 35జీబీకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం ఇలా...⇒ 83% సంభాషణలతో పాటుగా ఈ–మెయిల్, ఫొటోలు తీసుకోవడం⇒ 76% ఇంటర్నెట్ సర్ఫింగ్⇒ 73% బ్రౌజింగ్, మ్యాపింగ్, నావిగేషన్⇒ 60% ఆన్లైన్ బ్యాంకింగ్⇒ 59% వీడియో కాల్స్ మాట్లాడటం⇒ 58% వీడియోలు తీసుకోవడం⇒ 71% ఆన్లైన్ షాపింగ్⇒ 67% సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం, చూడటం⇒ 58% వార్తలు చదవడం/ సమాచారం ఇవ్వడం⇒ 57% సాధారణ ప్రయోజన యాప్లు⇒ 66% పాడ్ క్యాస్ట్లు⇒ 52% గేమ్లు ఆడడం⇒ 44% లాంగ్ వీడియోలు చూడటం⇒ 65% షార్ట్ వీడియోలు చూడటం⇒ 35% ఆన్లైన్ వీడియో గేమ్లు ఆడటం -
ముసుగు మనుషులు
‘సుగుణం మేలిముసుగు, దుర్గుణం దొంగముసుగు’ అన్నాడు ఫ్రెంచ్ రచయిత, రాజనీతిజ్ఞుడు విక్టర్ హ్యూగో. ‘కరోనా’ కాలంలో మనుషులందరికీ ముసుగులు అనివార్యంగా మారాయి. మహమ్మారి కాలంలో మూతిని, ముక్కును కప్పి ఉంచే ముసుగులు లేకుంటే మాయదారి మహమ్మారి రోగం మరెందరిని మట్టుబెట్టేదో! ముసుగులు పలు రకాలు. అన్నింటినీ ఒకే గాటన కట్టేయలేం. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం కుదరదు కదా! అనివార్యంగా ధరించే ముసుగులు కొన్ని, మతాచారాల కారణంగా ధరించే ముసుగులు ఇంకొన్ని– ఇవి ప్రమాదకరమైన ముసుగులు కాదు. ఇలాంటి ముసుగుల చాటున ఉన్న మనుషులను గుర్తించడమూ అంత కష్టం కాదు.అయితే, వచ్చే చిక్కంతా దేవతా వస్త్రాల్లాంటి ముసుగులతో మన మధ్య తిరుగుతుండే మనుషులతోనే! కనిపించని ముసుగులు ధరించే మనుషుల బతుకుల్లో లెక్కలేనన్ని లొసుగులు ఉంటాయి. వాటిని దాచుకోవడానికే ముఖాలకు దేవతావస్త్రాల ముసుగులను ధరిస్తుంటారు. అలాంటివారు మన మధ్య ఉంటూ, మనతోనే సంచరిస్తుంటారు. మనం పనిచేసే కార్యాలయాల్లో, మనం నివసించే కాలనీల్లో ఉంటారు. ముసుగులకు చిరునవ్వులు అతికించుకుని మనల్ని పలకరిస్తుంటారు కూడా! వాళ్లను ముసుగులతో తప్ప ముఖాలతో గుర్తుపట్టలేని పరిస్థితికి చేరుకుం టాం. వాళ్ల అసలు ముఖాలను పోల్చుకునే సరికి కనిపించని ఊబిలో కూరుకుపోయి ఉంటాం.గాంభీర్యం చాలా గొప్పగా ఉంటుంది గాని, చాలా సందర్భాల్లో అది పిరికిపందలు ధరించే ముసుగు. అలాగే, పలు సందర్భాల్లో భూతదయా ప్రదర్శనలు క్రౌర్యానికి ముసుగు; బహిరంగ వితరణ విన్యాసాలు లుబ్ధబుద్ధులకు ముసుగు; నిరంతర నీతి ప్రవచనాలు అలవిమాలిన అవినీతి పనులకు ముసుగు; సర్వసంగ పరిత్యాగ వేషాలు సంపన్న వైభోగాలకు ముసుగు– ఇలా చెప్పుకుంటూ పోతే ముసుగుల జాబితా కొండవీటి చేంతాడు కంటే పొడవుగా తయారవుతుంది. ‘ఒక్క బంగారు ముసుగు అన్ని వైకల్యాలనూ కప్పిపుచ్చుతుంది’ అన్నాడు ఇంగ్లిష్ నాటక రచయిత థామస్ డెకర్. బంగారు ముసుగులు తొడుక్కోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకని తెలివిమంతులు దేవతా వస్త్రాల ముసుగులలో తమ తమ లొసుగులను కప్పిపుచ్చుకుంటూ, నిక్షేపంగా సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అయిపోతుంటారు. ఇలాంటి పెద్దమనుషుల అసలు ముఖాలేవో గుర్తించడం దుస్సాధ్యం. ముసుగుల మాటునున్న ముఖాలను గుర్తించేలోపే అమాయకులు కాటుకు గురైపోతారు. సాధారణంగా ముసుగులు నాటకాది ప్రదర్శనల వేషధారణలో భాగంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో ముసుగులూ వేషాలూ దైనందిన జీవితంలో నిత్యకృత్యాలుగా మారిపోయాయి.అతి వినయం ధూర్త లక్షణానికి ముసుగు. ‘వదనం పద్మదళాకారం వచశ్చందన శీతలం/ హృదయం కర్తరీ తుల్యం, అతి వినయం ధూర్త లక్షణం’ అని మనకో సుభాషిత శ్లోకం ఉంది. అలాగే, ‘జటిలో ముండీ లుంభిత కేశః/ కాషాయాంబర బహుకృత వేష/ పశ్యన్నిపిచ న పశ్యతి మూఢో/ ఉదర నిమిత్తం బహుకృత వేషం’ అన్నాడు ఆదిశంకరుడు. పైన ఉదహరించిన సుభాషిత శ్లోకాన్ని, ఆదిశంకరుడి శ్లోకాన్ని గమనిస్తే, ముసుగులూ వేషాలూ ఆనాటి నుంచే ఉన్నట్లు అర్థమవుతుంది. కాకుంటే, అప్పటివి సత్తెకాలపు ముసుగులు. అతి తెలివిని ప్రదర్శించబోయిన అమాయకపు వేషాలు. ప్రధానంగా వాటి ప్రయోజనం ఉదర నిమిత్తానికే పరిమితమై ఉండేది. కేవలం ఉదర నిమిత్తం వేసుకునే ముసుగులూ వేషాల వల్ల ఎంతో కొంత వినోదమే తప్ప సమాజానికి పెద్దగా చేటు ఏమీ ఉండదు. అయినా, ఆనాటి సమాజంలోని ప్రాజ్ఞులు ముసుగులనూ, వేషాలనూ నిరసించేవారు. అలాంటివారి నిరసనల వల్ల ముసుగులూ వేషాలూ శ్రుతి మించకుండా ఉండేవి. అప్పట్లో ముసుగులకూ వేషాలకూ పెద్దగా ప్రచారం ఉండేది కాదు. అంతగా జనాదరణ ఉండేది కాదు. సినిమాలు వచ్చాక చిత్రవిచిత్ర వేషాలకు ప్రచారమూ పెరిగింది. నాటకాలు, సినిమాలు మాత్రమే వినోద సాధనాలుగా ఉన్న కాలంలో నటీనటులు మాత్రమే పాత్రోచిత వేషాలు వేసేవారు. సమాజంలో పెద్దమనుషుల ముసుగులో ఉండే వేషధారులు అక్కడక్కడా మాత్రమే ఉండేవారు. ఇక స్మార్ట్ఫోన్లు చేతిలోకి వచ్చాక మనుషులంతా వేషధారులుగా మారిపోయిన పరిస్థితి దాపురించింది. కృత్రిమ మేధ తోడయ్యాక మనుషుల అసలు ముఖాలను పోల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి వాటిల్లింది. ఇప్పుడు నటీనటులే కాదు, వారికి పోటీగా దేశాధినేతలు కూడా యథాశక్తిగా దేవతావస్త్రాల ముసుగులను తొడుక్కుని, రకరకాల వేషాలతో నవరసాభినయ చాతుర్యంతో జనాలను విస్మయంలో ముంచెత్తుతున్నారు.‘స్మార్ట్’ వేషాల సంగతి ఒక ఎత్తయితే, ఇప్పుడు చైనాలో సిలికాన్ ముసుగులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అలాంటిలాంటివి కావు, అల్ట్రా రియలిస్టిక్ ముసుగులు. ఒక నలభయ్యేళ్ల వ్యక్తి ఒక వృద్ధుడి ముఖాన్ని పోలిన సిలికాన్ ముసుగు వేసుకుని నేరాలకు పాల్పడిన సంగతి బయటపడటంతో కలకలం మొదలైంది. సిలికాన్ ముసుగుల చట్టబద్ధతపై కూడా చర్చ మొదలైంది. అయినా, ఎంత సిలికాన్ ముసుగులైతే మాత్రం అవేమైనా దేవతా వస్త్రాల ముసుగులా? అసలు ముఖాలను ఎంతకాలం దాచగలవు పాపం?! -
చౌక 5జీ ఫోన్ల మోత!
5జీ ఫోన్ కొనే ప్లాన్లో ఉన్నారా? పండుగ సీజన్ వరకు కాస్త ఓపిక పట్టండి! ఎందుకంటారా? భారీగా ఆదా చేసే చాన్స్ రాబోతోంది. రాబోయే పండుగల్లో చౌక 5జీ ఫోన్లు మార్కెట్ను ముంచెత్తనున్నాయి. ప్రధానంగా హ్యాండ్సెట్ల తయారీలో కీలకమైన 5జీ చిప్సెట్లను చిప్ తయారీ బ్రాండ్లు తక్కువ ధరల్లో విడుదల చేస్తుండటంతో ఫోన్ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతోంది. దీంతో ఈ ఏడాది చివరికల్లా దేశంలో 5జీ హ్యాండ్సెట్ల మార్కెట్ భారీగా ఎగబాకుతుందనేది పరిశ్రమ వర్గాల అంచనా.మనం ఇప్పటికే 5జీ యుగంలోకి అడగుపెట్టేశాం. ఒకపక్క టెలికం కంపెనీలు 5జీ నెట్వర్క్ విస్తరణకు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. మరోపక్క మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు కూడా 5జీ హ్యాండ్సెట్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీంతో ఫోన్ కొనుగోలుదారులకు ఇక ‘పండుగే’! ప్రస్తుతం దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ల ధర రూ. 11,000–13,000 మధ్య ప్రారంభమవుతోంది. కొన్ని ఫోన్ బ్రాండ్లు అప్పుడప్పుడు ప్రమోషనల్ ఆఫర్లను అందిస్తుండటంతో ధర కొంచెం తగ్గుతోంది. అయితే, చిప్ తయారీ సంస్థలు చౌక 5జీ చిప్సెట్లను అందుబాటులోకి తెస్తుండటంతో ఫోన్ రేట్లు భారీగా దిగిరానున్నాయి. చిప్.. చిప్.. హుర్రే! తాజాగా భారత్ కోసం చైనా చిప్సెట్ బ్రాండ్ యూనిసాక్ ‘టీ760’ చిప్సెట్ను విడుదల చేసింది. ప్రధాన మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు అందుబాటు ధరల్లో 5జీ ఫోన్ల విడుదలకు చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో రూ. 10,000 లోపు ధరల్లో 5జీ ఫోన్లకు మార్గం సుగమం కానుంది. యూనిసాక్ బాటలోనే మొబైల్ చిప్సెట్లలో దిగ్గజ బ్రాండ్లైన క్వాల్కామ్, మీడియాటెక్ కూడా చౌక 5జీ చిప్సెట్లను అందించనున్నాయి. ‘అతి త్వరలోనే’ బడ్జెట్, ఎంట్రీలెవెల్ 5జీ హ్యాండ్సెట్ల కోసం చిప్సెట్లను తీసుకొస్తామని క్వాల్కామ్ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. మీడియాటెక్ ‘డైమెన్సిటీ 6000 సిరీస్’ ఎంట్రీలెవెల్ చిప్సెట్ చౌకగా స్మార్ట్ ఫోన్లను అందించేందుకు వీలుకల్పిస్తుందని ఆ కంపెనీ డిప్యూటీ డైరెక్టర్ అనూజ్ సిద్ధార్థ్ చెప్పా రు. ‘2జీ, 4జీ విభాగాల్లో యూనిసాక్ చిప్సెట్ల వాటా పటిష్టంగా ఉంది. టీ760తో భారత్లో అందరికీ చౌక 5జీ ఫోన్లను అందించడమే మా లక్ష్యం. దీనికోసం కీలక ఫోన్ తయారీదారులతో జట్టు కడుతున్నాం. టీ760 చిప్సెట్ మెరుగైన పనితీరుతో భారత్ 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తాం’ అని యూనిసాక్ కంపెనీ పేర్కొంది. ఇక 5జీ మార్కెట్ జోరు... చిప్సెట్ల రేట్లు దిగిరావడం, చౌక ఫోన్ల లభ్యతతో ఈ ఏడాది చివరికల్లా 5జీ ఫోన్ల మార్కెట్ వాటా రెండంకెల స్థాయికి చేరుకోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘రూ. 10,000 విభాగంలో 5జీ ఫోన్ల వాటా ఈ ఏడాది మే నాటికి కేవలం 1.4 శాతం మాత్రమే ఉంది. చౌక చిప్సెట్ల ప్రభావంతో డిసెంబర్ నాటికి ఈ వాటా 10 శాతానికి చేరుకోనుంది’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. ట్రాన్సియన్ హోల్డింగ్స్ (టెక్నో, ఇన్ఫినిక్స్, ఐటెల్ తదితర మొబైల్ బ్రాండ్స్), హెచ్ఎండీ గ్లోబల్ (నోకియా బ్రాండ్), రియల్మీ, రెడ్మీ వంటి కంపెనీలు దసరా, దీపావళి పండుగ సీజన్లో చౌక 5జీ హ్యాండ్సెట్లను ప్రవేశపెట్టే సన్నాహాల్లో ఉన్నాయి. ‘ట్రాన్సియన్ వంటి కీలక తయారీదారు భారీ ప్రణాళికల్లో ఉండటంతో రూ.10,000 లోపు 5జీ హ్యాండ్సెట్ల మార్కెట్ దూసుకుపోనుంది. 5జీ ఫోన్ల విడుదలకు సంబంధించి మార్కెట్ను అధ్యయనం చేస్తున్నాం’ అని ట్రాన్సియన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరిజీత్ తలపాత్ర పేర్కొన్నారు.ఈ ఏడాది మే నాటికి రూ.10,000 లోపు 5జీ హ్యాండ్సెట్ల అమ్మకాల వాటా: 1.4% డిసెంబర్ కల్లా దేశీ ఫోన్ల మార్కెట్లో 5జీ మొబైల్స్ సేల్స్ పరిమాణం (కౌంటర్ పాయింట్ అంచనా): 10% ఎంట్రీలెవెల్ 5జీ సెగ్మెంట్లో టాప్ కంపెనీలు: ట్రాన్సియన్, హెచ్ఎండీ గ్లోబల్, రియల్మీ, రెడ్మీ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొత్త సిరీస్ ఫోన్లు వచ్చేశాయి..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో రెనో 12 సిరీస్ను విడుదల చేసింది. ఈ సిరీస్లో ఒప్పో రెనో 12 (Oppo Reno 12), ఒప్పో రెనో 12 ప్రో (Oppo Reno 12 Pro) అనే రెండు స్మార్ట్ఫోన్లను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ను ఇష్టపడేవారి కోసం ఒప్పో ఈ రెండు ఫోన్లలో చాలా ఏఐ ఫీచర్లను అందించింది.కంపెనీ ఒప్పో రెనో 12ని 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్తో పరిచయం చేసింది. దీని ధర రూ.32,999. ఈ స్మార్ట్ఫోన్ విక్రయం జూలై 25 నుంచి భారత్లో ప్రారంభమవుతుంది. ఇక ఒప్పో రెనో 12 ప్రో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999. అలాగే 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,999. దీని సేల్ జూలై 18 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో రెనో 12, ఒప్పో రెనో 12 ప్రో కొనుగోలుపై కంపెనీ భారీ తగ్గింపును అందిస్తోంది. రూ. 4000 తక్షణ తగ్గింపుతో సిరీస్ బేస్ వేరియంట్ను రూ. 28,999 లకే కొనుగోలు చేయవచ్చు.ఒప్పో రెనో 12 ఫీచర్లు⇒ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్సెట్⇒ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓస్ 14.1⇒ 50 + 8 + 2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా⇒ 80W ఫాస్ట్ ఛార్జింగ్తో 5000mAh బ్యాటరీ⇒ AI క్లియర్ ఫేస్, AI రైటర్, AI ఎరేజర్, AI రికార్డింగ్ సమ్మరీ వంటి ఫీచర్లుఒప్పో రెనో 12 ప్రో ఫీచర్లు⇒ 6.7-అంగుళాల ఫుల్ హోచ్డీ ప్లస్ డిస్ప్లే⇒ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓస్ 14.1⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్⇒ AI క్లియర్ ఫేస్, AI రైటర్, AI ఎరేజర్, AI రికార్డింగ్ సమ్మరీ వంటి ఫీచర్లు⇒ 50 + 8 + 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా⇒ 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా⇒ 80W ఫాస్ట్ ఛార్జింగ్తో 5000mAh బ్యాటరీ -
ఈ స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ బంద్!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో వాట్సాప్ ప్రజల జీవితంలో ఓ భాగమైపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా వ్యక్తిగత అవసరాల కోసం, వ్యాపార కార్యకలాపాల కోసం వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలో 35 మొబైల్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. దీనికి కారణం ఏంటి? జాబితాలో ఏఏ ఫోన్లు ఉన్నాయి అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.యూజర్ల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. అయితే కొన్ని స్మార్ట్ఫోన్స్ మాత్రం ఈ అప్డేట్స్ పొందలేవు. ఇందులో ఆండ్రాయిడ్ 5.0 వెర్షన్, యాపిల్ ఐఫోన్ ఐఓఎస్ 12 వెర్షన్ మొదలైనవి ఉన్నాయి. ఇలాంటి వాటిలో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది.జాబితాలోని ఫోన్లు►శాంసంగ్: గ్యాలక్సీ ఏస్ ప్లస్, గ్యాలక్సీ కోర్, గ్యాలక్సీ ఎక్స్ప్రెస్2, గ్యాలక్సీ గ్రాండ్, గ్యాలక్సీ నోట్ 3, గ్యాలక్సీ ఎస్3 మినీ, గ్యాలక్సీ ఎస్4 యాక్టీవ్, గ్యాలక్సీ ఎస్4 మినీ, గ్యాలక్సీ ఎస్4 జూమ్►మోటోరోలా: మోటో జీ, మోటో ఎక్స్►యాపిల్: ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ►హువావే: అసెండ్ పీ6 ఎస్, అసెండ్ పీ6 ఎస్, అసెండ్ జీ525, హువావే సీ199, హువావే జీఎక్స్1ఎస్, హువావే వై625►లెనోవో: లెనోవా 46600, లెనోవా ఏ8580, హువావే ఏ85870►సోనీ: ఎక్స్పీరియా జెడ్1, ఎక్స్పీరియా ఈ3►ఎల్జీ: ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్డీ, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7 -
మీ స్మార్ట్ ఫోన్లలో తరచూ ఇలా జరుగుతుందా? అయితే..
మనం నిత్యం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వేసవికాలంలో వేడిగా అవడం, చార్జింగ్ త్వరగా అయిపోవడం లాంటి సమస్యలు సాధారణమే.. అలాగే అవే ఫోన్లు వర్షాకాలంలో, చలికాలంలో కూడా చాలా వేడిగా ఉంటే అది మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. ఫోన్ పేలుళ్లు సంభవించడానికి కారణం కూడా ఈ ఓవర్ హీటే.ఈ ప్రమాదాలు నివారణకై.. గూగుల్ తన కోట్లాది ఆండ్రాయిడ్ యూజర్లకోసం కొత్త అడాప్టివ్ థర్మల్ ఫీచర్ను తీసుకురానుంది. ఈ ఫీచర్ స్మార్ట్ఫోన్ కు 'కవచం' లాగా పనిచేస్తుంది. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వీడియోగానీ, ఫోటోస్ గానీ తీయటం, చార్జింగ్ పెట్టి మరిచపోవటంలాంటివాటితో ఫోన్ బ్యాటరీ వేడెక్కి పేలడం, మంటలు రావడం జరుగుతూంటాయి.ఇలాంటి సమస్యలనుంచి బయటపడడానకి గూగుల్ కొత్త సేఫ్టీ ఫీచర్పై కసరత్తు చేస్తోంది. ఫోన్ వేడెక్కడం ప్రారంభించిన వెంటనే ఈ ఫీచర్ వినియోగదారులకు వెంటవెంటనే నోటిఫికేషన్లను పంపడంతోపాటు అలర్ట్ మెసేజ్ లు కూడా పంపిస్తుంది.ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఈ గూగుల్ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్ల కోసం ఈ ఫీచర్ తీసుకురానుంది. కంపెనీ ఈ సేఫ్టీ ఫీచర్కి 'అడాప్టివ్ థర్మల్' అని పేరు పెట్టింది. అలాగే బ్యాటరీ ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే, ఈ గూగుల్ ఫీచర్ ప్రీ-ఎమర్జెన్సీ హెచ్చరికను జారీ చేయడంతో.. వినియోగదారు ఆ సమయాననికి ఫోన్ వాడటం నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ఫోన్ బ్యాటరీ చల్లగవడానికి సమయం లభిస్తుంది. ఫోన్ పనితీరు మందగించదు.గూగుల్ కంటే ముందు ఐఫోన్ లో ఈ రకమైన ఫీచర్ ఉంది. బ్యాటరీ హీట్ నుంచి రక్షణగా ఇలాంటి హెచ్చరిక మెసేజ్ లు కూడా మీరు పొంది ఉంటారు. ఇకపై గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలలో ఈ పీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. తర్వాత దీనిని ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా విడుదల చేయవచ్చు.ఇవి చదవండి: జిమ్మూలేదూ, ఫ్యాన్సీ ఫుడ్డూ లేదు..కానీ ఇలా అయ్యాడట! -
BEALERT: మీ డేటా జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: హ్యాకర్గా మారిన యూపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి జతిన్కుమార్ ఏకంగా పోలీసు వెబ్సైట్లు హ్యాక్ చేయడం ద్వారా ఆ విభాగానికే సవాల్ విసిరి ఎట్టకేలకు అరెస్టయ్యాడు. ఇలా ఇతనొక్కడే కాదు... ఆన్లైన్లో చాలామంది కేటుగాళ్లు అదను కోసం వేచి చూస్తున్నారు. కంప్యూటర్లకు తోడుగా ట్యాబ్లు, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత సైబర్ అటాక్స్ గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత డేటాను భద్రంగా ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇలాంటి కొన్నింటిని నగర సైబర్క్రైమ్ నిపుణులు సూచిస్తున్నారు.జియో లొకేషన్ను ట్యాగ్ చేయొద్దు సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్, పోస్టింగ్స్ మామూలైపోయాయి. లైక్ల కోసం వ్యక్తిగత విషయాలను నెట్లో పడేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాల్లో ఎక్కువగా పోస్ట్ చేసినప్పుడు జియో లొకేషన్ను ట్యాగ్ చేయకుండా ఉండాలి. వివిధ సర్వేల పేరుతో ఆన్లైన్లో వచ్చే ఫామ్స్ అనాలోచితంగా నింపొద్దు. ప్రధానంగా ఫోన్ నెంబర్లు, పూర్తి పేర్లు రాయకూడదు.అఆ ‘పాస్వర్డ్లు’ వద్దే వద్దు ఇటీవల అంతర్జాతీయంగా జరిగిన అనేక సర్వేలు పాస్వర్డ్స్ విషయంలో వినియోగదారుల వీక్నెస్ బయటపెట్టింది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ‘1234తో తమ పేరు/ఇంటి పేరు’, ‘పాస్వర్డ్స్ అనే పదం’తదితరాలు పెట్టుకుంటున్నారని, పిన్ల విషయంలో ‘1234’, ‘1111’, ‘0000’ వంటివే ఎక్కువగా వాడుతున్నారని గుర్తించింది. దీనికి భిన్నంగా ఊహించడం కష్టంగా ఉండే, డ్యూయల్ అథెంటికేషన్ తదితరాలను ఎంపిక చేసుకోవాలి. పాస్వర్డ్లో కచ్చితంగా క్యాపిటల్, సంఖ్య, గుర్తు (హ్యాష్ట్యాగ్, స్టార్, ఎట్ వంటివి) ఉండేలా చూసుకోవాలి.‘ఎక్స్టెన్షన్’లను తొలగించండి కంప్యూటర్, ల్యాప్టాప్ల్లో మీరు ఉపయోగించిన... తరచూ వినియోగించే యాప్లు, బ్రౌజర్లకు ఎక్స్టెన్షన్లను అనేక మంది అలానే ఉంచుకుంటారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం అవుతుంది. ఈ నేపథ్యంలో కచి్చతంగా ప్రతి ఒక్కరూ ఆయా ఎక్స్టెన్షన్స్ను తొలగించాలి. అ«దీకృత మినహా ప్రతి యాప్ను అనుమానించాల్సిందే. అనేక యాప్స్ వినియోగదారు డేటాను సేకరించి, విక్రయించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు అధికారిక యాప్ స్టోర్స్ మాత్రమే వినియోగించాలి.‘చరిత్ర’ను తుడిచేయాల్సిందే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ చిన్న చిన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం నుంచి వ్యక్తిగత విషయాల కోసమూ వివిధ సెర్చ్ ఇంజన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే 95% మందికి సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలన్న విషయం తెలియట్లేదు. ఇలా చేయకపోతే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత డేటా ఇతరుల చేతికి చేరుతుంది. కొన్ని సెర్చ్ ఇంజన్లలో ఈ డిలీట్ ఆప్షన్ ఉండదు. అందుకే కచి్చతంగా సురక్షితమైన సెర్చ్ ఇంజన్, వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలి.అదీకృత అప్డేట్స్ చేసుకోవాల్సిందే ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు వాడే యాప్స్ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. వీటిలో బగ్ లేదా లోపాలను గుర్తించడానికి తయారీదారులు నిత్యం పరిశోధన, అభివృద్ధి చేస్తూనే ఉంటారు. ఇలాంటివి గుర్తిస్తే ‘ప్యాచ్’ చేయడానికి సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ విడుదల చేస్తుంటారు. ఇలా అధీకృత సంస్థ నుంచి వచ్చే అప్డేట్స్ను కచ్చితంగా వినియోగించుకోవాలి. అలా చేయకపోతే డేటాను యాక్సెస్ చేయడానికి సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచి్చనట్లే అవుతుంది.లాగిన్ వివరాలు వేరుగా ఉండాలిథర్డ్ పార్టీ యాప్ల వినియోగం వీలున్నంత వరకు తగ్గించాలి. అంటే... వేర్వేరు యాప్లను లాగిన్ చేయడానికి ఒకే ఖాతాను ఉపయోగించకూడదు. ఇన్స్ట్రాగామ్, ఎక్స్ ఖాతాలను లాగిన్ చేసేందుకు చాలా మంది ఫేస్బుక్ ఖాతాను వినియోగిస్తారు. అలాగే అనేక అంశాల్లో గూగుల్ వివరాలు పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక్క పాస్వర్డ్ సంగ్రహించే హ్యాకర్లు మిగిలిన అన్నింటినీ హ్యాక్ చేసే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వీటి లాగిన్స్ అన్నీ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. ‘పబ్లిక్’ని వాడుకోవడం ఇబ్బందికరమేఆన్లైన్లో బ్రౌజ్ చేసేప్పుడు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లను (వీపీఎన్) వినియోగించడం మంచిది. అత్యవసర సమయాల్లో పబ్లిక్ వైఫై వంటివి వినియోగించాల్సి వస్తే జాగ్రత్తగా వాడాలి. వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా చూసుకోవాల్సిందే. ఇలాంటి సురక్షితం కాని నెట్వర్క్స్ వాడుతున్నప్పుడు బ్యాంకు లావాదేవీలు వంటి ఆర్థిక కార్యకలాపాలు చేయొద్దు. అలాగే ఓటీపీలు, పాస్వర్డ్స్, పిన్ నంబర్లు తదితరాలు ఎంటర్ చేయొద్దు. -
ఓ మదీ మేలుకో..!
గుంటూరు మెడికల్: ఇంట్లో పిల్లలు అదే పనిగా వీడియోగేమ్స్ ఆడుతూ మిగతా పనులను పక్కన పెట్టేస్తున్నారా.. తదేకంగా గంటల తరబడి టీవీలకు అతుక్కుపోయి ఉంటున్నారా.. అయితే వారిని ఓ కంట కనిపెట్టి ఉండాల్సిందే. లేకుంటే చిన్నవయస్సులోనే వారు మానసిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని మానసిక వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చుని చాటింగ్లు చేయటం, ఫేస్బుక్లో తలమునకలవుతూ ఉండటం మానసిక వ్యాధులకు కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.సెల్ఫోన్, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ వినియోగం బాగా పెరగడం వల్ల మానసిక జబ్బులు ఎక్కువయ్యాయని ఈ–ఎడిక్షన్గా వైద్యులు పేర్కొంటున్నారు. మానసిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా మే నెలను ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా 35 మంది మానసిక వైద్యనిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ 20 మంది వరకు వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడే వారు వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో రోజూ 100 నుంచి 130 మంది వివిధ రకాల మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్నారు. మానసికవ్యాధి లక్షణాలు... చికాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పై బడి ఉంటే వారు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా తనొక్కడే ఉండి నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనిని పదేపదే చేయాలనుకోవటం, అనవసరమైన ఆలోచల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలోపం, బరువుపెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తనమీద ఆధారపడే వారందరిని ఇబ్బందికి గురిచేస్తూ తానూ ఇబ్బందులకు గురికావడం, ఎక్కువ సమయం పనిమీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేసే ధోరణిలో ఉండటం, తనకు హాని చేస్తున్నట్లు ఊహించుకుని తగాదాల వరకు వెళ్ళటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే యత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. హార్మోన్ల లోపమే కారణం ఒత్తిడి, వ్యసనాలు, మితిమీరిన సెల్ఫోన్, ఎల్రక్టానిక్ పరికరాల వినియోగం వల్ల ప్రస్తుతం మానసిక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ జబ్బులు వంశపారంపర్యంగానూ అధికంగా వస్తుంటాయి. మెదడులో రసాయనాలు ఊరటంలో మార్పు, మెదడులో గడ్డలు ఏర్పటం, మెదడులో ‘డోపమిన్’ హార్మోన్ లోపం, హార్మోన్ అసమతుల్యం, అసమానత్వం, పుట్టుకతో మెదడు సరిగ్గా ఎదగకపోవటం, ఫిట్స్, నిద్రలేమి వల్ల కూడా మనో వ్యాధులు వస్తాయి. మానసిక వ్యాధులతో ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు ఎక్కువగా బాధపడుతున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆందోళనకు గురిచేసే విషయాలను పట్టించుకోకూడదు. మద్యం, పొగతాగటం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఆరు నుంచి తొమ్మిది గంటలపాటు నిద్రపోవాలి. కుటుంబ సభ్యులందరితో సమయం గడపాలి. రోజూ వ్యాయామం చేయాలి. మానసిక వ్యాధులకు అనేక ఆధునిక మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ ఇవటూరి శరత్చంద్ర, మానసిక వైద్య నిపుణులు సంఘం రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు పిల్లలు, పెద్దలు తేడా లేదు పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ప్రస్తుతం మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్రమశిక్షణ లేని ఆధునిక జీవనశైలే దీనికి కారణం. ప్రతి ఒక్కరూ మానసిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తిస్తే త్వరగా నయం చేసేందుకు అవకాశం ఉంది. మందులతోపాటుగా రోగులకు కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. వ్యాధి గ్రస్తులను కుటుంబ సభ్యుల పర్యవేక్షిస్తూ మందులు సక్రమంగా మింగేలా చేస్తే వ్యాధి నుంచి త్వరితగతిన బయటపడతారు. –డాక్టర్ ఐవీఎల్ నరసింహారావు, మానసిక వైద్య నిపుణుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గుంటూరు నాలుగేళ్లుగా జీజీహెచ్లో మానసిక సమస్యలతో చికిత్స తీసుకున్న వారు ఇలా.. సంవత్సరం రోగుల సంఖ్య 2020 16,529 2021 22,726 2022 28,579 2023 29,371 2024 2,505జీజీహెచ్లో ఉచిత వైద్యం మానసిక వ్యాధులకు జీజీహెచ్లో ఉచిత వైద్య సేవలను అందించటంతోపాటుగా మందులూ పైసా ఖర్చు లేకుండా అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ 21 నబర్ ఓపీలో వైద్య సేవలు లభిస్తాయి. -
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్న్యూస్ ఇంది. ప్రముఖ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందించే ఈ సేల్ గురించి ఈ-కామర్స్ ప్లాట్ఫాం ముందుగానే ప్రకటించింది.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు ‘బెస్ట్ స్మార్ట్ఫోన్ డీల్స్' అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లు ఇవ్వనున్న కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. మీరు కొనాలనుకుంటున్న ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో చూసేయండి..ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు..అమెజాన్ ముఖ్యంగా 8 వన్ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్ప్లస్ 12 (OnePlus 12), వన్ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4), వన్ప్లస్ 12 ఆర్ (OnePlus 12R), వన్ప్లస్ నార్డ్ 3(OnePlus Nord 3) వంటి ఫోన్లలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రెడ్మీ 13సీ (Redmi 13C), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), శామ్సంగ్ గెలాక్సీ ఎం 34 (Samsung Galaxy M34), షావోమీ 14 (Xiaomi 14), శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S23), ఐకూ జెడ్ 9 (iQOO Z9), గెలాక్సీ ఎస్ 24 (Galaxy S24), టెక్నో పోవా 6 ప్రో (Tecno Pova 6 Pro) వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్లను పొందే ఐఫోన్ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్లో యాపిల్ డివైజ్లు కూడా ఉంటాయని టీజర్ పేర్కొంది. -
కళ్ళముందే సరికొత్త ప్రపంచం.. మొదలైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ఈవెంట్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '2024 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' (MWC 2024) ఈవెంట్ ఈ రోజు ప్రారంభమైంది. స్పెయిన్లోని బార్సిలోనాలో ప్రారంభమైన MWC 2024 ఈవెంట్ ఈ రోజు నుంచి గురువారం (ఫిబ్రవరి 26 నుంచి 29) వరకు జరుగుతుంది. ఇందులో అనేక స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు స్మార్ట్ఫోన్లను, యాక్సెసరీలను, ఏఐ టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలను ప్రవేశపెట్టనున్నాయి. ఈ ఈవెంట్లో శాంసంగ్, షావోమీ, రియల్మీ, వివో, మోటొరోలా, లెనోవో, ఇన్ఫీనిక్స్, టెక్నో వంటి అనేక టెక్ కంపెనీలు తమ సరికొత్త స్మార్ట్ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి. ల్యాప్టాప్ల విషయానికి వస్తే.. ఇందులో హెచ్పీ, లెనోవో, డెల్, అసుస్ మొదలైన కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ఎక్కువగా ఏఐ బేస్డ్ మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పెరుగుతున్న ఏఐ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని టెక్ కంపెనీలు చాలా వరకు తమ ఉత్పత్తులలో కూడా ఏఐ ఫీచర్స్ అందించాలని సంకల్పించాయి. ఇదీ చదవండి: కోడింగ్ అవసరమే లేదు!.. ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు గత ఏడాది ఈ ఈవెంట్ సందర్శించడానికి ఏకంగా లక్షల మంది జనం వెళ్లినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఈవెంట్లో లాంచ్ కావడానికి దిగ్గజ కంపెనీల ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నాయి. 29వ తేదీ వరకు ఈ ఉత్పత్తులను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. -
లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్.. అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడు కొనేయండి!
మార్కెట్లోకి రకరకాల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైన సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే లాంచ్ అయినప్పుడు వాటి ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంతమంది వాటిని కొనలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కంపెనీలు కొన్ని నెలల తర్వాత ఆ ఫోన్ల ధరలను తగ్గిస్తుంటాయి. మోటరోలా రేజర్ 40 (Moto Razr 40), మోటరోలా రేజర్ 40 అల్ట్రా (Moto Razr 40 Ultra) ఫ్లిప్ ఫోన్లు గతేడాది జూన్లో విడుదలయ్యాయి. 2000ల ప్రారంభం నాటి ఐకానిక్ Motorola Razr ఫ్లిప్ ఫోన్లను పునరుద్ధరిస్తూ లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ వీటిని తీసుకొచ్చింది. ప్రస్తుతం వీటి ధరలను మోటరోలా భారీగా తగ్గించింది. అధిక ధరల కారణంగా అప్పుడు కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు. రూ.20,000 తగ్గింపు మోటరోలా భారత్లో తన మోటో రేజర్ 40, మోటో రేజర్ 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్లకు గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. మోటో రేజర్ 40 ధరను రూ. 15,000 తగ్గించింది. దీని అసలు ధర రూ. 59,999 కాగా ఇప్పడు రూ. 44,999కి తగ్గింది. అదేవిధంగా మోటో రేజర్ 40 అల్ట్రా ధరను ఏకంగా రూ. 20,000 తగ్గించింది. రూ. 89,999 ఉన్న ఈ ఫోన్ను రూ. 69,999కే కొనుక్కోవచ్చు. మోటరోలా అధికారిక వెబ్సైట్తోపాటు అమెజాన్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. మోటో రేజర్ 40 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 144 Hz రిఫ్రెష్ రేట్, 1080×2640 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.90-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 1.50-అంగుళాల సెకండరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ రంగులలో లభ్యం 4200 mAh బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మోటో రేజర్ 40 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 165 Hz రిఫ్రెష్ రేట్తో 6.9-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా రంగులలో లభ్యం వైర్లెస్, వైర్డు ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే 3800mAh బ్యాటరీ -
కొత్త సంవత్సరంలో వస్తున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే..
కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? పాత ఫోన్లు బోర్ కొట్టేశాయా? లేటెస్ట్ ఫీచర్లతో వచ్చే టాప్ బ్రాండ్ల సరికొత్త స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? మీలాంటి వారి కోసమే ఈ సమాచారం. షావోమీ, శాంసంగ్, వన్ప్లస్, వీవో వంటి టాప్ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు 2024 సంవత్సరం జనవరి నెలలో పలు మోడల్లను లాంచ్ చేస్తున్నాయి. ఆయా మోడల్ల స్మార్ట్ ఫోన్ల లాంచ్ తేదీలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు అందిస్తున్నాం.. వన్ప్లస్ 12 సిరీస్ (OnePlus 12 series) వన్ప్లస్ 12 (OnePlus 12), వన్ప్లస్ 12ఆర్ (OnePlus 12R)లను ఆ కంపెనీ భారత్లో జనవరి 23న రాత్రి 7.30 గంటలకు విడుదల చేయనుంది. చైనాలో లాంచ్ అయిన వేరియంట్ ప్రకారం, వన్ప్లస్ 12 5G 6.82-అంగుళాల క్వాడ్-HD+ LTPO OLED స్క్రీన్ను కలిగి ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్తో వస్తుంది. గరిష్టంగా 24GB ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించవచ్చు. కెమెరా పరంగా వన్ప్లస్ 12లో 50MP సోనీ LYT-808 ప్రైమరీ లెన్స్, 64MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి హాసెల్బ్లాడ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రావచ్చు. వన్ప్లస్ 12 5G 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్తో 5,400 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ (Xiaomi Redmi Note 13 series) షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ను జనవరి 4న భారత్లో లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్లో రెడ్మీ నోట్ 13 (Redmi Note 13), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ (Redmi Note 13 Pro+) మోడల్లు ఉన్నాయి. ఇవి ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చాయి. భారత్లో కూడా అవే స్పెసిఫికేషన్లను కలిగి ఉండే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా 6.67-అంగుళాల AMOLED డిస్ప్లే, నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 SoC, ప్రో మోడల్ స్నాప్డ్రాగన్ 7s Gen 2 SoC, ప్రోప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా SoCతో రావచ్చు. కెమెరా విషయానికొస్తే, నోట్ 13 మోడల్ 100MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్తో వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రో మోడల్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 200MP శాంసంగ్ ISOCELL HP3 ప్రైమరీ సెన్సార్తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉండే అవకాశం ఉంది. 16MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. ఈ సిరీస్ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. వివో ఎక్స్100 సిరీస్ (Vivo X100 series) ఇప్పటికే చైనాలో విడుదలైన వివో ఎక్స్100 సిరీస్ త్వరలో భారత్లో లాంచ్ కానుంది. ఈ సిరీస్లో వివో ఎక్స్100 (Vivo X100), వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro) మోడల్స్ ఉండే అవకాశం ఉంది. చైనాలో లంచ్ అయిన వేరియంట్ల ప్రకారం, ఇవి ఆండ్రాయిడ్ 14 ఆధారిత OriginOS 4పై రన్ అయ్యే అవకాశం ఉంది. 6.78 అంగుళాల 8 LTPO AMOLED డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్తో పాటు వివో V3 చిప్తో వస్తాయని భావిస్తున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే రెండు 50MP ప్రైమరీ సెన్సార్తో Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 mAh బ్యాటరీ రావచ్చు. అయితే ప్రో మోడల్ 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్కు మద్దతు ఇచ్చే 5,400 mAh బ్యాటరీతో రావచ్చు. వీటితో పాటు 2024 జనవరిలో రానున్న మరికొన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే వాటి లాంచింగ్ తేదీలను ఆయా కంపెనీలు కన్ఫమ్ చేయలేదు. శాంసంగ్ గెలాక్సి ఎస్24 (Samsung Galaxy S24) సిరీస్, ఏసస్ రోగ్ ఫోన్ 8 (Asus ROG Phone 8), ఐకూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) మోడల్స్ వచ్చే నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. -
పలుకే బంగారమాయెనా!!..కోవిడ్ తర్వాతే అధికం..
వయసు పలికే పదాలు మొదటి సంవత్సరం దాదాపు 10 పదాలు రెండో సంవత్సరం 50 నుంచి 60 పదాలు మూడో సంవత్సరం కనీసం 150 పదాలు.. ఆ పైన కెనడాకు చెందిన ఓ సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. 6 నెలల నుంచి రెండేళ్లలోపున్న 900 మంది చిన్నారులను పరీక్షించింది. 20 శాతం మంది చిన్నారులు ప్రతిరోజూ సగటున 28 నిమిషాల సేపు స్మార్ట్ఫోన్లను చూస్తున్నట్లు తేలింది. 30 నిమిషాల డిజిటల్ స్క్రీనింగ్ వల్ల చిన్నారులకు ‘స్పీచ్ డిలే’ రిస్క్ 49 శాతం పెరుగుతుందని వెల్లడయ్యింది. ఏం చేయాలి? ముందుగా చిన్నారుల చెంతకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు దరిచేరకుండా చూసుకోవాలి.పిల్లలకు అసలు స్మార్ట్ఫోన్లు ఇవ్వవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచించింది. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. వారి నవ్వులకు, అరుపులకు ప్రతిస్పందించాలి. చిన్నారులను ముఖానికి దగ్గరగా తీసుకొని మాటలో, పాటలో, కథలో చెబుతూ..మీకు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలు తాగించేటప్పుడు, ఆహారం తినిపించేటప్పుడు.. చేసే పని గురించి వారికి వివరిస్తూ ఉండాలి. ఎలాంటి శబ్ధాలు చేస్తుంటాయి? తదితరాలన్నీ అడుగుతూ, అనుకరిస్తుండాలి. పిల్లలు ఏ వస్తువు చూస్తుంటే.. దాని గురించి వివరిస్తుండాలి. తద్వారా పిల్లలు కూడా మిమ్మల్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తూ.. క్రమంగా మాట్లాడుతారు. విజయవాడకు చెందిన రాజేశ్, ఉష దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడిని బుజ్జగించేందుకు..పుట్టిన ఏడాది గడిచేసరికల్లా స్మార్ట్ఫోన్లో వీడియోలు చూపించడం మొదలుపెట్టారు. ఏడుపు ఆపాలన్నా.. భోజనం చేయాలన్నా.. ఫోన్లోని వీడియోలు చూడాల్సిందే. ఇలా.. ఆ చిన్నారి క్రమంగా స్మార్ట్ఫోన్కు బానిస అవ్వగా.. ఆ తల్లిదండ్రులు నాలుగేళ్లయినా ‘అమ్మా, నాన్న’ అనే పిలుపులకు నోచుకోలేక పోయారు. చివరకు స్పీచ్ థెరపిస్ట్లను ఆశ్రయించి.. పిల్లలకు చికిత్స అందించాల్సి వచి్చంది. – గుండ్ర వెంకటేశ్, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒకప్పుడు చిన్న పిల్లలు ఏడిస్తే.. వారిని లాలించేందుకు తల్లిదండ్రులు జోలపాటలు పాడేవాళ్లు. ఎత్తుకొని ఆరుబయట తిప్పుతూ చందమామను చూపించి కబుర్లు చెప్పేవాళ్లు. అమ్మ, నాన్న.. అనే పదాలను చిన్నారుల నోటి వెంట పలికించడానికి ప్రయత్నించేవాళ్లు. వారు ఆ పదాలను పలకగానే విని మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు సిరులొలికించే ‘చిన్ని’ నవ్వులు.. చిన్నబోతున్నాయి. చీకటి ఎరుగని ‘బాబు’ కన్నులు.. క్రమంగా మసకబారిపోతున్నాయి. చిట్టిపొట్టి పలుకుల మాటలు మాయమైపోతున్నాయి. మొత్తంగా స్మార్ట్ఫోన్లలో చిక్కుకొని ‘బాల్యం’ విలవిల్లాడిపోతోంది. చిన్నారుల నోటి వెంట వచ్చే ‘అమ్మ, నాన్న..’ అనే పిలుపులతో కొందరు తల్లిదండ్రులు పులకించిపోతుంటే.. మరికొందరు తల్లిదండ్రులు ఆ ‘పలుకుల’ కోసం నెలలు, సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. పునాది పటిష్టంగా ఉంటేనే.. ప్రతి ఒక్కరి జీవితంలో ‘మాట్లాడటం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్నారులు ఎదుగుతున్నకొద్దీ మెల్లగా మాటలు నేర్చుకుంటూ ఉంటారు. మనం ఎలా మాట్లాడిస్తే అలా అనుకరిస్తూ ముద్దుముద్దుగా ఆ పదాలను పలుకుతుంటారు. ముఖ్యంగా చిన్నారి పుట్టిన మొదటి రెండేళ్లు లాంగ్వేజ్ డెవలప్మెంట్కు చాలా కీలకం. అప్పుడు సరైన పునాది పడితేనే.. మూడో ఏడాదికల్లా మంచిగా మాట్లాడగలుగుతారు. ‘స్మార్ట్’గా చిక్కుకుపోయారు.. సాధారణంగా చిన్నారులు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. మొదటి రెండేళ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. వారు తమ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతూ ఉంటే.. వారి పెదాల కదలికను చూస్తూ అనుకరిస్తుంటారు. కానీ చుట్టుపక్కల అలాంటి వాతావరణం లేకపోతే వారిలో బుద్ధి వికాసం లోపిస్తుంది. కొందరు తల్లిదండ్రులు వారి పనుల ఒత్తిడి వల్ల తమకు తెలియకుండానే పిల్లలకు సెల్ఫోన్లను అలవాటు చేస్తున్నారు. పిల్లల ఏడుపును ఆపించడానికో, భోజనం తినిపించడానికో, నిద్రపుచ్చేందుకో ఫోన్లలో ఆ సమయానికి ఏది దొరికితే ఆ వీడియో చూపిస్తున్నారు. క్రమంగా అది అలవాటుగా మారి.. పిల్లలు బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోతున్నారు. వాటిలోనే లీనమైపోయి.. తల్లిదండ్రుల పిలుపులకు సరిగ్గా స్పందించలేకపోతున్నారు. తమ భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయలేకపోతున్నారు. మరికొందరైతే గతంలో తాము నేర్చుకున్న పదాలను కూడా మర్చిపోయారు. ఫోన్లలో చూపించే కార్టూన్లు, గేమ్స్ వల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందులోని శబ్ధాలు, మాటలను వింటారు. కానీ.. వాటికి, నిజజీవితానికి చాలా తేడా ఉండటంతో ఆ శబ్ధాలు, మాటలను అనుకరించలేకపోతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రుల మాటలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాతే అధికం చిన్నారుల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య కోవిడ్ తర్వాత అధికమైందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగిందని పేర్కొంటున్నారు. లాక్డౌన్లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో అనుబంధాలు పెరగాలి. కానీ, ఆ సమయంలో చుట్టుపక్కలవారికి, బంధువులకు దూరంగా ఉండటం వల్ల అందరూ స్మార్ట్ఫోన్లకు అంకితమైపోయారు. చిన్నారులను లాలించడానికి కూడా ఫోన్లను ఉపయోగించారు. దీనివల్ల 9 నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న కొందరు చిన్నారులు తమ కీలక సమయాన్ని కోల్పోయారు. వేరే పిల్లలతో కలవకపోవడం, తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య అధికమైందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్కు ముందు వారానికి ఐదు కేసులు వస్తే.. కోవిడ్ తర్వాత 20 వరకు కేసులు వస్తున్నాయని పిల్లల వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం చిన్నారులు ఫోన్కు అడిక్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నారుల వద్ద ఫోన్ పెట్టేసి.. ఒంటరిగా వదిలేయవద్దు. అలాగే తల్లిదండ్రులు కూడా సెల్ఫోన్ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత ఎక్కువ సేపు పిల్లలతో గడుపుతూ.. వారి వైపే చూస్తూ కబుర్లు చెప్పాలి. పిల్లలను ఆలోచింపజేసేలా కుటుంబసభ్యులు, వస్తువులు, జంతువుల గురించి వర్ణిస్తూ మాట్లాడాలి. తద్వారా పిల్లలు సులభంగా మాటలు నేర్చుకునే అవకాశం ఉంది. – డాక్టర్ ఇండ్ల విశాల్రెడ్డి, మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ -
48 గంటల్లో 9.5 కోట్ల మంది విజిటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్ను సందర్శించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ఫోన్లు, టీవీలు) రంజిత్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాలవారీగా హైదరాబాద్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్ కనిపించగా, 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, పెద్ద స్క్రీన్ టీవీలవైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని గురువారమిక్కడ ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించిన అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరీనా (ఏఎక్స్ఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్ బాబు వివరించారు. -
‘న్యూస్క్లిక్’లో పోలీసుల సోదాలు
న్యూఢిల్లీ: చైనా అనుకూల సమాచారాన్ని భారత్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీ స్థాయిలో నగదును స్వీకరించిందన్న ఆరోపణలపై ఆన్లైన్ న్యూస్పోర్టల్ ‘న్యూస్క్లిక్’పై ఢిల్లీ పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సంస్థకు సంబంధించిన ఆఫీసులతోపాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లలోనూ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు. న్యూస్క్లిక్ వ్యవస్థాపకులు, ఎడిటర్–ఇన్–చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థా, హెచ్ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని మొదట ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత ఇద్దరినీ అరెస్ట్చేశారు. 100 ప్రాంతాల్లో ఏకంగా 500 మంది ఢిల్లీ పోలీసులు ఒకేసమయంలో దాడిచేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ముంబైలలో ఈ సోదాలు జరిగాయి. సోదాలు చేయాల్సిన వ్యక్తులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చెందిన ఢిల్లీలోని నివాసంలోనూ సోదాలు జరిగాయి. ఆయనకు సహాయకునిగా ఉండే శ్రీనారాయణ్ కుమారుడు సుమిత్ ఇదే న్యూస్క్లిక్లో పనిచేస్తుండటంతో ఏచూరీ ఇంట్లోనూ పోలీసు తనిఖీలు కొనసాగాయి. దీంతో ఏచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని సంస్థ ముఖ్య కార్యాలయంలోని వారిని ప్రశ్నించాక ఆ ఆఫీస్కు పోలీసులు సీలువేశారు. విదేశీ ప్రయాణాలు, పౌరసత్వ(సవరణ) చట్టంపై షాహీన్బాగ్ వద్ద చెలరేగిన ఆందోళనలు, రైతుల ఉద్యమాలు తదితరాలపై జర్నలిస్టులను 25 అంశాలపై ప్రశ్నించామని పోలీసులు వెల్లడించారు. న్యూస్క్లిక్కు నిధులు ఎలా వస్తున్నాయనే కోణంలో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యూస్క్లిక్ కార్యాలయాల్లో సోదాలు చేయడం తెల్సిందే. ఈ విషయంలో ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారంతోనే మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, నేరమయ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా కేసు నమోదుచేసి దాడులు చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, హార్డ్ డిస్్కలు, ఫ్లాష్ డ్రైవ్లను స్వాదీనం చేసుకున్నారు. ఆగస్ట్ 17న అత్యంత కఠిన ఉగ్రవ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక )చట్టంకింద నమోదైన కేసు ఆధారంగానే కొత్తను నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేశారు. చైనాతో సంబంధం ఉన్న కొన్ని సంస్థల నుంచి గత మూడేళ్లకాలంలో రూ.38.05 కోట్ల నగదు న్యూస్క్లిక్ పోర్టల్కు ముట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నగదులో కొంత మొత్తం పాత్రికేయులు గౌతమ్ నవ్లఖా, తీస్తా సీతల్వాడ్లకు చేరినట్లు ఆరోపిస్తోంది. విపక్షాల తీవ్ర విమర్శలు మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ సహా పలు విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తూర్పారబట్టాయి. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాసహా పలు మీడియా సంఘాలు పోలీసు దాడులను ఖండించాయి. మోదీ సర్కార్ను విమర్శించే పాత్రికేయులపై ప్రభుత్వం కత్తిగట్టిందని ఆక్షేపించాయి. -
ఈ నెలలో విడుదలయ్యే కొత్త స్మార్ట్ఫోన్స్ - వివరాలు
భారతదేశంలో ప్రస్తుతం పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. దీంతో కొత్త వాహనాలు, కొత్త మొబైల్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కావున ఈ కథనంలో ఈ నెల (అక్టోబర్) దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త స్మార్ట్ఫోన్స్ గురించి తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అక్టోబర్ 04 న విడుదలకానున్నట్లు సమాచారం. ఇది పిక్సెల్ 8 & పిక్సెల్ 8 ప్రో అనే రెండు మోడల్స్లో విడుదలకానున్నట్లు సమాచారం. పిక్సెల్ 8లో 6.2 ఇంచెస్ ఎఫ్హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే, ప్రో మోడల్ 6.7 ఇంచెస్ LTPO డిస్ప్లే పొందనున్నట్లు సమాచారం. పిక్సెల్ 8 లో 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 'ప్రో' లో 50 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ రియర్ ట్రిపుల్ కెమెరా ఉండవచ్చు. వీటి ధరలు వరుసగా రూ. 58170 & రూ. 74814 వరకు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. వివో29 సిరీస్ వివో వి29 సిరీస్ కూడా ఈ నెల 4న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది కూడా వీ29, వీ29 ప్రో అనే రెండు వేరియంట్లలో విడుదలకానుంది. వీ29 లో 120 Hz రేటుతో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే ఉండవచ్చని సమాచారం. రెండు వేరియంట్లు మంచి కెమెరా సెటప్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నాయి. రెడ్మీ నోట్ 13 5జీ చైనాలో విడుదలైన రెడ్మీ నోట్ 13 5జీ అక్టోబర్ చివరి నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది 6.6 ఇంచెస్ ఎఫ్హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే పొందుతుంది. ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ధరలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. వన్ప్లస్ ఓపెన్ అక్టోబర్ నెలలో విడుదలయ్యే కొత్త స్మార్ట్ఫోన్లలో వన్ప్లస్ ఓపెన్ ఒకటి. ఈ మొబైల్ ఈ నెల మధ్యలో లేదా చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 7.8 ఇంచెస్ 2కే అమోల్డ్ స్క్రీన్, 6.3 ఇంచెస్ అమోల్డ్ కవర్ డిస్ప్లే ఉంటుంది. ధర & వివరాలు తెలియాల్సి ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఈ నెల మొదటి వారంలో ఈ స్మార్ట్ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ ఎఫ్హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉండనుంది. అంతే కాకుండా స్నాప్డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 లేదా ఎక్సీనోస్ 2200 చిప్ సెట్ ఉండనున్నట్లు సమాచారం. కెమరా సెటప్ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ఫోన్స్ - రూ.10 వేలు కంటే తక్కువే!
ఇప్పటికే పండుగ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో ఓ కొత్త మొబైల్ తక్కువ ధరలో కొనుగోలు చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారికోసం రూ. 10వేలు లోపు లభించే ఉత్తమ స్మార్ట్ఫోన్లను ఈ కథనంలో చూసేద్దాం. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 ఇన్ఫినిక్స్ స్మార్ట్ 7 రూ. 10 కంటే ధరలో లభించే స్మార్ట్ఫోన్. ఇది 6.6-అంగుళాల HD+ డిస్ప్లే కలిగి, 13 మెగా ఫిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ మొబైల్ MediaTek Helio A20 ప్రాసెసర్తో పనిచేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ 12 మన జాబితాలో తక్కువ ధరకు లభ్యమయ్యే స్మార్ట్ఫోన్ల రెడ్మి 12 ఒకటి. ఇందులో 50 మెగా పిక్సెల్ కెమెరా, పెద్ద సెన్సార్, అధునాతన పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. 2022 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ మొబైల్ MediaTek Helio G85 ఆక్టా-కోర్ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇదీ చదవండి: డ్రైవర్కు రూ.9000 కోట్లు ట్రాన్స్ఫర్ - బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా శాంసంగ్ గేలక్సీ ఎమ్13 బ్యాంక్ ఆఫర్లతో పనిలేకుండానే తక్కువ ధరకు మొబైల్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది. అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ధృడమైన ప్లాస్టిక్ బాడీ మరియు ట్రిపుల్-కెమెరా సెటప్, ఎక్సినోస్ ప్రాసెసర్ పొందుతుంది. రియల్మి Narzo 50i రియల్మీ Narzo 50i మంచి కలర్ ఆప్షన్స్లో లభించే బెస్ట్ మొబైల్. ఇది Unisoc T612 ప్రాసెసర్ కలిగి 10W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమరా సిస్టం కూడా బాగానే ఉంటుంది. ఈ మొబైల్ ధర కూడా రూ. 10,000 కంటే తక్కువ. -
ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్మీకూ వచ్చిందా?
Emergency Alert -Severe: స్మార్ట్ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ మరోసారి మొబైల్ వినియోగదారులను గందరగోళంలో పడేసింది. గతంలో మాదిరిగి దేశవ్యాప్తంగా చాలా మంది యూజర్లకు ప్లాష్ మెసేజ్ఒకటి వచ్చింది. ఫ్లాష్ మెసేజ్తోపాటు పాటు బిగ్గరగా బీప్ సౌండ్ కూడా వచ్చింది. అయితే ఈ అత్యవసర సందేశానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా ఇండియాలో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను మళ్లీ పరీక్షించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు(సెప్టెంబరు 21) బీప్ సౌండ్తోపాటు మెసేజ్లు వచ్చాయి. అలాగే ఆందోళన వద్దు అన్న మెసేజ్లు కూడా స్మార్ట్ఫోన్ యూజర్లకు వచ్చాయి. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ సెండ్ చేసిన టెస్టింగ్ మెసేజ్ ఇది. అలర్ట్ టెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగానే ఈ మెసేజ్ పంపినట్లు తెలిపింది. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలో పరీక్షిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో మెసేజ్ వచ్చింది. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) మొబైల్ ఆపరేటర్లు , సెల్ ప్రసార వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాల సామర్థ్యం , ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటామని టెలి కమ్యూ నికేషన్ విభాగం సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది.భూకంపాలు, సునామీ, ఆకస్మిక వరదలు వంటి విపత్తుల కోసం మరింత సన్నద్ధంగా ఉండటానికి ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పనిచేస్తోంది. కాగా జూలై 20,ఆగస్టు 17న కూడా ఫోన్ వినియోగదారులకు ఇలాంటి టెస్ట్ మెసేజ్లు వచ్చాయి. -
పాడైపోయిన మొబైల్ ఫోన్లు,ల్యాప్ట్యాప్లు ఉన్నాయా? అయితే ఇది మీ కోసమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ భారత్లో తొలిసారిగా ‘మిషన్ ఈ–వేస్ట్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశుభ్ర వాతావరణాన్ని, జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఈ–వేస్ట్ను సేకరించి, రీసైక్లింగ్ చేపడతారు. ఇందుకోసం కంపెనీ స్టోర్లలో బిన్స్ను ఏర్పాటు చేస్తామని సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై.గురు తెలిపారు. పాడైన, వినియోగించని మొబైల్ ఫోన్లు, చార్జర్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ను సెలెక్ట్ స్టోర్లకు తీసుకువస్తే చాలు. రూ.10,000 వరకు డిస్కౌంట్ కూపన్ అందుకోవచ్చు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల ఈ–వేస్ట్ పోగవుతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్గా మారిందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో ఈ–వేస్ట్ నిర్వహణను తమ ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. మొత్తం పరిశ్రమకు మిషన్ ఈ–వేస్ట్ ప్రేరణగా నిలుస్తుందని సెలెక్ట్ ఈడీ మురళి రేతినేని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
ఇప్పటివరకూ స్మార్ట్ఫోన్లు.. ఇక ఎలక్ట్రిక్ టూవీలర్లు!
దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. వీటిలో అత్యధికంగా టూవీలర్లే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోని పలు కొత్త కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. దేశీయ స్మార్ట్ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ (Micromax) కొత్త వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. ఎలక్ట్రిక్ టీవీలర్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల విభాగంలో ఇప్పటికే ఓలా, ఏథర్ వంటి కంపెనీలు సత్తా చాటుతున్నాయి. వీటికి తోడు హీరో, బజాజ్, టీవీఎస్ వంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో మైక్రోమ్యాక్స్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, మైక్రోమ్యాక్స్లో కొన్ని అస్థిరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపులు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్తో సహా కీలక ఎగ్జిక్యూటివ్లు వైదొలగడం వంటి కారణాల నేపథ్యంలో కంపెనీ ఈవీ తయారీ రంగంలో అన్వేషణకు కారణమని చెప్పవచ్చు. 2021 ఏప్రిల్లో రాహుల్ శర్మ రాజీనామా తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన సహ వ్యవస్థాపకులలో ఒకరైన వికాస్ జైన్ కూడా కంపెనీ నుంచి వైదొలిగారు. గత ఫిబ్రవరిలో కంపెనీ వ్యవస్థాపకులు రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్లు కలిసి మైక్రోమ్యాక్స్ మొబిలిటీ పేరుతో కొత్త సంస్థను స్థాపించారు. ఈ కొత్త వెంచర్ మొదట ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారిస్తుందని తెలిసింది. ఇందు కోసం వ్యూహాత్మక ప్రయత్నాల్లో భాగంగా గురుగ్రామ్లో కార్యాలయ పునరుద్ధరణను చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మైక్రోమ్యాక్స్ 2014 ఆగస్టులో మార్కెట్ లీడర్ శాంసంగ్ను అధిగమించి భారతదేశపు ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీగా అగ్రస్థానాన్ని పొందింది. ఆ తర్వాత షావోమీ, ఒప్పో, వివో వంటి చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ల ఆవిర్భావంతో ప్రభను కోల్పోయింది. వాటి పోటీ ధరల వ్యూహాలను తట్టుకోలేక కిందకు జారిపోయింది. -
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్, ఆఫర్లను అందిస్తోంది అమెజాన్. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే ఈ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా షావోమీ, ఒప్పో, శాంసంగ్ వంటి బ్రాండ్ల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకు ఇప్పుడే కొనుక్కోవచ్చు. ప్రైమ్ సబ్స్క్రైబర్లు కానివారు మాత్రం అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➤ మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై అందుబాటులోకి వచ్చిన బెస్ట్ డీల్స్లో కొన్నింటి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.. ఐఫోన్ 14 (iPhone 14) అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 విక్రయానికి ముందు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా ఐఫోన్ 14 రూ. 67,499లకే అందుబాటులోకి వచ్చింది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్తో కూడిన ఈ ఫోన్ కార్ క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ గత ఏడాది భారత్లో రూ. 79,900 ధరతో లాంచ్ అయింది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎంపికచేసిన మోడల్స్కు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ షావోమీ 12 ప్రో 5జీ (Xiaomi 12 Pro 5G) Snapdragon 8 Gen 1 చిప్సెట్తో వచ్చే షావోమీ 12 ప్రో 5జీ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో భాగంగా తగ్గింపు ధర రూ. 41,999లకే లభిస్తోంది. లాంచింగ్ సమయంలో దీని బేస్ మోడల్ ధర రూ.62,999 ఉండగా తర్వాత రూ.52,999లకు తగ్గింది. కొనుగోలుకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ. 1,250 తగ్గింపు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ.36,000 డిస్కౌంట్ లభించే ఆస్కారం ఉంది. ఐకూ 9 5జీ (iQoo 9 5G) ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉంటే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ సమయంలో ఐకూ 9 5జీ స్మార్ట్ఫోన్ని రూ.29,990లకే కొనుక్కోవచ్చు. భారతదేశంలో ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 42,990. ఈ హ్యాండ్సెట్ 5nm స్నాప్డ్రాగన్ 888+ చిప్సెట్పై పనిచేస్తుంది. 120 వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. మీ ప్రస్తుత ఫోన్ని ఎక్సేంజ్కు ఇస్తే రూ. 26,650 వరకు తగ్గింపు లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ (Samsung Galaxy M33 5G) 6.6-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, Exynos 1280 చిప్సెట్, 5జీ కనెక్టివిటీతో వచ్చే ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ లాంచింగ్ ధర రూ.18,999. ఇది ఇప్పుడు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా రూ.16,999లకే అందుబాటులో ఉంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ.1,000. పాత హ్యాండ్సెట్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.16,100 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. రెడ్మీ 12సీ (Redmi 12C) MediaTek Helio G85 ప్రాసెసర్, 6.72-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్తో వచ్చే ఎంట్రీ లెవల్ రెడ్మీ 12సీ హ్యాండ్సెట్ని ప్రైమ్ ఎర్లీ డీల్స్ సమయంలో రూ.7,699లకే కొనుగోలు చేయవచ్చు. అయితే దీని అసలు లాంచ్ ధర రూ. రూ.8,999. పాత హ్యాండ్సెట్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.7,300 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. -
తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కావాలా? ఎంచుకో ఓ మంచి ఆప్షన్..
Best Mobile Phones Under 15,000: భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త ఉత్పత్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందులో స్మార్ట్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఖరీదైనవి కాగా.. మరికొన్ని బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. ఆగష్టు నెలలో రూ. 15,000 కంటే తక్కువ ధర కొనుగోలుచేయదగిన టాప్ 5జీ మొబైల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రెడ్మీ 12 5జీ (Redmi 12 5G).. ఆధునిక మార్కెట్లో రెడ్మీ మొబైల్స్కి డిమాండ్ భారీగా ఉంది. దీనికి కారణం తక్కువ ధర వద్ద వినియోగదారునికి కావలసిన ఫీచర్స్ లభించడమే. మన జాబితాలో బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో రెడ్మీ 12 5జీ ఒకటి. దీని ధర రూ. 10,999 మాత్రమే. ఇది స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ కలిగి మంచి కెమెరా సెటప్ కూడా పొందుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ (Samsung Galaxy M14 5G).. శాంసంగ్ కంపెనీకి చెందిన 'గెలాక్సీ ఎమ్14 5జీ' రూ. 15,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్. రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా గేమింగ్ వంటి వాటికి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉండే ఈ మొబైల్ 93Hz డిస్ప్లే పొందుతుంది. మంచి డిజైన్, అద్భుతమైన బ్యాటరీ పర్ఫామెన్స్ కలిగి వినియోగదారులకు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! రియల్మీ నర్జో ఎన్53 5జీ (Realme Narzo N53).. చూడటానికి ఐఫోన్ మాదిరిగా కనిపించడమే కాకుండా వినియోగదారులను ఒక్క చూపుతోనే ఆకట్టుకునే ఈ 'రియల్మీ నర్జో ఎన్53 5జీ' మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్ఫోన్. ఇది ప్రత్యేకంగా గేమింగ్ ఫోన్ కానప్పటికీ.. గేమ్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ప్రింట్ రెసిస్టెంట్ బ్యాక్ ప్యానెల్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇదీ చదవండి: ఎక్స్ బాయ్ ఫ్రెండ్పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి.. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G).. మన జాబితాలో తక్కువ ధరలో లభించే మరో మొబైల్.. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ. ఇది ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్ కలిగి, మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంటుంది.అంతే కాకుండా ఇందులో 50 మెగా పిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా ఉంటుంది. -
స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో భారత్ హవా.. ఎక్కువ ఆ దేశానికే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి యూఎస్కు జరుగుతున్న స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో కొత్త రికార్డు నమోదైంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–మే నెలలో దేశీయంగా తయారైన రూ.6,679 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు యూఎస్కు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.758 కోట్లుగా ఉంది. భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో విలువ పరంగా యూఎస్ మూడవ స్థానంలో ఉంది. ఇక మొత్తం ఎగుమతులు ఏప్రిల్–మే నెలలో అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 158 శాతం అధికమై రూ.19,975 కోట్లు నమోదయ్యాయి. యూఏఈకి రూ.3,983 కోట్లు, నెదర్లాండ్స్కు రూ.1,685 కోట్లు, యూకే మార్కెట్కు రూ.1,244 కోట్ల విలువైన స్మార్ట్ఫోన్లు సరఫరా అయ్యాయి. ఇటలీ, చెక్ రిపబ్లిక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2022–23లో భారత్ నుంచి వివిధ దేశాలకు చేరిన స్మార్ట్ఫోన్ల విలువ రూ.90,009 కోట్లు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ప్రకటించడం, యుఎస్కు చెందిన ఆపిల్ దేశీయంగా తయారీలోకి ప్రవేశించిన తర్వాత స్మార్ట్ఫోన్లకు ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా భారత్ అవతరిస్తోంది. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్ వచ్చేస్తోంది: ఫోన్లు, గృహోపకరణాలపై ఆఫర్లే ఆఫర్లు
Flipkart Big Saving Days Sale: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసేల్ను ప్రకటించింది. ఇండిపెండెన్స్డే సేల్కంటే ముందు ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ చేయ నుంది. ఆగస్టు 4 నుంచి 9వ తేదీవరకు నిర్వహించే ఈసేల్లో స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్పై తగ్గింపు ధరలను అందించనుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేందు భారీ తగ్గింపులను ప్రకటించనుంది.డిస్కౌంట్లపై అదనపు వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్ తదితర టాప్ దిగ్గజ కంపెనీల స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్ను అందించనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 11 తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం,ఇవి రూ. 68,999 రూ. 41,999కి జాబితా చేయగా, జనాదరణ పొందిన 5జీ స్మార్ట్ఫోన్లపై గణనీయమైన ధరల తగ్గింపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే సేల్లో ఎక్కువ తగ్గింపులను అందిస్తుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) అదేవిధంగా పిక్సెల్ 6ఏ, శాసంగ్ జెడ్ ఫ్లిప్ 3, గూగుల్, నథింగ్, పోకో, ఒప్పో, వివో, రియల్మీ వంటి అనేక ఇతర స్మార్ట్ఫోన్లు కూడా ధర తగ్గింపులను అందుకోనున్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కస్టమర్లు ఐదు శాతం క్యాష్బ్యాక్ను ఆశించవచ్చు.ఐసీఐసీఐ, కోటక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐపై గరిష్టంగా 4,500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా?) అలాగే ఫ్యాషన్తోపాటు టీవీలు, ఉపకరణాలు, ఆహారం, పానీయాలు, క్రీడలు & ఫిట్నెస్, కారు & బైక్ ఉపకరణాలు, బేబీ కేర్ ప్రొడక్ట్స్ తదితరాలపై 60 శాతం వరకు భారీ తగ్గింపు పొందవచ్చు . ఇంకా బైక్లు & స్కూటర్లు (ఎలక్ట్రిక్ స్కూటర్లతో సహా) రూ.56,500 నుండి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. టీవీలు, ఇతర గృహోపకరణాలపై 75 శాతం డిస్కౌంట్. స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. -
కొత్త స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది. వివో వీ29 సిరీస్ (Vivo V29 Series) వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రియల్మీ జీటీ 5 (Realme GT 5) 2023 ఆగష్టు నెలలో రియల్మీ తన జీటీ 5 స్మార్ట్ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్కే వందల కోట్లు.. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఇన్ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ రెడ్మీ 12 5జీ (Redmi 12 5G) రెడ్మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి. -
అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది..ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?
Amazon Great Freedom Festival sale 2023 ఆన్లైన్ దిగ్గజం మరోసారి ఫెస్టివల్ సేల్ను షురూచేసింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5వ తేదీన ప్రారంభం కానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా అద్భుతమైన సేల్ ఈవెంట్కు సిద్ధమవుతోంది. వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, తదితర పలు విభాగాల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించనున్నాయి. దీనికి తోడు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రతీ ఆగస్ట్ నెలలో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ ప్రకటించే అమెజాన్ ఈ ఏడాది గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ తేదీలను శుక్రవారం ప్రకటించింది. ఈ సేల్ ఆగస్ట్ 5 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. ప్రైమ్ మెంబర్స్ కు ఒక రోజు ముందే ఈ సేల్ ప్రారంభమవుతుంది అనేది తెలిసిన సంగతే. కొనుగోళ్లపై స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్తోపాటు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్, వీటన్నింటికి తోడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందుబాటులోఉంటాయి. ముఖ్యంగా ఈ సేల్ లో శాంసంగ్ వన్ ప్లస్, రియల్ మి, ఎంఐ తదితర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై 40 శాతానికి మించి డిస్కౌంట్ లభించనుంది. (పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా పైపైకే) వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలు కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ధరల లభ్యం. సోనీ ప్లేస్టేషన్ 5 ఇతర గేమింగ్ ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు. గేమ్లు కూడా గరిష్టంగా 80 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. ల్యాప్టాప్లు , వైర్లెస్ ఇయర్బడ్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. టీజర్ పేజీ ల్యాప్టాప్లు, ఇయర్ఫోన్లు, స్మార్ట్వాచ్లు మరియు అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అంతేకాకుండా యాపిల్, తదితర కంపెనీల టాబ్లెట్లు గరిష్టంగా 50 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. -
ఇండియాలో రూ. 15 వేల లోపు లభించే 5జీ స్మార్ట్ ఫోన్లు
-
మంచి స్మార్ట్ఫోన్ కొనాలంటే ఇవి బెస్ట్ ఆప్షన్ - ధరలు ఎలా ఉన్నాయంటే?
Best Smartphones Under 35000: దేశీయ విఫణిలో రోజురోజుకి కొత్త స్మార్ట్ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే చాలా మంది కొంత తక్కువ ధర కలిగిన బెస్ట్ అండ్ లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. భారతీయ మార్కెట్లో రూ. 35,000 కంటే తక్కువ ధర వద్ద మొబైల్ కొనాలని చూస్తున్న వారు ఈ బెస్ట్ స్మార్ట్ఫోన్స్ చూడవచ్చు. ఇందులో రియల్మీ, మోటోరోలా, పోకో బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రియల్మీ 11 ప్రో ప్లస్.. ప్రస్తుతం చాలామంది కొనుగోలుదారులు రియల్మీ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మన జాబితాలో రూ. 35,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్స్ జాబితాలో 'రియల్మీ 11 ప్రో ప్లస్' (Realme 11 Pro+) ఒకటి. దీని ధర రూ. 27,999 మాత్రమే. ఇందులో 200 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ వంటివాటితో పాటు ముందు వైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫీచర్స్ చాలా ఆధునికంగా ఉంటాయి. మోటోరోలా ఎడ్జ్ 40.. మన జాబితాలో రెండవ స్మార్ట్ఫోన్ 'మోటోరోలా ఎడ్జ్ 40' (Motorola Edge 40). దీని ధర రూ. 29,999. ఈ మొబైల్ 144 Hz రిఫ్రెష్ రేటుతో 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 13 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ సెంటర్డ్ పంచ్-హోల్ కెమెరా ఉంది. 4400 mAh బ్యాటరీ కలిగిన ఈ మొబైల్ 68 వాట్స్ వైర్డ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. వన్ప్లస్ నార్డ్ 3.. రూ. 33,999 వద్ద లభించే 'వన్ప్లస్ నార్డ్ 3' (OnePlus Nord 3) స్మార్ట్ఫోన్ ఆధునిక ఫీచర్స్ అయిన సెంటర్ అలైన్డ్ పంచ్ హోల్, ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ స్కానర్ అండ్ అలర్ట్ స్లైడర్ ఉన్నాయి. 120 Hz రేటుతో 6.74 ఇంచెస్ ఫుల్లీ హెచ్డీ డిస్ప్లే కలిగి వెనుక వైపు 50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో సెన్సర్లను పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 80 వాట్స్ పాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: రైతుగా మారిన బ్యాంక్ ఎంప్లాయ్.. వేలమందికి ఉపాధి - రూ. కోట్లలో టర్నోవర్!) పోకో ఎఫ్5.. మన జాబితాలో రూ. 29,999 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్ 'పోకో ఎఫ్5' (Poco F5). ఇది 120 Hz 6.67 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సర్లతో పాటు 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా పొందుతుంది. డిజైన్ & ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్లో ఎక్కువ జీతం వారికే.. సర్వేలో హైదరాబాద్ ఎక్కడుందంటే?) ఐక్యూ నియో 7 ప్రో ( iQOO Neo7 Pro).. రూ. 34,999 వద్ద లభించే ఈ ఐక్యూ నియో 7 ప్రో ఇప్పుడు ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న మొబైల్. ఇది అండర్-స్క్రీన్ బయోమెట్రిక్ రీడర్ కలిగి 6.78 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఇందులో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వెనుక వైపు 50 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా పొందుతుంది. -
త్వరలో విడుదలకానున్న ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్ ఇదే!
Oppo Reno 10 Series: భారతదేశంలో 5జీ మొబైల్స్ విరివిగా అమ్ముడవుతున్న సమయంలో 'ఒప్పో' (Oppo) సంస్థ తన 'రెనో 10 సిరీస్' (Reno 10 Series) విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆధునిక ఫీచర్స్తో విడుదలకానున్న ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా లభించనున్నాయి. ఈ మొబైల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోన్కు సంబంధించిన ఫోటోలను కూడా ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ 5జి మొబైల్ గత మే నెల ప్రారంభంలో చైనా మార్కెట్లో మూడు వేరియంట్లలో విడుదలయ్యాయి. అవి ఒప్పొ రెనొ 10, ఒప్పొ రెనొ 10 ప్రో, ఒప్పొ రెనొ 10 ప్రో ప్లస్. (ఇదీ చదవండి: చిన్నారి చేష్టలకు ఆనంద్ మహీంద్రా ఫిదా.. నెట్టింట్లో వైరల్ వీడియో!) కొత్త రెనో 10 సిరీస్ స్మార్ట్ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి.. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్తో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778 జీ ఆక్టాకోర్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్స్లో చైనా మార్కెట్లో లభిస్తోంది. భారతీయ మార్కెట్లో కూడా ఇదే కలర్ ఆప్షన్స్ ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ మొబైల్ లాంచ్ డేట్, అధికారిక ధరలను కంపెనీ వెల్లడించలేదు. చైనాలో రెనో 10 సిరీస్ ప్రారంభ ధర 2,499 యువాన్స్. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 29,000 అని తెలుస్తోంది. 10 reasons to get excited. The #OPPOReno10Series5G - coming soon.#ThePortraitExpert pic.twitter.com/AUiIhCxAUQ — OPPO (@oppo) June 27, 2023 -
పాత సామాన్లు కొంటాం..! పనిచేయని ఫోన్లు, పరికరాలు కొంటున్న ఫ్లిప్కార్ట్..
పనిచేయని పాత స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్లు, ఎయిర్కూలర్లు తదితర గృహోపకరణాలను ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేస్తోంది. ఎక్స్ఛేంజ్ ద్వారా పాతవి ఇచ్చి కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందు కోసం హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ను ఫ్లిప్కార్ట్ ప్రవేశపెట్టింది . ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ-వేస్ట్) తగ్గించడంతోపాటు పనికిరాని ఉపకరణాలను డిస్పోజ్ చేయడంలో కస్టమర్లు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఫ్లిప్కార్ట్ ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చింది. అధీకృత విక్రేతలతో భాగస్వామ్యం ద్వారా రీఫర్బిష్మెంట్, రీసైక్లింగ్ లేదా సరైన డిస్పొజల్ ద్వారా ఈ-వ్యర్థాల సంస్కరణ బాధ్యతను ఫ్లిప్కార్ట్ చేపట్టింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న దేశంగా ఉన్న భారత్ ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితిని మార్చాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఈ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టినట్లు ఫ్టిప్కార్ట్ చెబుతోంది. ఈ ప్రోగ్రామ్ ఆకర్షణీయమైన బైబ్యాక్ ఆఫర్లు, పని చేయని ఉపకరణాలను ఇంటి వద్దకే వచ్చి పికప్ చేసుకోవడం, హ్యాండ్-ఇన్-హ్యాండ్ ఎక్స్ఛేంజ్ ద్వారా కొత్త ఉత్పత్తులను అందిస్తుంది. డేటా తొలగింపు ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అదనంగా పాత మొబైల్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ఫీచర్ ఫోన్లు, ల్యాప్టాప్లను రీఫర్బిష్ లేదా డిస్పోజ్ చేయడానికి ముందు వాటిలోని డేటా తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. సమర్థవంతమైన సాంకేతిక ప్రక్రియలు, విస్తృతమైన లాజిస్టిక్స్ నెట్వర్క్తో ఒకే సారి కస్టమర్లకు అవాంతరాలు లేని సేవలను ఫ్లిప్కార్ట్ అందిస్తుంది. దీనిపై ఫ్లిప్కార్ట్ రీ-కామర్స్ సీనియర్ డైరెక్టర్, బిజినెస్ హెడ్ అశుతోష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ.. కొత్త ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు తమ వద్ద ఉన్న పని చేయని ఎలక్ట్రానిక్, ఇతర ఉపకరణాలను ఇచ్చి కొత్త ఉత్పత్తులు కొనుక్కునేలా వినూత్నమైన, సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్లు -
క్రోమా ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’.. స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు
హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం(2023–24) ప్రారంభం సందర్భంగా ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా.. ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’ పేరుతో గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, ఔత్సాహికుల భిన్న అవసరాలను తీర్చేందుకు హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, ల్యాప్ ట్యాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ ఆఫర్లు పొందేందుకు సమీప క్రోమా స్టోర్టు లేదా ఆన్లైన్లో www.croma.com వెబ్సైట్ను సందర్శించవచ్చు. ల్యాప్టాప్లపై డీల్స్ నెలకు రూ. 1,412 కంటే తక్కువ ఈఎంఐతో 350కి పైగా ల్యాప్టాప్లు ఈ సేల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్లు రూ. 32,990 నుంచే ప్రారంభమవుతాయి. రైజెన్ 3 ద్వారా ఆధారితమైన గేమింగ్ ల్యాప్టాప్లను రూ. 37,990 నుంచే కొనుగోలు చేయవచ్చు. వీటిలో మైక్రోసాఫ్ట్ హోమ్, స్టూడెంట్స్ ముందే ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఇక అన్ని యాపిల్ ఉత్పత్తులపైనా డీల్స్ ఉన్నాయి. టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లపై.. క్రోమా సేల్లో రూ.11,999తో టాబ్లెట్ను కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ. 1,337 ఈఎంఐతో స్మార్ట్ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. క్రోమా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై కేవలం రూ. 499లకే రూ.9,999 విలువైన కాలింగ్-ఎనేబుల్డ్ స్మార్ట్వాచ్ను పొందవచ్చు. -
అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్ఫోన్స్ - ధర కూడా తక్కువే!
Top 5 Best Smartphones: ఆధునిక కాలంలో మనిషి జీవితంలో ఒక భాగమైపోయిన స్మార్ట్ఫోన్ ఎవరి చేతిలో చూసిన కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో లక్షల్లో లభించే మొబైల్స్ ఉన్నాయి, సరసమైన ధరలో లభించే ఫోన్లు ఉన్నాయి. ఈ కథనంలో రూ. 20 వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ స్మార్ట్ఫోన్లను గురించి మరిన్ని తెలుసుకుందాం. రెడ్మీ నోట్ 12 భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్మీ బ్రాండ్కి సంబంధించిన 'నోట్ 12' రూ. 20,000 కంటే తక్కువ ధర లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 16,999. ఇందులోని 5,000mAh బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ ద్వారా పనిచేసే ఈ మొబైల్ 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్లను పొందుతుంది. ఇది 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ జెడ్7 రూ. 18,999 వద్ద లభించే 'ఐక్యూ జెడ్7' మన జాబితాలో రెండవ ఉత్తమ మోడల్. ఇందులో 5,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 6.38 ఇంచెస్ 90Hz AMOLED డిస్ప్లే ఉంటాయి. ఈ మొబైల్ 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది. మోటో జీ73 దేశీయ విఫణిలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతున్న మోటో బ్రాండ్ మొబైల్ ఇప్పటికీ అదే రీతిలో ముందుకు సాగుతున్నాయి. ఇందులో మోటో జీ73 స్మార్ట్ఫోన్ రూ. 18,999 వద్ద లభించే పాపులర్ మోడల్. ఇది 6.5 ఎల్సీడీ డిస్ప్లే పొందుతుంది. ఇందులోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 10 ప్రో 5జీ రియల్మీ 10 ప్రో 5జీ కూడా మన జాబితాలో సరసమైన వద్ద లభించే బెస్ట్ మోడల్. దీని ధర రూ. 18,999. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో LCD ప్యానెల్ పొందుతుంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ ఉంటుంది. ఈ మొబైల్ 5000 mAh బ్యాటరీ కలిగి 33W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ రూ. 19,999 వద్ద లభించే 'వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' ఆధునిక ఫీచర్స్ కలిగిన అద్భుతమైన మోడల్. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో 6.7 ఇంచెస్ ఫుల్ HD+ LCD డిస్ప్లే కలిగిన ఈ మోడల్ 2MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్తో పాటు హై రిజల్యూషన్ 108MP ప్రైమరీ సెన్సార్ పొందుతుంది. ఇందులోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు లభిస్తుంది. -
బీ న్యూ స్టోర్లలో రియల్మీ 11ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చెయిన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో రియల్మీ 11 ప్రో ప్లస్ సిరీస్ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోని మాదాపూర్ బీ న్యూ స్టోర్లో గురువారం నటి వర్ష బొల్లమ్మ ఈ స్మార్ట్ఫోన్ను విడుదల చేశారు. బజాజ్, టీవీఎస్ క్రెడిట్, హెచ్డీబీ, బీనౌ, క్లెవర్పే ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. జీరో ఫైనాన్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని బీ న్యూ స్టోర్ సీఎండీ బాలాజీ చౌదరి కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్తో పాటు రియల్మీ సౌతిండియా సేల్స్ హెడ్ వేణు మాధవ్లు పాల్గొన్నారు. -
స్మార్ట్ఫోన్స్ కొనేవారికి గుడ్న్యూస్.. ఫ్లిప్కార్ట్లో బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ (Flipkart Big Saving Days) పేరుతో తాజా సేల్ ఈవెంట్ను ప్రకటించింది. ఈ సేల్ జూన్ 10న ప్రారంభమై జూన్ 14 వరకు కొనసాగనుంది. ఈ పరిమిత కాల సేల్లో ఐఫోన్ 13, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్23, పోకో ఎక్స్5తో సహా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్కార్ట్ బెస్ట్ డీల్స్, ఆకర్షణీయ తగ్గింపులను అందిస్తోంది. వీటితోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. టాప్ బ్రాండ్స్.. ఫ్లాట్ డిస్కౌంట్స్ ⮞ ఐఫోన్13 (iPhone 13) 128జీబీ స్టోరేజ్ వేరియంట్ను ఫ్లిప్కార్ట్ రూ.58,749 నుంచి ఆఫర్ చేస్తోంది. ఇది యాపిల్ ఆన్లైన్ స్టోర్లో రూ.69,900 ఉంది. అంటే రూ. 11,151 ఫ్లాట్ తగ్గింపు . అదనంగా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్న కస్టమర్లు అదనంగా 10 శాతం తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.57,999లకే ఐఫోన్13ను కొనుగోలు చేయవచ్చు . ⮞ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 (Samsung Galaxy F23) 5Gని రూ.13,499లకే అందిస్తోంది. మార్చిలో లాంచ్ అయినప్పుడు దాని అసలు ధర రూ.17,499. రూ.6,500 తగ్గింపు అంటే ఎవరు వదులుకుంటారు? ఇంకా తక్కువ ధరకు ఫోన్ కావాలనుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) రూ. 10,999 లకే అందుబాటులో ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం14 (Samsung Galaxy M14)ని అయితే ఫ్లిప్కార్ట్లో రూ. 14,327 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ⮞ ఇక రూ.15,499 ఉన్న మోటో జీ62 (Moto G62) రూ. 14,499లకు, 15,499 ఉన్న పోకో ఎక్స్5 (Poco X5 5G)ని రూ.14,999లకు కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: గాల్లో డబుల్ డెక్కర్: భలే డిజైన్ చేశారు.. ఫొటో వైరల్ -
సగ భాగం 5జీ ఫోన్లే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అమ్ముడయ్యే స్మార్ట్ఫోన్లలో సగ భాగం 5జీ మోడళ్లు ఉంటాయని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ తెలిపారు. వివిధ నివేదికలూ ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘భారత్లో రూ.20 వేలకుపైగా ఖరీదు చేసే స్మార్ట్ఫోన్లు అన్నీ 5జీ మోడళ్లే. రూ.15–20 వేల ధరల విభాగంలో 5జీ వాటా 80 శాతం కాగా, రూ.10–15 వేల సెగ్మెంట్లో 40–50 శాతం కైవసం చేసుకుంది. రూ.10 వేల లోపు ధరల శ్రేణిలో ఈ ఏడాది 5జీ వచ్చే అవకాశం లేదు. 4జీతో పోలిస్తే 5జీ చిప్సెట్ కనీసం రూ.3,000 ఖరీదు ఎక్కువగా ఉంటుంది’ అని వివరించారు. మూడు పునాదులు.. ఉత్తమ ఫీచర్లు, అత్యంత నాణ్యత, ధర విషయంలో నిజాయితీ.. ఈ మూడు అంశాలు పునాదులుగా వ్యాపారం సాగిస్తున్నామని మురళీకృష్ణన్ తెలి పారు. ‘2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 20 కోట్ల ఫోన్లు విక్రయించాం. కంపెనీ అమ్మకాల్లో ఆన్లైన్, ఆఫ్లైన్ వాటా సమంగా ఉంది. పరిశ్రమలో ఆఫ్లైన్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఒక్కో ఉత్పాదన అభివృద్ధికి 9–12 నెలల సమయం తీసుకుంటున్నాం. కనీసం 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ కావాల్సిందేనని కస్టమర్లు కోరుతు న్నారు. ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ డిమాండ్ చేస్తున్నారు’ అని వివరించారు. -
ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ ఫెయిల్యూర్ పథకం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే భారతదేశంలో పెరుగుతున్న మొబైల్ ఫోన్ ఎగుమతులపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా రాజన్ పీఎల్ఐ పథకంలోని లొసుగులను ఎత్తి చూపిన సంగతి గమనార్హం. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?) దీనికి సంబంధించి ‘ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా?’ అనే పేరుతో వెల్లడైన పరిశోధనా నోట్ను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ్ రాజన్ షేర్ చేశారు. దేశంలో నిజమైన తయారీ కంటే దిగుమతి అయిన విడిభాగాల అసెబ్లింగ్ ద్వారా వృద్ధి సాగుతోందని విమర్శించారు. మొబైల్ ఫోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతూ దేశీ తయారీ ఉత్పత్తులకు సబ్సిడీ ఇస్తు న్న ఈ స్కీమ్ సమర్థతను ప్రశ్నించారు. భారతదేశంలో ఫోన్ను పూర్తి చేయడానికి మాత్రమే సబ్సిడీ ఇస్తోంది తప్ప, భారతదేశంలో తయారీ విలువ జోడింపునకు కాదనీ, ఇదే ఈ పథకంలోని ప్రధాన లోపమన్నారు. (Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! జూన్ 1 తర్వాత పెరగనున్న ధరలు) భారతదేశంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో మొత్తం మొబైల్ ఫోన్ దిగుమతిపై సుంకాలను పెంచింది. అలాగే 2020లో మొబైల్ ఫోన్ల స్థానిక ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం పీఏల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. 4 శాతం నుండి 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ ప్రోత్సాహకం ఐదేళ్లపాటు వర్తిస్తుంది.దేశంలో తయారీ సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పన ఉద్దేశ్యంగా వివిధ రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల పీఎల్ఐ స్కీమ్లను కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ స్కీమ్ల అమలుతీరును వివరిస్తూ రాజన్తో పాటు మరో ఇరువురు ఆర్థికవేత్తలు రాహుల్ చౌహాన్, రోహిత్ లంబాలు ఈ రీసెర్చ్ నోట్ను రూపొందించారు. భారతదేశం నిజంగా మొబైల్ తయారీ దిగ్గజం కాలేదని వీరు వాదించారు. చౌహాన్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లోని ఫామా-మిల్లర్ సెంటర్లో పరిశోధనా నిపుణుడు, లాంబా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. (IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ ఎవరిదో తెలుసా?) పీఎల్ఐ స్కీంతో పెరిగిన ఎగుమతులు సీఈఏ ప్రకటన ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) గత నెలలో భారతదేశంలో మొబైల్ ఫోన్ ఎగుమతులను ప్రకటించింది. 2022లోని నమోదైన 45,000 కోట్ల నుండి 2023లో 90,000 కోట్లను అధిగమించాయని తెలిపింది. దీనికి పీఎల్ఐ స్కీం ప్రధానమని ప్రకటించింది. కాగా గతంలోనే పథకంలోని లొసుగులను ఎత్తి చూపిన రాజన్ స్మార్ట్ఫోన్ల, ఉత్పత్తి ధరలపై కొన్ని ఉదాహరణలుకూడా ఇచ్చారు. ఏప్రిల్ 2018లో మొబైల్ దిగుమతులపై కస్టమ్ సుంకాలు 20 శాతంగా పెంచారనీ, ఇది తక్షణమే దేశీయ ధరలపెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు. తయారీదారులు ఇండియన్ కస్టమర్లపైనే భారాన్ని మోపు తారని కూడా చెప్పారు. ఉదాహరణకు, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ అమెరికాలో చికాగోలో పన్నులతో సహా రూ. 92,500లోపు అందుబాటులో ఉంటే ఇదే ఫోన్ ఇండియాలో దాదాపు 40 శాతం పెరిగి రూ.1,29,000గా ఉంటుందని లెక్కలు చెప్పిన సంగతి తెలిసిందే. -
వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్ స్మార్ట్ఫోన్లు ఇలా ఉంటాయా?
సాక్షి, ముంబై: టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా గాడ్జెట్స్కు సంబంధించి అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యాలతో యూజర్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. ల్యాండ్ ఫోన్లనుంచి ఫీచర్ ఫోన్ దాకా మొబైల్ వినియోగం ఒక ఎత్తు అయితే. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల దాకా మరో ఎత్తు అని చెప్పవచ్చు. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీలు, రియర్ కెమెరాలు, సెల్ఫీ కెమెరా, 5జీ దాకా ఈ ప్రస్థానం చాలా గొప్పది. ఈ క్రమంలో భవిష్యత్తు ఫోన్లు ఎలా ఉంటాయో తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. ఇవీ చదవండి: ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు ఐపీఎల్ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్ స్లిమ్ అండ్ స్లీక్ మాత్రమే కాదు. అత్యంత ట్రాన్సపరెంట్గా స్మార్ట్ఫోన్ లవర్స్ను ఇట్టే ఆకట్టుకుంటోంది. The Future of Smartphones!#Smartphone #mobile #gadgets pic.twitter.com/IDIgxyRwnx — The Pakistan Affairs (@ThePKAffairs) May 28, 2023 డోంట్ మిస్ టు క్లిక్ హియర్ సాక్షి బిజినెస్ -
టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం!
చైనీస్ టెక్ బ్రాండ్ టెక్నో (Tecno) భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. టెక్నో కామన్ 20 (Tecno Camon 20) సిరీస్ పేరుతో మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. లెదర్ ఫినిషింగ్, రిఫ్లెక్టివ్ డ్యూయల్ అపియరెన్స్ బ్యాక్ ప్యానెల్ను కలిగిన టెక్నో కామన్ 20, టెక్నో కామన్ 20 ప్రో స్మార్ట్ఫోన్లను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సిరీస్లో రావాల్సిన కామన్ 20 ప్రీమియర్ 5జీ (Camon 20 Premier 5G)ని మాత్రం ఇంకా ఆవిష్కరించలేదు. జూన్ నెలాఖరున ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్లలో కెమెరానే ప్రత్యేకతగా తెలుస్తోంది. ఈ కొత్త కెమెరా-సెంట్రిక్ స్మార్ట్ఫోన్లు అధునాతన పోర్ట్రెయిట్, వీడియో సామర్థ్యాలతో యూజర్లకు వినూత్న ఇమేజింగ్ అందిస్తాయని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో తెలిపారు. అందుబాటు ధరలోనే.. టెక్నో కామన్ 20 16జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్ వేరియంట్ ధర రూ.14,999. ప్రీడాన్ బ్లాక్, గ్లేసియర్ గ్లో, సెరెనిటీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. అమ్మకాలు మే 29 నుంచి ప్రారంభమవుతాయి. టెక్నో కామన్ 20 ప్రో 16జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.19,999. 16జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఈ మోడళ్లు డార్క్ వెల్కిన్, సెరెనిటీ బ్లూ కలర్స్లో వస్తున్నాయి. జూన్ రెండో వారంలో అందుబాటులోకి రానున్నాయి. డిజైన్, స్పెసిఫికేషన్లు ప్రత్యేకమైన కామన్ పజిల్ డిజైన్ 6.67 అంగుళాల AMOLED డాట్ ఇన్ డిస్ప్లే, ఫుల్ HD+ రిజల్యూషన్, 100 శాతం DCI-P3 వైడ్ కలర్ గామట్కు సపోర్ట్ 99.8 శాతం గుర్తింపు ఖచ్చితత్వం, 0.35 సెకన్ల వేగవంతమైన అన్లాక్తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వనిల్లా కామన్ 20 వేరియంట్ మీడియాటెక్ హీలియో G85 చిప్సెట్తో పాటు ఆర్మ్ మాలి-G52 యూనిట్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ (మెమొరీ ఫ్యూజన్తో 16జీబీ) 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ప్రో మోడల్లో డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ 256 జీబీ స్టోరేజ్ తక్కువ కాంతి పరిస్థితులలో సహాయపడే RGBW ప్రో టెక్నాలజీ, పోర్ట్రెయిట్ మాస్టర్, ఇన్-బాడీ స్టెబిలైజేషన్ సెన్సార్ షిఫ్ట్ OIS యాంటీ షేకింగ్ టెక్నాలజీ కామన్ 20లో 64MP+2MP+AI లెన్స్తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ప్రో వేరియంట్లో 64MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా మాడ్యూల్, 4K వీడియో రికార్డింగ్ 45W వరకు ఫ్లాష్ ఛార్జింగ్తో పాటు 5000mAh బ్యాటరీ యూనిట్ ఇదీ చదవండి: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్! -
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్!
తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు కొనాలని చూస్తున్న వారి కోసం మే నెలలో మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రియల్మీ (Realme), రెడ్మీ (Redmi) తమ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్లను మే నెలలో లాంచ్ చేశాయి. రియల్మీ నార్జో ఎన్53 (Realme Narzo N53)j, Redmi A2 సిరీస్ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. భారతదేశంలో Realme Narzo N53 ధర రూ. 8,999 వద్ద ప్రారంభమవుతుంది. Redmi A2 Plus ధర రూ. 8,499. వీటితోపాటు పోకో సీ51 (Poco C51), మోటో జీ13 (Moto G13), శాంసంగ్ గెలాక్సీ ఎం13(Samsung Galaxy M13) వంటి ఫోన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ నార్జో ఎన్53 Narzo N53 6.74 అంగుళాల పెద్ద డిస్ప్లే, 50MP మెయిన్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ధర రూ. 8,999. ఇందులో విశేషం ఏంటంటే ఐఫోన్ 14ప్రో (iPhone 14 Pro) లాంటి డిజైన్ ఉండటం. యాపిల్ డైనమిక్ ఐలాండ్ నాచ్ సిస్టమ్ ఇందులో ఉంది. రియల్ ఏ2 ప్లస్ Redmi A2 Plus అద్భుతమైన ఫీచర్లలో ముఖ్యమైనవి దాని డిజైన్, Android 13 Go ఎడిషన్ సాఫ్ట్వేర్. అలాగే ఇందులో అతిపెద్ద 5,000mAh బ్యాటరీని ఇస్తుంది. తక్కువ ర్యామ్, స్టోరేజ్ (2GB/32GB) చాలు, ఫింగర్ప్రింట్ రీడర్ అవసరం లేదు అనుకునే వారికి ఈ ఫోన్ సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ. 5,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. Redmi A2 స్టాండర్డ్ మోడల్. ఇందులో 2GB/64GB వేరియంట్ రూ.6,499, 4GB/64GB వర్షన్ రూ.7,499కి లభిస్తుంది. మోటరోలా జీ13 Motorola G13 ఫోన్ వేగవంతమైన 90Hz డిస్ప్లే, స్టీరియో స్పీకర్లతో వస్తుంది.డాల్బీ అట్మాస్ సౌండ్ను ఇది విడుదల చేస్తుంది. కంటెంట్ కోసం వినియోగించేవారికి ఈ ఫోన్ అనువుగా ఉంటుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 4GB/128GB వేరియంట్ ధర రూ.9,999. పోకో సీ51 Poco C51 భారత్లో ఏప్రిల్లోనే లాంచ్ అయింది. 4GB/64GB వేరియంట్ ధర ప్రారంభంలో రూ. 8,499 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 7,249లకే లభిస్తోంది. ఇది చూడాటానికి Redmi A2 ప్లస్ లాగే ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం13 Samsung Galaxy M13 ఒక సంవత్సరం పాతదే అయినా నేటికీ దీనికి మంచి ఆదరణ ఉంది. ఈ ఫోన్ 4GB/64GB వేరియంట్ ధర ఇటీవల రూ. 11,999 నుంచి రూ. 9,699కి తగ్గింది. దీంతో దీన్ని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. డెడికేటెడ్ అల్ట్రావైడ్ శక్తివంతమైన కెమెరా సెటప్, 6,000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇదీ చదవండి: Flipkart Big Bachat Dhamaal Sale: స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు.. ఫ్లిప్కార్ట్లో అదిరిపోయే డీల్స్! -
స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు..
Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ మళ్లీ వచ్చేసింది. స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఈ సేల్ మే 19న ప్రారంభమైంది. మే 21 వరకు కొనసాగుతుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a), ఐఫోన్ 14 (iPhone 14)తో పాటు కొత్తగా లాంచ్ అయిన మరికొన్ని స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్స్, ఇయర్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఇతర గాడ్జెట్లపై సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్లో ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేయండి.. ఇదీ చదవండి: Redmi A2 Series: రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ గూగుల్ పిక్సెల్ 7ఏ కొత్తగా లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) ధర రూ. 43,999లుగా ఉంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్చేంజ్ ద్వారా రూ. 34,000 వరకు తగ్గింపు లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ 6.1అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఫింగర్ప్రింట్ స్కానర్ ఉంది. Tensor G2 SoC చిప్తో జోడించారు. ఐఫోన్ 14 యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) 128 GB వేరియంట్ రూ. 69,999 వద్ద లభిస్తుంది . హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్ఛేంజ్పై రూ. 33,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది . Apple A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఒప్పో రెనో 8 ప్రో 5G ఒప్పో రెనో (OPPO Reno) 8 Pro 5G (12 జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్) ఫోన్ను రూ. 45,999లకే కొనుక్కోవచ్చు. అంతే కాకుండా కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని వాడుకుంటే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Mediatek డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. వివో T1X వివో (Vivo) T1X ఫోన్ 4GB ర్యామ్, 128GB రోమ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ సేల్లో రూ. 12,999 కే లభిస్తుంది. మరోవైపు కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే అదనంగా మరో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక పాత ఫోన్ల ఎక్స్చేంజ్పై గరిష్టంగా రూ. 12,450 లభిస్తుంది. పోకో F5 5G ప్రస్తుత ఫ్లిప్కార్ట్ సేల్లో పోకో (Poco) F5 5G ఫోన్ 8GB వేరియంట్ రూ. 29,999లకు లభిస్తోంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 6.67 అంగుళాల డిస్ప్లే, Qualcomm Snapdragon 7+ Gen2 చిప్సెట్ ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, వాటిపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకునేందుకు సాక్షి బిజినెస్ పేజీని చూడండి -
రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ
అతి తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది షావోమీ (Xiaomi). రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2 ప్లస్ (Redmi A2 Plus) ఫోన్లు భారత్లో అధికారికంగా విడుదలయ్యాయి. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! రెడ్మీ ఏ2 సిరీస్ గత సంవత్సరం వచ్చిన రెడ్మీ ఏ1 సిరీస్కు కొనసాగింపు. పైకి చూడటానికి ఒకేలా ఉన్నా ఏ2 సిరీస్లో మరికొన్ని హంగులు చేర్చారు. మరింత శక్తివంతమైన చిప్ను జోడించారు. తాజా ఆండ్రాయిడ్ ( Android 13 Go) ఎడిషన్ సాఫ్ట్వేర్ను జత చేశారు. ఇక రెడ్మీ ఏ2, ఏ2 ప్లస్ డిజైన్ పరంగా రెండూ ఒకే రకంగా ఏ2 ప్లస్ ఫోన్లో అదనంగా ఫింగర్ప్రింట్ రీడర్ ఫీచర్ ఉంటుంది. రెడ్మీ ఏ2 సిరీస్ ధర రూ. 5,999 నుంచి ప్రారంభమవుతుంది. మే 23 తర్వాత ఈ ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి. రేట్లు ఎంత.. ఎక్కడ కొనాలి.. ఆఫర్ల సంగతేంటి? రెడ్మీ ఏ2 2జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ.5,999. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.6,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్లో కూడా కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,499. ఇక రెడ్మీ ఏ2 ప్లస్ ధర రూ. 8,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్లో మాత్రమే వస్తుంది. సీ గ్రీన్, కామింగ్ ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్స్లో ఈ ఫోన్స్ లభిస్తాయి. ఈ ఫోన్లను ఆన్లైన్లో అయితే అమెజాన్, షావోమీ ఆన్లైన్ స్టోర్లో, అదే ఆఫ్లైన్లో అయితే ఎంఐ హోమ్ స్టోర్లతో పాటు కంపెనీ ఇతర రిటైల్ పార్టనర్ స్టోర్లలో మే 23 (మధ్యాహ్నం 12 తర్వాత) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే షావోమీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు ఈ ఫోన్ల కొనుగోలుపై రూ. 500 వరకు అదనపు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మోడళ్లపై 2 సంవత్సరాల వారంటీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకైతే ఈ ఫోన్లను హోం సర్వీస్లో అందించనున్నట్లు తెలిపింది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటర్డ్రాప్-స్టైల్ నాచ్తో 6.52 అంగుళాల 720p డిస్ప్లే MediaTek Helio G36 చిప్సెట్ 4GB ర్యామ్ 64GB ఎక్స్పాండబుల్ స్టోరేజ్ Android 13 Go సాఫ్ట్వేర్. వెనుకవైపు 8MP ప్రధాన సెన్సార్తో డ్యూయల్ కెమెరా సెటప్, ముందువైపు మరో 5MP కెమెరా 10W మైక్రో USB ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీ. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. -
వేసవి గాలుల తీవ్రరూపం.. కళ్లు పొడి బారుతున్నాయ్ జాగ్రత్త!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వేసవి గాలులు తీవ్రరూపం దాల్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అలాంటి వారికి వేడి గాలుల ప్రభావంతో కళ్లు పొడిబారిపోతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో టియర్ పొర (కన్నీటి గ్రంధి) దెబ్బతిని కంటికి తేమ అందక డ్రై అవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చేశారు. దీంతో పిల్లలు ఇంట్లోనే స్మార్ట్ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. పిల్లల్లో అత్యధికులు రోజులో 3నుంచి 5గంటల పాటు స్మార్ట్ఫోన్లు చూస్తున్నారు. అలాంటి వారిలో కంటి సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా నిమిషానికి 8 సార్లు కంటి రెప్పల్ని ఆర్పుతుంటాం. అలా చేయడం వల్ల కార్నియాకు అవసరమైన నీరుచేరి కళ్లు డ్రై కాకుండా చేస్తాయి. స్మార్ట్ఫోన్ చూసే సమయంలో కనురెప్పలు నిమిషానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే ఆర్పుతుంటారని వైద్యులు చెబుతున్నారు. దీంతో కళ్లు డ్రై అవుతున్నాయంటున్నారు. ప్రస్తుతం కంటి దురదలు, కళ్ల మంటలు రావడం, కొందరికి తలనొప్పి వంటి సమస్యలు వస్తున్నట్టు చెబుతున్నారు. వెలుతురు సరిగ్గా చూడలేకపోవడం, కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలుంటాయంటున్నారు. చికిత్స పొందకుంటే నల్లగుడ్డుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స పొందాలి కళ్లు డ్రై అయిన వారిలో దురదలు, కళ్లు మంటలు, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే క్రమేణా నల్లగుడ్డుపై ప్రభావం చూపవచ్చు. ప్రతిరోజూ ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడటం వలన సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఆ మందులు దీర్ఘకాలం వాడినా ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. సమస్య రాకుండా ఉండాలంటే కంటికి దూరంగా.. బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని స్మార్ట్ఫోన్, కంప్యూటర్లను వినియోగించాలి. – సి.త్రివేణి, నేత్ర వైద్య నిపుణురాలు, విజయవాడ ఏం చేయాలంటే.. ► వేసవిలో ప్రయాణాలు చేసేవారు విధిగా కళ్లజోడు వినియోగించాలి. ► తరచూ ముఖాన్ని చన్నీటితో కడుక్కోవడం మంచిది. ► స్మార్ట్ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుని ఉపయోగించాలి. ► కళ్లకు ఫోన్ను 15 సెం.మీ. దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టకూడదు. ► 20 నిమిషాలపాటు ఫోన్, కంప్యూటర్ వాడిన తర్వాత 20 సెకన్లపాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. అలా చేయడం ద్వారా కనురెప్పలు వేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి డ్రై కాకుండా చేస్తుంది. ► ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్ఫోన్ వినియోగించకూడదు. ► కంప్యూటర్పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్ గ్లాస్ వాడితే మేలు. ► రోజులో ఎక్కువసేపు స్మార్ట్ఫోన్, కంప్యూటర్పై పనిచేసే వారు ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడటం ద్వారా దుష్ఫలితాలు లేకుండా చూడవచ్చు. -
Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ ఆఫర్స్
సాక్షి,ముంబై: రియల్మీ ఐదో వార్షికోత్సవ సేల్ను ప్రకటించింది. రియల్మే మార్కెట్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. రియల్మీ అఫీషియల్ వెబ్సైట్తో పాటు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్లాట్ఫామ్ల్లో కూడా ఈ యానివర్సరీ సేల్ సందర్భంగా రియల్మీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు సహా , ఇతర రియల్మీ ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. మే 3 వరకు కస్టమర్లు భారీ ఆఫర్లను అందుకోవచ్చు. స్మార్ట్ఫోన్లు రియల్మీ జీటీ నియో 3టీ సుమారు రూ.8,000 డిస్కౌంట్తో రూ.19,999కే లభ్యం. ఫ్లాగ్షిప్ రియల్మీ జీటీ 2 ప్రో.. రూ.14వేల డిస్కౌంట్తో రూ.35,999కు లభిస్తోంది. ఈ సేల్లో రియల్మీ 10 ప్రో 5జీ, రియల్మీ 10 మొబైళ్లపై రూ.2,000 వరకు ఆఫర్ ఉంది. దీంతోపాటు రియల్మీ 9ఐ 5జీ, రియల్మీ సీ55, రియల్మీ సీ30 ,రియల్మీ సీ35, రియల్మీ జీటీ2, రియల్మీ 9 ప్రో+ 5జీ సహా మరిన్ని మొబైళ్లపై ఈ సేల్ సందర్భంగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ల్యాప్టాప్స్: రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ ల్యాప్టాప్ డిస్కౌంట్తో ప్రస్తుతం రూ.47,999, రియల్మీ బుక్ స్లిమ్ ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్ రూ.32,999కు ఫ్లిప్కార్ట్ ఈ ఆఫర్లతో ల్యాప్టాప్లు లభ్యం. స్మార్ట్ టీవీలు రియల్మీ 32, 43 అంగుళాల 4కే యూహెచ్డీ టీవీలపై రూ.3,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రియల్మీ స్మార్ట్ టీవీ నియో 32 ఇంచుల టీవీ రూ.1,000 డిస్కౌంట్తో రూ.11,999కే అందుబాటులో ఉంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) It's your time to grab the leap-forward deals! Don't miss the chance to catch the 5th-anniversary bonanza at https://t.co/HrgDJTHBFX. Head straight to the website now! pic.twitter.com/pVaIJliwPU — realme (@realmeIndia) May 1, 2023 -
స్మార్ట్ఫోన్లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..
ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్లు పేలిపోతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ఫోన్లు పేలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేరళలోని త్రిసూల్ ప్రాంతంలో స్మార్ట్ఫోన్ పేలి ఎనిమిదేళ్ల అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ స్మార్ట్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి? దానికి గల కారణాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం. బ్యాటరీ వాపు లేదా ఉబ్బడం: మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్లు అప్పుడప్పుడు కిందపడిపోవడం వల్ల బ్యాటరీలోని కొన్ని ముఖ్యమైన పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఇందులోని బ్యాటరీలు ఉబ్బుతాయి. ఇలాంటి ఉబ్బిన బ్యాటరీలు కలిగిన మొబైల్స్ చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే అవి ఏ సమయంలో అయినా పేలిపోయే ప్రమాదం ఉంది. (ఇదీ చదవండి: భారత్లో ఆరు ఎయిర్ బ్యాగులు కలిగి టాప్ 5 కార్లు - ధరలు ఎలా ఉన్నాయంటే?) బ్యాటరీలో ఏర్పడిన లోపం: స్మార్ట్ఫోన్లను తయారు చేసే కంపెనీలు కట్టుదిట్టమైన భద్రతలతో తయారు చేస్తాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సాంకేతి సమస్యల వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్య రావొచ్చు. ఎంచుకుంటే స్మార్ట్ఫోన్లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. దీని వల్ల ఏర్పడే కెమికల్ బ్యాలెన్ కారణంగా వేడి పెరిగి పేలిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) బ్యాటరీలు వేడెక్కడం: బ్యాటరీలు వేడెక్కడం అనేది మనం నిజ జీవితంలో గమనించే ఉంటాము. ఇది మొబైల్ పేలిపోవడానికి మరో ప్రధానమైన కారణం కావచ్చు. నిజానికి కొంత మంది తమ మొబైల్ ఫోన్స్ లేదా స్మార్ట్ఫోన్లను రాత్రి పూట ఛార్జింగ్ లో ఉంచి అలాగే వదిలేస్తారు. ఇది ప్రమాదానికి ప్రధాన హేతువు అవుతుంది. అంతే కాకుండా వేడిగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్స్ ఛార్జింగ్ వేయకూడదు. ఛార్జింగ్ వేసిన సమయంలో ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఇతర ఉపయోగాలకోసం వినియోగించడం రెండూ చేయకూడదు. ఇది చాలా ప్రమాదం అని తప్పకుండా గుర్తుంచుకోండి. -
ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్..
అమెజాన్ భారత్లో తన మొదటి గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫ్ ది ఇయర్ ను ప్రకటించింది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయని పేర్కొంది. ఈ ఆఫర్ల జాతర మే 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ గ్రేట్ సమ్మర్ సేల్కు సంబంధించిన టీజర్ను అమెజాన్ విడుదల చేసింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ప్రైమ్ మెంబర్లకు ఒక రోజు ముందే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ గృహోపకరణాలు, ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులపై గ్రేట్ సమ్మర్ సేల్లో భారీ తగ్గింపులను అందించబోతున్నట్లు టీజర్లో పేర్కొంది. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపు! అమెజాన్ అందించే డిస్కౌంట్లరకు అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయని వెల్లడించింది. ఐసీఐసీఐ, కోటక్ బ్యాంక్ కార్డ్ల ద్వారా 10 శాతం ఆదా చేసుకోవచ్చు. రాబోయే సేల్ కోసం అమెజాన్ ఒక వెబ్పేజీని రూపొందించింది. అందులో కొన్ని డీల్స్ ప్రివ్యూను అందిస్తుంది. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. వన్ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ (OnePlus Nord CE 2 Lite)ని రూ. 18,499లకే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా రెడ్మీ (Redmi 12C) ఫోన్ను రూ.8,999లకు సొంతం చేసుకోవచ్చు. ఇక వన్ప్లస్ బుల్లెట్స్ జెడ్2 (OnePlus Bullets Z2)పై రూ.1,599 తగ్గింపు ఉంటుంది. ఐఫోన్ 14పై కూడా భారీ డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ హింట్ ఇచ్చింది. ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర రూ.71,999. సరికొత్త స్మార్ట్ఫోన్లు, వాటి యాక్సెసరీస్పై 40 శాతం వరకు తగ్గింపు, నోకాస్ట్ ఈఎంఐలను ప్రకటించింది. అలాగే పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.10,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ సేల్లో ప్రైమ్ మెంబర్ల కోసం రూ. 5,000 విలువైన అమెజాన్ పే రివార్డ్లతో పాటు 18 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలపై.. టీవీలు, ఇతర ఉపకరణాలపై అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో కస్టమర్లు 60 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. వన్ప్లస్ వై సిరీస్ హెచ్డీ-రెడీ LED ఆండ్రాయిడ్ టీవీని రూ.14,999లకే కొనుక్కోవచ్చు. అలాగే ఎల్జీ 190L సింగిల్-డోర్ రిఫ్రిజిరేటర్ రూ. 17,490, 1.5-టన్నుల 5-స్టార్ AI ట్విన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ రూ. 46,490లకే లభిస్తుంది. ఇదీ చదవండి: Google Play Store: గూగుల్ సంచలనం! 3500 యాప్ల తొలగింపు.. -
ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే..
కొత్త సిరీస్ను ప్రారంభించినప్పుడు యాపిల్ పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపివేస్తూ వస్తోంది.యాపిల్ ఐఫోన్15 (iPhone 15)ఈ సంవత్సరం ఆఖరులో లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా కొన్ని పాత మోడళ్లను యాపిల్ నిలిపివేసే అవకాశం ఉంది. టామ్స్ గైడ్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 సిరీస్ని ప్రారంభించిన తర్వాత ఐఫోన్14 ప్రో (iPhone 14 Pro), ఐఫోన్14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max), ఐఫోన్13 మిని (iPhone 13 mini)తో పాటు ఐఫోన్12 (iPhone 12) మోడళ్లను యాపిల్ కంపెనీ నిలిపివేయనుంది. ఇందులో ఐఫోన్ 12ను నిలిపివేయడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఏ మోడల్ ఫోన్నైనా మూడేళ్లకు మించి అందుబాటులో ఉంచదు. ఐఫోన్12 మోడల్ నిలిచిపోతే దాని స్థానాన్ని ఐఫోన్ 13 భర్తీ చేస్తుంది. యాపిల్ సాధారణంగా ఒక సంవత్సరం అమ్మకాల తర్వాత దాని ప్రో మోడల్లను ఆపేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. కానీ ఐఫోన్ 14 మాత్రం కొనసాగే అవకాశం ఉంది. దీని ధరను కూడా తగ్గించవచ్చు. రెండేళ్ల అమ్మకాల తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీని నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 మినీని కూడా నిలిపివేయవచ్చని నివేదిక సూచిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ను కొనసాగిస్తుందా.. నిలిపేస్తుందా అన్నది చెప్పడం కష్టం. దీని ధరను రూ.8000లకుపైగా తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్ 15 విడులయ్యాక దానికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా కంపెనీ నిలిపేసే అవకాశం ఉంది. కాగా ఐఫోన్ (iPhone 15) సిరీస్ కింద కంపెనీ నాలుగు మోడళ్లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. బేస్ ఐఫోన్15 వేరియంట్, ఐఫోన్15 Plus, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లు ఉన్నాయి. వీటిని త్వరలో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్లో ప్రకటించే అవకాశం ఉంది. -
ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్..
ఆండ్రాయిడ్ పరికరాల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది. ఫోన్లలో స్టోరేజ్ సమస్యకు పరిష్కారంగా ‘ఆటో ఆర్కైవ్’ అనే ఫీచర్ను తీసుకొస్తున్నట్లు తన బ్లాగ్ పోస్ట్లో గూగుల్ పేర్కొంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లకు సంబంధించిన ఎలాంటి డేటా తొలగిపోదు. ఇది కేవలం తక్కువగా వాడిన యాప్ల డేటాను మాత్రమే ఆర్కైవ్ చేస్తుంది. ఆ యాప్లకు సంబంధించిన క్లౌడ్ ఐకాన్ ఫోన్లలో అలాగే ఉంటుంది. ఆటో ఆర్కైవ్ అంటే ఏమిటి? ఆటో ఆర్కైవ్ అనేది యాప్ను పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ను ఖాళీ చేయడానికి రూపొందించిన కొత్త ఫీచర్ . ఈ ఫీచర్ను యూజర్లు ఎంచుకుంటే వారి ఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ పరికరాల్లో తక్కువగా వినియోగించే యాప్లు పాక్షికంగా తొలగిపోతాయి. దీంతో ఆ మేరకు స్టోరేజ్ స్పేస్ ఖాళీ అవుతుంది. అయితే తమకు సంబంధించిన ముఖ్యమైన డేటా తొలగిపోతుందని యూజర్లు కంగారు పడాల్సిన పని లేదు. యూజర్ల డేటా, పాక్షికంగా తొలగించిన యాప్ ఐకాన్లు కూడా ఫోన్లో అలాగే ఉంటాయి. కాబట్టి ఒకవేళ యూజర్లు తొలగించిన యాప్ను మళ్లీ ఉపయోగించాలనుకున్నప్పుడు దాన్ని మరో సారి డౌన్లోడ్ చేసుకుని ఎక్కడి నుంచి యాప్ డేటా తొలగిపోయిందో తిరిగి అక్కడి నుంచి కొనసాగించవచ్చు. అయితే ఆ యాప్ గూగుల్ ప్లేస్టోర్ అందుబాటులో ఉన్నంతవరకే. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏదైనా యాప్ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకవేళ వారి ఫోన్లు, ఇతర పరికరాల్లో స్టోరేజ్ స్పేస్ తక్కువగా ఉన్నట్లయితే ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ను ఉపయోగించుకోవాలని వారికి సూచన అందుతుంది. ఆ ఫీచర్ను ఎంచుకున్న వెంటనే తక్కువ వినియోగంలో ఉన్న యాప్లను గుర్తించి ఆటోమేటిక్గా ఆర్కైవ్ చేస్తుంది. ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ వల్ల దాదాపు 60 శాతం వరకు స్టోరేజీ స్పేస్ ఆదా అవుతుంది. గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. యాప్ బండిల్ని ఉపయోగించి రూపొందించిన యాప్లకు మాత్రమే ఈ ఆటో ఆర్కైవింగ్ ఫీచర్ పనిచేస్తుంది. యాప్ బండిల్ అనేది యాప్ల రూపకల్పన కోసం 2021 నుంచి తప్పనిసరి చేసిన ఫార్మాట్. -
‘ఫోకస్’ తప్పుతోంది
కంచర్ల యాదగిరిరెడ్డి : అర నిమిషం తీరిక లేదు... అర్ధరూపాయి సంపాదన లేదు.. ఈ సామెత వింటుంటే ఈ తరం బడిపిల్లలు గుర్తుకు వస్తున్నారు. ఎప్పుడు చూసినా పుస్తకాల్లో తలమునకలై ఉంటారు. బాగా చదువుతున్నారే అని మురిసిపోయినా.. పరీక్షల్లో వచ్చిన మార్కులు చూస్తే అత్తెసరు. ఈ తరం పిల్లల్లో ఎక్కువ మంది ఫోకస్డ్గా లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలు పెద్దవారి ఏకాగ్రత కూడా బాగా తగ్గిపోతోందని.. స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు, మాధ్యమాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. దృష్టి మళ్లే దారులెన్నో.. మునుపటితో పోలిస్తే పిల్లల దృష్టి మళ్లేందుకు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, టీవీలు ఇలా ఎన్నో కారణమవుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరి నుంచో, ఏదో వాట్సాప్ గ్రూపులోనో మెసేజీలు రావడం, ఫేస్బుక్ నోటిఫికేషన్లు, స్మార్ట్ వాచ్ మెసేజ్.. ఇలా తరచూ మన దృష్టిని తప్పిస్తున్నాయని, దీనివల్ల తదేకంగా ఒక పనిని శ్రద్ధగా చేసే శక్తిని కోల్పోతున్నామని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫోన్లు రాకముందు, సాంకేతిక విప్లవం లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారన్నదానిపై అమెరికాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’ఇటీవల ఓ అధ్యయనం చేసింది. 1946–1975 మధ్య కాలంలో పుట్టి, రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వారిని, 1976–2000 మధ్య పుట్టి పలు రంగాల్లో ఉన్న వారిని, ప్రైమరీ స్కూల్, హైసూ్కల్, కాలేజీ విద్యార్థులను ప్రశ్నించి.. ఐక్యూ టెస్ట్ పెట్టింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఏ పనికైనా ఫోకస్ అవసరం! మనం ఏ పనిచేయాలన్నా ఫోకస్ అనేది చాలా అవసరం. లేకుంటే ఏ పని సరిగా, త్వరగా పూర్తి చేయలేం. తరాలు మారుతున్న కొద్దీ ఫోకస్ టైం మారుతూ వస్తోందని అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు బేబీ బూమర్లు అంటే 1946–1964 మధ్య పుట్టినవాళ్లకు ఫోకస్ టైం ఇరవై నిమిషాలు ఉండేది. తర్వాతి తరం జనరేషన్ ఎక్స్ అంటే 1965–1980 మధ్య పుట్టినవారి ఏకాగ్రత 12 నిమిషాలకు చేరింది. 1981, ఆ తర్వాత పుట్టినవారికి ఇది కేవలం ఎనిమిది నుంచి 12 నిమిషాలే.. ఫోకస్ పెట్టలేక పోయినప్పుడు అరగంటలో చేయాలనుకున్న పని గంట, గంటన్నర పడుతుంది. పైగా చేసే పనిలో నాణ్యత ఉండదని.. యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలూ వస్తాయని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నాలుగేళ్ల కితం జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. ఇంటర్నెట్ వాడకం మన మెదడులోని పలు ప్రాంతాల్లో మార్పులకు కారణమవుతుందని తేలింది. ఇలా మారిపోయే విషయాల్లో మన జ్ఞాపకాలూ ఉన్నాయని వెల్లడైంది. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్, అండ్ హ్యూమన్ డెవలప్మెంట్’అధ్యయనం ప్రకారం కూడా.. నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్ఫోన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్లను చూడటం వల్ల నిద్రకు చేటు కలుగుతుంది. అది కాస్తా వారి రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది. వాటితో కేవలం పరధ్యానమే.. కంప్యూటర్ల వాడకంతో మనుషుల మానసిక స్థితిపై కలిగే ప్రభావంపై ఇంకో అధ్యయనం కూడా జరిగింది. ఆ్రస్టేలియాకు చెందిన డాక్టర్ షరోన్ హార్వుడ్ నిర్వహించిన ఆ అధ్యయనం ప్రకారం.. టెక్నాలజీ అనేది మన మేధో సామర్థ్యాన్ని వెంటనే మార్చేస్తుందనడం పూర్తిగా వాస్తవమేమీ కాదు. యుగాలుగా రకరకాల పరిస్థితు లను ఎదుర్కొని పరిణామం చెందిన మెదడు పనితీరు ఒక్క తరంలో మారిపోదని ఆమె చెప్తున్నా రు. కాకపోతే డిజిటల్ పరికరాలు మన మనసును పరధ్యానంలో పడేస్తాయని స్పష్టం చేస్తున్నారు. పక్కన ఉన్నా ప్రభావమే.. మన పరిసరాల్లో స్మార్ట్ఫోన్, ఇతర డిజిటల్ స్క్రీన్ డివైజ్ ఉంటే చాలు మన ఏకాగ్రత స్థాయి గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, భావోద్వేగాల నియంత్రణకు కారణమైన విషయాలపై దృష్టిపెట్టడం వంటివాటిపై స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ల వంటివి ప్రభావం చూపగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలిందని స్పష్టం చేస్తున్నారు. చేతుల్లో, లేదా జేబులో, పక్కన టేబుల్పైనో స్మార్ట్ఫోన్ ఉంటే.. మన మనసు చేసే పనిపై కాకుండా ఫోన్కు వచ్చే నోటిఫికేషన్లు లేదా అది చేసే శబ్దాలపై పడుతుందని వెల్లడైందని వివరిస్తున్నారు. క్షణం విడిచి ఉండలేకుండా.. రోజులో గంటా రెండు గంటల పాటు స్మార్ట్ఫోన్ అందుబాటులో లేకపోయినా సరే నానా హైరానా పడే వారి సంఖ్య బాగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్యదేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని.. మన దేశంలోనూ ఆ పరిస్థితి వస్తోందని హెచ్చరిస్తున్నారు. తక్షణ తృప్తి (ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్) కారణంగానే మనుషులు డిజిటల్ పరికరాలకు బానిసలవుతున్నట్టు వివరిస్తున్నారు. చాలా దేశాల్లో పిల్లలు నిపుణులు సూచించిన దాని కంటే ఎక్కువ సమయం డిజిటల్ తెరల ముందు గడుపుతుండటం ఆందోళనకరమని స్పష్టం చేస్తున్నారు. సమస్యను గుర్తించడం ఎలా? ♦ చేపట్టిన పనిని పూర్తి చేసేందుకు కష్టపడుతుంటే, కష్టం అనిపిస్తుంటే, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతుంటే ఫోకస్ కోల్పోయామని అర్థం. ♦ అకారణంగా చిరాకు అనిపిస్తున్నా, మన దృష్టి సులువుగా పక్కదారి పడుతున్నా, రెస్ట్లెస్గా అనిపిస్తున్నా.. ఫోకస్ కోల్పోయామని స్పష్టంగా తెలుస్తుంది. ♦ ముఖ్యమైన అంశాలను అప్పటికప్పుడు మర్చిపోతుంటే ఫోకస్ పోతున్నట్టే. ఏమిటి పరిష్కారం? ♦ ఫోకస్ పెంచుకునేందుకు సులువైన మార్గాలెన్నో ఉన్నాయి. మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న మొబైల్ ఫోన్ నోటిఫికేషన్, కంప్యూటర్ నోటిఫికేషన్ వంటివి ఆఫ్ చేయాలి లేదా అత్యవసరమైనవే వచ్చేలా సెట్ చేసుకోవాలి. ♦ ఏ పని ముందు చేయాలి? ఏ పని తరువాత చేయాలి? దేనికి ప్రాధాన్యత ఎక్కువ? దేనిని నిర్ణీత సమయం (డెడ్లైన్)లోపు పూర్తి చేసుకోవాలన్న దానిపై కొంత వర్క్ చేసుకుని ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం నేర్చుకుంటే ఫోకస్ పెరుగుతుంది. ♦ ప్రతిరోజు మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయాలి. అంటే పూర్తిగా చేసే పనిపైనే ధ్యాస నిలిపాలి. ఉదాహరణకు.. ఉదయం లేవగానే బ్రష్ చేసేటప్పుడు ఆ బ్రషింగ్పై మాత్రమే, కాఫీ తాగేటప్పుడు దానిపై మాత్రమే ధ్యాస నిలిపేందుకు ప్రయత్నించాలి. ఇలా అన్ని పనులకూ వర్తింపజేయాలి. దీనిని రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఫోకస్ ఆటోమేటిగ్గా పెరుగుతుంది. –విశేష్ , సైకాలజిస్ట్ ఇంటర్నెట్కు బానిసవుతున్న జనం ప్రపంచవ్యాప్తంగా జనం ఇంటర్నెట్కు బానిసగా మారుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. వాటి ప్రకారం.. రోజులో ఒక్కొక్కరూ కనీసం 149 నిమిషాల పాటు స్మార్ట్ఫోన్ను చూస్తూ గడుపుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిళ్లు నిద్రలేచి మరీ సోషల్ మీడియా పోస్టులు చూసుకుంటున్నారు. వీడియో గేమ్స్ ఆడే యువకులు వారంలో వాటిపై గడిపే సమయం 8 గంటలకు పైనే.. అమెరికాలో ట్రాఫిక్ ప్రమాదాల్లో 26శాతం స్మార్ట్ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం వల్లనే జరుగుతున్నాయి! -
బీ న్యూ మొబైల్స్ స్టోర్లో రెడ్మీ 12సి సిరీస్ ఫోన్లు
హైదరాబాద్: ప్రముఖ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్ స్టోర్ రెడ్మీ 12సీ, 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. సినీ నటి దక్ష నాగర్కర్ గురువారం రెడ్మీ 12సీ స్మార్ట్ఫోన్ను గ్రాండ్గా లాంచ్ చేశారు. ‘‘బీ న్యూ స్టోర్స్ అద్భుతమైన ఆఫర్లతో రెడ్ మీ 12సీ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకే అందిస్తుంది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని నాగర్కర్ కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్తో పాటు రెడ్మీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..
కొత్త స్మార్ట్ఫోన్లు కొనాలనుకుని ఎక్కువ ధర కారణంగా కొనలేకపోయినవారికి ఇది సరైన సమయం. ఎందుకంటే గతేడాది విడుదలైన పలు టాప్ బ్రాండ్ స్మార్ట్ఫోన్ల ధరలు ప్రస్తుతం బాగా తగ్గాయి. వన్ప్లస్ (OnePlus), షావోమీ (Xiaomi), మోటరోలా (Motorola) సహా అనేక మధ్య శ్రేణి ఆండ్రాయిడ్ ఫోన్లు ఇటీవల తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చాయి. (బిజినెస్ ‘మోడల్’: 24 ఏళ్లకే సీఈవో.. రూ.వెయ్యి కోట్ల కంపెనీ!) షావోమీ (Xiaomi) 12 Pro రెండు వేరియంట్లలో వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 10,000 తగ్గింది . గత విడుదలైన ఈ ఫోన్ 8GB వర్షన్ను ఇప్పుడు రూ. 52,999లకు, 12GB వెర్షన్ను రూ. 54,999లకు కొనుగోలు చేయవచ్చు . కోర్చర్ బ్లూ (Couture Blue), నాయిర్ బ్లాక్ (Noir Black), ఒపేరా మావ్ (Opera Mauve) రంగుల్లో అందుబాటులో ఉంది. ఆక్టా కోర్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్, 12GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్, 50MP రియర్ ట్రిపుల్ కెమెరా, 120W హైపర్ఛార్జ్ టెక్నాలజీ, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్, 4600mAh బ్యాటరీ వంటివి ఈ ఫోన్ ప్రత్యేకతలు. వన్ప్లస్ (OnePlus) 10R గతేడాది లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రెండోసారి తగ్గింది. మొదటి సారి రూ.4,000 తగ్గగా ఇప్పుడు రూ. 3,000 తగ్గింది. ప్రారంభ ధర తగ్గింపు తర్వాత 8GB+128GB (80W) వేరియంట్ ధర రూ. 34,999 ఉండగా ఇప్పుడు రూ. 31,999లకు అందుబాటులో ఉంది. 12GB+256GB (80W) ఫోన్ ధర అప్పుడు రూ. 38,999 కాగా ఇప్పుడు రూ. 35,999. ఇక 12GB+256GB (150W) వేరియంట్ ధర అప్పుడు రూ. 39,999 ఉండగా ప్రస్తుతం రూ.36,999లకు లభిస్తోంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100-MAX చిప్సెట్ ఆధారితమైన ఈ స్మార్ట్ఫోన్ ర్యామ్ గరిష్టంగా 12 GB. అలాగే 256 GB ఇంటర్నల్ స్టోరేజ్. ఆక్సిజన్ఓఎస్ 13 ఓవర్లేతో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తుంది. షావోమీ (Xiaomi) 11 Lite NE 5G 2021 సెప్టెంబర్లో లాంచ్ అయిన ఈ ఫోన్పై రూ.3,000 ధర తగ్గింది. స్మార్ట్ఫోన్ 6GB, 8GB వెర్షన్లను ప్రస్తుతం వరుసగా రూ. 26,999లకు, రూ. 28,999లకు సొంతం చేసుకోవచ్చు . ఈ స్మార్ట్ఫోన్ డైమండ్ డాజిల్, జాజ్ బ్లూ, టుస్కానీ కోరల్, వినైల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఆక్టా కోర్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 4250mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. మోటో ఎడ్జ్ 30 ఈ స్మార్ట్ఫోన్ 2021లో రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. 6GB+128GB, 8GB+128GB వేరియంట్ల ధరలు గతంలో వరుసగా రూ.27,999, రూ.29,999లుగా ఉండేవి. తగ్గింపు తర్వాత 6GB వెర్షన్ రూ. 24,999లకు, 8GB వేరియంట్ రూ.26,999లకే లభిస్తోంది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 778+ చిప్సెట్, 6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, 33W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్, 4020mAh బ్యాటరీ ప్రత్యేకతలున్న ఈ ఫోన్ ఇది ఆండ్రాయిడ్ 12పై పనిచేస్తుంది. మోటో G72 గత సంవత్సరం అక్టోబర్లో విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ. 18,999. దీనిపై రూ. 3,000 తగ్గింపు ఉంది. అంటే రూ. 15,999లకే లభిస్తుంది. మెటోరైట్ గ్రే, పోలార్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది. ఆక్టా కోర్ MediaTek Helio G99 చిప్సెట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్పై పని చేస్తుంది. 108MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో ఉంది. (Free blue ticks: ట్విటర్ బ్లూ టిక్ ఫ్రీ! ఎవరికో తెలుసా?) -
రూ.20వేల లోపు సూపర్ స్మార్ట్ఫోన్లు..
దేశంలో రూ.20 వేల లోపే సూపర్ ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. మంచి పనితీరుతో పాటు ప్రీమియం డిజైన్, అద్భుతమైన కెమెరా ఆప్షన్లు ఉన్నాయి. గేమింగ్ ఇష్టపడేవారికి 6జీబీ ర్యామ్తో అత్యంత సామర్థ్యం గల ప్రాసెసర్లను కలిగిన స్మార్ట్ ఫోన్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. శాంసంగ్, మోటరోలా, నోకియా, షావోమీ వంటి టాప్ బ్రాండ్ల ఫోన్లు రూ.20 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: ఆర్బీఎల్ బ్యాంకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆర్బీఐ! రూ.కోట్లలో జరిమానా.. పోకో (POCO) X4 ప్రో ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్ , స్నాప్డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.67 అంగుళాలు కెమెరా: 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh షావోమీ రెడ్మీ (Xiaomi Redmi) Note 12 ధర: రూ. 17,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 4 Gen 1 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.67 అంగుళాలు కెమెరా: 48 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్మీ (realme) 10 Pro 5G ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.72 అంగుళాలు కెమెరా: 108 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే... వన్ప్లస్ (OnePlus) Nord CE 2 Lite 5G ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 695 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.59 అంగుళాలు కెమెరా: 64 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh రియల్ (realme) 9 5g SE ధర: రూ. 16,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 778G ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు (16.76 సెం.మీ.) కెమెరా: 48 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! రియల్మీ (realme) 9 ధర: రూ. 16,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, స్నాప్డ్రాగన్ 680 ర్యామ్: 6 GB డిస్ప్లే: 6.4 అంగుళాలు కెమెరా: 108 MP + 8 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh శాంసంగ్ గెలాక్సీ A14 5G ధర: రూ. 16,499 ప్రాసెసర్: ఆక్టా కోర్, Samsung Exynos 1330 ర్యామ్: 4 GB డిస్ప్లే: 6.6 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP + 2 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరాలు, 13 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... ఒప్పో (OPPO) A78 5G ధర: రూ. 18,980 ప్రాసెసర్: ఆక్టా కోర్ , మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.56 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 8 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh మోటో (Moto) G73 ధర: రూ. 18,999 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 930 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.5 అంగుళాలు కెమెరా: 50 MP + 8 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh వివో (Vivo) Y56 ధర: రూ. 19,780 ప్రాసెసర్: ఆక్టా కోర్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ర్యామ్: 8 GB డిస్ప్లే: 6.58 అంగుళాలు కెమెరా: 50 MP + 2 MP డ్యూయల్ ప్రైమరీ కెమెరాలు, 16 MP ఫ్రంట్ కెమెరా బ్యాటరీ: 5000 mAh -
Ugadi 2023 బిగ్ ‘సి’: వినూత్నఫెస్టివ్ ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సి’ ఉగాది పండుగ సందర్భంగా వినూత్న ఆఫర్లు ప్రకటించింది.మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్ల కొనుగోలుపై ఆకర్షణీయ రాయితీలు అందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ యం.బాలు చౌదరి తెలిపారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై పదిశాతం వరకు క్యాష్ బ్యాక్తో పాటు ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండా సులభ ఈఎంఐలలో పొందొచ్చన్నారు. (March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!) స్మార్ట్ టీవీల కొనుగోలుపై 1,500 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుందన్నారు. సులభ ఈఎంఐ పద్ధతిలో ల్యాప్టాప్స్ కొనే సౌకర్యం కూడా ఉందన్నారు. ‘‘ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుంది. మా రిటైల్ స్టోర్లలో ఆన్లైన్ కంటే తక్కువ ధరలకే ఉత్పత్తులు లభిస్తాయి. ప్రజలంతా ఈ ఆఫర్లను వినియోగించుకోవాలి’’ అని బాలు చౌదరి కోరారు. బ్రాండెడ్ ఉపకరణాలపై 51 శాతం తగ్గింపు, ఐఫోన్ కొనుగోలుపై రూ.5,000 తక్షణ తగ్గింపు, రూ.2000 విలువైన అడాప్టర్ ఉచితం వంటి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లలో శాంసంగ్ మొబైల్పై రూ.పదివేలు, Vivoపై రూ.5,000, Oppo మొబైల్పై 10 శాతంతగ్గింపు లాంటివి ఉన్నాయి. (వాల్మార్ట్ భారీ పెట్టుబడులు: ఫోన్పే రూ. 1,650 కోట్ల సమీకరణ) -
వివో వీ 27 సిరీస్ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్.. ధరలు ఎలా ఉన్నాయంటే
సాక్షి,ముంబై: చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. టాప్ ఎండ్ మీడియా టెక్ సాక్ ప్రాపెసర్లతో వివో వీ27, వివో వీ27 ప్రో పేరుతో వీటిని తీసుకొచ్చింది. వివో వీ 27, వివో వీ 27 ప్రొ ఫీచర్లు ప్రాసెసర్ తప్ప వివీ వీ 27 సిరీస్ స్మార్ట్ఫోన్లు దాదాపు రెండూ ఒకే విధమైన ఫీచర్లతో వచ్చాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత FunTouch OS 13ని, 120Hz రిఫ్రెష్ రేట్తో 6.78-అంగుళాల పూర్తి-HD+(1,080x2,400 పిక్సెల్లు) AMOLED డిస్ప్లే, 4600mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా 50+2+8 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, అలాగే ఆటో ఫోకస్ 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. వివో వీ 27, వివో వీ 27 ప్రొ ధర, లభ్యత వివో వీ 27 ప్రొ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 39,999. టాప్-ఎండ్ మోడల్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 42,999. వివో వీ 27: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 32,999 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ రూ. 36,999 ఈ స్మార్ట్ఫోన్లు సిరీస్ మ్యాజిక్ బ్లూ, నోబుల్ బ్లాక్ షేడ్స్లో లభ్యం. ఫ్లిప్కార్ట్, వివొ ఆన్లైన్ స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ భాగస్వాముల ద్వారా విక్రయం. వివో వీ27 ప్రొ ప్రీ-బుకింగ్ ఈ రోజు (మార్చి 1) ప్రారంభం. మార్చి 6 నుండి సేల్ షురూ. ఇక వివో వీ27 సేల్ మార్చి 23 నుండి ప్రారంభం. అలాగే కస్టమర్లు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు కార్డు కొనుగోళ్ల ద్వారా మూడు వేలు తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు రూ. 2500 exchange బోనస్ కూడా లభిస్తుంది. -
యాప్.. ఏజ్ గ్యాప్!
సాక్షి, హైదరాబాద్: కొందరికి బిర్యానీ ఇష్టం.. ఇంకొందరికి వంకాయ అంటే మధురం.. మరికొందరికి పప్పన్నమే అమృతం.. ఇలా ఇష్టాలు మరెన్నో.. అదీ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల వారీగా భిన్నంగా ఉంటుంది. అందుకే ‘లోకో భిన్న రుచి’అన్న సామెత పుట్టింది. మరి ఒక్క భోజనం విషయంలోనేనా.. అన్ని వ్యవహారాలకూ ఈ నానుడి వర్తిస్తుంది. ఇది తేల్చేందుకే ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, యాప్ల వినియోగంపై వివిధ అధ్యయనాలు జరిగాయి. అన్ని అధ్యయనాలూ కొంచెం అటూఇటూగా ఒకే తరహా ఫలితాలను ఇవ్వడం గమనార్హం. అన్నీ కూడా లోకా ‘మొబైల్ యాప్స్’భిన్న రుచీ అన్నట్టుగా నివేదికలు ఇచ్చేశాయి మరి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 630 కోట్ల మందికిపైగా స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉన్నట్టు అంచనా. దీనికి తగ్గట్టుగానే మొబైల్ అప్లికేషన్స్ (యాప్స్) భారీగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఫోన్లు, యాప్ల వినియోగం బాగా ఎక్కువైంది. ఆఫీసులో, ఇంట్లో, వీధిలో, బెడ్పై ఉన్నా, భోజనం చేస్తున్నా, వాహనాల్లో ఉన్నా ఫోన్లను ఉపయోగించడం పెరిగిపోయింది. అయితే ఇందులో ఫోన్ మాట్లాడటానికి వినియోగించే సమయం తక్కువేనని.. 88శాతం సమయాన్ని యాప్స్లోనే గడుపుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక తరచూ ఫోన్ చెక్ చేసుకోవడం కూడా బాగా పెరిగిపోయినట్టు తేలింది. ఉదాహరణకు అమెరికన్లు సగటున రోజూ 262 సార్లు అంటే ప్రతి ఐదున్నర నిమిషాలకోసారి తమ ఫోన్ను చెక్ చేసుకుంటున్నట్టు వెల్లడైంది. వివిధ అధ్యయనాలు, పరిశీలనల్లో తేలినది ఇదీ.. ►24 ఏళ్లలోపు యువతరంలో 21శాతం రోజుకు యాభైకంటే ఎక్కువసార్లు ఒక యాప్ను ఓపెన్ చేస్తున్నారు. ►49 శాతం వినియోగదారులు రోజుకు 11 సార్లు యాప్లను తెరుస్తున్నారు. ►సగటు స్మార్ట్ఫోన్యూజర్ రోజుకు 10 యాప్లను.. నెలకు 30 యాప్లను ఉపయోగిస్తున్నారు. ►యాపిల్ యాప్ స్టోర్లో 1.96 మిలియన్ల యాప్లు, గూగుల్ ప్లేస్టోర్లో 2.87 మిలియన్ల యాప్లు ఉన్నాయి. ►గతేడాది మొత్తంగా 219 బిలియన్ల యాప్లను స్మార్ట్ ఫోన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ►ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం యాప్ డౌన్లోడ్లు ఉచితంగానే జరుగుతున్నాయి. ►సగటున ఒక్కో వ్యక్తి తమ ఫోన్లో 80 దాకా యాప్లను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. వీటిలో 62 శాతం యాప్లను నెలలో ఒకసారి కూడా ఉపయోగించడం లేదు ►2023లో మొబైల్ యాప్స్ ద్వారా 935 బిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత్ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్లకు భిన్నంగా మనదేశంలో వయసు వారీగా యాప్ల వినియోగంలో ప్రాధాన్యతలు వేరుగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా 18– 24 ఏళ్ల మధ్యవారు తమ మొబైల్స్లో గడిపే సమయం, వినియోగించే యాప్లకు.. 25ఏళ్లు, ఆపైనవారి అభిరుచులు, ప్రాధాన్యతలకు భిన్నంగా ఉన్నట్టు వెల్లడైంది. ►24 ఏళ్లలోపు యువతరం ఇన్స్టా, ట్రూకాలర్, ఫ్లిప్కార్ట్, ఎంఎక్స్ ప్లేయర్, టెలిగ్రామ్లను అధికంగా వినియోగిస్తున్నారు. ►25 ఏళ్లు, ఆపై వయసు వారు వాట్సాప్, ఫేస్బుక్, ఫోన్పే, అమెజాన్, ఫేస్బుక్ మెసెంజర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ►మహిళలు ఉపయోగించే టాప్–5 యాప్లలో వాట్సాప్, స్నాప్చాట్, మీషో, షేర్చాట్, మోజో ఉన్నాయి. ►పురుషులు ఎక్కువగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్రూకాలర్, ఫోన్పే, అమెజాన్లను వినియోగిస్తున్నారు. -
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 వస్తోంది.. ఆ స్మార్ట్ఫోన్ ధర భారీగా తగ్గింది!
కొత్త మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభావార్త. ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్న శాంసంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎస్23 వేరియంట్లను గ్రాండ్గా లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడళ్లను ఆవిష్కరించింది. అయితే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రాకతో గెలాక్సీ ఎస్22 ధర భారీగా తగ్గింది. ఒక ఫోన్ లాంచ్.. మరొక ఫోన్ భారీగా తగ్గింపు ఈ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్లో స్టాండర్డ్ మోడల్. గతేడాది గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22 అల్ట్రా మోడళ్లతోపాటు ఇది లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 లాంచ్ చేసినప్పుడు దీని ధర రూ.72,999. ఇప్పుడు 'గెలాక్సీ ఎస్23 సిరీస్ను విడుదల చేసిన నేపథ్యంలో గెలాక్సీ ఎస్22 స్టాండర్డ్ మోడల్ ఫోన్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.57,999. అలాగే ఇందులో 256జీబీ వేరియంట్ ధర రూ.61,999. శాంసంగ్ ఎస్22 ఫోన్ స్క్రీన్ సైజ్ 6.1 ఇంచులు. 120హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేటుతో ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ల్పేని కలిగి ఉంది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్సెట్ను కలిగిన ఈ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపీ మెయిన్ సెన్సర్, 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 10ఎంపీ టెలీఫోటో లెన్స్ ఉంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 10ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం. కొత్తగా లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కూడా దాదాపు ఇవే ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. అయితే గెలాక్సీ ఎస్23లో కొత్త కలర్ ఆప్షన్లు, అధిక బ్యాటరీ సామర్థ్యం, క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్సెట్ ఉన్నాయి. చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్, రూ. 5 లక్షలు దాటితే! -
వార్నింగ్: మీ స్మార్ట్ఫోన్లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
మొబైల్ వినియోగదారులకు అలర్ట్. స్మార్ట్ఫోన్లలో మాల్వేర్ మరోసారి కలకలం రేపుతోంది. ఈ సారి ఏకంగా రెండు వందలకు పైగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ప్రమాదకరంగా గుర్తించారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. ఈ యాప్స్ మీ పరికరాన్ని సులభంగా కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ పొంది అందులో డబ్బులు కూడా మాయం చేస్తాయి. థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ (DES), నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (NCSA) సంస్థలు ఈ ప్రమాదకరమైన యాప్లను గుర్తించాయి. వీటిని తొలగించేందుకు ఈ రెండు సంస్థలు ఇప్పటికే గూగుల్ (Google) యాపిల్ (Apple)ని సంప్రదించాయి. యాపిల్ తన కఠినమైన భద్రతా చర్యలతో తన iOSలో ఈ ప్రమాదాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. కానీ గూగుల్ ఈ ప్రమాదాన్ని ఎలా నివారిస్తుందన్నదే సమస్యగా మారింది. ఈ యాప్స్ అన్నింటినీ తొలగించాలని థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ కోరింది. ఈ యాప్స్ ద్వారా హ్యాకర్లు మీ మొబైల్ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. తద్వారా మీ మెసేజెస్ చదవడం, బ్యాంకింగ్ లావాదేవీలపై నిఘా పెట్టడం, వ్యక్తిగత వివరాలు సేకరించడం, ఏటీఎం పిన్, కార్డ్ వివరాలను తెలుసుకోవడం లాంటివి జరగొచ్చు. ఒకవేళ మీ డివైజ్లో ఈ యాప్లను ఇన్స్టాల్ చేసుంటే మీ బ్యాటరీ డ్రెయిన్ లేదా పరికరం పనితీరు మందగించడం లాంటివి మార్పులును గమనిస్తారు. కనుక మీ స్మార్ట్ఫోన్ పనితీరులో ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే అవసరం లేని యాప్స్ డిలిట్ చేయండి ఉత్తమం. లేదంటే డేటా బ్యాకప్ చేసి మొబైల్ను పూర్తిగా రీసెట్ చేయండి. -
గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ: లాంచింగ్ ముందే హల్చల్,ఐఫోన్కు ఝలక్?
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నెక్స్ట్ గెలాక్సీ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీన జరగనున్న అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఎస్ 23 సిరీస్లో మూడు కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలో ఈ సిరీస్ విడుదల కానుంది. ఈ క్రమంలో ధర, డిజైన్, ఫీచర్ల గురించి లీక్లు మొదలయ్యాయి. స్పెసిఫికేషన్ల పరంగా, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ 200ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్తో వస్తోంది. 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, రెండు 10ఎంపీ టెలిఫోటో సెన్సార్తో రియర్ క్వాడ్-కెమెరా మరో ప్రధాన ఆకర్షణ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ ఫీచర్లు 6.8 అంగుళాల 2x డైనమిక్ AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఆండ్రాయిడ్ 13 One UI 5.0 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 45 వాట్ ఛార్జింగ్ ధర (అంచనా) రూ. 1,14,990 యాపిల్ ఐఫోన్14 ప్రో మాక్స్కు షాక్? అయితే యాపిల్ 14 ప్రో మాక్స్తో పోలిస్తే 8జీబీ ర్యామ్ సహా, 200 ఎంపీ కెమెరా, డిస్ప్లే చివరికి ధర విషయంలో కూడా మెరుగ్గా ఉన్న శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్, యాపిల్కు గట్టి పోటీ ఇవ్వనుందని పలు అంచనాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. -
‘స్మార్ట్’ ఉచ్చులో కౌమారం.. గంటలు గంటలు ఫోన్లోనే
సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్కు విద్యార్థి దశలోని బాలబాలికలు బానిసలుగా మారిపోతున్నారు. డిజిటల్ పరికరాలపై గంటల కొద్దీ గడుపుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. 13–17 ఏళ్ల వారిలో 28 శాతం మంది రోజుకు 6 గంటలకు పైగా ఫోన్లోనే గడిపేస్తున్నారని సర్వేల్లో బహిర్గతమైంది. వీరు భౌతికంగా సమాజంతో కంటే సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కువగా బతికేస్తున్నారు. ఫలితంగా తరగతుల్లో పాఠాలు వింటున్నప్పుడు, అసైన్మెంట్లు, ఇతర పనులు చేస్తున్నప్పుడు ఏకాగ్రత లోపించి ఇబ్బంది పడుతున్నట్టు ఢిల్లీలోని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో కమ్యూనిటీ మెడిసిన్ స్పెషలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజజీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం కంటే సోషల్ మీడియాలో పరిచయస్తులనే ఎక్కువగా ఇష్టపడుతుండటాన్ని ప్రస్తావిస్తూ.. ఇది సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కామన్ సెన్స్ మీడియా అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఆన్లైన్ పోర్నోగ్రఫీలోకి యువత అనుకోకుండా జారిపోతున్నారని వెల్లడించింది. 1,350 మంది యుక్త వయస్కులు పాల్గొన్న సర్వేలో 58 శాతం మంది అనుకోకుండా అశ్లీల వీడియోలను వీక్షిస్తున్నట్లు వెల్లడైంది. సోషల్ మీడియా ద్వారానే.. ఆన్లైన్లో గేమ్స్ ఆడే టీనేజర్లకు ఆ గేమ్స్ ఆడే స్నేహితుల ద్వారా అశ్లీలత పరిచయం అవుతున్నట్టు సర్వేలో తేలింది. ఇందులో ఇంకా విస్తుగొలిపే విషయం ఏంటంటే.. 13 ఏళ్లలోపు వారిలో 50 శాతం మంది అలా పోర్న్ వీడియోలకు పరిచయం అవుతున్నట్లు సర్వే పేర్కొనడం. అయితే.. సోషల్ మీడియా, రీల్స్ ద్వారా ఎక్కువ మంది పోర్న్కు ఆకర్షితులు అవుతున్నారు. 44 శాతం మంది ఆన్లైన్ వెబ్సైట్లు, 4 శాతం మంది యూట్యూబ్ స్ట్రీమింగ్, 34 శాతం మంది సబ్స్క్రిప్షన్ సైట్లు, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అశ్లీలతను చూస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వినియోగ ప్రారంభ వయసును 13 నుంచి 15కు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది 10 ఏళ్ల లోపు చిన్నారులు కూడా సొంతంగా సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉన్నారని, నిబంధనలు ఎక్కడ అమలవుతున్నాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం అనేక అశ్లీల వెబ్సైట్లపై నిషేధం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడకపోవడం కూడా యువత పెడదారి పట్టడానికి కారణం అవుతోందని విమర్శిస్తున్నారు. నాలుగింట ఒక వంతు.. కౌమార దశలో (13–17 ఏళ్ల) ఉన్న పిల్లలు నాలుగింట ఒక వంతుకు పైగా రోజుకు ఆరు గంటలు దాటి స్మార్ట్ ఫోన్కే అతుక్కుపోతున్నారు. ఈ విషయంలో 2019లో జరిగిన సర్వేలో 15 శాతం మంది పిల్లలు స్మార్ట్ఫోన్ వదలట్లేదని అప్పట్లో తల్లిదండ్రులు చెబితే.. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ స్వచ్ఛంద సంస్థ 9,633 మంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. -
విమాన ప్రయాణం.. మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయమంటారు, ఎందుకో తెలుసా?
గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తే కాలక్షేపానికి మొబైల్ వాడకం సాధారణమే. అదే విమానంలో ప్రయాణం అంటే మాత్రం మన స్మార్ట్ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని లేదా ఎరోప్లేన్ మోడ్ లో పెట్టమని చెప్తుంటారు. అసలు బస్సు, రైలు, బైకు వీటిలో ప్రయాణించేటప్పుడు లేని ఈ నిబంధన కేవలం విమాన ప్రయాణంలోనే ఎందుకు పాటించాలి. మీ సెల్యులార్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరం విమానానికి నిజంగా ప్రమాదం కలిగించగలదా?అలా చేయడం వెనుకు దాగున్న సైంటిఫిక్ కారణాల పై ఓ లుక్కేద్దాం! విమాన ప్రయాణంలో మొబైల్ స్విచ్ ఆఫ్.. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ప్యాసింజర్లు వారి మొబైల్స్ను స్విచ్ ఆఫ్ చేయమని అందులోని సిబ్బంది చెప్తుంటారు. అయితే విమానంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం నిషేధించలేదు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA). కానీ ప్లైట్ అటెండెంట్స్ మాత్రం ఈ నిబంధన పాటించమని చెబుతుంటారు. దీనికి ప్రధాన కారణం సెల్ ఫోన్స్, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలే (Radio Frequencies). ఇవి విమానంలోని నావిగేషన్ కు ఉపయోగించే రేడియో తరంగాలు దాదాపుగా ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. దాంతో కాక్ పిట్ లో ఉండే ఏరోనాటికల్ వ్యవస్థకు ఇది అంతరాయం కలిగిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విమాన ప్రయాణం సజావుగా సాగాలన్నా, మన స్మార్ట్ఫోన్ ఉపయోగించలన్నా ఈ రెండు సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడి పని చేస్తాయి. అందుకే విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మీ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమని చెప్పేది. ఇప్పటి వరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ కారణంగా ఈ తరహా ప్రమాదాలు జరగలేదు. కాకపోతే.. విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ అనే ప్రక్రియ చాలా కీలకమైంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలా ఫోన్స్ ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అనేక విమానయాన సంస్థలు తమ విమానాల్లో వై-ఫై సేవలను కూడా ప్రారంభించాయి. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
సొంత ఓఎస్పై ప్రభుత్వ భారీ కసరత్తు: ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఖేల్ ఖతం?
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ యూజర్లకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుందా? సొంతంగా ఒక దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించి, వినియోగదారులకు మరింత సురక్షితమైన అనుభవాన్ని అందించే ప్రాజెక్ట్పై పని చేస్తోందని విశ్వసనీయంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారిక ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఇండ్ ఓఎస్ పేరుతో తీసుకురానుంది. ప్రభుత్వం, స్టార్టప్లు , విద్యాసంస్థల చొరవతో దీన్ని రూపొందిస్తోంది. ఎపుడు, ఎలా లాంచ్ చేస్తుందనే దానిపై స్పష్టతేదు. ఇది యూజర్లకు ఒక కొత్త భారతీయ OS సురక్షితమైన అనుభవాన్ని అందించడమే కాకుండా Google, Appleకి దీటుగా గట్టి పోటీ ఇస్తుందని అంచనా. కాగా ప్రస్తుతం, గూగుల్ ఆండ్రాయిడ్ 97 శాతం వాటాతో టాప్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా, ఐఫోన్కోసం రూపొందించిన ఆపిల్ ఐఓఎస్ వాటా పరిమితంగానే ఉంది. మరోవైపు నోకియా, శాంసంగ్, బ్లాక్బెర్రీ నోకియా, మైక్రోసాప్ట్ ,ఫైర్ఫాక్స్ లాంటి దిగ్గజాల ఆపరేటింగ్ సిస్టమ్స్ పెద్దగా ఆదరణకు నోచుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇండ్ఓఎస్ ఆవిష్కారంపై భారీ అంచనాలే ఉన్నాయి. -
లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్, డోంట్ మిస్!
హైదరాబాద్: నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ పర్వదినాలను పురస్కరించుకుని ప్రముఖ లాట్ మొబైల్స్ మెగా ఆఫర్స్ను ప్రకటించింది. సంస్థ డైరెక్టర్ ఎం.అఖిల్, బ్రాండ్ అంబాసిడర్ రష్మిక మందాన ఈ ఆఫర్లను ఆవిష్కరించారు. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై గిజ్మోర్ బ్లేజ్ ప్రో స్మార్ట్ కాలింగ్ వాచ్, టోరెటో స్మార్ట్ బ్లూమ్-3 స్మార్ట్ వాచ్, స్మార్ట్ బ్లూటూత్ నెక్ బాండ్ లభించనున్నట్లు ఈ సందర్భంగా విడుదలైన ప్రకటనలో అఖిల్ తెలిపారు. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధరపై 40 అంగుళాల టీవీ ఆఫర్ కూడా ఉందని పేర్కొన్నారు. రూ.8999కే స్మార్ట్ టీవీ, రూ16,500కే లాప్ టాప్స్ ఆఫర్ అమల్లో ఉందన్నారు. స్మార్ట్ మొబైల్స్ కొనుగోలుపై రూ.10,000 వరకూ క్యాష్ బ్యాక్, జీరో వడ్డీ, వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు, 70 శాతం వరకూ అష్యూర్డ్ పే బ్యాక్, టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్లకు 6 నెలల ఉచిత సర్వీస్, పలు ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు అఖిల్ వివరించారు. -
న్యూ ఇయర్ ధమాకా: జనవరిలో లాంచ్ కానున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే!
భారత్లో స్మార్ట్ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాకుండా 2022లో 5జీ సేవలు దేశంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో 5జీ టెక్నాలజీకి అనుగుణంగా వివిధ కంపెనీలు తన స్మార్ట్ఫోన్లను లేటెస్ట్ ఫీచర్లుతో తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇక ప్రస్తుతం కొత్త సంవత్సరం కావడంతో పలు బ్రాండెడ్ కంపెనీలు తమ ఫోన్లను గ్రాండ్గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వివిధ సెగ్మెంట్లలో అద్భుతమైన ఫీచర్స్తో స్మార్ట్ఫోన్లను తీసుకురానున్నాయి. ఈ జనవరిలో లాంచ్ కానున్న బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు వాటి ప్రత్యేకతలని తెలుసుకుందాం! Tecno Phantom X2 ►టెక్నో ఫాంటమ్ ఎక్స్2 (Tecno phantom X2) జనవరి 2న భారత్లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇటీవలే ఫాంటమ్ X2 ప్రోతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ► ఫాంటమ్ X2 6.8 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే ►ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ► ఇందులో 64MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ► 5,160mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Poco C50 ►పోకో సీ 50 (Poco C50) ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్లో నడుస్తుంది కాబట్టి Poco ఇండియా ఇంటి నుండి సరసమైన స్మార్ట్ఫోన్గా కనిపిస్తోంది. ►ఈ స్మార్ట్ఫోన్ 6.52-అంగుళాల HD+ డిస్ప్లే ► 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ► వెనుకవైపు 8MP డ్యూయల్ కెమెరాలు, 5MP సెల్ఫీ కెమెరా ► ఇది ఫింగర్ప్రింట్ రీడర్, 5,000mAh బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంది. Samsung Galaxy F04 ►సాంసంగ్ నుంచి మరో సరసమైన ఫోన్, గెలాక్సీ ఎఫ్ 04 (Galaxy F04 )జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ► 6.5-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్ప్లే ► 8GB RAM వరకు MediaTek Helio P35 చిప్సెట్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ► 5,000mAh బ్యాటరీ సపోర్ట్ Redmi Note 12 series ►రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) సిరీస్ భారతదేశంలో జనవరి 5 న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సిరీస్లో రెడ్మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5G), రెడ్మీ నోట్ 12 ప్రో (Redmi Note 12 Pro), రెడ్మీ నోట్ 12 ప్రో+ ( Redmi Note 12 Pro+) ఫోన్లు ఉన్నాయి. ►రెడ్మీ నోట్ 12 ఈ సంవత్సరం బేస్ Redmi నోట్ ఫోన్కు 5G కనెక్టివిటీని తీసుకువస్తుంది. అయితే రెడ్మీ నోట్ 12 ప్రో + అత్యధికంగా 200MP ప్రధాన కెమెరా సిస్టమ్, 120W ఫాస్ట్ ఛార్జింగ్తో రానుంది. iQOO 11 ►ఐక్యూ 11 సిరీస్లో రెండు ప్రీమియం మోడల్స్ జనవరి 10న భారత్లో గ్రాండ్గా లాంచ్ కానున్నాయి. ఇందులో ఒకటి ఐక్యూ 11 కాగా , మరొకటి ఐక్యూ 11 ప్రో. ►144 Hz రిఫ్రెష్ రిఫ్రెష్ రేట్, ►2K రెజల్యూషన్తో 6.78 ఇంచెస్ E6 అమోలెడ్ డిస్ప్లే ►పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ► ట్రిపుల్ కెమెరా సెటప్తో రానుంది. ► 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్తో వస్తోంది. -
బిగ్ అలర్ట్.. డెడ్లైన్ దగ్గరకొచ్చింది, ఈ ఫోన్లలో వాట్సాప్ బంద్!
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. జనవరి 1, 2023 నుంచి పలు స్మార్ట్ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. ఎందుకంటే.. వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా యూజర్ ఇంటర్ఫేస్ను మెరుగుపరచడంతో పాటు బగ్లను ఫిక్స్ చేసేందుకు ప్రతి వారం యాప్ అప్డేట్లను విడుదల చేస్తుంది. మెటా యాజమాన్యంలోని ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లేదా వెబ్కు అనుగుణంగా తాజా సిస్టమ్ సాఫ్ట్వేర్లకు సపోర్ట్లను అందించేందకు వాటికి అనుగుణంగా అప్డేట్లను లాంచ్ చేస్తుంది. ఈ కారణంగా, ప్రతి సంవత్సరం కొత్త అప్డేట్లపై దృష్టి పెట్టేందుకు పాత ఆపరేటింగ్ వెర్షన్లకు తన సపోర్ట్ని నిలిపివేస్తుంది. ఇదే తరహాలో ఈ సంవత్సరం కూడా, కొన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడల్లతో సహా పాత ఆపరేటింగ్ సిస్టమ్లతో పని చేస్తున్న దాదాపు 49 స్మార్ట్ఫోన్ మోడల్స్కు సపోర్ట్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది వాట్సాప్. ఈ మోడల్లో పని చేయదు.. ఇలా చేయాల్సిందే! పాత ఐఫోన్ మోడల్లో పని చేయదు. కనుక ఈ మోడల్ను ఉపయెగిస్తున్న వారు తమ హ్యాండ్సెట్లను iOS 12 లేదా కొత్తదానికి అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆండ్రాయిడ్ వాడుతున్న వినియోగదారులు వాట్సాప్ ఉపయోగించాలంటే Android OS 4.1 లేదా తర్వాత వెర్షన్లోకి మారాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్, భద్రతాపరమైన లోపాల వల్ల యూజర్లు ఈ మార్పును సహకరించాలని వాట్సాప్ కోరింది. నివేదిక ప్రకారం iOS 11, Android OS 4.. అంతకంటే పాత ఓఎస్ మొబైల్ ఫోన్ లకు డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ తన సపోర్ట్ను ఆపివేయనుంది. గడువు ముగిసిన హ్యాండ్సెట్ల జాబితాలో Apple, Samsung, LG, Huawei, ఇతర కంపెనీలకు చెందిన 49 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న ఫోన్లు ఇవే.. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, చదవండి: అలర్ట్: ఆధార్ కార్డ్ వినియోగంపై కీలక మార్గదర్శకాలు విడుదల! -
ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. న్యూఇయర్కు వెల్కమ్ చెబుతూ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకు ఫ్లిప్కార్ట్ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభించనుంది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫోన్లతో పాటు ఇతర డివైజ్లను డిస్కౌంట్లకే దక్కించుకోవచ్చు. ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్లో ప్లస్ మెంబర్షిప్ సభ్యులు ఒకరోజు ముందు నుంచి అంటే డిసెంబర్ 15 నుంచి వారికి నచ్చిన ప్రొడక్ట్కు కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ విక్రయాల్లో అర్హులైన కష్టమర్లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. కొద్ది రోజుల క్రితం ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ను నిర్వహించింది. ఆ సేల్ మిస్సైన వాళ్లు ఈ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ పాల్గొనవచ్చు. స్మార్ట్ ఫోన్లతో పాటు, డిస్కౌంట్ ధరలో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్, మానిటర్లు, ప్రింటర్లు సహా ఎలక్ట్రానిక్స్పై 80 శాతం వరకూ డిస్కౌంట్స్, టీవీలు, గృహోపకరణాలపై 75 శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది. -
స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు తప్పడం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మొబైళ్లను విచ్చలవిడిగా ఉపయోగించడంతో భార్యాభర్తలు, అతి సన్నిహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అవసరమున్నా, లేకపోయినా సమయం, సందర్భం లేకుండా స్మార్ట్ఫోన్లలో మునిగిపోవడం చాలా మందికి అలవాటు అయ్యింది. కొంతమందిలో వ్యసనంగా మారడంతో పరిణామాలు సమాజాన్ని కలవర పరుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత ఒక వరంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎన్నో అవసరాలను తీరుస్తోంది. ఐతే ఈ టెక్నాలజీని మితిమీరి ఉపయోగిస్తే పెనుసమస్యగా మారుతోంది. మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల అతి వినియోగం వల్ల వివాహిత జంటల సంబంధాల్లో, మానసికంగా చూపుతున్న ప్రభావం, స్వభావంలో వస్తున్న మార్పులపై ‘స్మార్ట్ఫోన్స్ అండ్ దెయిర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రిలేషన్షిప్స్–2022’అనే అంశంపై వీవో–సైబర్ మీడియా పరిశోధన చేసింది. అందులో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలను ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ స్విచ్ఛాఫ్ స్టడీలో వెలువరించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణేలలోని స్మార్ట్ఫోన్ల వినియోగదారులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫోన్ వాడకంలో వస్తున్న ట్రెండ్స్, అతి వినియోగంతో వస్తున్న మార్పులను విశ్లేషించింది. జెండర్తో సంబంధం లేకుండా భర్త/భార్య సగటున రోజుకు 4.7గంటలు స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. తమతో కాకుండా ఫోన్తో గడుపుతున్నారంటూ తమ జీవిత భాగస్వామి తరచూ ఫిర్యాదు చేస్తుంటారని 73శాతం మంది అంగీకరించారు. ఇంకా మరెన్నో విషయాలను అధ్యయనం వెల్లడించింది. ముఖ్యాంశాలు ►అవకాశమున్నా కూడా తమ భార్య/భర్తతో కాకుండా ఎక్కువ సమయం మొబైళ్లతోనే సమయం గడుపుతున్నామన్న 89% మంది. ►స్మార్ట్ఫోన్లలో మునిగిపోయి కొన్నిసార్లు తమ చుట్టూ పరిసరాలనూ మరిచిపోయామన్న 72 శాతం మంది. ►తమ వారితో సమయం గడుపుతున్నపుడు కూడా ఫోన్లను చూస్తున్నామన్న 67% మంది. ►స్మార్ట్ఫోన్ల మితిమీరి వినియోగం వల్ల తమ భాగస్వాములతో సంబంధాలు బలహీనపడినట్టు 66 శాతం మంది. అంగీకారం. ►అతిగా ఫోన్ వాడకంతో మానసికమైన మార్పులు వస్తున్నాయని, స్మార్ట్ఫోన్ వాడుతున్నప్పుడు భార్య కలగజేసుకుంటే ఆవేశానికి లోనవుతున్నామన్న 70 శాతం ►ఫోన్ కారణంగా భార్యతో మాట్లాడుతున్నపుడు కూడా మనసు లగ్నం చేయలేకపోతున్నామన్న 69 శాతం మంది. ►భోజనం చేస్తున్నపుడు కూడా ఫోన్లను ఉపయోగిస్తున్నామన్న 58 శాతం మంది. ►లివింగ్రూమ్లో స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 శాతం ►రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఫోన్లు చూస్తున్నవారు 86 శాతం ►జీవితంలో ఒకభాగమై పోయిన స్మార్ట్ఫోన్లను వేరు చేయలేమన్న 84 శాతం ►తీరిక సమయం దొరికితే చాలు 89% మంది ఫోన్లలో మునిగిపోతున్నారు ►రిలాక్స్ కావడానికి కూడా మొబైళ్లనే సాధనంగా 90% మంది ఎంచుకుంటున్నారు. స్క్రీన్టైమ్పై స్వీయ నియంత్రణ అవసరం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆకర్షణకు లోనయ్యే, గంటలు గంటలు అందులోనే మునిగేపోయేలా చేసే గుణం స్మార్ట్ ఫోన్లలో ఉంది. అది ‘అటెన్షెన్ సీకింగ్ డివైస్’కావడంతో బయటకెళ్లినా, ఇంట్లో ఉన్నా పది నిమిషాలు కాకుండానే మొబైళ్లను చెక్ చేస్తుంటాం. వాడకపోతే కొంపలు మునిగేదేమీ లేకపోయినా అదో వ్యసనంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లోనూ తాము బిజీగా ఉన్నామని చూపెట్టేందుకు సెల్ఫోన్లు ఉపయోగిస్తుంటారు. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చాక అత్యవసరమైతే తప్ప మొబైళ్లు ఉపయోగించరాదనే నిబంధన వివాహితులు పెట్టుకోవాలి. బెడ్రూమ్లో ఫోన్లు వినియోగించరాదనే నియమం ఉండాలి. రోజుకు ఇన్ని గంటలు మాత్రమే సెల్ఫోన్ వాడాలనే నిబంధన పెట్టుకోవాలి. ఉపవాసం మాదిరిగా వారానికి ఒకరోజు అత్యవసరమైతే తప్ప ఫోన్ ఉపయోగించకుండా చూసుకోవాలి. మొబైల్ అధిక వినియోగ ప్రభావం తమ జీవితాలపై, సంబంధాలపై ఏ మేరకు పడుతోందనే జ్ఞానోదయమైతే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్లో అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘స్మార్ట్ఫోన్ అప్గ్రేడ్ డేస్’ పేరుతో డిస్కౌంట్ సేల్కు తెర తీసింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు స్మార్ట్ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. ముఖ్యంగా కొన్ని 5జీ మోడల్స్తోపాటు, వన్ప్లస్ 10 ప్రొ, ఐఫోన్ 14, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 సహా అనేక స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినవారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ లభ్యం. కనిష్టంగా రూ. 5,000 కొనుగోలు చేసిన వినియోగదారులు రూ. 1,000 వరకు (పది శాతం) తగ్గింపు పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ దారులు కనీసం రూ. 1,250 వరకు పది శాతం తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ రూ. 9,699కి లభ్యం. ఐక్యూ జీ6 లైట్ 13,999 కి లభిస్తుంది. రెడ్మీ ఏ1 డిస్కౌంట్ అనంతరం రూ. 6,119 కి లభిస్తుంది.రెడ్మీ 11ప్రైమ్ 5జీ రూ. 11,999, రెడ్ మీ నోట్ 11 రూ. 10,999లకు కొనుగోలు చేయ వచ్చు. ఒప్పో ఎఫ్ 21ఎస్ ప్రొ 5జీ: ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొ 5జీ రూ. 24,499కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ఆఫర్గా అదనంగా రూ. 3,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఇంకా ఒప్పో ఏ సిరీస్లో, ఒప్పో ఏ76, ఏ77 వరుసగా రూ. 15,490. రూ. 16,999కి అందుబాటులో ఉన్నాయి. లావా: ఇక స్వదేశీ బ్రాండ్, లవా బ్లేజ్ NXTని రూ.8,369కి సొంతం చేసుకోవచ్చు. అలాగే లావా జెడ్3 రూ.6,299కే లభ్యం. టెక్నో టెక్నో పాప్ 6 ప్రో రూ.5,579కి, టెక్నో స్పార్క్ 9 రూ.7,649కి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇటీవల తీసుకొచ్చిన పోవా 5జీ , టెక్నోకేమాన్ 19 మాండ్రియన్ వరుసగా రూ. 14,299 ,రూ. 16,999కి అందుబాటులో ఉంటాయి. -
108 ఎంపీ కెమెరాతో అదిరిపోయే 5జీ స్మార్ట్ఫోన్, ఫస్ట్ సేల్ ఆఫర్ కూడా!
సాక్షి,ముంబై: రియల్మీ 10 ప్రో 5జీ సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. రియల్మీ 10 ప్రో 5జీ రెండు వేరియంట్లలో,డార్క్ మ్యాటర్, హైపర్ స్పేస్, నెబ్యూలా బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోంది. రియల్మీ 10 ప్రోప్లస్ 5జీ కూడా మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. రియల్మీ 10 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు 6.72 ఫుల్హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 680నిట్స్ పీక్ స్నాప్డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 13 108+2 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 33 వాట్ ఛార్జింగ్ ధరలు, ఆఫర్ రియల్మీ 10 ప్రోప్లస్ 5జీ 14 నుంచి డిసెంబరు నుంచి ఫస్ట్ సేల్ షురూ అవుతుంది. కాగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. రియల్మీ 10 ప్రో 5జీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ రూ.19,999 ధరతో వచ్చింది. డిసెంబరు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా లభ్యంకానుంది. లభిస్తుంది. రియల్మీ అధికారిక వెబ్సైట్లోనూ ఈ మొబైల్ సేల్కు వస్తుంది. -
రియల్మీ10 ప్రొ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్, ధర తక్కువే!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రియల్మి సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. చైనాలో రియల్మి 10 ప్రో సిరీస్ను కంపెనీ ఆవిష్కరించింది. రియల్మి ప్రొ, రియల్మి ప్రొ ప్లస్ 5జీ రెండు వేరియంట్లలో కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. త్వరలోనే ఈ ఫోన్లను భారత మార్కెట్లో తీసుకొస్తామని స్పష్టం చేసింది. ఇవి స్టార్లైట్ గోల్డ్, నైట్ బ్లాక్, సీ బ్లూ రంగుల్లో లభ్యం. రియల్మి 10 ప్రో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే స్నాప్డ్రాగన్ 695 SoC, ఆండ్రాయిడ్ 13 108+ 2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరా 16ఎంపీ సెల్పీ కెమెరా 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ధరలు: 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సుమారు రూ. దాదాపు రూ. 18,300 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 21,700 రియల్మి 10 ప్రో ప్లస్ 5జీ 6.72 అంగుళాల ఫుల్హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 800నిట్స్ పీక్, Snapdragon 695 SoC, ఆండ్రాయిడ్ 13 108+2 ఎంపీ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000mAh బ్యాటరీ 67 వాట్ ఛార్జింగ్ ధరలు 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సుమారు రూ. 19,444 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 22,900 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ దాదాపు రూ. 26,300 -
మొబైల్ ఫోన్ చార్జర్ల కష్టాలకు చెక్.. ఈ ఐడియా అదిరింది!
న్యూఢిల్లీ: త్వరలో మొబైల్ ఫోన్ చార్జర్ల కష్టాలకు తెరపడనుంది. ఉన్నట్టుండి చార్జింగ్ అయిపోతే, మరొకరి ఫోన్ చార్జర్తో అవసరం గట్టెక్కవచ్చు. ఇందుకు వీలుగా ఒకేరకమైన చార్జింగ్ పోర్ట్ను దశలవారీగా అమలు చేయడానికి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు అంగీకారం తెలిపాయి. ఈ విషయాన్ని కేంద్ర విని యోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఏకరూప చార్జింగ్ పోర్ట్ సాధ్యా సాధ్యాలను పరిశీలించడానికి ఉప కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని అంతర్గత మంత్రిత్వశాఖల టాస్క్ఫోర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఏఐటీ, ఫిక్కీ, సీఐఐ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ భువనేశ్వర్, ఐఐటీ వారణాసి విద్యా సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు తదితర ఎలక్ట్రానిక్ డివైజ్లను యూఎస్బీ టైప్–సీ చార్జింగ్ పోర్ట్తో తీసుకొచ్చేందుకు పరిశ్రమ ప్రతినిధులు సమ్మతి తెలిపారు. చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
దుమ్ము లేపుతుంది, భారత్లో ఎక్కువగా అమ్ముడవుతున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే
ఫెస్టివల్ సీజన్లో తమ సంస్థకు చెందిన ఫోన్లు భారత్లో భారీగా అమ్ముడు పోయినట్లు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తెలిపింది. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య కాలంలో రూ.14,400 కోట్ల విలువైన ఫోన్లను అమ్మినట్లు వెల్లడించింది. 2022 మొదటి మూడు త్రైమాసికాలలో ప్రీమియం కేటగిరీ స్మార్ట్ఫోన్లలో 99 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ సీనియర్ అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ మాట్లాడుతూ..ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి కేవలం 60 రోజుల వ్యవధిలో రూ.14,400 కోట్లను ఆర్జించినట్లు చెప్పారు. జనవరి - సెప్టెంబర్ మధ్య కాలంలో 5జీ స్మార్ట్ఫోన్ విలువ పరంగా సంవత్సరానికి ప్రాతిపదికన కంపెనీ 178 శాతం అమ్మకాలు జరిపిందని అన్నారు. గతేడాది పండుగ సమయంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది సంస్థ వృద్ధి రెండంకెల స్థాయికి చేరుకుందన్నారు. సంస్థ వృద్ధికి దోహదపడిన వాటిలో ‘శాంసంగ్ (ఫోన్లపై ఫైనాన్స్) ఫైనాన్స్ ప్లస్’ ఒకటని చెప్పారు. పండుగ సీజన్లో ఈ ప్లాట్ఫారమ్లో లావాదేవీలు 3 రెట్లు వృద్ధితో 10 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్లు జరిగాయని పునరుద్ఘాటించారు. చదవండి👉 ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్ ఎక్కువగా అమ్ముడవుతున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే వినియోగదారులు ఎక్కువ 5జీ, ప్రీమియం ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. రూ.10,900 నుంచి 5జీ ప్రారంభ ధర ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సంస్థ సుమారు 20 రకాల మోడళ్లలో 5జీ నెట్వర్క్ను వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించింది. నవంబర్ 15 నాటికి కంపెనీ అన్ని 5జీ ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, చాలా స్మార్ట్ఫోన్లు ఇప్పటికే 5జీ సేవల్ని వినియోగించేకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు బబ్బర్ తెలిపారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం..జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్ పరంగా 18 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్ఫోన్ విక్రయదారుగా నిలిచింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్గా స్థానాన్ని దక్కించుకుంది. చదవండి👉 ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
వివో బిగ్ దీపావళి ఆఫర్స్: రూ.101లకే స్మార్ట్ఫోన్ మీ సొంతం!
దీపావళి సందర్భంగా ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ ‘వివో’ తన ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లతో ‘బిగ్ జాయ్ దీపావళి’ కార్యక్రమాన్ని ప్రకటించింది. వివో ఎక్స్80 సిరీస్, వివో వీ25 సిరీస్, వై75 సిరీస్, వై35 సిరీస్, ఇతర వై సిరీస్ స్మార్ట్ ఫోన్లపై ఇప్పటి వరకు లేనంత డిస్కౌంట్ను ఇస్తున్నట్టు తెలిపింది. వివో ఎక్స్80 సిరీస్పై రూ.8,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. వివో 25 సిరీస్ ఫోన్లపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇతర బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు ఈఎంఐపై ఈ ప్రయోజనాలు అందిస్తోంది. ముందు రూ.101 చెల్లించి ఎక్స్, వీ సిరీస్లో నచ్చిన ఫోన్ను తీసుకెళ్లొచ్చని వివో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లో రూ.101 ప్రారంభంలో చెల్లించి ఆ తర్వాత ఈఎంఐ ( EMI) కట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీని పై వివో పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది. ఈ ఆఫర్పై పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని వివో రిటైలర్ సంప్రదించడం ఉత్తమం. రూ.15వేలకు పైన ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినా, ఆరు నెలల అదనపు వారంటీ ఇస్తున్నట్టు తెలిపింది. వై సిరీస్ ఫోన్లను ఈఎంఐపై తీసుకుంటే రూ.2,000 క్యాష్బ్యాక్ ఇస్తున్నట్టు పేర్కొంది. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి: TwitterDeal మస్క్ బాస్ అయితే 75 శాతం జాబ్స్ ఫట్? ట్విటర్ స్పందన -
కస్టమర్లకు రియల్ మీ మరింత మెరుగైన సేవలు
న్యూఢిల్లీ: రియల్ మీ తన కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ‘రియల్ మీ కేర్ సర్వీస్ సిస్టమ్’ను ప్రారంభించింది. కంపెనీ రెండో దశ వృద్ధిలోకి అడుగు పెట్టిందని, దీంతో కస్టమర్ల అంచనాలకు మించి సేవలను అందించనున్నట్టు రియల్మీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల కస్టమర్లు ఆన్లైన్, ఆఫ్లైన్ టచ్ పాయింట్ల ద్వారా, వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా, 1,000కి పైగా సర్వీస్ సెంటర్ల రూపంలో సులభంగా సేవలను పొందొచ్చని తెలిపింది. సోషల్ మీడియా, ఈమెయిల్, వాయిస్, వాట్సాప్, వెబ్ చాట్పై ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కస్టమర్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
ఈ ఫోన్పై బోలెడు ఆఫర్లు, 90 శాతం వరకు తగ్గింపు కూడా!
ఫెస్టివల్ సీజన్లో ప్రజలు షాపింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే కంపెనీల తమ ఉత్పత్తులపై బోలెడు ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉంటాయి. తాజాగా దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తమ కస్టమర్ల కోసం బిగ్ దీపావళి సేల్ నిర్వహిస్తోంది. ఇందులో ప్రాడెక్ట్స్పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఇక ప్రత్యేకంగా స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఫ్లిప్కార్ట్. ఈ సేల్ సందర్భంగా వివో (Vivo) స్మార్ట్ఫోన్ను (Smart Phone) ఏకంగా 90 శాతం డిస్కౌంట్తో అందిస్తోంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ వివరాలపై ఓ లుక్కేయండి! అదిరే ఆఫర్లతో వివో టీ1 44డబ్ల్యూ వివో కంపెనీకి చెందిన టీ1 44డబ్ల్యూ( Vivo T144w) ఫోన్పై కళ్లు చెదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్పై ఈ ఫోన్ పని చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ (Qualcomm Snapdragon) 680 ప్రాసెసర్ ఉంది. అలాగే, ఈ స్మార్ట్ఫోన్లో 50MP ప్రధాన కెమెరా సెన్సార్ ఉంది. ఇది తక్కువ బ్రైట్నెస్తో అదిరిపోయే ఫోటోలను తీస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ అమొలెడ్ డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 90% వరకు తగ్గింపు.. ఎలా అంటారా! ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.19,990 ఉంది. ప్రస్తుతం బిగ్ దీపావళి సేల్ సందర్భంగా, ఈ ఫోన్ను 27 శాతం తగ్గింపుతో రూ.14,499కే కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. అంతేనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా కోటక్ బ్యాంక్ కార్డుల ద్వారా చేసిన చెల్లింపుపై అదనంగా మరో రూ.1,000 తగ్గింపు కూడా ఉంది. ఈ ఫోన్పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.13,600 వరకు తగ్గింపు ఉంది. వీటన్నింటికి కలిపి చూస్తే 90 శాతం వరకు తగ్గింపుతో ఈ ఫోన్ను కస్టమర్లు ఈ స్మార్ట్ఫోన్ని సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఫోన్ను ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
దీపావళి షాపింగ్: ఈ స్పెషల్ ఆఫర్స్ తెలుసుకుంటే బోలెడు డబ్బు ఆదా!
భారత్లో అక్టోబర్ నెల వచ్చిందంటే పండుగ సంబురాలు ప్రారంభమైనట్లే. కంపెనీలు కూడా కస్టమర్ల కోసం ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. దసరా ముగిసిందో లేదో కొద్ది రోజుల్లోనే దీవాళి కూడా దగ్గర పడడంతో ఈ ఆఫర్ల సందడి మరింత పెరిగింది. సాధారణ రోజుల్లో షాపింగ్ చేసే ప్రజలు పండుగ సమాయాల్లో మరింత ఆసక్తి చూపుతారు. అందుకే ఆ సమయాల్లో వాహనాలు, గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లుతో పాటు ఇతర వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుండగా, మరో వైపు బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు కూడా వివిధ రకాల డిస్కౌంట్లతో కస్టమర్లని పలకరిస్తుంటాయి. అయితే ప్రజలు మాత్రం ఈ పండుగ సమయాల్లో.. మార్కెట్లో ఉండే ప్రత్యేక ఆఫర్లు ద్వారా ఎక్కువ లబ్ధి పొందే వాటిని తెలుసుకుని ఆపై షాపింగ్ చేస్తే మంచిదని నిపుణులు సూచన. క్యాష్బ్యాక్, డిస్కౌంట్లు క్యాష్బ్యాక్లు, డిస్కౌంట్లు అత్యంత ప్రజాదరణ పొందినవి. కొనుగోలు చేసేటప్పుడు ముందస్తు ఖర్చులలో కొంత భాగాన్ని ఇవి తగ్గిస్తాయి. అవి సాధారణంగా ఏడాది పొడవునా ఉన్నప్పటికీ పండుగ సమయాల్లో ఇవి మరింత డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయి. గాడ్జెట్లు, దుస్తులు, ఇల్లు & వంటగదికి అవసరమైన వస్తువులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కొనుగోలు చేయాలని చూస్తున్న కస్టమర్లు ఇలాంటి ఆఫర్లతో లబ్ధి పొందవచ్చు. క్రెడిట్ కార్డ్లు కూడా మీకు బెస్ట్ డీల్సీను అందిస్తాయి. ముఖ్యంగా ఎంపిక చేసుకునే ఆన్లైన్ ప్లాట్ఫాంలో కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై మరింతగా ప్రయోజనం ఉంటుందండోయ్. ప్రీ అప్రూవ్డ్ లోన్స్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ సంస్ధలో కస్టమర్లుగా ఉన్న వారితో పాటు ప్రైమ్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తాయి. అంటే ప్రీ అప్రూవ్డ్ లోన్లను అందిస్తుంటాయి. వీటి ప్రాసెసింగ్ చాలా వేగంగా ఉంటుంది. సాధారణంగా మనం లోన్ కోసం అప్లై చేసుకుంటే.. జరిగే సాగదీత ప్రక్రియ మొత్తం కూడా ఇందులో కనిపించదు. చాలా సులభంగా రుణాలు పొందవచ్చు. పలు బ్యాంకులు ప్రీమియం క్రెడిట్ కార్డులపై, ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ROI)పై పర్సనల్ లోన్ , హై లోన్-టు-వాల్యూ (LTV)పై హోం లోన్ ప్రీ-క్వాలిఫైడ్ ఆఫర్లను అందిస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, కారు రుణాలు, ఆస్తిపై రుణాలు (LAP) మొదలైన వాటిపై ప్రాసెసింగ్ ఫీజులను పాక్షికంగా లేక పూర్తిగా మాఫీ చేస్తుంటాయి. దీని వల్ల కస్టమర్లు వారి డబ్బును చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. వలన, రూ. 50 లక్షల గృహ రుణంపై ప్రాసెసింగ్ రుసుము రూ. 10,000 వరకు పెరగవచ్చు కాబట్టి గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయవచ్చు. కారు లోన్, హోమ్ లోన్ లేదా LAP వంటి పెద్ద లోన్ల కోసం దరఖాస్తు చేసే వారు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ వంటి వాటితో నగదు ఆదా అవుతుంది. చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
వావ్.. రూ.10వేలకే బోలెడు ఫీచర్లతో 5జీ స్మార్ట్ఫోన్!
దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కంపెనీలు కూడా కస్టమర్లకు 5జీ అధునాతన టెక్నాలజీ సర్వీసును అందించే క్రమంలో బిజీ అయ్యాయి. అయితే కొన్ని మొబైల్స్కి మాత్రం ఈ 5జీ టెక్నాలజీ సపోర్ట్ చేయదన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మొబైల్ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జీ సేవలు అందించే స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహులు చేస్తున్నాయి. ఈ క్రమంలో రూ. 10వేలకే 5జీ మొబైల్ తీసుకురానున్నట్లు ఇండియన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ప్రకటించింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన ఐఎంసీ 2022 ఈవెంట్లో లావా బ్లేజ్ (Lava Blaze 5G)ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో దొరికే 5జీ ఫోన్లలో ఇదే అతి చౌకైందని, ఈ దీపావళికి ప్రీబుకింగ్స్తో కస్టమర్లకు ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ బడ్జెట్ 5G ఫోన్ కీలక ఫీచర్లు ఇవే! ►5G సపోర్ట్ స్మార్ట్ఫోన్, ► మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, ►1600×720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్తో 6.5 ఇంచెస్ LCD స్క్రీన్, ►90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ►5000mAh బ్యాటరీ, బ్లూ, గ్రీన్ కలర్స్ ► 50mp రియర్ కెమెరా, 8 mp ఫ్రంట్ కెమెరా ►4GB RAM, 128GB ►5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్లు ఉన్నాయు చదవండి: Airtel 5g: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
స్మార్ట్ఫోన్ల పండగ వచ్చింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ పండుగల సీజన్లో 5.17 కోట్ల యూనిట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. వీటి విలువ రూ.1.44 లక్షల కోట్లు ఉంటుందని టెక్నాలజీ మార్కెట్ రిసర్చ్ కంపెనీ టెక్ఆర్క్ వెల్లడించింది. 2022లో స్మార్ట్ఫోన్ విక్రయాల ద్వారా కంపెనీలకు వచ్చే మొత్తం ఆదాయంలో ఇది 43 శాతానికి సమానం. యూనిట్ల పరంగా చూస్తే అమ్ముడయ్యే మొత్తం పరిమాణంలో వీటి వాటా 31.9 శాతం. 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో 58.7 శాతం యూనిట్లు రూ.6–12 వేల ధరల శ్రేణి మోడళ్లు ఉంటాయి. ఈ విభాగంలో ఆదాయం అత్యధికంగా రూ.12–25 వేల శ్రేణిలో నమోదు కానుంది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ఆన్లైన్ మార్కెట్ప్లేస్, ఈ–కామర్స్ స్టోర్లు అత్యధికంగా 65–68 శాతం చేజిక్కించుకోనునున్నాయి. ఏడు కంపెనీలదే.. ఇక 5జీ స్మార్ట్ఫోన్లు 30.2 శాతం వాటాతో 1.56 కోట్ల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళతాయని టెక్ఆర్క్ అంచనా. సీజన్లో కంపెనీలు అందుకునే ఆదాయంలో వీటి వాటా ఏకంగా 66.7 శాతం ఉండనుంది. 5జీ విషయంలో పరిమాణం పరంగా రూ.25–50 వేల ధరల శ్రేణి మోడళ్ల వాటా 37.8 శాతం, విలువ పరంగా రూ.50 వేలు ఆపైన ధర కలిగిన మోడళ్ల వాటా 66.9 శాతం ఉండే చాన్స్ ఉంది. అమ్ముడయ్యే మొత్తం స్మార్ట్ఫోన్లలో యాపిల్, శామ్సంగ్, వన్ప్లస్, వివో, ఒప్పో, రియల్మీ, షావొమీ కలిపి 90 శాతం పరిమాణం కైవసం చేసుకుంటాయి. మేకిన్ ఇండియా ఫోన్లు.. ఈ ఏడాది ఏప్రిల్–జూన్లో మేకిన్ ఇండియా ఫోన్లు 4.4 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16 శాతం అధికమని కౌంటర్పాయింట్ రిసర్చ్ తెలిపింది. ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఈ స్థాయి వృద్ధికి కారణం. స్మార్ట్వాచ్, ట్రూ వైర్లెస్ స్టీరియో, నెక్బ్యాండ్, ట్యాబ్లెట్ పీసీ వంటి ఉత్పత్తుల తయారీ సైతం అధికం అయింది. మేకిన్ ఇండియా స్మార్ట్ఫోన్లలో 24 శాతం వాటాతో ఒప్పో అగ్రస్థానంలో నిలిచింది. శామ్సంగ్, వివో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. థర్డ్ పార్టీలు సైతం.. స్మార్ట్ఫోన్ విభాగంలో కంపెనీలు సొంతంగా తయారు చేసినవి 66 శాతం కాగా, మిగిలినది థర్డ్ పార్టీ కంపెనీలు రూపొందించినవి. స్మార్ట్ఫోన్ల రంగంలో భారత్ ఎఫ్ఐహెచ్, డిక్సన్, డీబీజీ కంపెనీలు థర్డ్ పార్టీ విభాగంలో ముందు వరుసలో ఉన్నాయి. 75 శాతం స్మార్ట్వాచ్లను ఆప్టీమస్ ఉత్పత్తి చేయడం విశేషం. ట్యాబ్లెట్ పీసీల్లో వింగ్టెక్, శామ్సంగ్, డిక్సన్లు టాప్–3లో ఉన్నాయి. టీవీల విభాగంలో డిక్సన్, రేడియంట్, శామ్సంగ్, ఎల్జీ కంపెనీల వాటా 50 శాతం. -
వన్ప్లస్ దివాలీ సేల్.. కళ్లు చెదిరే డీల్స్
సాక్షి,ముంబై: ఫెస్టివ్ సీజన్లో కస్టమర్లను ఆఫర్ల వర్షం రారమ్మని పిలుస్తోంది. ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 23 నుంచి డిస్కౌంట్సేల్కు తెరలేవనుంది. మరోవైపు చైనీస్ స్మార్ట్ఫోన్ మొబైల్ దిగ్గజం వన్ప్లస్ అధికారిక వెబ్సైట్లో సెప్టెంబర్ 22 నుంచి దివాలీ సేల్ను ప్రారంభిస్తోంది. స్మార్ట్ఫోన్లు, టీవీఎస్ ఇయర్బడ్లు, టీవీలు, మరిన్నింటిపై డిస్కౌంట్లులభ్యం. అదనంగా, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డ్ హోల్డర్లు 6వేల వరకు తక్షణ తగ్గింపును పొందగలరు. 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్కూడా అందిస్తోంది. అంతేకాకుండా, దీపావళి హెడ్ స్టార్ట్ సేల్ 2022 వన్ప్లస్ ఉత్పత్తుల కోసం రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కూపన్లను కూడా అందిస్తుంది. అలాగే వన్ప్లస్ ఇండియా వెబ్సైట్లో ప్రస్తుతం ఫ్లిప్ అండ్ విన్ ఛాలెంజ్ కూడా ఉంది. ఈ సేల్లో ముఖ్యంగా వన్ప్లస్ 10 ప్రొను రూ 55,999 కి విక్రయిస్తోంది. దీని లాంచింగ్ ధర రూ 66,999. అంటే రూ 11,000 డిస్కౌంట్ ధరతో అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్తో పాటు డిస్కౌంట్లతో కలిపి ఈ మొత్తం తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే వన్ప్లస్ 10ఆర్ 5జీ 29,999లకే అందించనుంది. ఎంఆర్పీ ధర 34,999. అలాగే వన్ప్లస్ నార్డ్ 2టీ 5జీ ఫోన్నరెండవేల తగ్గింపుతో రూ. 26,999కే విక్రయించ నుంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో స్మార్ట్ఫోన్లు, అలాగే టీవీలు ఇతర ఉత్పత్తులను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. -
ఈవీ వాహనదారులకు శుభవార్త, ఫోన్ ఛార్జింగ్ కంటే ఫాస్ట్గా!
ప్రపంచ దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈవీలతో సుధీర్ఘ ప్రయాణాలు చేసే వాహనదారులకు ఛార్జింగ్ పెట్టుకునే సమయం ఎక్కువ పట్టడం, ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యల్ని అధిగమించేందుకు పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ పరిశోధనల్లో సత్ఫలితాలు నమోదవుతున్నాయని సైంటిస్ట్లు చెబుతున్నారు. ఇడాహో నేషనల్ లాబొరేటరీ (Idaho National Laboratory) సంస్థ ఛార్జింగ్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించేలా కొత్త పద్దతుల్ని సృష్టించినట్లు తెలిపింది. ఈ పద్దతులతో వాహనదారులు సెల్ ఫోన్ ఛార్జింగ్ కంటే వేగంగా..కేవలం 10 నిమిషాల్లో ఈవీ వెహికల్స్కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని ఇడాహో సైంటిస్ట్ ఎరిక్ డుఫెక్ స్పష్టం చేశారు. ఫాస్ట్గా ఛార్జింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కు పెట్టే ఛార్జింగ్ అన్నీ వాహనాలకు ఒకేలా ఉండదు. వాహనాన్ని బట్టి మారుతుంటుంది. కొన్ని ఈవీ బ్యాటరీలకు మొత్తం ఛార్జింగ్ పెట్టాలంటే సుమారు 40 నుంచి 50 గంటల సమయం పడుతుంది. మరికొన్నింటికి 20 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ పెట్టొచ్చు. ఉదాహరణకు ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో అగ్ర గామిగా ఉన్న టెస్లా సంస్థ 320 కిలోమీటర్ల ప్రయాణించే కార్లకు కేవలం 15 నిమిషాల్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదే కొత్త టెక్నిక్ ఎలక్ట్రిక్ బ్యాటరీలను ఛార్జింగ్ పెట్టే సమయంలో అనేక లోపాలు తలెత్తుతున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ పెడితే దీర్ఘకాలంలో బ్యాటరీకి హాని కరం. ఒక్కోసారి ఆ బ్యాటరీలో అగ్నికి ఆహుతైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే బ్యాటరీ లైఫ్ టైమ్ అంచనా వేస్తే ఫాస్ట్ చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందుకోసం డుఫెక్ బృందం మెషిన్ లెర్నింగ్ సాయంతో బ్యాటరీ లైఫ్ టైంను పరిశీలించింది. ఈ అల్గోరిథంలో 20,000 నుండి 30,000 డేటా పాయింట్లను అంచనా వేసింది. ఈ డేటా పాయింట్ల సాయంతో బ్యాటరీ మన్నికను గుర్తించి 10నిమిషాల్లో 90శాతం ఛార్జింగ్ పెట్టింది. ప్రస్తుతం 10నిమిషాల కంటే తక్కువ సమయంలో ఈవీలకు ఛార్జింగ్ పెట్టే పద్దతిపై తమ ప్రయోగాల్ని ముమ్మురం చేసినట్లు అమెరికాకు చెందిన ఇడాహో నేషనల్ లాబొరేటరీ తెలిపింది. -
5జీ పరుగులు ఒకవైపు.. ‘పాత తరం ఫోన్’ అడుగులు మరొకవైపు: ఏమిటో వింత పరిణామం!
స్మార్ట్ ఫోన్లు ప్రపంచమంతా విస్తరించి ఉన్నాయి. జనాభాలో 83 శాతం మందికిపైగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అంటే 600 కోట్ల మంది చేతుల్లో ఈ స్మార్ట్ ఫోన్ ఉంది. వన్జీ, టూజీ, త్రీజీ, ఫోర్జీ పోయి ఇప్పుడు 5జీ వైపు పరుగులు తీస్తోందీ స్మార్ట్ఫోన్. స్మార్ట్ఫోన్ల విజృంభణ ఇంతలా సాగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఓ వింత పరిణామం మెల్లమెల్లగా చోటు చేసుకుంటోంది. ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ల క్రితం మనం వదిలేసిన బేసిక్ ఫోన్ అంటే తొలి తరం సెల్ ఫోన్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. గత రెండు మూడేళ్ల నుంచి ఈ బేసిక్ ఫోన్ల అమ్మకాలు జోరందుకున్నాయి. బేసిక్ ఫోన్, డంబ్ ఫోన్, ఫీచర్ ఫోన్, బ్రిక్ ఫోన్ (మోటోరోలా తయారుచేసిన తొలి సెల్ఫోన్ ‘డైనాటాక్’ ఇటుక సైజులో ఉండేది) అని రకరకాల పేర్లతో పిలిచే తొలితరం సెల్ఫోన్ అమ్మకాలు ఇటీవల 100 కోట్ల మార్కుకు చేరుకుంది. బుల్లితెర, ప్రెస్ బటన్లు, క్వెర్టీ కీబోర్డు, స్నేక్ గేమ్, ఓ మాదిరి రేడియోతో ఫోన్ చేయడానికి, మెసేజులు పంపడానికి మాత్రమే ఉపయోగపడే ఇలాంటి డంబ్ ఫోన్ల కోసం గూగుల్లో సెర్చ్ చేసే వారి సంఖ్య 2018 నుంచి 2021 మధ్య 89 శాతం పెరిగింది. గత ఏడాది స్మార్ట్ ఫోన్ల విక్రయం 140 కోట్లు ఉండగా బేసిక్ ఫోన్ల అమ్మకం 100 కోట్లకు చేరిందని సాఫ్ట్ వేర్ కంపెనీ ‘సెమ్ రస్’ నివేదిక. బ్రిటన్ లో ప్రతి 10 మందిలో ఒకరి దగ్గర డంబ్ ఫోన్ ఉందని డెలాయిట్ చెబుతోంది. షేర్ మార్కెట్ కింగ్ వారెన్ బఫెట్ ఇటీవల కాలం వరకు సామ్సంగ్ బేసిక్ ఫోన్ ఎస్సీహెచ్– 320 వాడేవారు. ఇటీవల ఆయన ఐఫోన్కు మారారు. అదీ ఎవరో బహుమతిగా ఇచ్చిందే. ఆపిల్ కంపెనీలో షేర్లు ఉన్న బఫెట్ ఏ రోజూ ఐఫోన్ జోలికి వెళ్లలేదు. డంబ్ ఫోన్ తోనే కాలం గడిపారు. ఇప్పుడు కూడా ఈ ఐఫోన్–11ని కేవలం ఫోన్ లా మాత్రమే వాడతానంటున్నారు. సోషల్ మీడియా సైడ్ ఎఫెక్ట్ లెక్కలేనన్ని ఫీచర్లు, ఆడియో, వీడియో స్ట్రీమింగ్, జీపీఎస్ సౌకర్యం, ఇంటర్నెట్ ద్వారా సమస్త సమాచారం, సదుపాయాలు ప్రతి అవసరానికీ అంది వచ్చే యాప్లు ఉన్న స్మార్ట్ ఫోన్ లను వీడి.. చాలామంది మళ్లీ వెనక్కి సాధారణ బేసిక్ ఫోన్ వైపు మళ్లడానికి సోషల్ మీడియా ఓ ప్రధాన కారణం. అనేకానేక సౌకర్యాలను ఇచ్చే స్మార్ట్ ఫోన్స్ మోజులో కొట్టుకుపోయిన వీరంతా ఇప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ని గుర్తించి వెనక్కి వెళ్తున్నారు. ‘సోషల్ మీడియా యాప్స్ తో నిండిపోయిన నా ఫోన్తో నా రోజంతా గడిచి పోయేది. ఈ స్మార్ట్ ఫోన్తో నేనేం కోల్పోయానో అర్థం అయింది. అందుకే ఇప్పుడు పాత డంబ్ ఫోన్ కొన్నాను. నా వ్యక్తిగత జీవితం మళ్ళీ నా చెంతకు వచ్చింది’ అని లండన్కు చెందిన 17 ఏళ్ల రాబిన్ వెస్ట్ బీబీసీకి చెప్పింది. ‘ఫోన్ల అసలు అవసరం మరిచిపోయేలా చేసింది స్మార్ట్ ఫోన్. ఫోన్ చేసి నలుగురితో మాట్లాడటం మానేసి సోషల్ మీడియా సమాచారం, కామెంట్లు, లైకులు, షేరింగ్లతో కాలం గడిపేస్తున్నాం’ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన టెక్నాలజీ నిపుణులు ప్రొఫెసర్ సాండ్రా వాచర్ అంటున్నారు. ఓ సాధారణ వ్యక్తి ఏడాదిలో 52,925 నిమిషాలు సోషల్ మీడియాలో టైపింగ్ కోసం వెచ్చిస్తున్నట్లు బ్రిటన్కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ స్టార్లిస్ట్ వెల్లడించింది. అమెరికన్ పౌరుడు ఏడాదికి 109 రోజుల సమయాన్ని యాప్స్, వెబ్స్ చూడడంలో గడిపేస్తున్నాడు. స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారి 39 శాతం యువత నిద్రలేమితో సతమతమవుతున్నట్టు లండన్ కింగ్స్ కాలేజీ సైకాలజీ విభాగం పరిశోధనలో వెళ్లడైంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు వారికి బేసిక్ ఫోన్లు మాత్రమే అందిస్తున్నారు. పేదరికమూ ఓ కారణం ఫీచర్ ఫోన్ల వ్యాప్తికి పేదరికం కూడా ఒక కారణం. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో పేదరికంతో మగ్గుతున్న కోట్లాదిమందికి స్మార్ట్ ఫోన్లు కొనుగోలుచేసే శక్తి లేక చవకగా దొరికే బేసిక్ ఫోన్లతో అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకి 250 రూపాయలకన్నా తక్కువ ఆదాయం పొందుతున్న వారు 200 కోట్ల మంది ఉన్నారు. ఈ వర్గంలో బేసిక్ ఫోన్ల వాడకం ఎక్కువగా ఉందని కౌంటర్ పాయింట్ అనే పరిశోధనా సంస్థకు చెందిన అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ చెబుతున్నారు. భారతదేశంలో ఈ డంబ్ ఫోన్లను వాడుతున్న వారు 32 కోట్ల మంది ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించి భారత రిజర్వు బ్యాంకు బేసిక్ ఫోన్ల ద్వారా కూడా ఆన్లైన్ చెల్లింపులకు వీలు కల్పించే ప్రోగ్రాంలను రూపొందించింది. కరెంటు ఎక్కువగా అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాటరీ రీచార్జింగ్ సౌకర్యం తక్కువగా ఉంటుంది. అలాంటిచోట ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే నాలుగైదు రోజులు పనిచేసే బేసిక్ ఫోన్ ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ::: దొడ్డ శ్రీనివాసరెడ్డి చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
భారత్లో చైనా స్మార్ట్ ఫోన్లు ‘బ్యాన్’, స్పందించిన కేంద్రం!
వారం రోజుల క్రితం భారత ప్రభుత్వం రూ.12వేల లోపు చైనా ఫోన్లపై నిషేధం విధించబోతోంది అంటూ బ్లూమ్ బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా ఆ కథనంపై కేంద్రం స్పందించినట్లు తెలుస్తోంది. బ్లూమ్ బర్గ్ రిపోర్ట్పై కేంద్రం స్పందించినట్లు సమాచారం. చైనా సంస్థలైన షావోమీ, ఒప్పో, వివో ఫోన్లను భారత్లో అమ్మకుండా నిషేధం విధించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖకు ఉన్నతాధికారులు చెప్పినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వాస్తవానికి కేంద్రం రూ.12వేల లోపు ఫోన్లపై బ్యాన్ చేయాలని చర్చలు జరిపిన మాట నిజమేనని పేర్కొన్నాయి. కాకపోతే అవి చైనా ఫోన్లు కాదని, దేశీయ ఉత్పత్తి సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్ తో పాటు ఇతర కంపెనీలని హైలెట్ చేశాయి. గత కొంత కాలంలో భారత్..చైనా సంస్థలపై ఓ కన్నేసింది. ఆ దేశానికి షావోమీ,వివో,ఒప్పోలు దేశ చట్టాల్ని ఉల్లంఘించి మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు తేలింది. దీంతో సదరు సంస్థలపై ఈడీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే చైనా బ్రాండ్స్ అంటే మండిపడే కేంద్రం.. డ్రాగన్ కు చెందిన టిక్ టాక్, పబ్జీతో పాటు వందల సంఖ్యలో యాప్స్ను బ్యాన్ చేసింది. తాజాగా పబ్జీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన బీజీఎంఐని సైతం గూగుల్,యాపిల్ స్టోర్ల నుంచి తొలగించాయి. చదవండి👉 మళ్లీ భారత్లోకి రీ ఎంట్రీ కోసం ఆరాటం, టిక్టాక్ సరికొత్త వ్యూహం! -
వినియోగదారులకు శుభవార్త,అన్ని రకాల గాడ్జెట్స్కు ఒకే తరహా ఛార్జర్!
న్యూఢిల్లీ: కొత్త ఎలక్ట్రానిక్ పరికరం తీసుకున్న ప్రతిసారీ, దానికి పనికొచ్చే మరో రకం చార్జర్ను కొత్తగా కొనాల్సిన అగత్యాన్ని తప్పించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు మొదలైన వివిధ పరికరాలన్నింటికీ కామన్గా ఒకే చార్జర్ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై మొబైల్స్ తయారీ సంస్థలు సహా పరిశ్రమ వర్గాలతో ఆగస్టు 17న సమావేశం కానుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా బహుళ చార్జర్ల వినియోగాన్ని, ఈ–వ్యర్థాలతో పాటు వినియోగదారులపై భారాన్ని కూడా తగ్గించే సాధ్యాసాధ్యాలను మదింపు చేసేందుకు ఈ భేటీ ఉపయోగపడగలదని పేర్కొన్నారు. 2024 నాటికి చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ యూఎస్బీ–సీ పోర్ట్ తరహా చార్జర్ల వినియోగాన్ని అమల్లోకి తేనున్నట్లు యూరోపియన్ యూనియన్ ఇటీవలే ప్రకటించింది. అమెరికాలో కూడా ఇలాంటి డిమాండే ఉంది. చదవండి👉 నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, అమెజాన్కు భారీ ఫైన్! -
'డబ్బులు ఎవరికీ ఊరికే రావు', 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే!
దేశంలో 5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు టెలికాం కంపెనీలు పోటీపడుతున్నాయి. తొలుత నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ తరుణంలో చాలా మందికి వచ్చే సందేహం..ఏ ఫోన్ కొనాలి? అని. ఏ ఫోన్కి 5జీ నెట్ వర్క్కి సపోర్ట్ చేస్తుంది అని. ఇప్పుడా అనుమానాల్ని నివృత్తి చేస్తూ ఏ ఫోన్ 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తుందో తెలుసుకుందాం. 5జీకి సపోర్ట్ ఇవ్వాలంటే ఫోన్లో అందుకు సపోర్ట్ చేసే ప్రాసెసర్ ఉండాలి. అయితే దేశీయంగా 5జీ విప్లవం జోరందుకోవడంతో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు తాము తయారు చేసిన ఫోన్లలో 5జీ సపోర్ట్ చేసేలా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయంటూ కొనుగోలు దారుల్ని నమ్మబలికిస్తుంటాయి. డబ్బులెవరికీ ఊరికే రావు. అలాంటి ప్రకటనల పట్ల కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 5జీ ప్రాసెసర్ మీరు కొనాలనుకున్న, లేదంటే ఇప్పటికే కొన్న ఫోన్లకు 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తుందా? లేదా? అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే యూజర్లు వారి ఫోన్ సెట్టింగ్లోకి వెళ్లాలి. ఆ తర్వాత అబౌట్ ఫోన్ ఆనే ఆప్షన్ పై ట్యాప్ చేసి ప్రాసెసర్పై క్లిక్ చేస్తే మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ : స్నాప్డ్రాగన్ 865, స్నాప్డ్రాగన్ 865+, స్నాప్డ్రాగన్ 870, స్నాప్డ్రాగన్ 888, స్నాప్డ్రాగన్ 888+, స్నాప్డ్రాగన్ 8 జెన్ 1, స్నాప్డ్రాగన్ 8+ జనరల్ 1, స్నాప్డ్రాగన్ 695, స్నాప్డ్రాగన్ 765/765జీ, స్నాప్డ్రాగన్ 750/750/జీ, స్నాప్డ్రాగన్ 768/768/జీ, స్నాప్డ్రాగన్ 778/778జీ/ 778ప్లస్ మీడియా టెక్ ప్రాసెసర్ : మీడియా టెక్ డైమన్సిటీ 700 నుండి డైమన్సిటీ 9000 ప్రాసెసర్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఇవి కాకుండా మీడియా టెక్ హీలియా సిరీస్తో పాటు ఇతర సిరీస్ ప్రాసెసర్లు 5జీకి సపోర్ట్ చేయవు. శాంసంగ్ ప్రాసెసర్ : ఎక్సినోస్ 9820, ఎక్సినోస్ 9825,ఎక్సినోస్ 990,ఎక్సినోస్2100, ఎక్సినోస్ 2200లు 5జీకి సపోర్ట్ చేస్తాయి. 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ ఇచ్చే ఫోన్లు ఇవే యాపిల్ – ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ 2022 శాంసంగ్ – శాంసంగ్ ఎస్-సిరీస్ (ఎస్20 అంతకంటే ఎక్కువ), గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ 5జీ, గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ, ఏ-సిరీస్, ఎం-సిరీస్ మోడల్లు సపోర్ట్ చేస్తాయి. వన్ ప్లస్ - వన్ ప్లస్ 8 సిరీస్, వన్ ప్లస్ 9 సిరీస్, వన్ ప్లస్ 10సిరీస్, వన్ ప్లస్ నార్డ్ సిరీస్ షావోమీ- షావోమీ 12 సిరీస్,షావోమీ 11 సిరీస్, షావోమీ10సిరీస్, షావోమీ నోట్ 11 ప్రో ప్లస్, రెడ్ మీ నోట్ 11టీ, రెడ్మీ నోట్ 10 టీ పోకో- పోకో ఎఫ్4 5జీ, పోకో ఎం4 5జీ, పోకో ఎం4 ప్రో 5జీ ఒప్పో - రెనో 8 సిరీస్, రెనో 7 సిరీస్, రెనో 6 సిరీస్, ఒప్పో ఏ-సిరీస్, కె-సిరీస్, ఎఫ్-సిరీస్ ఫోన్లు వివో - వీ21, వీ21ఈ, వీ 23 సిరీస్, టీ1 సిరీస్,ఎక్స్ 60-సిరీస్, ఎక్స్ 70-సిరీస్, ఎక్స్ 80-సిరీస్ ఐక్యూ- ఐక్యూ009 సిరీస్,ఐక్యూ7 సిరీస్, ఐక్యూ జెడ్ 5, ఐక్యూ జెడ్ 6, ఐక్యూ జెడ్ 6 ప్రో రియల్ మీ - రియల్ మీ జీటీ సిరీస్, రియల్ మీ జీటీ 2 సిరీస్, రియల్ మీ ఎక్స్ 7, రియల్ మీ ఎక్స్ 7 మ్యాక్స్, రియల్ మీ ఎక్స్ 7 ప్రో, రియల్ మీ నార్జ్ 50 5జీ, రియల్ మీ నార్జో 30 5జీ, రియల్ మీ 8/8ఎస్/8 ప్రో 5G, రియల్ మీ 9/ 9 ప్రో 5జీ ఫోన్లు మాత్రమే 5జీ నెట్ వర్క్కి సపోర్ట్ చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి👉: What is 5G?: 5జీ అంటే ఏమిటి? ఈ నెట్ వర్క్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు -
ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 నేటి (జూలై 23న) అర్థరాత్రి ప్రారంభం కానుంది. ఈసేల్లో ఐఫోన్ 12 రూ. 52,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. దీనికి సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా ఆర్బీఎల్ బ్యాంక్ కార్డ్లతో షాపింగ్ చేసినవారు అదనంగా.1,000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఐఫోన్ 11 ధర 40 వేల దిగువకు చేరగా. ఐ ఫోన్ 12ను రూ. 51,999కే సొంతం చేసుకోవచ్చు. iPhone 11 64GB బ్లాక్ వేరియంట్ను రూ. 2,000 బ్యాంక్ తగ్గింపుతో రూ. 39,999 ధరకు పొందవచ్చు. మోటో జీ 60 కూడా తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంకు ఆఫర్తో కలిసి మోటో జీ60 ధర రూ. 13,999కి లభ్యం. పోకో ఎం4 ప్రొ స్మార్ట్ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్లో షావోమి, వివో, రెడ్మినోట్ ఫోన్లు కూడా డిస్కౌంట్ ధరల్లో అందిస్తోంది. ఇది కూడా చదవండి: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్:స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్:స్పెషల్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్
సాక్షి, హైదరాబాద్: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022కు తెరతీసింది. నేటి (జూలై 23న) అర్థరాత్రి నుంచిబిగ్ సేవింగ్డేస్ సేల్ షురూ కానుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్లో కస్టమర్లు స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్స్పై డిస్కౌంట్లు, స్పెషల్ డీల్స్ను పొందవచ్చు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్పై 80 శాతం వరకు తగ్గింపును, టీవీలు, ఇతర ఉపకరణాలపై 70 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఒప్పో, ఆపిల్, వివో, మోటరోలా తదితర స్మార్ట్ఫోన్లపై తగ్గింపు రేట్లు అందిస్తోంది. అలాగే హెడ్ఫోన్లపై 70 శాతం వరకు తగ్గింపును కూడా అందజేయనుంది. మౌస్, రూటర్లు, కీబోర్డులు తదిర కంప్యూటర్ ఉపకరణాలు రూ.99 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. బిగ్ స్క్రీన్ టాబ్లెట్ కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లు 45 శాతం తగ్గింపుతో దీన్ని సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్లపై 65 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. అంతేకాదు సేల్ ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటలకు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు తాజా డీల్స్ను కూడా ప్రకటిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంకు, కోటక్ బ్యాంక్ ,ఆర్బిఎల్ బ్యాంక్ కార్డ్లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ‘ప్లస్’ సభ్యుల కోసం ఇప్పటికే ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ డే సేల్ కూడా జూలై 23 అర్ధరాత్రి నుండి ప్రారంభం కానుంది. ఇది కూడా చదవండి: ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు -
రూ.20 వేల లోపు లభించే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే!
టెక్నాలజీ పెరిగే కొద్ది స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు తయారీ సంస్థలు కొత్త కొత్త ఫీచర్లు, సరికొత్త హంగులతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆ ఫోన్ల విడుదల ఎక్కువైంది. కొనుగోలు దారులు సైతం ఆకట్టుకునే ఫోన్లు కళ్లెదురుగా కనిపిస్తుంటే ఏ ఫోన్ కొనుగోలు చేయాలో అర్ధం గాక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అందుకే పనితీరు బాగుండి.. కెమెరా, బ్యాటరీ, స్మూత్ డిస్ప్లేతో రూ.20వేలకు మార్కెట్లో ఇప్పటికే కొనుగోలు దారుల్ని ఆకట్టుకుంటున్న ఫోన్ల గురించి తెలుసుకుందాం. 5జీ పోకో ఎక్స్4 ప్రో రూ.20వేల లోపు బడ్జెట్ ధరలో లభ్యమయ్యే ఫోన్ల స్థానంలో పోకో ఎక్స్4 ప్రో నిలిచింది. 6.67 అంగుళాలతో ఎఫ్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, ఫాస్ట్ ఫర్మామెన్స్ కోసం స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 5000ఏఎంహెచ్ బ్యాటరీ, 67డబ్ల్యూ ఛార్జర్, 64 ఎంపీ లెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో లభ్యం అవుతుంది 5జీ రెడ్మీ నోట్ 11ప్రో షావోమీకి చెందిన రెడ్ మీ నోట్ 11ప్రో. దీని ధర రూ.18,999గా ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే హేలియా జీ96 చిప్ సెట్తో రూ.20వేల లోపు బడ్జెట్ ధర ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుంటే ఈ ఫోన్లో బీజీఎంఐ,కాల్ ఆఫ్ డ్యూటీ (సీఓడీ) లాంటి హై గ్రాఫిక్స్ గేమ్స్ను ఈజీగా ఆడుకోవచ్చు. అంతేకాదు 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రేట్ కెమెరా సెటప్తో ఈ ఫోన్ను డిజైన్ చేశారు. 5జీ ఐక్యూ జెడ్6 రూ.15వేల లోపు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లైతే ఐక్యూ జెడ్6 బెస్ట్ ఆప్షన్ అని మార్కెట్ పండితులు చెబుతున్నారు. ఎందుంటే ఇందులో ఆండ్రాయిడ్ 12 ఎక్స్పీరియన్స్, బ్యాటరీ లైఫ్, కెమెరా పనితీరు బాగుండటమే కాదు.. స్నాప్ డ్రాగన్ 696 చిప్సెట్తో వస్తుంది. 50 ఎంపీ,2ఎంపీ, 2 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో డిజైన్ చేసింది ఉంది. ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. 5జీ రియల్ మీ 9ప్రో రియల్ మీ 9ప్రోలో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 6.6 అంగుళాల డిస్ప్లే,120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ,33 డబ్ల్యూ ఛార్జర్, 64ఎంపీ నైట్ స్కేప్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్తో పాటు 2 ఎంపీ మైక్రో లెన్స్తో అందుబాటులో ఉంది. మోటోజీ52 మోటరోలా మోటో జీ 52 సూపర్ డిస్ల్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్, 6.6 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అండ్ 2ఎంపీ సెన్సార్లతో ఈ ఫోన్ రూ.14,999కే లభ్యమవుతుంది. -
ఈ ఫోన్లు కొంటే..షావోమీ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ యూట్యూబ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. అయితే ఇందులో ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే.. ఎంపిక చేసిన షావోమీ, రెడ్మి స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై మొదటి మూడు నెలలు ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ మేరకు షావోమి ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది. షావోమి ఇలాంటి ఆఫర్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు తన సబ్-బ్రాండ్లలో ఒకటైన పోకో కూడా ఇదే ఆఫర్ను వినియోగదారులకు అందిస్తోంది. సో..యూట్యూబ్ ప్రీమియం ఉచిత ఆఫర్ను ఇప్పటికే పొందినట్లయితే, షావోమీ ఫోన్ కొనుగోలుపై ఫ్రీ ఆఫర్ను పొందేందుకు అర్హుల కారు అనేది గమనించాలి. షావోమి 11, షావోమీ 12 ప్రో, షావోమీ 11టి,11 ఐ కొనుగోలుపై మూడు నెలలు, అలాగే రెడ్మి నోట్ 11, నోట్ 11 ఎస్ లాంటి కొన్ని స్మార్ట్ఫోన్లపై రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్స్ర్రిప్షన్ ఉచితం. ఈ ప్రమోషనల్ ఆఫర్ జనవరి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. కాగా యూట్యూబ్ ప్రీమియం నెలకు రూ.129. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర ఓటీటీ ప్లాట్ఫారమ్ల కంటే ఇదే చౌకగా లభిస్తోంది. -
సూపర్ గేమింగ్ స్మార్ట్ఫోన్: ఐకూ నియో 6 వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: ఐకూ ఇండియా కొత్త స్మార్ట్ఫోన్ను మంగళవారం తీసుకొచ్చింది. ప్రీమియం ధరలో ఐకూ నియో 6 ..5జీ మొబైల్ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ డార్క్ నోవా , ఇంటర్ స్టెల్లార్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది.1200Hz తక్షణ టచ్ శాంప్లింగ్ రేట్ 32907mm2 క్యాస్కేడ్ కూలింగ్ సిస్టమ్తో సూపర్ గేమింగ్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. స్మార్ట్ఫోన్ 12 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. స్పెషల్ లాంచింగ్ ధర రూ. 25000 తగ్గింపు అందిస్తోంది. ఈ ప్రత్యేక ధర జూన్ 5వ తేదీవరకు మాత్రమే ఈ ధర అందుబాటులో ఉంటుంది. ఐసీసీఐసీఐ కార్డ్ చెల్లింపులపై మరో 3 వేల రూపాయల తగ్గింపు. ఐకూ నియో 6 ఫీచర్లు 6.62 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే క్వాల్కం స్నాప్డ్రాగన్ 870 5జెన్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12, 1080x2400 పిక్సెల్స్ 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ 16 మెగాపిక్సెల్ సెల్ఫీకెమెరా 64+12+2 ఎంపీ రియర్ కెమెరా 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫ్లాష్ చార్జ్ -
నచ్చినప్పుడు నచ్చినంతసేపే పని
ఇష్టమున్నప్పుడే పని చేసే అవకాశం ఉంటే! తోచిన పనిని మాత్రమే చేసే ఆస్కారం ఉంటే! ఎప్పుడు, ఎక్కడ, ఎంతసేపు పనిచేయాలో నిర్ణయించుకొనే అధికారం మన చేతుల్లోనే ఉంటే! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యువతలో ఈ ఆలోచనా ధోరణి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఇలా నచ్చిన సమయాల్లో నచ్చిన పనిచేసే వారి సంఖ్య రాకెట్ వేగంతో పెరుగుతోంది. తమ సమయానుకూలతను బట్టి పనిచేసే వారిని ముద్దుగా ’గిగ్ వర్కర్స్’ పిలుస్తున్నారు. అవసరం, అవకాశం మేరకు యజమాని, ఉద్యోగి స్వల్పకాలిక ఒప్పందం మేరకు చేసే పనుల ద్వారా సమకూరే ఆదాయాన్ని గిగ్ ఎకానమీగా పిలుస్తున్నారు. దీని పరిమాణమెంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది గిగ్ ఉద్యోగులున్నట్లు అంచనా. ఇక గిగ్ ఆర్థికవ్యవస్థ విలువ ఈ ఏడాది అక్కరాలా లక్షన్నర కోట్ల డాలర్లని మాస్టర్కార్డ్ అంచనా. ఇది 2025 కల్లా 2.7 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. మారిన కాలం.. అందివచ్చిన అవకాశం టెక్నాలజీలో మార్పులు, స్మార్ట్ఫోన్లు ఈ గిగ్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కడానికి తోడ్పడుతున్నాయి. గిగ్ ఆర్థిక వ్యవస్థ ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లపైనే నడుస్తోంది. పయనీర్స్ నివేదిక ప్రకారం 70 శాతం గిగ్ వర్కర్లు గిగ్ వెబ్సైట్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అమెరికాలో అతి పెద్ద గిగ్ వెబ్సైట్ ’ఆఫ్వర్క్’కు 1.5 కోట్ల సబ్స్క్రైబర్లున్నారు. 53 శాతం యువత స్మార్ట్ఫోన్ల ద్వారా ఉపాధి అవకాశాలు వెతుక్కుంది. వృత్తి నిపుణులు ఫేస్బుక్ ప్రచారం ద్వారా ఉపాధి పొందుతున్నారు. అమెరికాలో... అమెరికాలో 5.7 కోట్ల గిగ్ వర్కర్లున్నారు. 2027 కల్లా 8.6 కోట్లకు చేరతారని అసోసియేషన్ ఫర్ ఎంటర్ప్రైజ్ అపర్చునిటీస్ నివేదిక పేర్కొంది. ► రెగ్యులర్ ఉద్యోగుల కంటే గిగ్ వర్కర్లు మూడు రెట్లు వేగంగా పెరుగుతున్నట్టు అంచనా. ► గిగ్వర్కర్ల ద్వారా 2020లో దేశ ఆర్థిక వ్యవస్థకు 1.21 లక్షల కోట్ల డాలర్లు సమకూరాయి. ► స్వతంత్ర ఉద్యోగులు అమెరికాలో వారానికి 107 కోట్ల పని గంటలు పనిచేస్తున్నారు. ► ఫ్రీలాన్స్ వర్కర్లలో 51 శాతం ఎంత వేతనమిచ్చినా రెగ్యులర్ జాబ్కు నో అంటున్నారు. రెగ్యులర్ ఉద్యోగుల కంటే వీరు 78 శాతం ఎక్కువ సంతోషంగా ఉన్నారని ‘ఆఫ్వర్క్’ పేర్కొంది. ► 80 శాతం అమెరికా కంపెనీలు గిగ్ వర్కర్ల ద్వారా వ్యాపార విస్తరణ కోసం వ్యూహాలు మార్చుకుంటున్నాయి. మన దేశంలో ఎలా? బలమైన గిగ్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. కరోనాతో దెబ్బతిన్న గిగ్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. ► భారత్లో 1.5 కోట్ల మంది గిగ్ వర్కర్లున్నారు. ► మన గిగ్ ఆర్థిక వ్యవస్థకు 9 లక్షల రెగ్యులర్ ఉద్యోగులకు సమానమైన ఉపాధి కల్పించే సామర్థ్యముందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా. ► 2025 నాటికి దేశంలో గిగ్ వ్యాపారం 3,000 కోట్ల డాలర్లకు, అంటే రూ.2.3 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని అంచనా. ఏమిటీ గిగ్ వర్కింగ్..? ఓ కంపెనీలో నిర్ధిష్ట పనివేళల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు కాకుండా అవసరం మేరకు తాత్కాలిక పనులు చేస్తూ ఆదాయం పొందుతున్న ఫ్రీలాన్సర్లుగా గిగ్ వర్కర్లను చెప్పవచ్చు. ఆ లెక్కన స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ తెచ్చిచ్చే డెలివరీ బాయ్, ఓలా, ఉబర్ డ్రైవర్ గిగ్ వర్కర్లే. వెబ్ డిజైనర్లు మొదలు ప్రోగ్రామర్ల దాకా వందల వృత్తులవారు ఇలా పని చేస్తూ సరిపడా ఆదాయం పొందుతున్నారు. అమెరికాలోనైతే గిగ్ వర్కర్లు అత్యధిక ఆదాయం పొందుతున్నారు. కొందరు ఏటా లక్ష డాలర్లకుపైగా సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సగటు సంపాదన గంటకు 21 డాలర్లు! వీరిలో 53 శాతం 18–29 ఏళ్ల వారేనని ఓ సర్వేలో తేలింది. – సాక్షి,నేషనల్ డెస్క్ -
తక్కువ ధరకే, అదిరిపోయే రెడ్ మీ 5జీ స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ సబ్ బ్రాండ రెడ్మీ తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనుంది. రెడ్మీ 11 5జీతో రానున్న ఈ ఫోన్ భారత్ మార్కెట్లో జూన్ నెలలో విడుదల కానుండగా..ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉండగా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను రెడ్మీ డిజైన్ చేసింది భారత్ మార్కెట్లో జూన్ నెలలో విడుదల కానున్న ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ స్టోరేజ్ ఉండే వేరియంట్ ధర రూ.13,999 ధరగా ఉండనుంది. అయితే షావోమీ త్వరలోనే ఈ మొబైల్ గురించి మరిన్ని విషయాల్ని వెలడించనుంది. టీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
భారత్కు శాంసంగ్ భారీ షాక్! ఇకపై ఆ ప్రొడక్ట్లు ఉండవట!
ప్రముఖ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారత్కు భారీ షాకిచ్చింది. ఇకపై ఫీచర్ ఫోన్లను ఇండియాలో అమ్మకూడదని నిర్ణయించింది. అయితే స్మార్ట్ ఫోన్ సేల్స్ను కొనసాగించనుంది. శాంసంగ్ ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో దేశీయంగా ప్రీమియం,సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై భారీ ఎత్తున అమ్మకాలు జరిపింది. అయినా భారత్లో ఫీచర్ఫోన్ అమ్మకూడదనే నిర్ణయం ఇతర ఫోన్ తయారీ సంస్థల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం ఏదైనా ఇకపై భారత్లో శాంసంగ్కు చెందిన ఫీచర్ ఫోన్లు కనుమరుగు కానున్నాయి. రూ.15వేల లోపు ఫోన్లే సౌత్ కొరియా దిగ్గజం ఫీచర్ ఫోన్ అమ్మకాలు వద్దనుకున్నా..బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను అమ్మనుంది. ఇందుకోసం శాంసంగ్ మరో రెండు సంస్థలతో సహకారంతో పీఎల్ఐ స్కీం కింద రూ.15వేల లోపు ఉన్న ఫోన్లను తయారు చేయనుంది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.10వేల నుంచి రూ.20 వేల మధ్య ఉన్న ఫోన్ల డిమాండ్ పెరగనుంది. షిప్మెంట్ తగ్గింది ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో భారత్లో శాంసంగ్ ఫీచర్ ఫోన్ షిప్మెంట్ తగ్గి 39 శాతంతో సరిపెట్టుకుంది. సప్లయ్ చైన్ సమస్యలు, అధిక రిటైల్ ద్రవ్యోల్బణం కారణంగా కొన్ని సంవత్సరాలుగా ఫీచర్ ఫోన్ షిప్ మెంట్లో ప్రథమ స్థానంలో ఉన్న శాంసంగ్ కేవలం 12శాతంతో మూడో స్థానానికి పడిపోయింది. శాంసంగ్ సరికొత్త రికార్డ్లు భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సరికొత్త రికార్డ్లను నమోదు చేసింది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ సత్తా చాటింది. ఆ సంస్థ దేశీయంగా విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 22 సిరీస్ ఫోన్ అమ్మకాలతో నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థగా పేరు సంపాదించింది. సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లు సైతం 81శాతం అమ్మకాలతో యూజర్లను ఆకట్టుకున్నాయి. ప్రీమియం టూ సూపర్ ప్రీమియం ప్రీమియం సెగ్మెంట్లో అంటే ధర రూ.30వేలకు పైగా ఉన్న స్మార్ట్ ఫోన్లు 38శాతంతో అమ్ముడుపోయాయి. మార్చిలో ధర లక్షకు పైగా ఉన్న గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో 81శాతంతో అమ్మకాలు జరిపినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. చదవండి👉గుడ్న్యూస్: అదిరిపోయే డిస్కౌంట్లు, ఐఫోన్ 13పై బంపరాఫర్లు! -
నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు!
మాటల్లేవు... మాట్లాడుకోవడాలు లేవు! ఒక అచ్చట లేదు.. ముచ్చటా లేదు! నట్టింట్లో సందడి, హడావుడి లేనే లేవు... ఉన్నదల్లా భరించలేనంత నిశ్శబ్దం! నలుగురు నాలుగు దిక్కుల్లో మొబైల్ఫోన్ తెరలకు అతుక్కుపోయిన పరిస్థితి. స్మార్ట్ఫోన్ ఇప్పుడు చాలామందిలో వ్యసనమైపోయింది. దీంతోనే నిద్ర... దీంతోనే మేలుకొలుపు. రీల్స్ మత్తులో కొందరు... పబ్జీ ఆడుతూ ఇంకొందరు.. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్... పేర్లు ఏవైనా.. అన్నింటి అతి వాడకం పుణ్యమా అని సమాజం విచిత్ర మహమ్మారిని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి పీడ ఎలాగోలా వదిలిందని సంబరపడుతున్న ఈ సమయంలో దశాబ్దకాలంగా పట్టిపీడిస్తున్న ఈ స్మార్ట్ఫోన్ మహమ్మారి సంగతులపై ప్రత్యేక కథనం. (కంచర్ల యాదగిరిరెడ్డి) ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ దేశంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 2021లో భారతీయులు రోజుకు సగటున 7 గంటల పాటు ఫోన్కు అతుక్కుపోతున్నారు. లాక్డౌన్ కారణమో మరేదో కానీ.. 2020 వరకు రోజుకు నాలుగున్నర గంటలే ఉన్న ఫోన్ వినియోగం ఆ తరువాతి సంవత్సరానికి 2.5 గంటలు పెరిగింది. ‘నేను మొదట్లో గంట మాత్రమే యూట్యూ బ్, ఇతర సామాజిక మాధ్యమాలను చూసేవాడిని. రాన్రాను అది నాకు నిద్ర లేని రాత్రులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ ఊబి నుంచి బయటపడేందుకు మానసిక నిపుణుడి సహాయం తీసుకోవాల్సి వచ్చింది’ అని ముంబైకి చెందిన గృహి ణి ప్రమీలా రాణి వాపోయారు. ‘ముఖ్యంగా టీనేజ్ పిల్లలు స్మార్ట్ఫోన్కు బానిసలవుతున్నారు. వారిని ఆ వ్యసనం నుంచి దూరం చేయకపోతే భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. నా దగ్గరకు రోజూ ఇలాంటి కేసులు అరడజను దాకా వస్తున్నాయి. వారిలో పిల్లలతో పాటు సాధారణ గృహిణులూ ఉన్నారు’ అని ఢిల్లీకి చెందిన మానసిక నిపుణుడు రాజేంద్రన్ చెప్పారు. హైదరాబాద్కు చెందిన మానసిక నిపుణుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘నిమిషానికి ఒకసారి.. నోటిఫికేషన్లు, మెయిళ్లు, చాట్ మెసేజీలేమైనా వచ్చాయా? అని చెక్ చేసుకోవడం స్మార్ట్ఫోన్ వ్యసన లక్షణాల్లో మొదటిది. ఫోన్ దగ్గర లేకపోతే ఆందోళనపడటం.. చార్జింగ్ ఫుల్గా ఉండాలనుకోవడం, నిద్రలేవగానే స్మార్ట్ఫోన్ లాక్ ఓపెన్ చేయడం.. ఇలా వ్యసనం బయటపడుతుంటుంది’ అని చెప్పారు. భౌతిక, మానసిక సమస్యలు స్మార్ట్ఫోన్ అతి వినియోగం కారణంగా అటు భౌతిక, ఇటు మానసిక సమస్యలు రెండూ తలెత్తుతున్నాయి. మహిళల్లో తలనొప్పి ఎక్కువ అవుతుండగా.. కళ్ల మంటలు, చూపులో అస్పష్టత, మెడ సమస్యలు, జబ్బు పడితే తేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ వినియోగం కాస్తా ఏకాగ్రత లోపానికి దారితీస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ‘బాలల హక్కుల సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న విద్యార్థుల్లో 37.15 శాతం మంది ఏకాగ్రత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే కనీసం 23.80 శాతం మంది పిల్లలు నిద్రపోయేటప్పుడు కూడా స్మార్ట్ఫోన్ను తమ దగ్గరగా ఉంచుకుంటున్నారు’అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వయంగా గత నెలలో లోక్సభకు వివరించారు. ‘ప్రాథమిక ఫలితాల ప్రకారం సెల్ఫోన్ రేడియేషన్ కాస్తా మగవారిలో వంధ్యత్వానికి దారితీస్తుంది. అలాగే వీర్యకణాల కదలికలు నెమ్మదించేందుకు, సంఖ్య తగ్గేందుకూ మొబైల్ఫోన్ రేడియేషన్ కారణమవుతుంది’అని ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ కే.గోవర్దన్ రెడ్డి హెచ్చరించారు. మానసిక సమస్యల విషయానికి వస్తే స్మార్ట్ఫోన్ అధిక వినియోగం వల్ల నిద్ర చెడటం మొదలుకొని నిస్సత్తువగా అనిపించడం, మనోవ్యాకులత, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలకు దారి తీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రశ్నించుకోండి... సరిచేసుకోండి! స్మార్ట్ఫోన్ వ్యసనాన్ని గుర్తించేందుకు కొన్ని సర్వేలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోని ప్రశ్నలకు నిజాయితీగా జవాబులు చెప్పుకోగలిగితే మీరు స్మార్ట్ఫోన్కు బానిసయ్యారా? లేదా? అన్నది తెలిసిపోతుంది. తదనుగుణంగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలరు కూడా. అతికొద్ది మందికి కొన్ని మందులు వాడాల్సిన అవసరం రావొచ్చు. అయితే స్మార్ట్ఫోన్ వ్యసనాన్ని తొలగించేందుకు నిర్దిష్టమైన పద్ధతి అంటూ ఏదీ లేదన్నది మాత్రం అందరూ గుర్తించాలి. -
అరచేతిలో అశ్లీలం
(కంచర్ల యాదగిరిరెడ్డి) దేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం భారీగా పెరగడంతో ‘అశ్లీలం’ఇప్పుడు సర్వాంతర్యామిగా మారింది. వాటికితోడు మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్లు లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు సులభంగా అందుబాటులో ఉండటం వల్ల అశ్లీల సాహిత్యం విరివిగా వ్యాప్తి చెందుతోంది. టెలికామ్ పోర్టల్ ‘ది మొబైల్ ఇండియన్ డాట్ కామ్’ఇటీవల రూపొందించిన ఒక నివేదిక ప్రకారం 2021లో 4.5 కోట్ల మందికిపైగా భారతీయులు అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసుకొని వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఇలాంటి దృశ్యాలు చూస్తున్న (25 కోట్లు) వారిలో భారతీయుల వాటా 16 శాతం కావడం గమనార్హం. ఇక స్మార్ట్ఫోన్ వాడకం పెద్దగా తెలియని వారి కోసం మొబైల్ఫోన్ రిపేర్ షాపుల్లో, సైబర్ కేఫ్లలో మైక్రో మెమొరీ కార్డులు, పెన్ డ్రైవ్ల రూపంలో విరివిగా అశ్లీల వీడియోలు లభిస్తున్నాయని, ఈ తరహా వ్యాపారం భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఎక్కువని నివేదిక పేర్కొంది. రూ. వందకో అశ్లీల వీడియో... ‘ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ వెలుపల 4–5 దుకాణాలు రూ. కోట్లలో అశ్లీల వీడియోల వ్యాపారం చేస్తున్నాయి. ఈ దుకాణాల నుంచి అశ్లీల వీడియోలు కొనుగోలు చేస్తున్న వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలు, ఆఫీసు బాయ్లే. అక్కడి దుకాణదారులు రూ. 1,000 నుంచి రూ. 2,500 మధ్య లభించే ఫోన్లను పెద్దమొత్తంలో కొని వాటిలో అశ్లీల వీడియోలను నింపి ఒక్కో మొబైల్ను రూ. 3,500–4,000 వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారుల వద్ద స్మార్ట్ఫోన్ ఉంటే అశ్లీల సాహిత్యాన్ని వారు ఎంపిక చేసుకున్న భాషను బట్టి కనిష్టంగా రూ. 100, గరిష్టంగా రూ. 500కి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు’అని లీగల్ న్యూస్ అండ్ కామెంటరీ సర్వీస్ వెబ్సైట్ నిర్వాహకుల్లో ఒకరైన నిర్మలా గోవాల్కర్ వివరించారు. దేశంలో ప్రతి 40 సెకన్లకు ఒక అశ్లీల వీడియో రూపొందుతోందని, ఇందులో 38 శాతం పిల్లల లైంగిక వేధింపులతో ముడిపడి ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది గడిచిన 65 రోజుల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా వచ్చిన అంశాల్లో 25 శాతం మైనర్ బాలికల అశ్లీలతకు సంబంధించినవే ఉండటం బాధాకరమని ఆమె పేర్కొన్నారు. మైసూరుకు చెందిన రెస్క్యూ అనే గ్రూపు దక్షిణాదిలో 5,575 మంది కళాశాల విద్యార్థులపై చేపట్టిన సర్వే ప్రకారం 65 శాతం మంది క్రమం తప్పకుండా తమ ఫోన్లలో బూతు చిత్రాలు చూస్తున్నారు. ఈ విషయంలో బాలికల కంటే బాలురు 16 శాతం ఎక్కువ. హైదరాబాద్లోనూ అధికమే... హైదరాబాద్ అబిడ్స్లోని జగదీశ్ మార్కెట్లో మొబైల్ షాపు నిర్వహించే ఓ వ్యక్తి రోజుకు 250–300 నీలిచిత్రాలను అప్లోడ్ చేస్తున్నాడు. ఇంగ్లిష్ వీడియోలను కావాలంటే తక్కువ ధరకు, తెలుగు, హిందీ భాషల వీడియోలను ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ గలీజు దందాపై అతన్ని ప్రశ్నిస్తే తాను కేవలం పోర్న్ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోలనే విక్రయిస్తున్నానని చెప్పుకొచ్చాడు. పైగా పోలీసులు గతంలో తనను నాలుగైదుసార్లు అనవసరంగా అరెస్టు చేశారని పేర్కొనడం గమనార్హం. అయితే గతంలో ఆ షాపు నిర్వాహకుడిని అరెస్టు చేసినప్పుడు అతని సెల్ఫోన్లో భారీగా అశ్లీల వీడియోలు కనిపించినట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. ఓ షోరూంలోని మహిళల ట్రయల్ రూంలో అమర్చిన కెమెరా ద్వారా రికార్డు చేసిన వీడియోలూ అతని వద్ద లభించాయన్నారు. నిపుణుల సూచనలు... ►మొబైల్ కంపెనీలు తమ ఫోన్ల ఉత్పత్తుల్లో నీలిచిత్రాలు డౌన్లోడ్ కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటే సమస్య చాలా వరకు తగ్గుతుంది. (యాపిల్ సంస్థ ఇప్పటికే నీలిచిత్రాల డౌన్లోడ్ను నిరోధించడానికి ఒక సాఫ్ట్వేర్ను తీసుకొచ్చింది. వాటిని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే వార్నింగ్ వచ్చేలా ఆ సంస్థ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టింది.) ►అశ్లీల చిత్రాలను చూడటాన్ని బెయిల్కు వీల్లేని నేరంగా పరిగణించే చట్టం తేవాలని కోరుతూ ఇండోర్కు చెందిన న్యాయవాది కమలేశ్ వాస్వాని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కర్ణాటక శాసనసభలో ఏకంగా ఒక మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు నీలిచిత్రాలు చూస్తూ దొరికిన ఘటనను సీరియస్గా తీసుకోవాలని కూడా ఆయన కోర్టును అభ్యర్థించారు. -
అదిరిపోయే ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్!
Reliance Digital Discount Days Sale, ముంబై: రిలయన్స్ డిజిటల్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు ‘‘డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్’’ పేరుతో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లపై బెస్ట్ డీల్స్తో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 7.5% వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అదనంగా రూ.రెండు వేల విలువైన కూపన్స్ ఇస్తారు. రూ.80 వేల కంటే ఎక్కువ కొంటే రూ.10 వేల వరకు అదనపు డిస్కౌంట్ ఇస్తారు. టీవీలు, స్మార్ట్ఫోన్స్, ల్యాప్ట్యాప్స్, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ వాచీలు, కిచెన్ పరికరాలపై ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. ఈఎంఐ పద్ధతిలోనూ ఉత్పత్తులను సొంతం చేసుకోవచ్చు. సరికొత్త శామ్సంగ్గెలాక్సీ ఎస్22+ గ్రీన్ కలర్ వేరియంట్ ప్రత్యేకంగా రిలయన్స్ డిజిటల్లో మాత్రమే లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 84,999గా ఉంది. ఈ ఆఫర్ కింద ఐఫోన్ 13 సరసమైన ధర(ప్రారంభ ధర రూ.61,900)కే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్లు, డిస్కౌంట్లు రిలయన్స్ డిజిటల్, జియో సోర్ట్స్లతో పాటు www. reliancedigital. in లేదా www. jiomart. com వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. -
పిల్లలు ఫోన్కు అడిక్ట్ అయ్యారా? టైమ్ లేదని తప్పించుకోకుండా ఇలా చేయండి!
చాక్లెట్ ఇస్తే స్కూలుకెళ్తా... ఒకప్పటి డిమాండ్ ఇది. సైకిల్ కొనిస్తేనే స్కూలుకెళ్తా... ఇప్పుడిదీ పాతబడిపోయింది. ‘స్మార్ట్ఫోన్ ఇవ్వకపోతే స్కూలుకెళ్లను’ కరోనా మార్పు ఇది. పిల్లలు సెల్ఫోన్కి అడిక్ట్ అయిపోవడం గురించి దశాబ్దకాలంగా మాట్లాడుతున్నాం. కానీ ఈ రెండేళ్ల కాలం పిల్లలకు సెల్ఫోన్ ఇచ్చి తీరాల్సిన అవసరాన్ని తెచ్చింది కరోనా. ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల శకం ముగిసింది. ఆఫ్లైన్ క్లాసులు మొదలవుతున్నాయి. అయినా పిల్లలు మాత్రం సెల్ఫోన్ వదలడానికి ఇష్టపడడం లేదు. ఈ అడిక్షన్ నుంచి పిల్లలను బయటకు తీసుకురావడం పెద్ద సవాల్. ఇందుకు ‘పిల్లల దృష్టిని మళ్లించడం, మరొక విషయం మీద దృష్టిని కేంద్రీకరించేటట్లు చూడడమే పరిష్కారం’ అన్నారు చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ సుదర్శిని. మనిషి సామాజిక జీవి. మనుషులతో కలవకపోతే మానసిక రోగి అవుతాడు. కరోనా దేహ ఆరోగ్యంతో చెలగాటం ఆడుకుని సరిపెట్టలేదు. వ్యాధి బారిన పడిన వాళ్లను, పడని వాళ్లను కూడా మానసికంగా వేధిస్తూనే ఉంది. పిల్లల్లో ఆ దుష్ప్రభావాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. పిల్లలు స్కూలుకెళ్లినప్పుడు క్లాస్లో ఇతర పిల్లలతో ఎలా మెలగుతున్నారనే విషయాన్ని తరచూ టీచర్లను అడిగి తెలుసుకునే వాళ్లు పేరెంట్స్. ఈ కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులే కావడంతో పిల్లలు కళ్ల ముందే ఉన్నారుగా అనే ఉద్దేశంలో పిల్లల బిహేవియర్ మీద దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ఇవి కాకుండా తల్లిదండ్రుల్లో ఇద్దరూ చెరో లాప్ట్యాప్లో ఆఫీస్ పనిలో నిమగ్నం కావడం లేదా ఒకరు ఇంటి పనిలో మునిగిపోవడంతో పిల్లల్లో మానసిక పరమైన అవాంఛనీయ ధోరణులను గమనించలేకపోవడం కూడా కాదనలేని విషయమే. ఇక పిల్లల విషయానికి వచ్చేటప్పటికి... గతంలో పేరెంట్స్ని సెల్ఫోన్ అడిగితే కొద్దిసేపు ఇచ్చి టైమ్ కండిషన్ పెట్టేవాళ్లు. ఆన్లైన్ క్లాసుల కారణంగా ఫోన్ అధికారికంగా చేతికి వచ్చేసింది. ఇక ఏం కావాలి? హ్యాపీగా ఫోన్తో పండగ చేసుకున్నారు. క్లాస్ పూర్తయిన తర్వాత కూడా బయటకు వెళ్లి ఆడుకునే పరిస్థితి లేకపోవడంతో ఫోన్కు అడ్డు చెప్పలేని పరిస్థితి పేరెంట్స్ది. కరోనా నుంచి ప్రపంచం బయటపడింది. ఆన్లైన్ శకం ముగిసింది. ఆఫ్లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఇక స్మార్ట్ఫోన్తో పనేముంది? కానీ పిల్లలు అలా అనుకోలేకపోతున్నారు. స్మార్ట్ ఫ్రెండ్ ‘‘పిల్లలను సరిదిద్దడానికి అనుసరించాల్సిన ప్రధాన సూత్రం ఏమిటంటే... వాళ్ల చేతి నుంచి ఒకటి తీస్తున్నప్పుడు ఆ చేతిలో మరొకటి పెట్టడమే. డిస్ట్రాక్షన్, డైవర్షన్ ద్వారా వాళ్ల చేత మనం ఏం చేయించాలనుకుంటున్నామో ఆ పని చేయించడం అన్నమాట. పది–పన్నెండేళ్లలోపు పిల్లలను దారిలో పెట్టడం, టీనేజ్ పిల్లలను దారిలో పెట్టడం దేనికదే భిన్నం. ఇటీవల మా దగ్గరకు వస్తున్న కేసులను పరిశీలిస్తే కొంతమంది చిన్న పిల్లల్లో ఆటిజమ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. సమగ్రంగా పరీక్షించి, గతంలో వాళ్ల ప్రవర్తనను విశ్లేషించి చూస్తే నిజానికి వాళ్లకు ఆటిజమ్ లేదని నిర్ధారణ అవుతుంది. పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటూ, వాళ్లడిగినప్పుడు ఫోన్ ఇవ్వకపోతే చేతిలో ఉన్న వస్తువును విసిరికొట్టడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం కరోనా కారణంగా భౌతికదూరం పాటించడం కోసం విపరీతమైన సామాజిక దూరం పాటిస్తూ ఉండడమే. వాళ్ల వయసు పిల్లలను కలవాల్సిన దశలో స్నేహితులకు దూరంగా ఉండాల్సి రావడం కూడా. నెలలు, సంవత్సరాలపాటు ఇంట్లో ఇద్దరు– ముగ్గురు పెద్దవాళ్ల మధ్య వాళ్ల ఆంక్షల మధ్య గడపాల్సి రావడంతో పిల్లల్లో లోలోపల విసుగు ఎక్కువైపోయింది. టీనేజ్లో అయితే ఇరిటేషన్ యాంగర్ పెరిగిపోతుంది. దాని నుంచి బయటపడడానికి ఫోన్తో స్నేహం చేస్తూ, ఫోన్తోనే సాంత్వన పొందడానికి అలవాటు పడ్డారు. (చదవండి: చద్దన్నం ప్రయోజనాలు ఇవే.. రోజూ తిన్నారంటే..) ప్రశంస పని చేస్తుంది! ఇప్పుడు ఫోన్ వాడకం మీద ఆంక్షలు పెట్టక తప్పని పరిస్థితి. అయితే పిల్లలు ఆ ఆంక్షలను స్వీకరించడానికి సిద్ధం కావడం లేదు అసహనం పెరిగిపోతోంది. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే చేతిలో ఉన్న వస్తువులను విసిరి కొట్టడం, పుస్తకాలను చించేయడంతోపాటు పుస్తకాలను మాయం చేస్తున్నారు. ఆ కండిషన్ నుంచి బయటపడాలంటే పేరెంట్స్ ఆంక్షలు పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రిలాక్సేషన్ టెక్నిక్ ని ఫాలో అవ్వాలి. కుటుంబంలో ఒకరితో ఒకరు కలిసి గడిపే సమయాన్ని పెంచుకోవాలి. ఆన్లైన్ క్లాసుల కారణంగా పాఠాలు సరిగ్గా అర్థం కాకపోయి ఉంటే ఆ పిల్లలు స్కూలుకు వెళ్లడానికి అస్సలు ఇష్టపడరు. నిజానికి అది మొండితనం కాదు, ఎస్కేప్ కావడానికి మార్గాలు వెతుక్కోవడం అన్నమాట. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుని ‘నిద్ర సరిపోకపోతే ఉదయం లేవలేవు’ అని చెప్తే చాలు. అలాగే టైమ్కి నిద్రపోయిన రోజు తెల్లవారి ఉదయం పిల్లలతో ‘స్క్రీన్కు దూరంగా ఉండడంతో రాత్రి బాగా నిద్రపోయావు, ఆవలింతలు రావడం లేదు కూడా. ముఖం కూడా తాజాగా ఉంది, ఉత్సాహంగా కనిపిస్తున్నావు’ అని ప్రశంసాపూర్వకంగా మాట్లాడాలి. ఈ అడిక్షన్ చిన్నది కాదు! ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓవర్నైట్ మారిపోవాలనుకోవడం అత్యాశే. మార్పు వచ్చే వరకు ప్రయత్నాలు చేయాలి. మద్యం అలవాటును మాన్పించడం వంటిదే ఇది కూడా. ఒక్కసారిగా ఫోన్ ఇవ్వడం ఆపేస్తే విత్డ్రాయల్ సింప్టమ్స్ మొదలవుతాయి. నిదానంగా తగ్గిస్తూ రావాలి. మొదట్లో చెప్పుకున్నట్లు ఒకటి తీసేయాలంటే ఆ చేతిలో మరొకటి పెట్టాల్సిందే. ఫోన్ బదులు షటిల్ రాకెట్ ఇచ్చి వాళ్లతోపాటు పేరెంట్స్ కూడా ఆడుకోవచ్చు. ఈ విషయంలో ‘టైమ్ లేద’ని తప్పించుకోవద్దు. పిల్లలను దారిలో పెట్టుకోవడం కంటే మించి ఏ పనులూ ప్రధానమైనవి కావని గుర్తించాలి’’ అని వివరించారు చైల్డ్ సైకాలజిస్ట్ సుదర్శిని. (చదవండి: ముఖంపై మృతకణాలు తొలగిపోవాలంటే...) ‘ఆట’విడుపు ఫోన్ నుంచి దృష్టి మళ్లించడానికి ఫిజికల్ యాక్టివిటీని పెంచాలి. పార్క్కు తీసుకువెళ్లాలి. పేరెంట్స్ కూడా వాళ్లతోపాటు ఆడాలి లేదా ఆ వయసు పిల్లలను కలుపుకుని ఆడుకునే వీలు కల్పించాలి. దేహం బాగా అలసిపోయినప్పుడు ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలవుతుంది. మెదడు... ఒత్తిడిని దూరం చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్ ద్వారా ప్లెజర్ పీలవడం అనే మార్గానికి అలవాటు పడి ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ, స్నేహాలను పెంచుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెంచుకోవడం ద్వారా ప్లెజర్ అందుతుందన్నమాట. స్కూలు పాత్ర కూడా పెద్దదే! కొంత మంది పిల్లలు అమ్మానాన్నలకు తెలియకుండా ఫోన్ను స్కూల్కి తీసుకువెళ్లిపోతుంటారు. ఆ అలవాటును ఇంట్లో కంట్రోల్ చేయలేనప్పుడు స్కూల్ యాజమాన్యానికి తెలియచేయాలి. టీచర్లు ‘ఇక ఆన్లైన్ క్లాసులు ఉండవు, ఆఫ్లైన్ క్లాసులే. కాబట్టి ఫోన్ వాడాల్సిన పని లేదు’ అని ఒకటికి పదిసార్లు మామూలుగా చెప్పాలి. ఆ తరవాత కొన్నాళ్లకు ‘స్కూల్కి ఫోన్ తెస్తే పనిష్మెంట్ ఉంటుంద’ని కూడా హెచ్చరించాలి. పిల్లలను క్విజ్, డ్రాయింగ్ వంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీల్లో నిమగ్నం చేయాలి. – వాకా మంజులారెడ్డి -
శామ్సంగ్ నుంచి అయిదు స్మార్ట్ఫోన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న శామ్సంగ్ తాజాగా గెలాక్సీ ఏ–సిరీస్లో అయిదు స్మార్ట్ఫోన్స్ ప్రవేశపెట్టింది. ధర రూ.15,000 నుంచి ప్రారంభం. 108 ఎంపీ క్వాడ్ కెమెరా, సూపర్ అమోలెడ్ 120 హెట్జ్ డిస్ప్లేతో గెలాక్సీ ఏ73 5జీ తయారైంది. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుపరిచారు. గెలాక్సీ ఏ53, ఏ23, ఏ13, ఏ33 మోడళ్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. కాగా, ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.20–45 వేల ధరల శ్రేణి విభాగంలో 40 శాతం వాటాను శామ్సంగ్ లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే ఈ విభాగంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు కంపెనీ తెలిపింది. 5జీ స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో ప్రస్తుతం 16 మోడళ్లను విక్రయిస్తోంది. నెలకు 3 లక్షల మంది శామ్సంగ్ ఫైనాన్స్ ప్లస్ ద్వారా సులభ వాయిదాల్లో స్మార్ట్ఫోన్స్ కొనుగోలు చేస్తున్నారని కంపెనీ మిడ్, హై స్మార్ట్ఫోన్స్ విభాగం హెడ్ అక్షయ్ ఎస్ రావు మంగళవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. వీరిలో 50 శాతం మంది తొలిసారిగా రుణం తీసుకున్నవారేనని వివరించారు. -
ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.30 వేల యాపిల్ ఐఫోన్ రూ.15 వేలకే..!
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్కార్ట్ యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెకండ్ హ్యాండ్ లేదా Refurbished స్మార్ట్ఫోన్లను ప్రత్యేక సేల్లో భాగంగా అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ సేల్లో మీకు నచ్చిన యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ సంస్థలకు చెందిన Refurbished స్మార్ట్ఫోన్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ప్రీమియం యాపిల్ ఐఫోన్ 7 128జీబీ కొత్త స్మార్ట్ఫోన్ ధర రూ.30,999 అయితే, ఈ సేల్లో మీకు రూ.15,499కు లభిస్తుంది. ఈ Refurbished స్మార్ట్ఫోన్లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేయనున్నట్లు ఫ్లిప్కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు కొత్త మొబైల్స్ దీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ Refurbished యాపిల్ ఐఫోన్ గోల్డ్ కలర్ వేరియంట్ 64 జీబీ స్మార్ట్ఫోన్ కేవలం 10,899 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్లో ఏ9 ప్రాసెసర్ ఉంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 7 Refurbished యాపిల్ ఐఫోన్ 7 128జీబీ కొత్త స్మార్ట్ఫోన్ ధర రూ.30,999 అయితే, ఈ సేల్లో మీకు రూ.15,499కు లభిస్తుంది. ఇందులో ఏ10 ఫ్యూజన్ ప్రాసెసర్'ను కలిగి ఉంది. గూగుల్ పీక్సెల్ 3 ఎక్స్ఎల్ 64 జీబీ ర్యామ్ గల సెకండ్ హ్యాండ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ ₹13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డీ+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పీక్సెల్ 3ఏ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ ₹10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది. (చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త.. వాటి లింక్ గడువు పొడిగింపు!) -
సేల్స్ బీభత్సం..! 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన ఫోన్లు అమ్ముడయ్యాయి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ గత వారం విడుదల చేసిన ఓ స్మార్ట్ ఫోన్ దెబ్బకు 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగినట్లు టెక్ బ్లాగ్లు పలు రిపోర్ట్లను వెలుగులోకి తెచ్చాయి. టెక్ బ్లాగ్ గిజ్మో చైనా కథనం ప్రకారం.. న్యు ఇయర్ సెంటిమెంట్ను క్యాష్ చేసుకునేందుకు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ డిసెంబర్ 28న షావోమీ12 సిరీస్ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది.ఆఫ్లైన్, ఆన్లైన్ వేదికగా విడుదల చేసిన 5 నిమిషాల్లోనే సుమారు 1.8 బిలియన్ యువాన్. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.2108 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను అమ్మినట్లు గిజ్మో చైనా తన కథనంలో పేర్కొంది. స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది న్యు ఇయర్ సందర్భంగా షావోమీ సంస్థ చైనాలో తొలిసారి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ షావోమీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. షావోమీ 12 సిరీస్లోని బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు షావోమీ 12, షావోమీ 12ప్రో ఫోన్లను విడుదల చేసింది. బడ్జెట్ తక్కువగా ఉండడం, అడ్వాన్స్ ఫీచర్లు ఉండడంతో పాటు న్యుఇయర్ సెంటిమెంట్ షావోమీకి కలిసొచ్చింది. దీంతో నిమిషాల వ్యవధిలో భారీ సేల్స్ జరిగినట్లు టెక్ బ్లాగ్ గిజ్మో చైనా తన కథనంలో హైలెట్ చేసింది. షావోమీ 12 స్పెసిఫికేషన్లు షావోమీ 12 స్మార్ట్ ఫోన్ 6.28 అంగుళాలు, 2కే అమోలెడ్ డిస్ప్లే, 4,500ఏఎంహెచ్ బ్యాటరీ,120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 సీపీయూతో 12జీబీ ర్యామ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ సోనీ ఐఎక్స్ 766 సెన్సార్లు, 13ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపీ టెలిఫోటో లెన్స్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 67వాల్ట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 50వాల్ట్ల వైర్లెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. షావోమీ 12 ప్రో స్పెసిఫికేషన్లు షావోమీ 12 ప్రో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, ఫంచ్ హోల్ కట్ అవుట్, ఆండ్రాయిడ్ 12ఓఎస్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాల్ట్ల ఛార్జింగ్ సపోర్ట్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 50ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమరాలు ఉన్నాయి. చదవండి: షావోమీ 'నెక్ట్స్ జనరేషన్ రేసర్' మామూలుగా ఉండదు, ఫీచర్లు అదిరిపోతాయ్..! -
కొత్త ఏడాదిలో ‘స్మార్ట్’గా ఫోన్ల అమ్మకాలు
ముంబై: కొత్త ఏడాదిలో స్మార్ట్ఫోన్లకు భారీ గిరాకీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఏడాదిలో 20 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా 5జీ ఫోన్లకు డిమాండ్ పెరగడంతో పాటు దిగ్గజ మొబైల్ కంపెనీల మధ్య పోటీతత్వం ఫోన్ల ఎగుమతులు పెరిగేందుకు తోడ్పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ గత ఐదేళ్ల నుంచి స్థిరమైన వృద్ధి పథంలో పయనిస్తోంది. కోవిడ్ ప్రేరేపిత లాక్డౌన్ల కారణంగా ఈ ఏడాది పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సెమికండెక్టర్ల కొరత సహా అన్ని అవాంతరాలను అధిగమిస్తూ కొత్త ఏడాదిలో 20 కోట్ల యూనిట్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది’’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విశ్లేషకులు శిల్పి జైన్ తెలిపారు. ఈ ఏడాదిలో (2021)మొత్తం 167–168 మిలియన్ల స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు జరిగినట్లు కౌంటర్ పాయింట్ నివేదిక పేర్కొంది 5జీ స్మార్ట్ఫోన్ల ఊతం ఇటీవల కస్టమర్లు 5జీ స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో వచ్చే ఏడాది నుంచి 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుత డిమాండ్కు తగ్గట్లు షావోమి, శాంసంగ్, వివో, ఒప్పో, వన్ప్లస్ కంపెనీలు 5జీ ఫోన్లు తయారీపై దృష్టి సారించాయి. ప్రారంభ ధరలోనే 5జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. 5జీ ఫోన్లకు నెలకొన్న డిమాండ్ కలిసిరావడంతో మొత్తం స్మార్ట్ఫోన్ల ఎగుమతులు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఈ ఏడాది(2021)లో 2.8 కోట్ల 5జీ ఫోన్ల షిప్మెంట్ జరిగింది. వచ్చే ఏడాదిలో 129 వృద్ధితో మొత్తం 6.8 మిలియన్ల అమ్మకాలు జరగవచ్చు. దీంతో కొత్త ఏడాదిలో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 190 మిలియన్ల మార్కును అందుకోనే వీలుంది‘ అని సైబర్ మీడియా రీసెర్చ్ విశ్లేషకులు ఆనంద్ ప్రియా సింగ్ తెలిపారు కేంద్రం చేయూత కోవిడ్ ప్రేరేపిత లాక్డౌన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండెక్టర్ల కొరత ప్రభావం దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్పైనా పడింది. దీంతో ఈ గతేడాది స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు అంచనాల కంటే 20 శాతం తక్కువగా నమోదైంది. అయితే సెమీ కండక్టర్లు, కాంపొనెంట్ల తయారీ, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ ఏర్పాటుకు కేంద్రం డిసెంబర్లో రూ.76,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. పీఎల్ఐ స్కీమ్ను ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్కు విస్తరించడంతో దేశంలో ఫోన్ల తయారీ బాగా పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మొబైల్ ఫోన్ల తయారీ, వాటి విడిబాగాల తయారీని పెంచేందుకు తలపెట్టిన ఫేజ్డ్ మాన్యుఫాక్చరింగ్ ప్రోగ్రామ్ (పీఎంపీ) కూడా కలిసొస్తుందని మొబైల్ పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. -
‘సబ్సిడీపై స్మార్ట్ఫోన్లు’.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందన
న్యూఢిల్లీ: దేశీయంగా ఇంకా ఫీచర్ ఫోన్లను వినియోగిస్తున్న వారిని స్మార్ట్ఫోన్ల వైపు మళ్లించడానికి సబ్సిడీపై హ్యాండ్సెట్లను అందించాలన్న ప్రతిపాదనలపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ప్రభుత్వం ఇప్పటికే దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు తీసుకుందన్నారు. ‘ప్రస్తుతం మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించి ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్ ఉంది. గత నాలుగైదేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో మెరుగైన మొబైల్ ఫోన్ల ధరలు రూ. 10,000 కన్నా తక్కువ స్థాయికి దిగివచ్చాయి. ఇది కీలక స్థాయి. ఎందుకంటే అల్పాదాయ వర్గాలకూ ఇది అందుబాటు రేటుగానే భావించవచ్చు. ఇక దేశీయంగా విడిభాగాలు, చిప్ల తయారీ కోసం కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనివల్ల సరఫరాపరమైన ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా స్మార్ట్ఫోన్ల తయారీ వ్యయాలు తగ్గి, మరింత అందుబాటు ధరల్లో లభించగలవు‘ అని చెప్పారు. కాబట్టి సబ్సిడీ అవసరం ఉండదనే అర్థం వచ్చేట్టుగా మంత్రి వ్యాఖ్యానించారు. స్పెక్ట్రం ధరలపై కొనసాగుతున్న చర్చలు టెలికం స్పెక్ట్రం ధరకు సంబంధించిన చర్చల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిలో చురుగ్గా పాల్గొనాలని, టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్)కి తగు సూచనలివ్వాలని టెల్కోలకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన భాగస్వామ్య సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ట్రాయ్ తుది డాక్యుమెంటు రూపొందిస్తుందని, దాని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. స్పెక్ట్రం ధరల నిర్ణయంలో ’ప్రజా ప్రయోజనాల’ను కూడా దృష్టిలో ఉంచుకుంటున్న విషయాన్ని అంతా గుర్తిస్తున్నారని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆదాయాన్ని గరిష్టంగా పెంచుకోవడం.. అదే సమయంలో బడుగు వర్గాలకు సర్వీసులను మరింతగా మెరుగుపర్చడానికి మధ్య సమతూకం పాటించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కోవిడ్ పరిణామాలతో అంతా డిజిటల్ బాట పట్టాల్సి రావడంతో టెలికం ప్రాధాన్యతకు గణనీయంగా గుర్తింపు లభించిందని వైష్ణవ్ తెలిపారు. చదవండి: స్పెక్ట్రం బేస్ ధరపై టెలికాం సంస్థల పేచీ -
మరోసేల్, రెండు రోజులు మాత్రమే..స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు..!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులోకి ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 6వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్ బ్రాండ్లపై కొనుగోలు దారులకు ఆఫర్లతో పాటు సేవింగ్ డీల్ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో ప్రత్యేకంగా రియల్మీ స్మార్ట్ ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించింది. రియల్మీ జీటీ నియో2 పై రూ.4వేలు, రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ (ప్రీ-పెయిడ్)పై రూ.4వేలు, రియల్ మీ 8ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్పై రూ.2వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ 8ఐ రూ.1,000, నార్జో 50ఏ పై రూ.1500, రియల్ మీ సీ25వై పై రూ.1,500, నార్జ్ 50ఐ, రియల్ మీ 50ఐ తోపాటు ఇతర స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ 8 పై ఫ్లిప్ కార్ట్, రియల్ మీ. కామ్ లో రూ.2 వేల డిస్కౌంట్, రియల్ మీ 8 5జీ రూ.1500 వరకు ఆఫర్ను పొందవచ్చు. రియల్ మీ సీ21వై ,రియల్ మీ సీ 21పై రూ.500, రియల్ మీ 50ఐ స్మార్ట్ ఫోన్ పై రూ.200 వరకు తగ్గింపు పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. చదవండి: ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే? -
కేవలం రూ.10 వేలకే..అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే
అసలే మంత్ ఎండింగ్. చేతిలో సరపడా డబ్బులు లేవు. కానీ బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలని ట్రై చేస్తున్నారు. అయితే మీ కోసం మార్కెట్లో రూ.10ల లోపు అదిరిపోయే ఫీచర్లతో బ్రాండెంట్ కంపెనీల స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రియల్ మీ నార్జో 30ఏ రియల్ మీ నార్జో 30ఏ స్మార్ట్ఫోన్ ధర రూ.8,999. రియల్ మీ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. 6.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంట్రన్నల్ స్టోరేజ్తో ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ను కలిగి ఉంది. 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్తో యూఎస్బీ సీ పోర్ట్ను వినియోగించుకోవచ్చు. 18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. మైక్రోమ్యాక్స్ నోట్ 1 'మేడ్ ఇన్ ఇండియా' మైక్రోమ్యాక్స్ నోట్ 1 బడ్జెట్ ధరలతో అందుబాటులో ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోర్ ఫోన్ ధర రూ. 9,999గా ఉంది. మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్సైట్, ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్ 10,మీడియా టెక్ హాలియా జీ80 ప్రాసెసర్ను కలిగి ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో మరో రెండు సెన్సార్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 2ఎస్ ఉత్తర కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ కు చెందిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 2ఎస్ ఫోన్ అందుబాటులో ఉంది. స్మార్ట్ఫోన్లో 6.5 అంగుళాల హెచ్డీప్లస్ ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ఎస్ఓఎస్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరాలు ఉన్నాయి. వెనుక సెటప్లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ముందు భాగంలో సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దీని ధర రూ. 9,499 ఉంది. మోటరోలా మోటో జీ10 పవర్ మోటో జీ 10..6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ (720×1,600 పిక్సెల్లు) మాక్స్ విజన్ డిస్ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ25 ఎస్ఓఎస్,13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది.5,000 ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. నోకియా సీ 20 ప్లస్ నోకియా సీ 20ప్లస్ 4,950ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, ఆక్టా కోర్ యూనిసోక్ ఎస్ఈ 9863ఏ ఎస్ఓఎస్తో పాటు 3జీబీ ర్యామ్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, కెమెరా వెనుక డ్యూయల్ సెటప్ ఉంది. రెడ్మీ 9 ప్రైమ్ రెడ్మీ 9 ప్రైమ్ ధర రూ. 9,999కే అందుబాటులో ఉంది. స్మార్ట్ఫోన్ 6.53 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్తో పనిచేస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో కూడిన క్వాడ్ రియర్ కెమెరాతో వస్తుంది. -
షావోమీదే పైచేయి.. శాంసంగ్ వెనుకంజ
న్యూఢిల్లీ: సరఫరాపరమైన సవాళ్ల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ4) దేశీయంగా స్మార్ట్ఫోన్ల విక్రయాలు తగ్గే అవకాశం ఉందని రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మొత్తం అమ్మకాలు 16 కోట్ల కన్నా తక్కువకే పరిమితం కావచ్చని పేర్కొంది. వరుస గా నాలుగు త్రైమాసికాలు వృద్ధి చెందిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు.. సెప్టెంబర్ త్రైమాసికంలో వార్షి క ప్రాతిపదికన 12 శాతం క్షీణించి 4.8 కోట్ల యూనిట్లకు పరిమితమైనట్లు వివరించింది. జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో (తొలి తొమ్మిది నెలలు) స్మార్ట్ఫోన్ అమ్మకాలు 12 కోట్ల యూనిట్లుగా నమోదైనట్లు ఐడీసీ తెలిపింది. సరఫరా పరమైన సవాళ్లతో నాలుగో త్రైమాసికంలో విక్రయాలు క్షీణించవచ్చని, వచ్చే ఏడాది ప్రథమార్ధం కూడా సమస్యాత్మకంగానే కొనసాగవచ్చని పే ర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో షావోమి 23.4 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉండగా, శాంసంగ్, వివో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
అదిరిపోయే ఫీచర్లతో..రూ.20 వేల లోపు ఫోన్లు ఇవే
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్లు సేల్స్ను కొనసాగిస్తున్నాయి. అయితే ఈ సేల్లో రూ.20వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, ఆకట్టుకునే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 20వేల లోపు టాప్ వన్లో ఉన్న ఫోన్ రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్.6.67 అంగుళాల ఫోన్లో అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్, 732జీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ సదుపాయం ఉంది.120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 100శాతం డీసీఐ -పీ3 వైడ్ కలర్, హెచ్డీఆర్-10 సపోర్ట్, టీయూవీ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ (TÜV Rheinland low blue light certification) సదుపాయం ఉంది. ఇక 6జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. ఒప్పో ఎఫ్19ఎస్ ఒప్పో ఎఫ్19ఎస్ 6.43 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ ఎస్ఎం6115 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,60హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్,409పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, పీక్ బ్రైట్నెస్ కోసం 800నిట్స్ ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్లోయింగ్ గోల్డ్, గ్లోయింగ్ బ్లాక్ కలర్స్లో అందుబాటులో ఉండగా దీని ధర రూ.19,990 ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం51 శాంసంగ్ గెలాక్సీ ఎం51' 6.7 అంగుళాల అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే, 20:9యాస్పెట్ రేషియో, పీక్ బ్రైట్ నెస్ కోసం 420నిట్స్, ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్3, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ సదుపాయం ఉంది. దీని ధర రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. వివోవై73 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, ఆక్టాకోర్ మీడియా టెక్ హేలియా జీ 95 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ సదుపాయం ఉన్న ఈ ఫోన్ ధర రూ.19,990గా ఉంది. రియల్ మీ ఎక్స్7 5జీ రియల్ మీ ఎక్స్7 5జీ' 6.55అంగుళా ఫుల్ హెచ్డీతో అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్, 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్జెడ్ టచ్ శాప్లింగ్ రేట్, డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్5, పీక్ బ్రైట్ నెస్ కోసం 1200 నిట్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ ఫోన్ రూ.17,000గా ఉంది. చదవండి: అలెర్ట్: మీరు ఆ ఫోన్లు వాడుతుంటే ఇకపై వాట్సాప్ పనిచేయదు -
యాపిల్కు భారీ షాక్, ఒక్క సెకన్లో ఐఫోన్13 హ్యాక్
గ్లోబల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమిని వెనక్కి నెట్టిన యాపిల్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఇటీవల యాపిల్ విడుదల చేసిన 'ఐఫోన్ -13 ప్రో'ను సెకన్ల వ్యవధిలో 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ హ్యాక్ చేశారని చైనాకు చెందిన టెక్ అనాలసిస్ సంస్థ ఐథోమ్ తన రిపోర్ట్లో పేర్కొంది. షావోమిని వెనక్కి నెట్టింది.. కానీ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కెనాలిస్ ప్రకారం..ఈ ఏడాది క్యూ3 (జులై నుంచి సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో టెక్ దిగ్గజం యాపిల్ 15 శాతం వాటాతో.. చైనాకు చెందిన షావోమిని అధిగమించింది. తిరిగి రెండో స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. అందుకు కారణం ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్కు విపరీతమైన డిమాండ్ పెరగడమేనని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. యాపిల్ సంస్థ ప్రతి ఏడాది నిర్వహించే 'యాపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్'ను ఈ ఏడాది నిర్వహించింది. ‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్’ ద్వారా సెప్టెంబర్ 14న నిర్వహించిన ఈవెంట్లో యాపిల్ సంస్థ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. సెక్యూరిటీ విషయంలో తిరుగు లేదు ఈ సందర్భంగా యాపిల్ ప్రతినిధులు మాట్లాడుతూ తాము విడుదల చేసే, లేదంటే విడుదల కానున్న ఐఫోన్లలో ప్రైవసీ,సెక్యూరిటీ విషయంలో రాజీపడబోమని తెలిపారు. కానీ చైనా 'వైట్ హ్యాట్' హ్యాకర్స్ మాత్రం ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను ఎలా హ్యాక్ చేయొచ్చో..తాజాగా యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 13సిరీస్ ఫోన్లను సెకన్లలో హ్యాక్ చేయొచ్చని తెలిపారు. ఒక్క సెకన్లో హ్యాక్ చేశారు ఇటీవల చైనాలో 4వ 'టియాన్ఫు కప్' ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ కాంటెస్ట్ జరిగింది. ఈ కాంటెస్ట్లో వైట్ హ్యాట్ హ్యాకర్ ఐఫోన్ 13 ప్రోని సెకన్లలో హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసిన హ్యాకర్ ఐఫోన్లో ఉన్న ఫోటో ఆల్బమ్, యాప్లకు యాక్సెస్ చేశాడు. అంతేకాదు అందులో ఉన్న డేటాను ఈజీగా డిలీట్ చేయడం సాధ్యమైందని ఐథోమ్ తన రిపోర్ట్లో పేర్కొంది. మరి ఈ ఐఫోన్13 ప్రో హ్యాకింగ్ పై ఐఫోన్ ప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైట్ హ్యాట్ హ్యాకర్లు అంటే ఎవరు వైట్ హ్యాట్ హ్యాకర్లు లేదా ఎథికల్ హ్యాకర్స్. ఈ హ్యాకర్స్ను ఆయా సంస్థల్లో లేదంటే, టెక్నాలజీలోని లోపాల్ని గుర్తిస్తారు. నిబంధనలకు అనుగుణంగా లోపాల్ని గుర్తించేలా పనిచేసే వీళ్లని ఆయా టెక్ సంస్థలు, లేదంటే ప్రభుత్వాలు సైతం నియమించుకుంటాయి. చదవండి : ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్: స్మార్ట్ఫోన్, ల్యాప్ట్యాప్స్పై డిస్కౌంట్లు
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ తర్వాత బిగ్ దివాళీ సేల్స్ను ప్రకటించింది. ఈ సేల్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా పరిమితంగా పలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్ట్యాప్లపై భారీ డిస్కౌంట్లు అందించింది. రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ పై దివాళీ సేల్లో ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ ప్రకటించింది. మార్కెట్ లో ఫోన్ ధర రూ.25,999 ఉండగా ఈ సేల్ లో రూ.21,999కే అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్లో ఐఫోన్ 12 పై రూ.11,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.65,900ఉండగా ఆఫర్లో రూ.54,999కే సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 12 మినీని రూ.37,999కే కొనుగోలు చేయొచ్చు. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ .59,900గా ఉంది. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్ ఆఫర్లలో భాగంగా శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 రూ .17,999 కి అందుబాటులో ఉంది. ఏసర్ ఆస్పైర్ 7 ల్యాప్ ట్యాప్ ధర రూ.54 వేలకు పైగా ఉండగా దివాళీ సేల్ లో రూ. 49,990కే లభిస్తుంది. -
మొబైల్స్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు
కాలం మారిపోయింది..సెల్ఫోన్ దేహంలో భాగమైపోయింది..ఫోన్ లేనిదే పొద్దు పోవడంలేదు..అత్యవసర పనుల నుంచి.. సరదా కబుర్లకు కూడా సెల్ ఉండాల్సిందే..! అంతెందుకు ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ ఫోన్తో కమ్యూనికేట్ అవ్వొచ్చు. అలాంటి సెల్ ఫోన్కు ఓ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ గురించి తెలుసా? ఉదాహరణకు పీసీ(personal computer)ల కంటే ప్రపంచంలోనే ఎక్కువ మొబైల్ ఫోన్లు ఉన్నాయని తెలుసా? చేతిలో ఫోన్ లేకపోతే పుట్టే భయాన్ని ఏమంటారో తెలుసా? అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ పేరేంటో తెలుసా? మొదటి మొబైల్ ఫోన్ బరువు ఎంతో తెలుసా? ఇలాంటి ఇంటస్ట్రింగ్ ఫ్యాక్స్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ►మనం వినియోగించే 'స్మార్ట్ ఫోన్' అసలు పేరు 'సిమోన్'. ఈ ఫోన్లో క్యాలండర్ యాప్స్, అడ్రస్ బుక్, వరల్డ్ క్లాక్, క్యాలిక్లేటర్, నోట్ ప్యాడ్, ఈమెయిల్, ఫ్యాక్స్, గేమ్స్ ఆడేవారు. టచ్ స్క్రీన్తో లభించే ఈ ఫోన్ ధర వెయ్యి డాలర్లు. ►ఫస్ట్ సెల్ ఫోన్ ను 1973లో తయారు చేశారు.ఆఫోన్ నుంచి 1992లో ఫస్ట్ మెసేజ్ పంపారు. ►ఫస్ట్ కెమెరా ఫోన్ 2002 జపాన్లో విడుదలైంది. ►టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన అన్నీ ఫోన్లలో కంటే ఐఫోన్ 5ఎస్ ఎక్కువగా అమ్ముడు పోయింది. 2013 సెప్టెంబర్ 20న విడుదలైన ఈ ఫోన్ ఇప్పటి వరకు 70వేల మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ►ప్రపంచంలో వాటర్ ఫ్రూఫ్ ఫోన్లు అమ్ముతున్న దేశం జపాన్. ►సైంటిస్ట్లు తొలిసారి యూరిన్ సాయంతో సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టారు. ►2015లో ఆపిల్ సంస్థ పాత ఐఫోన్లను రీసైకిల్ చేసి టన్ను గోల్డ్ను వెలికి తీసింది. అలా వెలికి తీసిన ప్రస్తుతం గోల్డ్ ధర 40మిలియన్ల (ఇండియన్ కరెన్సీలో రూ.2,99,88,62,000.00) ఉంది. ► మొబైల్ ఫోన్లను విసిరేయడం ఫిన్ల్యాండ్లో అధికారిక క్రీడ ► టాయిలెట్ హ్యాండిల్ కు ఉన్న బ్యాక్టీరియా కంటే 18 టైమ్స్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన ఫోన్లో ఉంది.శాక్రమెంటో బీ రిపోర్ట్ ప్రకారం ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, టచ్ స్క్రీన్లపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ►ప్రతిరోజు ఓ వ్యక్తి యావరేజ్గా 110 సార్లు తమ స్మార్ట్ ఫోన్లను అన్ లాక్ చేస్తుంటాడు. ►చేతిలో ఫోన్ లేకపోతే కలిగే భయాన్ని వైద్య పరిభాషలో నోమో ఫోబియా అంటారు. ►1999లో తొలిసారి బెనిఫాన్ ఈఎస్ఈ అనే ఫోన్లో జీపీఎస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ► 2015లో వరల్డ్ వైడ్ గా 1.4 బిలియన్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. ► హాంకాంగ్ పాపులేషన్ 7.2 మిలియన్ల మంది ఉండగా..యాక్టీవ్గా ఉన్న మొబైల్స్ సంఖ్య 17.4 మిలియన్లుగా ఉంది. ► 40శాతం స్మార్ట్ ఫోన్లు దొంగతనానికి గురయ్యే సమయం సాయంత్రం 5 గంటల సమయం లోపలే. ► 11శాతం మొబైల్స్ దొంగతనం పనిచేసే ప్రదేశాల్లో జరిగినట్లు తేలింది. ► తొలిసారి వాడుకలోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ బరువు 2.5 పౌండ్లు.. అదే ఫోన్ ఇప్పుడు యావరేజ్గా 250 గ్రాములు. చదవండి: జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి -
స్మార్ట్ఫోన్ల జాతర.. వరుస కట్టిన కొత్త ఫోన్లు
పండగ సీజన్ని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్ఫోన్ కంపెనీలు రెడీ అయ్యాయి. దసరా మొదలు న్యూ ఇయర్ వరకు ఉన్న ఫెస్టివ్ సీజన్లో వరుసబెట్టి ఫోన్లు రిలీజ్ చేసేందుకు స్పెషల్ ఈవెంట్లను వేదికగా చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఫోన్ల ధర ఎంత, వాటిలో ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి గ్యాడ్జెట్ లవర్స్లో పెరిగిపోతుంది. యాపిల్తో మొదలు స్మార్ట్ఫోన్ ప్రపంచలో యాపిల్ది ప్రత్యేక స్థానం, మెటల్బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, యాప్స్టోర్, టాప్నాచ్ ఇలా ఒక్కటేమిటీ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఫీచర్లలో సగానికి సగం యాపిల్ పరిచయం చేసినవి లేదా యాపిల్ వల్ల పాపులర్ అయినవే ఉన్నాయి. అందువల్లే యాపిల్ ఈవెంట్ అంటే ప్రపంచమంతటా ప్రత్యేక ఆసక్తి. మొబైల్ టెక్నాలజీలో కొత్తగా ఏం పరిచయం చేయబోతున్నారనే కుతూహలం నెలకొంటుంది. ఇలాంటి వారి కోసమే అన్నట్టుగా అక్టోబరు 18న యాపిల్ ఆన్లీషెడ్ ఈవెంట్ జరగనుంది. గూగుల్ సైతం ప్రపంచంలో ఎనభై శాతం స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఫ్లాట్ఫార్మ్ మీదనే రన్ అవుతున్నా.. మార్కెట్ లీడర్ అనదగ్గ ఒక్క ఫోన్ రిలీజ్ చేయలేదనే వెలితి గూగుల్ని పట్టి పీడిస్తోంది. నెక్సస్, మోటో, పిక్సెల్ తదితర బ్రాండ్ నేమ్లతో పదేళ్లుగా గూగుల్ మొబైల్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో అక్టోబరు 19న పిక్సెల్ 6 మొబైల్ని రిలీజ్ చేయనుంది. ఇందులో కొత్తగా టెన్సర్ చిప్సెట్ని ఉపయోగిస్తోంది గూగుల్. ఈసారైనా ఈ టెక్ దిగ్గజ కంపెనీ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. మరో సిరీస్లో వన్ప్లస్ హైఎండ్ ఫీచర్లు అతి తక్కువ ధరలో అనే కాన్సెప్టుతో వచ్చి శామ్సంగ్, యాపిల్కు చుక్కలు చూపించింది వన్ ప్లస్ బ్రాండ్. కేవలం దీని వల్లే హై ఎండ్బ్రాండ్ ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదంటాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ పరంపరలో 9 సిరీస్కి సంబంధించిన వివరాలు అక్టోబరు 19న వెల్లడించనుంది వన్ప్లస్. మేము వస్తున్నాం యాపిల్, గూగుల్లకి పోటీగా అన్ ప్యాకెడ్ ఈవెంట్ని ప్రకటించింది శామ్సంగ్. అక్టోబరు 20న జరగబోయే ఈ సమావేశంలో తమ సంస్థ నుంచి రాబోతున్న కొత్త స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)కి సంబంధించి గ్యాడ్జెట్లను శామ్సంగ్ పరిచయం చేయనుంది. మళ్లీ వస్తోన్నఎక్స్పీరియా అక్టోబరులోనే కొత్త ఎక్స్పీరియా ఫోన్ని పరిచయం చేసేందుకు సోనీ రెడీ అవుతోంది. ఒకప్పుడు స్మార్ట్ఫోన్ మార్కెట్లో చెలరేగిన సోని.. గత ఐదేళ్లుగా గప్చుప్గా ఉంది. కాగా మరోసారి ఇండియన్ మార్కెట్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా అక్టోబరు 26న ఎక్స్పీరియా ఈవెంట్ నిర్వహిస్తోంది. సోనితో పాటే ఇదే నెలలో ఒప్పో, ఆనర్, హువావే, ఐక్యూ కంపెనీలు సైతం కొత్త ఫోన్లు మార్కెట్లోకి తేబోతున్నాయి. ఏడాది చివరినాటికి బడ్జెట్ ఫోన్లతో దేశంలో సగం మార్కెట్ని ఆక్రమించిన రెడ్మీ, రియల్మీ సంస్థలు సైతం రాబోయే నెలల్లో కొత్త ఫోన్లు తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు వీటి సబ్సిడరీ కంపెనీలైన ఆనర్, పోకోలు ధరల యుద్ధాన్ని మరింత తీవ్రం చేసేందుకు కొత్త మోడళ్లతో మార్కెట్ను ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి. చదవండి:6జీ ఇంటర్నెట్ స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! -
రియల్ మీ అదిరిపోయే ఆఫర్
స్మార్ట్ ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్. రియల్ మీ ఇండియా పేరుతో దేశ వ్యాప్తంగా ఆఫ్లైన్ స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.ఇందులో భాగంగా అక్టోబర్ 8,9 తేదీలలో ఎక్స్ క్లూజీవ్ ఆఫర్లు ప్రకటించింది. రియల్ మీ నిర్వహించే ఆఫర్లో రూపాయికే పలు గాడ్జెట్స్ను అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఆఫ్లైన్ స్టోర్లు ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విదేశీ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు మార్కెట్ను విస్తరించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఇండియన్ ఆన్లైన్ మార్కెట్లో షావోమీ 28 (క్యూ2) శాతం, శాంసంగ్ 18 శాతం, వివో 15 శాతం సేల్స్ తో రాణిస్తున్నాయి. 15 శాతం మార్కెట్ షేర్ను పెంచేందుకు రియల్ మీ ఆఫ్లైన్ మార్కెట్పై కన్నేసింది. గతేదాడి ఆగస్ట్ 20న రియల్ మీ తొలి ఆఫ్లైన్ స్టోర్ను ప్రారంభించింది. ఇప్పుడు ఆ స్టోర్ల సంఖ్యను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 100 ఆఫ్లైన్ స్టోర్లను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ఇండియా రియల్ మీ సీఈఓ మాధవ్ సేఠ్ ప్రకటించారు. టైర్ 2, టైర్ 3 సిటీస్ తో పాటు అదనంగా గుజరాత్లో ఫ్లాగ్ షిప్ స్టోర్(ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 300 రియల్ మీ స్టోర్లను ప్రారంభించే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. 2022నాటికి ఆ సంఖ్యను 1000 స్టోర్లకు పెంచుతామని తెలిపారు. Congratulations to the entire #realme family! We're launching 100 exclusive realme stores today. I am quite excited, and I hope that all the #realmeFans will enjoy visiting these unique stores as well.#Centurywithrealme pic.twitter.com/dv5iBsx6Zn — Madhav Sheth (@MadhavSheth1) October 8, 2021 ఆఫ్లైన్ స్టోర్లలో ఏముంటాయ్ రియల్ మీ లాంఛ్ చేయనున్న ఈ రియల్ మీ స్టోర్లలో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ట్యాప్స్, ట్యాబ్లెట్స్ తో పాటు ఇతర టెక్ గాడ్జెట్స్ ఉంటాయని మాధవ్ సేఠ్ వెల్లడించారు. ఆఫ్లైన్ మార్కెట్లో కష్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: 'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు' -
5 రోజుల్లో షావోమీ స్మార్ట్ఫోన్ అమ్మకాలు తెలిస్తే షాకే..!
దసరా, దీపావళి పండుగ సీజన్లు రావడంతో పలు ఈ-కామర్స్ సంస్థలు, ఇతర ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఉత్పత్తుల సంస్థలు ఫెస్టివల్ సీజన్లను ప్రకటించాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ-కామర్స్ సంస్థల బాటలోనే ప్రముఖ చైనీస్ దిగ్గజం షావోమీ కూడా నడుస్తోంది. షావోమీ కొనుగోలు దారులకు ‘దీపావళి సేల్ విత్ ఎమ్ఐ’ సేల్ ను ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్తో పాటుగా షావోమీ సేల్పై భారతీయులు ఎగబడి స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారు. 5 రోజుల్లో అక్షరాల 20 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించామని షావోమీ బుధవారం రోజున ఒక ప్రకటనలో వెల్లడించింది. చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..! ప్రీమియం సెగ్మెంట్లో భాగంగా షావోమీ 11 లైట్ ఎన్ఈ5జీ, మిడియమ్ సెగ్మెంట్లో ఎమ్ 11ఎక్స్, రెడ్మీ నోట్ 10ఎస్, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ 9 సిరీస్ స్మార్ట్ఫోన్స్ భారతీయులు భారీగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో 10 శాతం మేర అమ్మకాలు జరిగాయని షావోమీ పేర్కొంది. ఇక స్మార్ట్టీవీ అమ్మకాల్లో కూడా షావోమీ రికార్డు నమోదు చేసింది. మూడురోజల్లో సుమారు లక్షకు పైగా స్మార్ట్టీవీలను షావోమీ విక్రయించింది. చదవండి: ఎలన్ మస్క్ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్! -
గుడ్ న్యూస్.. ఇక ఫోన్ స్క్రీన్ పగలదు
ఎంత కొత్త మోడల్ కొన్నా.. ఎంత ఖరీదైన ఫోన్ కొన్నా.. ఒక్కసారి కిందపడిందంటే స్క్రీన్ గ్లాస్ పగలడం ఖాయం. ఫోన్ స్క్రీన్ అనే కాదు.. గాజు ఏదైనా కాస్త ఒత్తిడిపడితే పుటుక్కుమంటుంది. కానీ అత్యంత గట్టిగా ఉండి ఓ మోస్తరు ఒత్తిడి తట్టుకునే సరికొత్త గాజు త్వరలోనే అందుబాటులోకి రానుంది. కెనడాకు చెందిన మెక్గిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. సాధారణ గాజును, ఆక్రిలిక్ (దృఢంగా ఉండే పారదర్శక ప్లాస్టిక్)ను కలిపి ఈ సరికొత్త గాజును రూపొందించారు. సాధారణ గాజుతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకుంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అలెన్ ఎర్లిచర్ తెలిపారు. ముత్యాల తరహాలో.. ఆల్చిప్పల్లో ముత్యాలు రూపొందే పద్ధతి ఆధారం గానే శాస్త్రవేత్తలు సరికొత్త గ్లాస్ను తయారు చేశారు. ఆల్చిప్పల లోపలి వైపు ‘నెక్ర్’గా పిలిచే పదార్థం ఉంటుంది. పెళుసుగా ఉండే కాల్షియం కార్బోనేట్ పదార్థం, సాగే గుణమున్న ఆర్గానిక్ (కొన్ని రకాల ప్రొటీన్లు) పదార్థం కలిసి ‘నెక్ర్’గా రూపొందుతాయి. దీనితో రూపొందే ఆల్చిప్పలు, ముత్యాలు దృఢంగా ఉంటూనే.. ఒత్తిడిని తట్టుకోగలుగుతాయి. ఈ నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. పెళుసుగా ఉండే గాజును, సాగే గుణమున్న ఆక్రిలిక్ను కలిపి దృఢమైన గ్లాస్ను రూపొందించారు. దీని తయారీ సులువని, ధర కూడా తక్కువని తెలిపారు. స్మార్ట్ఫోన్ల స్క్రీన్లతోపాటు టీవీలు, మానిటర్లు వంటివాటికి ఈ గాజును వినియోగించవచ్చన్నారు. -
వీటిలో ఇంటర్నెట్ సేవలు బంద్..!
రేపటి నుంచి అనగా సెప్టెంబర్ 30 నుంచి పలు డివైజ్ల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. Let’s Encrypt’sకు చెందిన IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ గడువు రేపటితో ముగియనుంది. దీంతో పలువురు ఈ సర్టిఫికేట్లను కల్గిన డివైజ్లో వరల్డ్ వైడ్ వెబ్సేవలను పొందలేరని టెక్నికల్ నిపుణులు పేర్కొన్నారు. లెట్స్ ఎన్క్రిప్ట్ (Let's Encrypt) అనేది నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మొబైల్, ల్యాప్టాప్, పర్సనల్కంప్యూటర్స్ వంటి పరికరాల మధ్య ఇంటర్నెట్ కనెక్షన్ని ఈ ఆర్గనైజేషన్ ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్ సహాయంతో మనం వాడే డివైజ్లకు ఏలాంటి హాని లేకుండా, సురక్షితమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయి. అంతేకాకుండా మీ పర్సనల్ డేటాను హ్యక్ కాకుండా చూస్తోంది. మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు యూఆర్ఎల్ అడ్రస్లో మొదట హెఛ్టీటీపీఎస్తో ఆయా వెబ్సైట్ వస్తోంది. ఈ విషయాన్ని మనలో కొంత మంది గమనించే ఉంటాం. హెఛ్టీటీపీఎస్ ప్రారంభమయ్యే వెబ్సైట్ అత్యంత సురక్షితమని అర్థం. ఈ ప్రాసెస్ పూర్తిగా IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ సహాయంతోనే జరుగుతుంది. చదవండి: Jeans Could Get Pricey: జీన్స్, టీషర్ట్స్ లవర్స్కు షాకింగ్ న్యూస్...! ప్రభావం ఎక్కువగా వీటిపైనే..! IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ ఆప్డేట్ అయిన డివైజ్లకు ఏలాంటి ప్రాబ్లమ్ లేదు. ఏళ్ల తరబడి ఎలాంటి ఆప్డేట్కు నోచుకొని డివైజ్ల్లో ఇంటర్నెట్ సేవలు ముగియనున్నాయి. టెక్ క్రచ్ నివేదిక ప్రకారం...మాక్ఓఎస్ 2016 వర్షన్, పలు ఓల్డ్ ఐఫోన్స్, విండోస్ ఎక్స్పీ(విత్ సర్వీస్ పాక్ 3), ప్లే స్టేషన్ కన్సోల్ 3. ప్లేస్టేషన్ 4 వంటి అప్గ్రేడ్ కాని వాటిలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయి. ఇలా చేస్తే బెటర్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత 7.1.1 కంటే పాత వెర్షన్లను కలిగి ఉన్న అన్ని ఆండ్రాయిడ్ డివైజ్ లలో ఇంటర్నెట్ పని చేయదు. ఐవోఎస్ 10 కంటే పాత వెర్షన్లను కలిగి ఉన్న ఐఫోన్లలో కూడా ఇంటర్నెట్ సేవలు పని చేయవు. మీ డివైజ్ లలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, వెంటనే మీ ఫోన్ లో చెక్ చేసి, పాత వర్షన్ ఉంటే వెంటనే అప్డేట్ చేయండి. ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ వర్షన్ ఉన్న స్మార్ట్ఫోన్ యూజర్లు మోజిలా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ను ఉపయోగిస్తే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చునని తెలుస్తోంది. చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..! -
బడ్జెట్లో మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్ఫోన్
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో సబ్ బ్రాండ్ ఐక్యూ చైనాలో ఆవిష్కరించిన తన జెడ్5 స్మార్ట్ఫోన్ను నేడు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లో శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో పంచ్ హోల్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఐక్యూ జెడ్5 44డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేసి వస్తుంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. (చదవండి: పది సెకండ్ల యాడ్కు 18 లక్షలే....!) ఐక్యూ జడ్5 ధర భారతదేశంలో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఐక్యూ జడ్5 రూ.23,990కి లభిస్తే, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మొబైల్ ధర రూ.26,990 ఉంది. ఇది ఆర్కిటిక్ డాన్, మిస్టిక్ స్పేస్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అక్టోబర్ 3 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో(iQoo.com, Amazon.in) అందుబాటులో ఉంటుంది. లాంఛ్ ఆఫర్ కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్/క్రెడిట్, ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. ఐక్యూ జెడ్5 స్పెసిఫికేషన్లు 6.67 అంగుళాల ఫుల్-హెచ్ డీ+ LCD డిస్ ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ 8 జీబీ/12 జీబీ ర్యామ్, 128 జీబీ/256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 64 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా 44డబ్ల్యు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ హై-రెస్ ఆడియో, హై-రెస్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.23,990 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.26,990 -
వన్ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్ఫోన్లో అదిరిపోయే ప్రాసెసర్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్ప్లస్ త్వరలో 9 ఆర్టీ పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ తీసుకొని రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన కొన్ని ఆసక్తికర స్పెసిఫికేషన్లను కొందరు టిప్ స్టార్ హీరోలు బయటకి లీక్ చేస్తున్నారు. ఈ మొబైల్ వచ్చే నెల అక్టోబర్ మధ్యలో లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది విడుదల కాబోయే చివరి స్మార్ట్ఫోన్ ఇది. ఈ స్మార్ట్ఫోన్ శక్తివంతమెన స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్నట్లు తెలుస్తుంది. వన్ప్లస్ 9 ఆర్టీ అక్టోబర్ 15న లాంచ్ కానున్నట్లు ప్రముఖ టిప్ స్టార్ స్టీవ్ హెమ్మర్ స్టాఫర్(@onleaks) ట్వీట్ చేశారు. దీనిని వన్ప్లస్ ధృవీకరించలేదు. ఈ స్మార్ట్ఫోన్ రెండు వేరియంట్లలో లభించనుంది. వన్ప్లస్ 9 ఆర్టీ 8జీబీ + 128జీబీ వేరియెంట్ ధర సీఎన్వై 2,999(సుమారు రూ.34,300), 8జీబీ + 256జీబీ వేరియెంట్ ధర సీఎన్వై 3,299(సుమారు రూ.37,700)కు విడుదల కావచ్చు అని తెలుస్తుంది.(చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపు ఈ సేవలకు అంతరాయం) వన్ప్లస్ 9 ఆర్టీ ఫీచర్స్(అంచనా) 6.55 అంగుళాల శామ్ సంగ్ ఈ3 ఫుల్-హెచ్ డి+ డిస్ ప్లే (120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు) కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజ్ 50 ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 766 సెన్సార్ ట్రిపుల్ సెటప్ కెమెరా 65డబ్ల్యు ఫాస్ట్ చార్జర్ 4,500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ -
చిప్ల కొరత, కలవరంలో కార్ల కంపెనీలు
ముంబై:అంతర్జాతీయంగా సెమీకండక్టర్ చిప్ల కొరత భారత్లో వాహనాల తయారీకి ప్రతికూలంగా మారుతోంది. దీంతో ఆగస్టు–సెప్టెంబర్ హోల్సేల్ అమ్మకాలపై ప్రభావం పడొచ్చని ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ ఒక నివేదికలో తెలిపింది. ‘మారుతి, బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీలపై సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ ప్రభావం ఉండవచ్చు‘ అని వివరించింది. మలేషియాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్ కూడా చిప్ల కొరతకు కారణంగా ఉంటోందని జెఫ్రీస్ తెలిపింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బ నుంచి డిమాండ్ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితులు ఆటోమొబైల్ కంపెనీలను కలవరపరుస్తున్నాయి. చదవండి : ఆపిల్ 'థింక్ డిఫరెంట్'..వీళ్లకి మూడింది! విరివిగా సెమీకండక్టర్ల వినియోగం.. వాహనాలు మొదలుకుని కంప్యూటర్లు, సెల్ఫోన్లతో పాటు ఇతరత్రా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో సెమీకండక్టర్లుగా వ్యవహరించే సిలికాన్ చిప్లను వాడుతున్నారు. ఆయా ఉత్పత్తులు వివిధ పనులను సక్రమంగా నిర్వర్తించేందుకు (కంట్రోల్, మెమొరీ మొదలైనవి) చిప్లు ఉపయోగపడతాయి. ఇటీవలి కాలంలో బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్ట్, నేవిగేషన్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్స్ వంటి అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లతో కొత్త వాహనాల రూపకల్పనలో సెమీకండక్టర్ల వాడకం గణనీయంగా పెరిగింది. కీలకమైన చిప్లకు కొరత నెలకొనడంతో అంతర్జాతీయంగా ఆటోమోటివ్ సహా ఇతర పరిశ్రమలపైనా ప్రభావం పడుతోంది. దీంతో అవి ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. నివేదికలోని ఇతర వివరాలు.. 2019 ఆగస్టుతో (కరోనాకి పూర్వం) పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ 41–44 శాతం పెరిగింది. ట్రక్కుల రిజిస్ట్రేషన్ 15 శాతం తగ్గినప్పటికీ క్రమంగా మెరుగుపడుతోంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం ఆగస్టులో ఏకంగా 19 శాతం పడిపోయాయి. ►2019 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 29 శాతం తగ్గాయి. కోవిడ్ సెకండ్ వేవ్ పరిణామాలు ఇందుకు కారణం. డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. జులై ద్వితీయార్థంలో ఆటోమొబైల్ కంపెనీల కోసం ఆన్లైన్లో సెర్చి చేయడం కాస్త తగ్గినప్పటికీ ప్రస్తుతం మళ్లీ పెరుగుతోంది. కన్జూమర్ సెంటిమెంట్ మెరుగుపడుతోందనడానికి ఇది నిదర్శనంగా జెఫ్రీస్ తెలిపింది. ►ఇక 2019తో పోలిస్తే 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టూవీలర్ల రిజిస్ట్రేషన్లు 46 శాతం పడిపోయినప్పటికీ క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ►జులై–ఆగస్టు మధ్య కాలంలో ట్రాక్టర్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 2019తో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ట్రక్కులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ►ఆటోమొబైల్ కంపెనీల స్థూల మార్జిన్ ఒత్తిళ్లలో అత్యధిక భాగం సెప్టెంబర్ త్రైమాసికానికి తగ్గిపోవచ్చని జెఫ్రీస్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో కంపెనీలు సీక్వెన్షియల్ ప్రాతిపదికన మెరుగైన మార్జిన్లు నమోదు చేసుకోవచ్చని వివరించింది. సెప్టెంబర్లో మారుతీ ఉత్పత్తి డౌన్..? చిప్ల కొరత కారణంగా సాధారణ స్థాయితో పోలిస్తే సెప్టెంబర్లో ఉత్పత్తి 40 శాతానికి తగ్గిపోవచ్చని దేశీ దిగ్గజం మారుతీ సుజుకీ అంచనా వేస్తోంది. హర్యానా, గుజరాత్లోని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రభావం పడవచ్చని సంస్థ తెలిపింది. హర్యానాలోని గుర్గావ్, మానెసర్ ప్లాంట్ల వార్షిక తయారీ సామర్థ్యం 15 లక్షల యూనిట్లుగా ఉంది. దీంతో పాటు గుజరా త్లోని సుజుకీ మోటర్ గుజరాత్ (ఎస్ఎంజీ) ప్లాంటు స్థాపిత సామర్థ్యం వార్షికంగా మరో 7.5 లక్షల యూనిట్ల స్థాయిలో ఉంది. జులైలో మారుతీ సుజుకీ మొత్తం ఉత్పత్తి 58 శాతం పెరిగి 1,70,719 యూనిట్లుగా నమోదైంది. -
లీకైన వన్ప్లస్ 9ఆర్ టీ స్మార్ట్ఫోన్ ధర, ఫీచర్స్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్ప్లస్ త్వరలో మార్కెట్లోకి తీసుకొనిరాబోయే 9ఆర్ టీ స్మార్ట్ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్ అయినట్లు తెలుస్తుంది. చైనా టిప్ స్టార్ ఒకతను చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ వీబోలో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు. వన్ప్లస్ 9ఆర్ టీ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని పేర్కొన్నారు. ఈ ఫోన్ 65డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది అని కూడా తెలిపారు. వన్ప్లస్ 9ఆర్ టీ 8/128 జీబీ వేరియంట్, 8/ 256 జీబీ అనే రెండు వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. మన ఇండియాలో వన్ప్లస్ 9ఆర్ టీ 8/128 జీబీ ధర రూ.39,999గాను, వన్ప్లస్ 9ఆర్ టీ 8/256 జీబీ వేరియంట్ ధర రూ.43,999 ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ఫోన్ 6.55 అంగుళాల శామ్సంగ్ ఈ3 ఫుల్-హెచ్ డీ+ సూపర్ అమోల్డ్ డిస్ ప్లేతో రానునట్లు తెలుస్తుంది. దీని డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ రానున్నట్లు టిప్ స్టార్ పేర్కొన్నారు. ఈ ఫోన్ 8జీబీ ఎల్ పీడిడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యుఎఫ్ ఎస్ 3.1 స్టోరేజ్ తో వస్తుందని తెలిపారు. వన్ప్లస్ 9ఆర్ టీ మన దేశంలో అక్టోబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.(చదవండి: హీరో ఎలక్ట్రిక్ ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్) -
రూ.9 వేలకే రియల్మీ ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్ఫోన్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ రియల్మీ చాలా తక్కువ ధరకే ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్ఫోన్ సీ21వైను నేడు(ఆగస్టు 23) మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త రియల్మీ స్మార్ట్ఫోన్ 20:9 డిస్ ప్లేతో వస్తుంది. ఈ సీ21వై స్మార్ట్ఫోన్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంది. అలాగే ఇది రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో స్లో-మోషన్ వీడియోను(1080పీ) వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. మొత్తం మీద రియల్మీ సీ21వై రెడ్ మీ 9, ఇన్ఫినిక్స్ హాట్ 10ఎస్, నోకియా జీ20 వంటి బడ్జెట్ ఫోన్లతో పోటీ పడనుంది. భారతదేశంలో రియల్మీ సీ21వై 3జీబీ/32జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.8,999, 4/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ క్రాస్ బ్లాక్, క్రాస్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్, రియల్మీ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఆఫ్ లైన్ రిటైలర్ స్టోర్లలో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది.(చదవండి: రైల్వే రిజర్వేషన్ టికెట్ బదిలీ చేసుకోవచ్చు ఇలా..!) రియల్మీ సీ21వై స్పెసిఫికేషన్స్: 6.5 అంగుళాల హెచ్ డి+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యుఐ యునిసోక్ టీ610 ఆక్టా కోర్ ప్రాసెసర్ 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మోనోక్రోమ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా(ఎఫ్/2.4 లెన్స్) 3/32 జీబీ, 4/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ (రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్) 4జీ ఎల్ టీఈ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ వి5.0, జీపిఎస్/ ఎ-జిపిఎస్, మైక్రో-యుఎస్ బి, 3.5మిమి హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి. -
ఒకేసారి రెండు, అద్భుతమైన ఫీచర్లతో రియల్ మీ స్మార్ట్ ఫోన్లు
ఇండియా టాప్ ఫైవ్ స్మార్ట్ ఫోర్ బ్రాండ్లలో షియోమీ,శాంసంగ్, వివో, ఒప్పో,రియల్ మీ బ్రాండ్లు ఉన్నాయి. అయితే 16 శాతం మార్కెట్తో ఐదో స్థానంలో ఉన్న రియల్ మీ.. తన మార్కెట్ షేర్ను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా యూజర్లు ఆకట్టుకునేలా ఇండియాలో తొలి 'రియల్ మీ స్లిమ్ బుక్' పేరుతో ల్యాప్ ట్యాప్ ను విడుదల చేసింది. విడుదలైన ఆ ల్యాప్ ట్యాప్ యూజర్లను అట్రాక్ట్ చేస్తుండగా.. రియల్ మీ జీటీ 5జీ సిరీస్ లో 'రియల్ మీ జీటీ 5జీ, రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ 5జీ' పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. రియల్ మీ జీటీ 5జీ ఫీచర్స్ రియల్ మీ జీటీ 5జీ క్వాల్కమ్ 8 సిరీస్ ప్రాసెసర్, ఆకా 888 స్నాప్ డ్రాగన్, ఎల్పీడీడీఆర్5 12 జీబీ నుంచి 256జీబీ యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్, హీట్ను తగ్గించేందుకు వీసీ కూలింగ్ సిస్టంతో వస్తుంది. ఇక 6.43 అంగుళాల ఆమ్లోడ్ డిస్ ప్లే , 1080 రెజుల్యూషన్, 120జెడ్ హెచ్ రిఫ్రెష్ రేట్, ఫ్రంట్ ఎండ్ పంచ్ హోల్ కట్ అవుట్లో 16 మెగా పిక్సెల్ కెమెరా, వెనక భాగంలో 3 కెమెరాలు, 64 మెగా పిక్సెల్ లో ఫ్రంట్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ మైక్రో సెన్సార్తో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే..65 వాల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 4,500ఏఎంహెచ్ బ్యాటరీ, డ్యాయల్ స్టెరో స్పీకర్స్, హై రెజెల్యూషన్తో ఆడియో సపోర్ట్, హెడ్ ఫోన్ జాక్ , ఆండ్రాయిడ్ 11 బేస్డ్, యూజర్ ఇంటర్ ఫేస్ 2.0తో ఆకట్టుకుంటుంది. రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ ఫీచర్స్ రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ 6.43 అంగుళాల సూపర్ ఆమ్లోడ్ డిస్ ప్లే, 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ కంట్ అవుట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778 ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్ నుంచి 256జీబీ స్టోరేజ్ తో యూజర్ ఇంటర్ ఫేస్ 2.0తో ఆండ్రాయిడ్ 11 వెర్షన్ లో అందుబాటులో ఉంది. అట్రాక్ట్ చేసేలా ఫోటోలు తీసేలా ఫ్రంట్ ఎండ్ 32మెగా పిక్సెల్ కెమెరా, 64మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ మాక్రో షూటర్ను అందిస్తుంది. 65 వాల్ట్లతో ఫాస్ట్ గా ఛార్జింగ్ ఎక్కేందుకు 4,300 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది. రియల్ మీ జీటీ 5జీ మాస్టర్ ఎడిషన్ ధర త్రీ కాన్ఫిగరేషన్ తో 6జీబీ/128జీబీ, 8జీబీ/128జీబీ, 8జీబీ/256జీబీ వస్తుండగా..6జీబీ/128జీబీ ప్రారంభ ధర రూ.25,999, 8జీబీ/128జీబీ ధర రూ.27,999, 8జీబీ/256జీబీ వెర్షన్ లో రూ.29,999కే అందిస్తున్నట్లు రియల్ మీ ఇండియా ప్రతినిధులు తెలిపారు. రియల్ మీ జీటీ 5జీ ధర రియల్ జీటీ 5జీ రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది. 8జీబీ/128జీబీ,12జీబీ/256జీబీ తో వస్తుండగా 8జీబీ/128జీబీ మోడల్ ధర రూ. 37,999, 12జీబీ/256జీబీ వెర్షన్ ధర రూ .41,999 వస్తుంది. రియల్ మీ జీటీ 5జీ ఆగస్ట్ 25 నుండి realme.com, Flipkart తో పాటు ఆఫ్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. -
పాత ఫోన్లు, లాప్ట్యాప్లు అమ్మేస్తారా? ఇది మీకోసమే..
సాక్షి, వెబ్డెస్క్: వేల రూపాయలు పెట్టి కొన్న గాడ్జెట్లు నెలలు తిరగకుండానే ఓల్డ్ మోడల్ అవుతున్నాయి. ఇయర్ ఫోన్స్ మొదలు స్మార్ట్ఫోన్ల వరకు , కీబోర్డు మొదలు టచ్ ల్యాప్టాప్ల వరకు వెంట వెంటనే అప్డేట్ వెర్షన్లు వచ్చేస్తున్నాయి. కొత్త వెర్షన్ వస్తువు కొందామంటే.. పాతది ఏం చేయాలని? ఎలా రీజనబుల్ ధరకు అమ్మేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్యను తీరుస్తూ.. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల కొనడమే పనిగా ఈ-కామర్స్లోకి అడుగుపెట్టింది క్యాషిఫై. పాతవి అమ్మాలంటే మార్కెట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో వెనువెంటనే మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో ఇది మరీ ఎక్కువ. వారం తిరక్కుండానే కొత్త ఫీచర్లతో తక్కువ ధరలో మంచి ఫోన్లు వస్తున్నాయి. దీంతో కొత్త ఫోన్లు చాలా త్వరగా ఓల్డ్ వెర్షన్ అయిపోతున్నాయి. వీటిని అమ్మి కొత్తది తీసుకుందామంటే మనకు తెలిసిన మార్కెట్లో సరైన ధర రావడం కష్టంగా మారింది. ఇలాంటి వారికి చక్కని వేదికగా మారింది క్యాషిఫై. ఈ-కామర్స్కు కొత్త భాష్యం చెబుతూ రీ-కామర్స్గా పాత ఎలక్ట్రానిక్ వస్తువులని ప్రజల నుంచి కొనుగోలు చేస్తుందీ వెబ్ పోర్టల్. రీ-కామర్స్ ఇది ఈ-కామర్స్ కాదు.. రీ-కామర్స్. అంటే పాత వస్తువుల్ని కొనడమే వీళ్ల పని. ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, స్మార్ట్వాచ్, స్మార్ట్ స్పీకర్, డీఎస్ఎల్ఆర్ కెమెరా, ఇయర్బడ్స్ తదితర వస్తువులన్నీ ఈ సైట్లో అమ్మే అవకాశం ఉంది. క్యాషిఫై వెబ్సైట్కి వెళ్లి అక్కడున్న ఆప్షన్లను అనుసరిస్తే మీ దగ్గరున్న ప్రొడక్టుకి ఎంత ధర వస్తుందో తెలియజేస్తుంది. ఆ తర్వాత మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాక.. ఫైనల్ ధర ఎంతో నిర్ధారిస్తుంది. అందుకు ప్రొడక్టు ఓనర్ అంగీకరిస్తేనే డీల్ ముందుకు వెళ్తుంది. ఎక్సేంజీ కంటే మేలు ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో సైతం ఎక్సేంజ్ ఆఫర్లు రెగ్యులర్గా ఉంటాయి. అయితే ఎక్సేంజ్ ఆఫర్లలో కంపెనీలు పాత ఫోన్లకు చాలా తక్కువ ధరను ఆఫర్ చేస్తుంటాయి. పైగా అన్ని రకాల పాత మోడళ్లపై ఎక్సేంజీ ఆఫర్ వర్తించవు. అంతేకాదు మనకు నచ్చిన వస్తువలపై ఎక్సేంజీ ఆఫర్ ఉండకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా క్యాషిఫైలో పాత గాడ్జెట్స్ అమ్మేయోచ్చు. ఆఫ్లైన్లో కూడా ఇప్పటి వరకు ఆన్లైన్లోనే వ్యాపారం చేస్తూ వచ్చిన క్యాషిఫై తాజాగా ఆఫ్లైన్లోకి వచ్చింది. రిటైల్ చైయిన్ యూనిషాప్తో ఒప్పందం చేసుకుంది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై ఏరియాల్లో 60కి పైగా రిటైల్ షాప్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా టైర్ టూ సిటీలకు కూడా విస్తరించేలా క్యాషిఫై ప్రణాళిక సిద్దం చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ఆఫ్లైన్ సౌకర్యం హైదరాబాద్ని పలకరించే అవకాశమూ ఉంది. -
వీడియో ఓటీటీ మార్కెట్
న్యూఢిల్లీ: దేశీ వీడియో ఓటీటీ (ఓవర్ ది టాప్) మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. నెట్వర్క్లు మెరుగుపడటం, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్స్ వినియోగం పెరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. ఆర్బీఎస్ఏ అడ్వైజర్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2021లో 1.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న వీడియో ఓటీటీ మార్కెట్ పరిమాణం 2025 నాటికి 4 బిలియన్ డాలర్లకు చేరుతుందని నివేదిక పేర్కొంది. ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాలు .. ప్రాంతీయ భాషల్లో మాట్లాడే జనాభా మొదలైన అంశాలు ఓటీటీ ప్లాట్ఫాం వృద్ధికి తోడ్పడనున్నాయని తెలిపింది. డిస్నీప్లస్ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ వంటి టాప్ ఫేవరెట్స్తో పాటు పలు స్థానిక, ప్రాంతీయ సంస్థలు కూడా ఓటీటీ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని పేర్కొంది. సోనీలైవ్, ఊట్, జీ5, ఇరోస్నౌ, అల్ట్బాలాజీ, హోయ్చొయ్, అడ్డా టైమ్స్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. -
ఈ ఒక్క ఛార్జర్తో అన్నింటికీ చెక్..! ధర ఎంతంటే..
స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్స్ మన నిత్యజీవితంలో ఒక భాగమయ్యాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్, హెడ్ ఫోన్స్కు వేరవేరుగా బ్యాటరీ ఛార్జర్లను మనతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లి మనం క్యారీ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కు ఛార్జర్లు మర్చిపోయామంటే అంతే సంగతులు.. తిరిగి దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ షాప్కు వెళ్లి కొత్తది కొనుకోవాల్సిందే. మనలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొన్నవాళ్లమే.. తాజాగా షావోమి రిలీజ్ చేసిన ఛార్జర్తో వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చును. షావోమి మార్కెట్లోకి 67W సోనిక్ఛార్జ్ 3.0 ను సోమవారం రోజున మార్కెట్లోకి రిలీజ్ చేసింది. షావోమి రిలీజ్ చేసిన కొత్త ఛార్జర్ యుఎస్బీ టైప్-ఎ నుంచి యుఎస్బీ టైప్-సి సపోర్ట్ చేయనుంది. కాగా ఛార్జర్లో ఒకే యుఎస్బి టైప్-ఎ పోర్ట్ ఉండడం గమనార్హం, కానీ షావోమి ఈ ఛార్జర్తో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, హెడ్ఫోన్లు , మరెన్నో పలు పరికరాలను ఛార్జ్ చేయగలదని షావోమి పేర్కొంది. ఛార్జర్ అనేక పరికరాలను వేగంగా ఛార్జ్ చేయడానికి 67W అవుట్పుట్ను అందిస్తుంది.షావోమి ఈ ఏడాది ప్రారంభంలో 67W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తూ ఎంఐ 11 అల్ట్రాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ ఫోన్కు 55W ఫాస్ట్ ఛార్జర్ను కొనుగోలుదారులకు షావోమీ అందిస్తోంది. షావోమి సోనిక్ఛార్జ్ 3.0 క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0తో వస్తోంది. భారత్లో ఎంఐ 67W సోనిక్ ఛార్జ్ 3.0 ఛార్జర్ ధర రూ .1,999 గా నిర్ణయించారు. ఈ ఛార్జర్ను షావోమి అధికారిక వెబ్సైట్ నుంచి, ఎంఐ హోమ్ స్టోర్స్లో అందుబాటులో ఉండనుంది. ఛార్జర్కు 100 సెం.మీ 6A టైప్-సీ కేబుల్తో రానుంది. Mi 67W SonicCharge 3.0 Charger Combo#Mi67WCharger #SonicCharge3 Sale Starts Today at 12PM - https://t.co/Sb9Dw2mkHN Available on https://t.co/D3b3QtmvaT, Mi Home and Offline Stores. pic.twitter.com/N9WO1HsuVn — Mi India (@XiaomiIndia) July 12, 2021 -
Digital Payments: యాప్స్ నుంచి చెల్లిస్తున్నారు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం.. పేరు ఏదైనా ఇప్పుడు రియల్ టైం చెల్లింపుల కోసం వినియోగదార్లు తమ స్మార్ట్ఫోన్లో ఏదైనా ఒక పేమెంట్ యాప్ వాడుతున్నారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత యాప్స్ వినియోగం దేశంలో అనూహ్యంగా పెరుగుతోంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా చెల్లింపులు, నగదు బదిలీ వంటి లావాదేవీలు క్షణాల్లో పూర్తి కావడం.. కచ్చితత్వం, అదనపు వ్యయాలు లేకపోవడం తదితర ప్రయోజనాలు ఉండడంతో వీటి పట్ల కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరెన్సీకి ప్రత్యామ్నాయంగా యూపీఐ యాప్స్ నిలిచాయంటే అతిశయోక్తి కాదేమో. 2020లో రియల్ టైమ్ లావాదేవీల పరిమాణం చైనాలో 1,500 కోట్లు దాటితే.. భారత్ ఏకంగా 2,500 కోట్లు నమోదైందంటే ఎంత వేగంగా కస్టమర్లు డిజిటల్ వైపు మళ్లుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్య విషయమేమంటే ఫీచర్ ఫోన్ యూజర్లకూ యూపీఐ లావాదేవీలను పెద్ద ఎత్తున విస్తరించే పనిలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిమగ్నమైంది. ఇవీ యూపీఐ గణాంకాలు.. దేశంలో యాక్టివ్ యూపీఐ యూజర్లు సుమారు 20 కోట్లు ఉన్నారు. ఈ సంఖ్యను 2025 నాటికి 50 కోట్లకు చేర్చాలన్నది మొబైల్ పేమెంట్స్ ఫోరం ఆఫ్ ఇండియా లక్ష్యం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం యూపీఐ లావాదేవీల పరిమాణం, విలువ రెండేళ్లలో మూడింతలు దాటింది. 2019 మే నెలలో రూ.1,52,449 కోట్ల విలువైన 73.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత సంవత్సరం ఇదే కాలంలో రూ.4,90,638 కోట్ల విలువైన 253.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ప్రస్తుతం 49 పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, 175 బ్యాంకులు, 16 థర్డ్ పార్టీలకు చెందిన యూపీఐ ఆధారిత యాప్స్ భారత్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో థర్డ్ పార్టీ యాప్స్దే హవా. పరిశ్రమలో వీటి వాటా ఏప్రిల్ గ ణాంకాల ప్రకారం ఫోన్పే 45%, గూగుల్ పే 34.3, పేటీఎం 12.14% వాటా దక్కించుకున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం.. యూపీఐ లావాదేవీల మీద సెకండ్ వేవ్ ప్రభావం పడింది. 2021 ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో పరిమాణం 4.14 శాతం తగ్గి 253.9 కోట్లు, విలువ 0.61% పడిపోయి రూ.4,90,638 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో గరిష్టంగా రూ.5,04,886 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. పరిమాణం 273.2 కోట్లుంది. సున్నా లావాదేవీల నుంచి ఈ స్థాయికి అయిదేళ్లలో రావడం విశేషం. అయితే ప్రభుత్వం 2019 డిసెంబరులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) తొలగిస్తూ లావాదేవీల ఫీజును లేకుండా చేయడంతో దేశంలో యూపీఐ యాప్స్ హవాకు దారి తీసింది. కాగా, ఎండీఆర్ ఎత్తివేయడం వల్ల పేమెంట్ గేట్వే సంస్థల మనుగడపై ప్రభావం చూపిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ గతేడాది జూలైలో అభిప్రాయపడింది. ఈ నిర్ణయం పరిశ్రమలో ఆవిష్కరణలకు అడ్డుగా నిలిచిందని, ఉద్యోగాలు కోల్పోతున్నారని, డిజిటల్ పేమెంట్స్ మౌలిక వసతుల విస్తరణ నెమ్మదించిందని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎండీఆర్ తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే యూపీఐ లావాదేవీలపై ఫీజును కస్టమర్లు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకులకూ మేలు జరుగుతోంది.. డిజిటల్ లావాదేవీలను అన్ని బ్యాంకులూ ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. గతంలో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బ్యాంకు శాఖలు నెలకొని ఉండేవి. ప్రస్తుతం తదుపరి తరం శాఖలు 1,500 చదరపు అడుగుల లోపుకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకానొక దశలో ఏటా 80,000 మందిని నియమించుకున్నాయి. 2020లో ఈ సంఖ్య 5,113 మాత్రమేనని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలంగాణ కన్వీనర్ బి.ఎస్.రాంబాబు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశవ్యాప్తంగా 80,000 పైచిలుకు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలు నేడు 63,000లకు వచ్చి చేరాయని వెల్లడించారు. శాఖల విస్తరణ క్రమంగా తగ్గుతోందని, యూపీఐ యాప్స్ కారణంగా బ్యాంకులకూ మేలు జరుగుతోందని చెప్పారు. -
స్మార్ట్ఫోన్తో ఆక్సిజన్ లెవల్స్ ఇలా చెక్ చేసుకోండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ హెల్త్ స్టార్టప్ ఎంఫైన్.. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవడానికి యాప్లో ఎంఫైన్ పల్స్ పేరుతో టూల్ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాక్ కెమెరా, ఫ్లాష్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ స్మార్ట్ఫోన్తోనైనా ఉపయోగించవచ్చని ఎంఫైన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అజిత్ నారాయణ్ వెల్లడించారు. శ్వాసకోశ లేదా తీవ్రమైన గుండెజబ్బులున్నవారు స్లీప్ అప్నియా, భారీ గురక, నవజాత శిశువుల్లో ఆక్సిజన్ సంతృప్త స్థాయిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సిఫార్సు చేస్తారు. అలాగే ప్రస్తుతం సమయంలో కరోనా వైరస్ రోగుల్లో కూడా ఆక్సిజన్ స్థాయిలను మానిటరింగ్లో ఈ ఆ క్సీమీటర్ పాత్ర చాలాకీలకం. ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ సాంకేతికతతో స్మార్ట్ఫోన్ కెమెరా, ఫ్లాష్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఆన్డ్రాయిడ్ యూజర్లకు ఇది పరిమితం. త్వరలో ఐఓఎస్ వినియోగదారుల కోసం ప్రారంభించబడుతుంది. ఫైన్ పల్స్తో స్మార్ట్ఫోన్ కాస్తా ఆక్సీమీటర్గా మారిపోతుంది. ఇలా చెక్ చేసుకోండి: ► గూగుల్ ప్లేస్టోర్లో mfine యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ► మెజర్ యువర్ బ్లడ్ ఆక్సీజన్ లెవల్స్పైన క్లిక్ చేయండి. ► మెజర్ బటన్పైన క్లిక్ చేయండి. ► తర్వాత మీ చేతి వేలిని బ్యాక్ కెమెరాపై 20 సెకన్ల పాటు ఉంచండి ► అంతే రెండు సెకన్లలో మీ ఆక్సిజన్ లెవల్స్ డిస్ప్లే అవుతాయి. -
ఆన్లైన్ లో హలచల్ చేస్తున్న గెలాక్సీ ఎస్ 21 ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ స్పెసిఫికేషన్లు అధికారికంగా ప్రారంభించడానికి ముందే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. 2021 జనవరి ప్రారంభంలో ఈ మొబైల్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం. తాజాగా జర్మనీకి చెందిన విన్ ఫ్యూచర్.డి పబ్లిషర్ తన బ్లాగ్ లో గెలాక్సీ ఎస్ 21 స్పెసిఫికేషన్లను లీక్ చేసింది. విడుదలైన లీక్స్ ప్రకారం, గెలాక్సీ ఎస్ 21లో ట్రీపుల్ రియర్ కెమెరా సెటప్, సింగిల్ సెల్ఫీ షూటర్ కెమెరా, 8 జీబీ ర్యామ్ తో రానుంది. ఈ మొబైల్స్ లో ప్రాంతాన్ని బట్టి శామ్సంగ్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ లేదా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో తీసుకురానున్నారు.(చదవండి: యాపిల్ బాటలో షియోమీ) శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ఫీచర్స్: విన్ ఫ్యూచర్.డి పేర్కొన్న వివరాల ప్రకారం.. గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ డ్యూయల్ సిమ్(నానో) సపోర్ట్ తో రానుంది. ఈ మొబైల్స్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యుఐ 3.1పై పని చేయనున్నాయి. ఈ మొబైల్స్ ప్రాంతాన్ని బట్టి శామ్సంగ్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ లేదా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రానుంది. గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 + 8 జీబీ ర్యామ్ను స్టాండర్డ్గా కలిగి ఉండగా 128 జీబీ, 256 జీబీ ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21లో 6.2-అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్(1,080x2,400 పిక్సెల్స్) డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ స్క్రీన్, ఇన్ఫినిటీ-ఓ డిస్ప్లేతో రానున్నట్లు పేర్కొంది. అలాగే, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ కూడా అదే డిస్ప్లేతో 6.7-అంగుళాల పరిమాణంలో, 394 పిపి పిక్సెల్ సాంద్రతతో రానుంది. రెండు ఫోన్లలో 60-120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ తో రానునట్లు భావిస్తున్నారు. గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంటాయి. ఇందులో 64 మెగాపిక్సెల్ టెలిఫోటో ఎఫ్/2.0 లెన్స్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్/2.2 కెమెరా, వైడ్ యాంగిల్ ఎఫ్/1.8 లెన్స్తో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఈ మొబైల్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 3x “హైబ్రిడ్” ఆప్టికల్ జూమ్ను కలిగి ఉండనున్నాయి. బ్యాటరీ పరంగా, గెలాక్సీ ఎస్ 21 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ వైర్డ్, వైర్లెస్ ఛార్జింగ్ రెండింటికి సపోర్ట్ చేయనుంది. కనెక్టివీటి కోసం బ్లూటూత్ వీ5, యుఎస్బీ టైప్ సి పోర్ట్, ఎన్ఎఫ్సి, వై-ఫై 6 ఉన్నాయి. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ ధర: గత వారం విన్ ఫ్యూచర్.డి శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 సిరీస్ యొక్క ధరలను నివేదించింది. గెలాక్సీ ఎస్ 21 బేస్ మోడల్ 128జీబీ ధర యూరో 849 (సుమారు రూ.76,000), 256జీబీ మోడల్ యూరో 899 (సుమారు రూ.80,600)కు లభించనున్నట్లు సమాచారం. మరోవైపు గెలాక్సీ ఎస్ 21 ప్లస్ 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్ల ధరలు వరుసగా యూరో 1,049 (సుమారు రూ.94,000), యూరో 1,099 (సుమారు రూ.98,700) వద్ద లభిస్తుందని అంచనా. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21, గెలాక్సీ ఎస్ 21 ప్లస్ రెండూ జనవరి 14న రాబోయే గెలాక్సీ ఎస్ 21 అల్ట్రాతో పాటు ప్రారంభించనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. -
రూ.14వేలకే శామ్సంగ్ 5జీ మొబైల్
షియోమీ, రియల్ మీ సంస్థలు బడ్జెట్ ధరలో 5జీ మొబైల్ ఫోన్లను తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పడు ఇదే తరహాలో శామ్సంగ్ కూడా బడ్జెట్ లో 5జీ మొబైల్ ఫోన్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ భారతదేశం, ఇతర ఆగ్నేయాసియా దేశాల వంటి మార్కెట్లలో కూడా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో లాంచ్ చేసిన శామ్సంగ్ గెలాక్సీ ఏ21కి తర్వాతి వెర్షన్ గా శామ్సంగ్ గెలాక్సీ ఏ22 5జీని భావిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం శామ్సంగ్ గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ 2021 రెండవ భాగంలో తీసుకురానునట్లు సమాచారం. దీని ధర రెండు లక్షల కొరియన్ వాంగ్లు(సుమారు రూ.13,300)గా నిర్ణయించారు. (చదవండి: 5000లు పెడితే రోజుకు 500 వస్తాయనే ఆశతో..) గెలాక్సీ ఏ22 5జీ కన్నా ముందు గెలాక్సీ ఏ32 5జీ మొబైల్ ని మార్కెట్లోకి తీసుకువస్తారని సమాచారం. కొత్త శామ్సంగ్ గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ హువావే, ఒప్పో, వివో, షియోమి వంటి కంపెనీ 5జీ మొబైల్స్ కీ పోటీగా తీసుకొస్తున్నట్లు సమాచారం. గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ తయారీ కోసం శాంసంగ్ జాయింట్ డెవలప్మెంట్ ప్రొడక్షన్ మెథడ్(జేడీఎం) పద్ధతిని ఎంచుకున్నారు. అంటే ఈ మొబైల్ కి సంబందించిన రూపకల్పనలో ప్రధాన భాగాలు, కొన్ని స్పెసిఫికేషన్లను మాత్రమే శామ్సంగ్ రూపొందిస్తుంది. మిగతా డిజైన్, ప్రొడక్షన్ ప్రక్రియ మొత్తం అవుట్ సోర్స్ చూసుకుంటుంది. ఈ ఏడాది రవాణా చేసిన శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ స్మార్ట్ఫోన్లలో 20-30 శాతం జేడీఎం పద్ధతిని ఉపయోగించి ఉత్పత్తి చేసినట్లు సమాచారం. శామ్సంగ్ గెలాక్సీ ఏ22 5జీ మొబైల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. -
నోకియా 5.4లో సూపర్ ఫీచర్స్
హెచ్ఎండీ గ్లోబల్ త్వరలో నోకియా 5.4 అనే కొత్త ఫోన్ను లాంచ్ చేయనుందని వార్తలు జోరుగా వస్తున్నాయి. గతంలో లాంచ్ అయిన నోకియా 5.3కి తర్వాతి వెర్షన్గా ఈ ఫోన్ రానుంది. నోకియా 5.4 స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ వీ10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్తో నడుస్తుంది. దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం చివరిలో బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లతో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం.(చదవండి: ఒప్పో నుండి మరో సూపర్ మొబైల్) నోకియా 5.4 ఫీచర్స్ దీనిలో 6.4 అంగుళాల హోల్ పంచ్ డిస్ ప్లేను అందించనున్నారు. దీనిలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం. నోకియా 5.3 మాదిరిగానే నోకియా 5.4లో 13 ఎంపీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్, 2 ఎంపీ మాక్రో కెమెరాతో రానుంది. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సల్ కెమెరా తీసుకురానున్నట్లు సమాచారం. దీనిలో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. అలాగే ఈ మొబైల్ గూగుల్ ఎఆర్ కి కూడా సపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ రెండు ఆస్ట్రేలియన్ రిటైల్ వెబ్ సైట్లలో కనిపించింది. దాని ప్రకారం 350 ఆస్ట్రేలియన్ డాలర్లుగా(సుమారు రూ.19,000) ఉండనుంది. -
2021లో రాబోయే షియోమీ ఫోన్లు ఇవే
షియోమీ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ లను తీసుకొస్తుంది. ఒక్కోసారి నెలకు 1, 2 ఫోన్లను ఈ కంపెనీ లాంచ్ చేస్తుంది. అలాగే 2021లో కూడా మరిన్నీ ఫోన్లను తీసుకురావడానికి షియోమీ సిద్ధంగా ఉంది. వచ్చే సంవత్సరం షియోమీ మనదేశంలో రెడ్మి బ్రాండ్ క్రింద రెడ్మి 10 సిరీస్, రెడ్మి నోట్ 10 సిరీస్ తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే పోకో విషయానికి వస్తే పోకో ఎం 3 ప్రో, పోకో ఎమ్ 3 ప్రో మరియు పోకో ఎక్స్ 4, పోకో ఎక్స్ 5 ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లపై ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. 2021లో రాబోయే పూర్తీ షియోమీ ఫోన్ల జాబితా ఈ క్రింద ఉంది. (చదవండి: వోడాఫోన్ ఐడియా రికార్డు) షియోమీ ఎంఐ 11, ఎంఐ 11 ప్రో షియోమీ ఎంఐ 11 సిరీస్ లో రాబోయే మొబైల్ జనవరిలో వస్తుందని సమాచారం. దీనిలో ఇటీవల లీకైన సమాచారం ప్రకారం 108 ఎంపీ ప్రధాన కెమెరా, కర్వేడ్ డిస్ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ వంటి ఫీచర్లను తీసుకురానున్నారు. ఎంఐ 11 ప్రోలో ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్ నుండి 192 మెగాపిక్సెల్స్ వరకు ఉండనుంది. 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కూడా ఇందులో అందించనున్నట్లు సమాచారం. పోకో ఎఫ్ 2 పోకో ఎఫ్ 2 త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. పోకో ఎఫ్ 1 తర్వాతి వెర్షన్గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. పోకో ఈ మధ్యే ఎన్నో ఫోన్లను లాంచ్ చేయడం ప్రారంభించింది. పోకో ఎఫ్ 2 ఫీచర్ల గురుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. రెడ్మి నోట్ 10, రెడ్మి నోట్ 10 ప్రో, రెడ్మి నోట్ 10 ప్రో మాక్స్ రెడ్ మీ నోట్ సిరీస్లో రానున్న తర్వాతి వెర్షన్ స్మార్ట్ ఫోన్లు ఇవే. రెడ్మి నోట్ 10, రెడ్మి నోట్ 10 ప్రో 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తాయని సమాచారం. రెడ్మి నోట్ 10 తక్కువలో 108 ఎంపి కెమెరా ఫోన్గా మారవచ్చు. దీనిలో స్నాప్డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కలిగిన 4800 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ కే 40/ పోకో ఎక్స్ 4 రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ కూడా ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. కాబట్టి ఈ ఫోన్ కూడా త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో స్నాప్డ్రాగన్ 775 5జీ ప్రాసెసర్ తో రావచ్చు. కొన్ని మార్కెట్లలో రెడ్ మీ బ్రాండింగ్, కొన్ని మార్కెట్లలో పోకో ఎక్స్4గా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెడ్మి కే 40 ప్రో/ పోకో ఎఫ్ 3ప్రో రెడ్మి కే 30 ప్రో లేదా పోకో ఎక్స్ 2 ప్రో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తో భారతదేశానికి రావచ్చు. రెడ్మి కె 40 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, మల్టీ కెమెరా సెటప్, 12 జిబి ర్యామ్, 5జీ కనెక్టివిటీ తీసుకొస్తున్నట్లు సమాచారం. రెడ్మి 10, రెడ్మి 10 ప్రైమ్, రెడ్మి 10 పవర్, రెడ్మి 10 ఐ ఇవి రెడ్ మీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో లాంచ్ కానున్నాయి. రెడ్ మీ 9 సిరీస్ తర్వాతి వెర్షన్లుగా రెడ్ మీ 10 సిరీస్ రానుంది. వీటి ధర వచ్చేసి 7,000 నుండి రూ.12,000 ఉండనున్నట్లు సమాచారం. 2021 మొదటి త్రైమాసికంలో మొదలయ్యి ఏడాది పొడవునా రెడ్మి 10 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తూనే ఉంటుంది. పోకో ఎం3, పోకో ఎం 3 ప్రో పోకో ఎం3 ఇప్పటికే లాంచ్ అయింది. కొన్ని దేశాల్లో ఈ ఫోన్ పోకో ఎం3 ప్రోతో పాటు లాంచ్ కానుంది. పోకో ఎం 3 రియల్మే నార్జో 20 ఎ, రియల్మే సి 15 మరియు ఇన్ఫినిక్స్ హాట్ 9 ప్రో వంటి వాటికీ పోటీగా తీసుకొచ్చింది. పోకో ఎం3 స్నాప్డ్రాగన్ 662 చిప్ సెట్ 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది. పోకో ఎం3 ఇండియా ధర బడ్జెట్ కేటగిరీ రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. పోకో ఎం 3 ప్రో 15,000 కేటగిరీలో మిడ్-బడ్జెట్ రేంజ్ లో తీసుకురానుంది. ఎంఐ నోట్ 10 లైట్/ఎంఐ 10ఐ ఎంఐ నోట్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో 2021 ప్రారంభంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఎంఐ నోట్ 10 లైట్ సెప్టెంబర్లో ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. చైనాలో రెడ్ మీ నోట్ 9 ప్రో 5జీగా లాంచ్ అయిన ఫోన్ మనదేశంలో ఎంఐ 10ఐగా లాంచ్ కానుందని తెలుస్తోంది. -
ప్రమాదంలో 2కోట్ల చైనా మొబైల్స్
చైనాలో దిగ్గజ కంపెనీ జియోనీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చైనాలోని ఒక న్యాయస్థానం జియోనీ ఫోన్లతో సంబంధం ఉన్న ఒక వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చింది. చైనా జడ్జిమెంట్ డాక్యుమెంట్ నెట్వర్క్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, జియోనీ ఫోన్లలో ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా ఫోన్లలో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను సంస్థ ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. డిసెంబర్ 2018 మరియు అక్టోబర్ 2019 మధ్య ఒక యాప్ ద్వారా 20 మిలియన్లకు పైగా జియోనీ ఫోన్లలలో ఉద్దేశపూర్వకంగా ప్రవేశ పెట్టిన ట్రోజన్ హార్స్ వైరస్ తో దెబ్బతిన్నాయని కోర్టు కనుగొంది. “స్టోరీ లాక్ స్క్రీన్” ప్రత్యేక యాప్ వినియోగదారుల నుండి అయాచిత ప్రకటనలు మరియు ఇతర చట్టవిరుద్ధ మార్గాల ద్వారా లాభాల సాధనంగా ఉపయోగబడిందని నివేదిక పేర్కొంది. (చదవండి: ఐఫోన్13 కెమెరా ఫీచర్లు వైరల్) “స్టోరీ లాక్ స్క్రీన్” యాప్ యొక్క అప్డేట్ ద్వారా వినియోగదారుల ఫోన్లలో ట్రోజన్ హార్స్ ప్రోగ్రామ్ను అమర్చడానికి షెన్జెన్ జిపు టెక్నాలజీ(జియోనీ యొక్క అనుబంధ సంస్థ)తో ఒప్పందం కుదర్చుకున్నట్లు కోర్టు తెలిపింది. నివేదిక తెలిపినట్లుగా, "పుల్ పద్ధతి"ని ఉపయోగించి వినియోగదారుకు తెలియకుండా సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా జియోనీ మొబైల్ ఫోన్లలో అప్డేట్ చేసారని కోర్టు పేర్కొంది. దీని కోసం జియోనీ 40 లక్షల డాలర్లు ముడుపులు ఇచ్చుకుంది. 2018లో మొదటిసారిగా వారు ఈ వైరస్ను ఫోన్లలో ఇన్స్టాల్ చేయడం ప్రారంభించారు. 2019 అక్టోబర్ వరకు ఇలాగే కొనసాగించారు. ఈ పద్దతిలో 21.75 మిలియన్ స్మార్ట్ఫోన్లను ప్రభావితం చేయడంతో ద్వారా.. కంపెనీ సుమారు 4.2 మిలియన్లు అర్జించినట్లు తేలింది. మొబైల్ పరికరాలను చట్టవిరుద్ధంగా నియంత్రించినందుకు న్యాయస్థానం.. గ్జూ లి, జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చింది. వారికి 3 నుంచి 3.5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 22,59,738 రూపాయల జరిమానా విధించింది. -
బిగ్ బ్యాటరీతో రానున్న మోటో జీ9 పవర్
మోటో జీ9 పవర్ మొబైల్ ను డిసెంబర్ 8న భారతదేశంలో తీసుకురానున్నట్లు తెలిపింది. ట్విట్టర్ లో ‘మోటోరోలా నుండి మరో కొత్త ఫోన్ రాబోతుంది. దాని పేరు మోటో జీ9 పవర్. డిసెంబర్ 8, మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ వేదికగా మొబైల్ లాంచ్ అవుతోంది. అప్పటి వరకు వేచి చూడండి’అని మోటోరోలా తెలిపింది. దీనికి సంబందించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా షేర్ చేసింది. ఈ మొబైల్ను ఇప్పటికే యూరప్లో లాంచ్ చేశారు. ఫోన్ ధర రూ.17,400 (199 యూరోలు) అని తెలుస్తోంది.(చదవండి: ఐఫోన్11కు స్క్రీన్ల రీప్లేస్మెంట్) మోటో జీ9 పవర్ ఫీచర్స్: మోటో జీ9 పవర్ ఆండ్రాయిడ్ 10పై నడుస్తుంది. దీనిలో 6.8-అంగుళాల హెచ్డి + (720x1,640 పిక్సెల్స్)ఐపిఎస్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ తో పనిచేస్తుంది. దీనిలో స్టోరేజ్ వచ్చేసి 128జీబీ, మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించుకోవచ్చు. మోటో జీ9 పవర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్తో ఎఫ్/1.79 లెన్స్తో, 2 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్/2.4 లెన్స్తో మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఎఫ్/2.4 లెన్స్తో కలిగి ఉంది. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్/2.2 ఎపర్చర్తో వస్తుంది. మోటరోలా మోటో జీ9 పవర్ను 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, 3.5 ఎంఎం ఆడియో జాక్ మరియు 4జీ ఎల్టిఇ ఉన్నాయి. ఫోన్ బరువు 221 గ్రాములు మరియు 9.66 మిమీ మందంగా ఉంటుంది. ఈ ఫోన్ ఎలక్ట్రిక్ వయిలెట్, మెటాలిక్ సేజ్ రంగుల్లో లభిస్తుంది. -
11వేలలో 5జీ ఫోన్
11 వేలలో 5జీ మొబైల్ ను చైనాలో విడుదల చేసింది జెడ్టీఈ కంపెనీ. జెడ్టీఈ బ్లేడ్ వీ2021 5జీ స్మార్ట్ఫోన్ ను 2 డిసెంబర్ 2020న విడుదల చేసింది. ఇది 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీని ధర 999 చైనా యువాన్లు (సుమారు రూ.11,200), ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ తో పనిచేయనుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అందించారు. (చదవండి: భారత్లో షియోమీని బ్యాన్ చేయండి) జెడ్టీఈ బ్లేడ్ వీ2021 5జీ స్పెసిఫికేషన్లు జెడ్టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఫోన్ 6.52-అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. జెడ్టీఈ బ్లేడ్ వీ2021 5జీ 4జీబీ ర్యామ్, మైక్రో SD కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరించగల 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజీ తో వస్తుంది. జెడ్టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఆండ్రాయిడ్ 10 ఆధారంతో మిఫావర్ 10 ఆపరేటింగ్ సిస్టంపై నడవనుంది. ఇది 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. కెమెరాల విషయానికొస్తే, వెనుక వైపున ఉన్న జెడ్టీఈ బ్లేడ్ వీ2021 5జీ 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను f/1.79 ఎపర్చర్తో, f/2.2 ఎపర్చర్తో రెండవ 8 మెగాపిక్సెల్ కెమెరా, f/2.4 ఎపర్చర్తో మూడవ 2 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. ఇది సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. జెడ్టీఈ బ్లేడ్ వీ2021 5జీ డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్. జెడ్టీఈ బ్లేడ్ వీ2021 5జీ 188 గ్రాముల బరువు ఉంటుంది. ఇది స్పేస్ గ్రే, ఫాంటసీ బ్లూ మరియు స్పేస్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. జెడ్టీఈ బ్లేడ్ వీ2021 5జీ డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉంది. జెడ్టీఈ బ్లేడ్ వీ2021 5జీ ఫేస్ అన్లాక్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని అందించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధరను 999 యూరోలుగా(సుమారు రూ.11,200) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యూరోలుగా(సుమారు రూ.15,700) నిర్ణయించారు. -
5జీ మొబైల్స్ సందడి షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఇప్పటికీ టెలికం రంగంలో 4జీ సేవలు విస్తరించలేదు. మరోవైపు 5జీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అయినప్పటికీ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థలు దూకుడుగా ఉన్నాయి. 5జీ మోడళ్లతో పోటీకి సై అంటున్నాయి. ఐడీసీ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలై–సెప్టెంబరులో భారత్లో 10 లక్షల పైచిలుకు 5జీ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఏప్రిల్–జూన్తో పోలిస్తే ఇది 500 శాతం అధికం. దీనినిబట్టి చూస్తే అటు కస్టమర్లూ నూతన టెక్నాలజీ పట్ల ఆసక్తిగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. 5జీ సేవలు రాకముందే ఈ స్మార్ట్ఫోన్లు పెద్ద ఎత్తున వినియోగదార్ల చేతుల్లోకి వచ్చే అవకాశం ఉందని టెలికం రంగం అంచనా వేస్తోంది. క్వాల్కాం, మీడియాటెక్ వంటి చిప్సెట్ తయారీ సంస్థలు నూతన టెక్నాలజీ చిప్సెట్లను ఆఫర్ చేస్తున్నాయి. సేవల కంటే ముందే చిప్సెట్ల ధరలూ దిగొస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటి.. యాపిల్, శామ్సంగ్, షావొమీ, వన్ప్లస్, ఆసస్, వివో, ఒప్పో, మోటరోలా, రియల్మీ, హువావే ఇప్పటికే భారత 5జీ హ్యాండ్సెట్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. హానర్, సోని, నోకియా, గూగుల్, ఎల్జీ, నూబియా, బ్లాక్షార్క్, జడ్టీఈ, టీసీఎల్, మీజు, షార్ప్ త్వరలో రంగ ప్రవేశం చేయనున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లో 40 దాకా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సుమారు రూ.24,000 నుంచి ప్రారంభం. త్వరలో 120కి పైగా కొత్త మోడళ్లు రానున్నాయి. 4జీతో పోలిస్తే 5జీ స్మార్ట్ఫోన్ల ధర పెద్దగా వ్యత్యాసం లేకపోవడం కూడా కలిసి వచ్చే అంశమని బిగ్–సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఇప్పటికే సగటు స్మార్ట్ఫోన్ ధర రూ.14–15 వేలకు వచ్చింది. 5జీ విషయంలో తయారీ సంస్థలు, కస్టమర్లు రెడీగా ఉన్నారు. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటే 5జీ టెలికం సేవలు త్వరితంగా అందుబాటులోకి వస్తాయి’ అని అన్నారు. వచ్చే ఏడాది నుంచి.. భారత్లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 5జీ మోడళ్ల రాక క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2021 ప్రారంభంలో రూ.15,000–25,000 ధరల శ్రేణిలో స్మార్ట్ఫోన్లన్నీ 5జీ టెక్నాలజీతో రానున్నాయని అంచనా. రూ.8–15 వేల ధరల శ్రేణిలో మోడళ్లు వస్తే కొనుగోళ్లు అనూహ్యంగా అధికమవుతాయని సెల్ పాయింట్ ఫౌండర్ మోహన్ ప్రసాద్ పాండే తెలిపారు. సోషల్ మీడియాలో యువత చాలా చురుకుగా ఉంటోంది. 5జీ టెక్నాలజీ వస్తే ఫొటోలు, వీడియోలు వేగంగా అప్లోడ్ చేసుకోవచ్చు, వీక్షించొచ్చు అని అన్నారు. 5జీ హ్యాండ్సెట్స్ కోసం కస్టమర్లు పరుగెత్తాల్సిన అవసరం లేదు. బ్రాండ్స్ దూకుడు చూస్తుంటే 4జీ నుంచి 5జీకి వినియోగదార్లు సులభంగా మళ్లుతారని టెక్ఆర్క్ అనలిస్ట్ ఫైజల్ కవూసా చెప్పారు. 3జీ నుంచి 4జీకి కస్టమర్ల ఆదరణకు నాలుగేళ్లు పట్టింది. 2012లో దేశంలో 4జీ ప్రారంభం అయినప్పుడు ఒక్క బ్రాండ్ నుంచి కూడా స్మార్ట్ఫోన్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. 5జీ విషయంలో ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ఆరేళ్లలో 35 కోట్లకు 5జీ యూజర్లు ► ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల కనెక్షన్లు ► 2026 నాటికి ఎరిక్సన్ అంచనా న్యూఢిల్లీ: భారత్లో 5జీ కనెక్షన్లు 2026 నాటికి 35 కోట్లకు చేరవచ్చని అంతర్జాతీయ టెలికం సంస్థ ఎరిక్సన్ అంచనా వేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రిప్షన్స్ సంఖ్య 350 కోట్లకు చేరగలవని ’ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ 2020’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో స్పెక్ట్రం వేలం నిర్వహించిన పక్షంలో 2021లోనే భారత్లో తొలి 5జీ కనెక్షన్ అందుబాటులోకి రాగలదని ఎరిక్సన్ నెట్వర్క్ సొల్యూషన్స్ విభాగం హెడ్ (ఆగ్నేయాసియా, భారత్) నితిన్ బన్సల్ తెలిపారు. ‘2026లో ప్రపంచ జనాభాలో 60 శాతం మందికి 5జీ కవరేజీ ఉంటుంది. కనెక్షన్ల సంఖ్య 350 కోట్ల దాకా చేరొచ్చని అంచనా. భారత్లో 5జీ సబ్స్క్రైబర్స్ సంఖ్య 35 కోట్లు దాటిపోవచ్చు. 2026లో మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్స్లో దీని వాటా 27 శాతంగా ఉండవచ్చు‘ అని బన్సల్ పేర్కొన్నారు. టెలికం సేవలకు సంబంధించి భారత్లో ప్రస్తుతం ఎల్టీఈ (4జీ) టెక్నాలజీదే ఆధిపత్యం ఉందని, మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్స్లో దీని వాటా 63 శాతంగా ఉందని నివేదికలో వెల్లడైంది. 2026 నాటికి దశలవారీగా 3జీ సేవలు నిల్చిపోతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. భారత్లో ఎల్టీఈ యూజర్ల సంఖ్య 2020లో 71 కోట్లుగా ఉండగా 2026 నాటికి సుమారు 2 శాతం వార్షిక వృద్ధితో 82 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. -
జనవరిలో రానున్న మీ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
షియోమీ తన మీ 10 సిరీస్ తర్వాత రాబోయే సిరీస్ ను త్వరలో తీసుకొస్తున్నట్లు చాలాకాలంగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మీ 11 సిరీస్ తో రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్లు వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ అవుతాయని సమాచారం. తాజా నివేదికల ప్రకారం, షియోమీ 2021 జనవరిలో మీ 11 మరియు మీ 11 ప్రోలను తీసుకురావాలని యోచిస్తోంది. స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ రాబోయే ఫోన్లలో మీ 11, మీ 11 ప్రో ఫోన్లు ఒకటని తెలుస్తుంది.(చదవండి: నోకియా లవర్స్ కి గుడ్ న్యూస్) షియోమీ మీ 10 ప్రో అప్ గ్రేడ్ వెర్షన్ గా వస్తున్న మీ 11 ప్రో మొబైల్ WQHD + ప్యానెల్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు డిస్ప్లేతో రాబోతుందని సమాచారం. స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ తో రాబోయే మొట్టమొదటి చైనీస్ ఫోన్గా ఇది గుర్తింపు పొందింది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ కంటే ఇది 20 శాతం ఎక్కువ పవర్ ఎఫిసియెంట్, 10 శాతం ఎక్కువ శక్తివంతమైనది. కొన్ని నివేదికల ప్రకారం, కొత్త స్నాప్డ్రాగన్ క్వాల్కామ్ చిప్సెట్ ఆపిల్ యొక్క A14 బయోనిక్ చిప్సెట్ కంటే వేగంగా పనిచేస్తుందని సమాచారం. ఇందులో ఉండే ప్రధాన కెమెరా 108-మెగాపిక్సెల్ నుండి 192-మెగాపిక్సెల్స్ వరకు ఉండనుంది. ఇతర లెన్స్లలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ అప్గ్రేడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లు ఉండనున్నాయి. దీని గురుంచి షియోమీ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ మీ 11 సిరీస్ వచ్చే ఏడాది జనవరి నాటికి కంపెనీ చైనాలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట దీని చైనా మార్కెట్ లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. షియోమీ మీ 11 సిరీస్ ను యుఎస్లో శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 30 సిరీస్ను జనవరిలో లాంచ్ చేయడానికి ముందే తీసుకురావాలని చూస్తుంది. -
టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!
ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో టాప్-10 ట్రెండింగ్లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. మొబైల్ వినియోగదారులు వరుసగా గత మూడు వారలుగా పోకో ఎమ్3 మొబైల్ గురుంచి తెగ సెర్చ్ చేస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం కొత్తగా వచ్చిన పోకో ఎమ్3 ఈ వారంలో మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాత షియోమీ రెడ్మి నోట్ 9 4 జీ రెండవ స్థానంలో నిలిచింది.(చదవండి: గతవారం టాప్ -10 ట్రేండింగ్ ఫోన్స్) అక్టోబర్ నెలలో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ గత వారం కంటే ఒక స్థానం వెనుకబడి మూడవ స్థానంలో నిలిచింది. గతంలో నాల్గవ స్థానంలో ఉన్న పోకో ఎక్స్ 3 ఎన్ఎఫ్సి మళ్లీ అదే స్థానాన్ని నిలుపుకుంది. షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో గత వారం 6వ స్థానంలో నిలువగా ఈ వారంలో 5వ స్థానానికి ఎగబాకింది. శామ్సంగ్ గెలాక్సీ ఎ 51 5వ స్థానం నుండి 6వ స్థానానికి పడిపోయింది. కొత్తగా రాబోయే రెడ్మి నోట్ 9 ప్రో 5 జీ ఏడవ స్థానంలో నిలిచింది. వరుసగా తర్వాత స్థానాలలో కొత్తగా వస్తున్న శామ్సంగ్ గెలాక్సీ A21ఎస్, గెలాక్సీ A21, గెలాక్సీ A02ఎస్ ఫోన్లు 8, 9, 10 స్థానాలలో నిలిచాయి. ఈ వారంలో అత్యధికంగా వెతుకుతున్న పది ఫోన్లలో శామ్సంగ్(4), షియోమీ(4), ఆపిల్(2) సంస్థలవే కావడం విశేషం. ర్యాంక్ 1: షియోమి పోకో ఎం3 ర్యాంక్ 2: షియోమి రెడ్మి నోట్ 9 4జీ ర్యాంక్ 3: ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ర్యాంక్ 4: షియోమి పోకో ఎక్స్ 3 ఎన్ఎఫ్సి ర్యాంక్ 5: షియోమి రెడ్మి నోట్ 9 ప్రో ర్యాంక్ 6: శామ్సంగ్ గెలాక్సీ ఎ51 ర్యాంక్ 7: రెడ్మి నోట్ 9 ప్రో 5 జీ ర్యాంక్ 8: శామ్సంగ్ గెలాక్సీ A21ఎస్ ర్యాంక్ 9: శామ్సంగ్ గెలాక్సీ A21 ర్యాంక్ 10: శామ్సంగ్ గెలాక్సీ A02ఎస్ -
షావోమీ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ గిఫ్ట్
షావోమీ ఫ్యాన్స్కు శుభవార్త. భారీ డిస్కౌంట్స్తో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రకటించింది షావోమీ. ఈ సేల్ నవంబర్ 26 నుండి 29 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ కొనసాగుతుంది. ఈ సమయంలో మీరు మీ.కామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆఫ్లైన్ స్టోర్ లలో కొనుగోలు చేసే షియోమి ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్ పొందగలుగుతారు. ఈ సేల్లో రూ.699 ధరకే 10,000ఎంఏహెచ్ రెడ్మీ పవర్ బ్యాంక్ కొనొచ్చు. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ధర రూ.1,999 మాత్రమే. ఇలా అనేక ప్రొడక్ట్స్పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మరి ఏ ప్రొడక్ట్పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.(చదవండి: సోషల్ మీడియాలో ఇలాంటివి పోస్ట్ చేయకండి) రెడ్మీ స్మార్ట్ఫోన్లు రెడ్మి 8ఎ డ్యూయల్ స్మార్ట్ఫోన్ను బేస్ మోడల్కు రూ .6,999 వద్ద అందుబాటులో ఉంది. రెడ్మీ 9ఐ స్మార్ట్ఫోన్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.8,299. రెడ్మీ 9 ప్రైమ్ అసలు ధర రూ.11,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.9,999. రెడ్మీ నోట్ 9 ప్రో స్మార్ట్ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.13,999. రెడ్మి నోట్ 8 అసలు ధర రూ.12,999కాగా, ఆఫర్ ధర రూ.12,999. రెడ్మీ ఇయర్బడ్స్ ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్ 2సీ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,299. ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్స్ 2 అసలు ధర రూ.5499 కాగా ఆఫర్ ధర రూ.2,999. రెడ్మీ ఇయర్బడ్స్ ఎస్ బ్లాక్ అసలు ధర రూ.2,399 కాగా ఆఫర్ ధర రూ.1,699. రెడ్మీ ఇయర్ బడ్స్ 2సీ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299. రెడ్మీ ఇతర ఉత్పత్తులు రెడ్మీ 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299. రెడ్మీ 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.999 కాగా ఆఫర్ ధర రూ.699. ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ అసలు ధర రూ.1,199 కాగా ఆఫర్ ధర రూ.899. ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ అసలు ధర రూ.1,499 కాగా, ఆఫర్ ధర రూ.1,299. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 అసలు ధర రూ.2,499 కాగా ఆఫర్ ధర రూ. 1,999. ఎంఐ వాచ్ రివాల్వ్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ. 9,999. మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2 అసలు ధర రూ.3,999 కాగా ఆఫర్ ధర రూ.2,499. ఎంఐ ఫ్లెక్స్ ఫోన్ గ్రిప్ స్టాండ్ అసలు ధర రూ.199 కాగా ఆఫర్ ధర రూ.99. ఎంఐ టీవీ స్టిక్ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,499. -
డిసెంబర్ 2న వివో వీ20 ప్రో లాంచ్..
వివో వీ20 ప్రో 5జీ వచ్చే వారం భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది గతంలో థాయ్ ల్యాండ్లో విడుదలైన ఫోన్ మాదిరిగానే ఉండనుంది. డిసెంబర్ 2వ తేదీన ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు అందించారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ని సంస్థ యొక్క యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వివో వీ20 ప్రో అమెజాన్ మరియు దేశవ్యాప్తంగా ఇతర రిటైల్ కేంద్రాలలో అందుబాటులో ఉండనుంది. (చదవండి: నోకియా 9.3 ప్యూర్వ్యూ మళ్లీ వాయిదా) వివో వీ20 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్టచ్ ఓఎస్ 11పై పని చేయనుంది. ఇందులో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఇందులో 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, హెచ్డిఆర్ 10 సపోర్ట్, స్టాండర్డ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. వివో వీ20 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ సెన్సార్ను అందించారు. దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 44 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్ పై వివో వీ20 ప్రో పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ను ఈ స్మార్ట్ ఫోన్లో అందించారు. వివో వీ20 ప్రో 5జీ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్టిఇ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఫీచర్లను ఇందులో అందించారు. దీని బరువు 170 గ్రాములుగానూ ఉంది. వివో వీ20 ప్రో 5జీ ని భారతదేశంలో 29,990 ధరకే తీసుకురానున్నట్టు సమాచారం. మూన్ లైట్ సొనాటా, మిడ్ నైట్ జాజ్, సన్ సెట్ మెలోడీ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. -
నోకియా 9.3 ప్యూర్వ్యూ లాంచ్ మళ్లీ వాయిదా
నోకియా 9.3 ప్యూర్ వ్యూ లాంచ్ మరోసారి వాయిదా పడింది. నోకియా యొక్క కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 2021 ప్రథమార్ధంలో లాంచ్ కానున్నట్లు సమాచారం. నోకియా 9.3 ప్యూర్ వ్యూను ఎప్పుడు లాంచ్ చేస్తారో సరైన సమాధానాన్ని తెలపలేదు. రాబోయే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ ని ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లో తీసుకురానున్నట్లు సమాచారం. అందుకే ఈ ఆలస్యానికి కారణం అని తెలుస్తోంది. (చదవండి: 3 వేలలోనే రెడ్ మీ స్మార్ట్ వాచ్) నోకియా 9.3 ప్యూర్ వ్యూ స్పెసిఫికేషన్లు ఎక్కువ శాతం విడుదల కాలేదు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు ఇందులో 120 హెర్ట్జ్ డిస్ ప్లేను అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 8కే వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉండనుంది. ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లో హెచ్ఎండి గ్లోబల్ రాబోయే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాసెసర్ డిసెంబర్లో లాంచ్ కానుంది. కాబట్టి ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ను అందించే బదులు స్నాప్ డ్రాగన్ 875ను అందిస్తే లేటెస్ట్ ప్రాసెసర్ తరహాలో ఉండే అవకాశం ఉంది. అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీ స్నాప్ డ్రాగన్ 875 ప్రాసెసర్తో ఫోన్ల తయారీని జనవరిలో ప్రారంభించనున్నాయి. ఈ ఫోన్ లో స్టెయిన్ లెస్ స్టీల్ ఫ్రేమ్, సాఫైర్ గ్లాస్ డిస్ ప్లేతో వస్తుందని కంపెనీ పేర్కొంది. 2021 ద్వితీయార్ధంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని నివేదిక పేర్కొంది. ఈ ఫోన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే లాంచ్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే దీని లాంచ్ మాత్రం అప్నట్నుంచి వాయిదా పడుతూనే ఉంది. -
వివో వై1ఎస్ వచ్చేసింది
వివో భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ వినియోగదారుల కోసం వివో వై1ఎస్ రూపంలో మొబైల్ ని తీసుకొచ్చింది. సాదారణంగా సోషల్ మీడియా ద్వారా ఫోన్ను ప్రకటించే బదులు, ఈ సారి తన వెబ్సైట్ ద్వారా ఫోన్ను తీసుకొచ్చింది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, 4030 ఎంఏహెచ్ బ్యాటరీలను ఇందులో అందించారు.(చదవండి: పడిపోయిన మొబైల్ అమ్మకాలు) వివో వై1ఎస్ స్పెసిఫికేషన్స్ వివో వై1ఎస్ లో 6.22 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించనున్నారు. దీని పిక్సెల్ రిజల్యూషన్ 720 x 1520గా ఉండనుంది. స్క్రీన్ టు బాడీ రేషియో 88.6 శాతంగా ఉండనుంది. మీడియాటెక్ హీలియో పీ35 ఎంటీ6765 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందించనున్నారు. స్టోరేజ్ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడి ఫ్లాష్ ఉన్న13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారిత ఫన్టచ్ ఓఎస్ 10.5పై నడుస్తుంది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,030 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చింది. అరోరా బ్లూ, ఆలివ్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగా హెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, మైక్రో యూఎస్బీ 2.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఈ ఫోన్ కంపెనీ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. కానీ దీని ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం దీని 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గా పేర్కొన్నారు. -
పడిపోయిన మొబైల్ అమ్మకాలు
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగా సీజన్ లో రికార్డు స్థాయిలో జరిగిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఆ తర్వాత డిమాండ్ 20-25% పడిపోయిందని నిపుణులు తెలిపారు. ఇది తమకు బ్లాక్ సీజన్ అని నేషనల్ రిటైల్ స్టోర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఏడాది అమ్మకాలు సంవత్సరానికి 50% పైగా పడిపోయాయని చెప్పారు. కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు నవంబర్ లో 25% వరకు పడిపోయాయి. వచ్చే డిసెంబరు నెలలో మరింత తగ్గుతాయి అని తెలిపింది. సాధారణంగా దీపావళి తరువాత నెలవారీ అమ్మకాలు పడిపోతాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దసరా పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎక్కువ షిప్మెంట్స్ ఉంటాయి. ఈసారి దీపావళి తర్వాత కూడా సేల్స్ వెంటనే పడిపోయాయి. (చదవండి: బడ్జెట్ లో రెడ్మీ నోట్ 9 5జీ మొబైల్స్) "పండుగ అమ్మకాల కోసం కంపెనీలు ఫోన్లను నిల్వ చేయటం వల్ల సెప్టెంబర్ లో సాధారణంగా కన్న ఎక్కువ అమ్మకాలు జరిగాయి. కానీ దీపావళి అమ్మకాల తరువాత వెంటనే అమ్మకాలు పడిపోయాయి. దాదాపు ఈ తగ్గుదల శాతం 20 నుండి 25 వరకు ఉండవచ్చని" కౌంటర్ పాయింట్ పరిశోధనా డైరెక్టర్ తరుణ్ పాథక్ అన్నారు. సాధారణంగా పండుగ సీజన్ లో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇవ్వడం వల్ల సాధారణం కంటే 2-3 రెట్లు ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. అలాగే పండుగ సీజన్ తర్వాత అమ్మకాలు తగ్గుతాయని అశ్విని భడోరియా అన్నారు. షియోమి, వివో, రియల్మీతో సహా అగ్ర బ్రాండ్లు ఈ సీజన్లో అత్యధిక దీపావళి అమ్మకాలను జరిపినట్లు తెలిపాయి. ఆపిల్ జూలై-సెప్టెంబర్ కాలంలో అత్యధికంగా ఎగుమతులు నమోదు చేసింది. లేటెస్ట్ ఐఫోన్స్ లాంచింగ్కు ముందే సేల్స్ రికార్డు సృష్టించాయి. తమకు అక్టోబర్ ఒక చెత్త నెల అని, నవంబర్ నెలలో సేల్స్ పుంజుకున్నప్పటికీ దీపావళి తర్వాత మళ్లీ పడిపోయాయని రిటైలర్స్ వాపోతున్నారు. -
బడ్జెట్లో రెడ్మీ 5జీ మొబైల్స్ విడుదల
మొబైల్ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్ఫోన్ విడుదల అయ్యింది. రెడ్మి నోట్ 9 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ను నవంబర్ 26న చైనాలో విడుదల చేసింది. చైనాలో లాంచ్ ఈవెంట్ లో భాగంగా రెడ్మి నోట్ 9 4జీ, రెడ్మి నోట్ 9 5జీ, శక్తివంతమైన రెడ్మి నోట్ 9 5జీ ప్రో స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ మూడింటిలో ప్రో మోడల్ ను రిటైల్ మార్కెట్ లో 1,600 యువాన్ల(చైనా కరెన్సీ)కు తీసుకొచ్చింది. అలాగే రెడ్మి నోట్ 9 5జీని 1,300 యువాన్లకు, రెడ్మి నోట్ 9 5జీ 1,000 యువాన్ల ధరకు చైనాలో అమ్ముతుంది. డిసెంబర్ 1 నుండి కొనుగోలుకు ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. కానీ భారత్ లో ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా ప్రకటించలేదు. (చదవండి: ఇండియన్ పబ్జిలో 3 కొత్త ఫీచర్స్) రెడ్మి నోట్ 9 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ రెడ్మి నోట్ 9 ప్రో 5జీ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ పై పని చేయనుంది. 1080p రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67-అంగుళాల డిస్ప్లేని కలిగిఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఐసోసెల్ హెచ్ఎం 2 సెన్సార్ తో నిర్మించబడింది. ఇతర కెమెరాల విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2-కెమెరా మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్లో 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే MIUI 12పై నడుస్తుంది. రెడ్మి నోట్ 9 ప్రో 5జీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,820ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది కేవలం 58 నిమిషాల్లో 0% నుండి 100% వరకు ఛార్జ్ చేస్తుంది. రెడ్మి నోట్ 9 ప్రో 5జీ 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర యువాన్ 1,599(సుమారు రూ.17,960), 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,799(సుమారు రూ .20,210), చివరగా, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,999(సుమారు రూ.22,450). రెడ్మి నోట్ 9 5 జీ స్పెసిఫికేషన్స్ రెడ్మి నోట్ 9 5 జి మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. రెడ్మి నోట్ 8లో కనిపించే చిప్సెట్ కంటే 800యు రెండు రెట్లు వేగంగా పనిచేస్తుందని షియోమి పేర్కొంది. రెడ్మి నోట్ 9 5 జీలో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్సిడి ప్యానెల్ డిస్ ప్లేను అందించారు. ఈ ప్యానెల్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే, 48-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. దీనిలో సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది, అలాగే 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే MIUI 12పై నడుస్తుంది. రెడ్మి నోట్ 9 5 జీ 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,299 (సుమారు రూ.14,590), 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్1,499 (సుమారు రూ. 16,840), 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,699 (సుమారు రూ.19,000). (చదవండి: బడ్జెట్లో మోటో 5జీ ఫోన్) రెడ్మి నోట్ 9 4 జీ స్పెసిఫికేషన్స్ రెడ్మి నోట్ 9 4 జీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6.53-అంగుళాల ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉంది. ఇది అడ్రినో 610 జిపియుతో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే MIUI 12పై నడుస్తుంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 120 డిగ్రీల సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, థర్డ్ డెప్త్ సెన్సార్తో కూడిన 48 ఎంపి కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్తో ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఈ మోడల్లో 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్ మరియు స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. రెడ్మి నోట్ 9 4 జీ ధర 4 జీబీ ర్యామ్/128 జిబి స్టోరేజ్ వేరియంట్కు యువాన్ 999 (సుమారు రూ. 11,220), 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్కు యువాన్ 1,099 (సుమారు రూ.12,340), 8జీబీ RAM / 128జీబీ స్టోరేజ్ వేరియంట్కు యువాన్ 1,299 (సుమారు రూ. 14,560), 8జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ కోసం యువాన్ 1,499 (సుమారు రూ. 16,830) వద్ద లభిస్తున్నాయి. -
బడ్జెట్లో మోటో 5జీ ఫోన్
మోటరోలా చివరకు తన మోటో జి 5జీని త్వరలో భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని మోటొరోలా ట్వీటర్ ద్వారా ప్రకటించింది. మిడ్-రేంజ్ విభాగంలో 5జి ఫోన్ను లాంచ్ చేయాలని మోటోరోలా చాలాకాలంగా ఎదురుచూస్తుంది. ఈ ఫోన్ గతంలోనే యూరోప్లో లాంచ్ అయింది. మోటో జి 5జీ 4 జీబీ + 64 జీబీ వేరియంట్ యొక్క ధర యూరప్లో 299.99 యూరోలు(సుమారు రూ.26,300)గా నిర్ణయించింది. ట్విట్టర్ లో కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో యూరప్ కంటే కొంచెం తక్కువ ధరకే తీసుకురానుంది. (చదవండి: ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే మొబైల్ బెస్ట్ డీల్స్) మోటో జి 5జీ స్పెసిఫికేషన్స్ మోటో జీ 5జీలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్టీపీఎస్ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ పై మోటో జీ 5జీ పనిచేయనుంది. దీని ర్యామ్ 4జీబీ కాగా, 64జీబీ స్టోరేజ్తో లభిస్తుంది. దీనిలో మైక్రో ఎస్డి కార్డ్ వేసుకోవడం ద్వారా 1టెరాబైట్ వరకు విస్తరించుకోవచ్చు. మోటో జి 5జీ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనిలో 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 5జీ, వైఫై, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. -
మైక్రోమ్యాక్స్ బడ్జెట్ మొబైల్ ఫస్ట్ సేల్
మైక్రోమాక్స్ చివరకు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమాక్స్ ఇన్ 1బీ సిరీస్తో కంపెనీ భారత మార్కెట్లోకి తిరిగి వచ్చింది. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మొదటిసారిగా నవంబర్ 24న విక్రయించగా, మైక్రోమాక్స్ ఇన్ 1బీఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ ద్వారా మొదటి సేల్కి తీసుకొచ్చింది. మైక్రోమాక్స్ యొక్క ఇన్ నోట్ 1ని మొదటి సేల్కి తీసుకొచ్చిన కొద్ది నిమిషాల్లోనే ఫోన్ అమ్ముడైంది. మైక్రోమాక్స్ ఇన్ 1బి స్పెసిఫికేషన్స్ మైక్రోమాక్స్ ఇన్ 1బి 6.52-అంగుళాల హెచ్డీ + మినీ డ్రాప్ డిస్ప్లేను కలిగి ఉంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1బీ పనిచేయనుంది. 2జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ వరకు ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 10వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎంహెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఈ ఫోన్ వెనకభాగంలో అందించారు. (చదవండి: జియో పేజెస్లో కొత్త ఫీచర్) మైక్రోమాక్స్ ఇన్ 1బి ధర 2 జీబీ ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్కు రూ. 6,999, కాగా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్కు రూ. 7,999. ఫ్లిప్కార్ట్లోని కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో 5 శాతం క్యాష్బ్యాక్, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్బ్యాక్.. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ ద్వారా 5 శాతం అదనపు తగ్గింపు పొందగలరు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు మైక్రోమాక్స్ ఇన్ 1బిపై 9 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐని పొందవచ్చు. -
భారీ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3
మొబైల్ మార్కెట్ లో చైనా సంస్థల హవా కొనసాగుతూనే ఉంది. చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ పోకో మరో కొత్త మోడల్ను ప్రపంచానికి పరిచయం చేసింది. పోకో ఎం3 స్మార్ట్ఫోన్ను గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పోకో ఎం2 అప్గ్రేడ్ మోడల్ ఇది. భారత్ లో విడుదల చేసిన పోకో ఎం2 బాగా పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే. దింతో రాబోయే పోకో ఎం3పై కూడా అంచనాలు పెరిగాయి. చివరికి ఈ సరికొత్త మోడల్ను రిలీజ్ చేసింది పోకో. కొత్త ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ తో పాటు 48 మెగా పిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది. దీనిలో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వస్తుంది. (చదవండి: షాక్ గురైన స్నాక్ వీడియో యూజర్లు) పోకో ఎం3 ఫీచర్స్ పోకో ఎం3 ఆండ్రాయిడ్ 10సపోర్ట్ తో ఎంఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ పై నడవనుంది. ఇందులో 90.34 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో 6.53-అంగుళాల పూర్తి-హెచ్ డి ప్లస్ డిస్ప్లేని కలిగి ఉంది. డిస్ప్లే కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా రక్షించబడింది. ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, దీనితో పాటు 4జీబీ ఎల్ పీడీడీఆర్ఎక్స్ ర్యా మ్ ఉంది. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఎఫ్ / 1.79 లెన్స్తో వస్తుంది. కెమెరా సెటప్లో ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్ 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.4 లెన్స్తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ల కోసం, స్మార్ట్ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను తీసుకొచ్చారు. పోకో ఎం3 64జీబీ మరియు 128జీబీ స్టోరేజ్ లలో లభిస్తుంది. దీనిలో మైక్రో ఎస్ డీ కార్డ్ స్లాట్ వేయడం ద్వారా 512జీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో ఎం3లోని కనెక్టివిటీ కోసం 4జీ ఎల్ టీఈ, వై -ఫై, బ్లూటూత్, జిపిఎస్/ ఏ-జిపిఎస్, యుఎస్ బి టైప్-సి మరియు 3.5 మిమీ హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. దీనిలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ ను కలిగి ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ వస్తుంది. (చదవండి: 15 వేలలో లోపు ఇవే బెస్ట్!) పోకో ఎం3 ధర 4జీబీ+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్కు పోకో ఎం3 ధర.149 డాలర్లు(సుమారు రూ. 11,000)గా నిర్ణయించబడింది. 4జీబీ + 128జీబీ స్టోరేజ్ ధర. 169 డాలర్లు(సుమారు రూ. 12,500) ధరను కలిగి ఉంది. ఫోన్ కూల్ బ్లూ, పోకో ఎల్లో మరియు పవర్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో పోకో ఎం3 రిలీజ్ అయింది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. ఇప్పటికే ఇండియాలో ఎం సిరీస్లో పోకో ఎం2, పోకో ఎం2 ప్రో రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి మార్కెట్లో ఉన్నాయి. మరి పోకో ఎం3 ఇండియాకు వస్తుందా? దీనిపై కంపెనీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. -
వన్ప్లస్ 9ప్రో డిజైన్ ఫస్ట్ లుక్
భారత్లో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతుంది. గత నెలలో వన్ప్లస్ 8టీ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసిందో లేదో అప్పుడే తర్వాత వన్ప్లస్ నుండి రాబోయే ఫ్లాగ్ షిప్ మొబైలుపై రూమర్లు వస్తున్నాయి. తాజాగా వన్ప్లస్ 9ప్రో డిజైన్కు సంబంధించి ఫస్ట్ లుక్ ఒకటి బయటకి వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ ప్రకారం వన్ప్లస్ 9ప్రో యొక్క డిజైన్ వనిల్లా వెర్షన్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కర్వ్డ్ 6.7-అంగుళాల డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం ఒక పంచ్ హోల్ కటౌట్తో రానున్నట్లు సమాచారం. వాల్యూమ్ బటన్ ఫోన్ కి ఎడమ వైపున ఉండగా, పవర్ బటన్ కుడి వైపున ఉన్నాయి. వెనుకవైపు, నాలుగు కెమెరా లెన్స్లతో సమానమైన దీర్ఘచతురస్రాకార కెమెరా ప్యానెల్ ఉంది. వన్ప్లస్ 9 సిరీస్ ఫోన్లో 144 Hz రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ వాడనున్నట్లు సమాచారం. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం మార్చిలో కొత్త వన్ప్లస్ 9 సిరీస్ ఫోన్ తీసుకొస్తుందో లేదో చూడాలి. (చదవండి: ట్విటర్ ఫ్లీట్స్లో భారీ లోపం) -
పోకో ఎం3 ఫీచర్స్ విడుదల
ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్-బ్రాండ్గా మార్కెట్లోకి అడుగుపెట్టిన పోకో సంస్థ కొత్త కొత్త స్మార్ట్ఫోన్ల లాంచ్ లతో అందరి దృష్టిని ఆకట్టుకున్నది. ఈ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో పోకో ఎం2తో పాటుగా పోకో ఎం2 ప్రోను కూడా ఇండియాలో విడుదల చేసింది. సంస్థ ఇప్పుడు వీటికి అప్ డేట్ వెర్షన్ గా పోకో ఏం3ను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. పోకో ఎం3ను నవంబర్ 24న ఐరోపా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు స్మార్ట్ఫోన్ కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు, పోకో ఏం3 ఫోన్ యొక్క డిస్ప్లే, బ్యాటరీ, చిప్సెట్తో సహా మొబైల్ గురించి కొన్ని వివరాలను అధికారికంగా ధ్రువీకరించింది. పోకో ఎం3 స్పెసిఫికేషన్లలో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 6.53-అంగుళాల డిస్ప్లే ఉన్నాయి. పోకో డిజైన్ను కూడా వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ వాటర్డ్రాప్ నాచ్, వెనుక ప్రత్యేకమైన దీర్ఘచతురస్రాకార బ్లాక్తో ఆకృతి గల కెమెరా ప్యానల్తో వస్తుంది. ప్రధాన కెమెరా విభాగంలో ఎల్ఇడీ ఫ్లాష్ మరియు పోకో బ్రాండింగ్తో ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. అందరు పోకో ఎం3 ధర గురుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు లాంచ్ ఈవెంట్ లో దీని ధరను వెల్లడించనున్నారు. (చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్) పోకో ఏం3 ఫీచర్స్ పోకో ఏం3 బెజెల్-తక్కువ 6.53-అంగుళాల డిస్ప్లేతో ఫుల్ హెచ్ డి ప్లస్ రిజల్యూషన్ మరియు సెల్ఫీ కెమెరా కోసం పైన వాటర్డ్రాప్ నాచ్ ఉంటుంది. కనీసం 4జీబీ ర్యామ్ తో స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ తీసుకు రానున్నారు. అయితే 6,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. పోకో ఏం3లో ఆండ్రాయిడ్ 10-ఆధారిత ఎంఐయుఐ 12ను పోకో ఏం3 బాక్స్ లో తీసుకురానున్నారు. పోకో ఏం3 ట్రిపుల్ రియర్ కెమెరాలతో పాటు 48 ఎంపీ ప్రాథమిక సెన్సార్ ఉంటుంది. మిగిలిన కెమెరా సెన్సార్లు, స్టోరేజ్ గురించి వివరాలు ప్రస్తుతానికి మిస్టరీగా ఉన్నాయి. పోకో ఏం3 నలుపు, నీలం, పసుపు అనే మూడు రంగులలో రానున్నట్లు సమాచారం. భారతదేశంలో పోకో ఎం3 విడుదల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.