ఘోర రోడ్డు ప్రమాదం.. కుటుంబం మృతి | Four Person Killed in Peddapalli Road Accident | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 22 2018 8:13 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Four Person Killed in Peddapalli Road Accident - Sakshi

సాక్షి, పెద్దపల్లి : అతివేగం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వివరాలివి.. ఓ దంపతులు వారి పిల్లలతో ఓ కారులో బయలుదేరారు. వేగంగా ప్రయాణిస్తున్న వారి కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపలి వద్ద రాజీవ్‌ రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి స్వస్థలానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు మంథనికి చెందిన అకుల వరుణ్‌, సౌమ్య, అఖిలేష్‌ కుమార్‌(10), శాన్వి(08)లుగా గుర్తించారు. వరుణ్‌ మంథనిలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ అని సమాచారం. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement