
భువనేశ్వర్ : బాలాసోర్ జిల్లాలో గురువారం రాత్రి హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పాలిథీన్ కవర్లో ఓ శిశువు మృతదేహం దర్శనమిచ్చింది. పట్టణంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఓ శునకం చిన్నారి మృతదేహం పీక్కుతింటుండగా.. కొందరు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment