infant dead body
-
‘నేనేం పాపం చేశాను’.. ముళ్లపొదల్లో శిశువు మృతదేహం
సాక్షి, ఖమ్మం: మాతృత్వానికి నోచుకోక ఎంతో మంది మహిళలు అల్లాడుతున్నారు. అలాంటిది చందమామలాంటి పిల్లలను కొందరు నిర్థాక్షిణ్యంగా చంపేస్తున్నారు. నవమాసాలు గర్భంలో ఉన్న శిశువులు కళ్లు తెరవకముందే హత్య చేసేస్తున్నారు. కొందరు శిశువులను చెత్తకుండీలు, తుప్పల్లో పడేస్తున్నారు. మరి కొందరు ఆలయాలు, బస్స్టేషన్, రైల్వేస్టేషన్లలో వదిలేస్తున్నారు. ఎవరైనా చూస్తే వారు బతికి బట్టగడుతున్నారు. లేదంటే వారు కుక్కలు, నక్కలు పాలై మృత్యువాత పడుతున్నారు. అందరూ ఉన్నప్పటికీ అమ్మ, నాన్న పిలుపునకు నోచుకోక అనాథలుగా మిగులుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. ముదిగొండ మండలం పెద్దమండవలో శుక్రవారం ఓ వీధిలో సీసీ రోడ్డు పక్కనే ఉన్న ముళ్లపొదలో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. పూర్తిగా నెలలు నిండకముందే గర్భం నుంచి తొలగించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు తీసుకెళ్లి ఖననం చేశారు. అయితే ఇదే గ్రామామికి చెందిన శిశువు మృతి చెందగా స్లానికులు పాతి పెట్టినట్లు తెలుసోంది. కుక్కలు వెలికి తీసి పొదల్లోకి ఎత్తుకెళ్ళినట్లు తెలుస్తోంది. చదవండి: ఒకే ఎఫ్ఐఆర్తో రెండు కేసులు, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. సీపీ సీరియస్ -
సులభ్ కాంప్లెక్స్లో నవజాత శిశువు మృతదేహం.. ఎన్నో అనుమానాలు!
సాక్షి, కరీంనగర్: నగరంలోని రాంనగర్ సులభ్ కాంప్లెక్స్లో శనివారం ఉదయం నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. రాంనగర్ చేపల మార్కెట్ వద్ద గల సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు ఉదయం లోపలికి వెళ్లగా దుర్వాసన వచ్చింది. పరిశీలించి, శిశువు మృతదేహమని గుర్తించి, పోలీసులకు సమచారం అందించారు. అదనపు డీసీపీ ఎస్.శ్రీనివాస్(లాఅండ్ఆర్డర్), సీఐ లక్ష్మీబాబు, ఎస్సై తోట మహేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. శిశువు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. శిశువు ఇక్కడే జన్మించి, చనిపోయిందా లేదా మృతిచెందిన శిశువును తీసుకొచ్చి పడేశారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ మహిళ వచ్చి వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. గోల్కొండ ఖిల్లా నుంచి జారిపడి -
దారుణం: పసికందును పీక్కుతున్న కుక్క
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పొదలలో వదిలేయడంతో ఆ పసికందు మృతదేహాన్ని కుక్కలు రోడ్డుమీదకు ఈడ్చుకు వచ్చాయి. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గ్రామ మహిళా పోలీసు తెలియజేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. విషయం తెలిసిన ఐసీడీఎస్ అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పసికందు మృతదేహం పడి ఉన్న తీరును పరిశీలించిన ఐసీడీఎస్ సీడీపీఓ ఆశా రోహిణి సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో ఆ దగ్గర్లోనే పొదలలో ఎవరో గుర్తు తెలియని మహిళ ప్రసవం జరిగినట్లు గుర్తించారు. ప్రసవం జరిగిన ఆనవాళ్లను కనుగొన్నారు. పొలాల్లోనే ప్రసవించిన మహిళ పసికందును వదిలి వెళ్ళిపోవడంతో పసికందు మృతి చెందిందని తెలిసింది. పొదలో ఉన్న పసికందు మృతదేహాన్ని కుక్క నోటకరచుకొని వస్తుండగా స్థానికులు గమనించి విధించడంతో రోడ్డుపైనే పసికందు మృతదేహాన్ని కుక్క వదిలి వెళ్ళిపోయింది. వెంటనే స్థానికులు గ్రామ మహిళా కానిస్టేబుల్ ద్వారా పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇటువంటి అవాంఛనీయ గర్భం ధరించిన మహిళలు ఐసీడీఎస్ అధికారులకు తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని పిల్లలను సంరక్షించి తామే వేరే వారికి దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. దయచేసి ఇలాంటి పాపపు పనులు చేయొద్దని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి ఆశా రోహిణి తెలియజేశారు. -
కవర్లో చిన్నారి మృతదేహం..
భువనేశ్వర్ : బాలాసోర్ జిల్లాలో గురువారం రాత్రి హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పాలిథీన్ కవర్లో ఓ శిశువు మృతదేహం దర్శనమిచ్చింది. పట్టణంలోని కమ్యునిటీ హెల్త్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఓ శునకం చిన్నారి మృతదేహం పీక్కుతింటుండగా.. కొందరు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అంత్యక్రియలకు డబ్బులు లేక ఓ తల్లి!...
రాంచీ : చనిపోయిన శిశువు అంత్యక్రియలు నిర్వహించటానికి డబ్బులు లేవన్న కారణంతో ఓ తల్లి మృత శిశువును జాతీయ రహదారిపై పడవేసింది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధన్బాద్కు చెందిన డాలీ అనే మహిళ గత నెల 30వతేదీన పురిటి నొప్పులతో బొకారో జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కాగా అక్టోబర్ 1వతేదీన శిశువుకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స చేయించాల్సిందిగా ఆమెకు సూచించారు. అయితే ఆమె పక్కనే ఉన్న మరో ప్రైవేటు ఆసుపత్రిలో శిశువును చేర్పించింది. ఆసుపత్రి వారు చికిత్స చేయటానికి రోజుకు 8వేల రూపాయలు వసూలు చేస్తుండటంతో ఆ ఖర్చు ఆమెకు పెను భారంగా మారింది. దీంతో అనారోగ్యంగా ఉన్న శిశువును వెంటబెట్టుకుని సొంత ఊరికి ప్రయాణమైంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత మార్గం మధ్యలో ఆ శిశువు కన్నుమూసింది. చనిపోయిన శిశువును ఇంటికి తీసుకువెళితే అంత్యక్రియల నిమిత్తం డబ్బులు ఖర్చు చేయవలసివస్తుందని భావించిన ఆమె శిశువును ప్లాస్టిక్ కవర్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేసింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. శిశువు మృతదేహం ఉన్న చోటుకు చేరుకున్న పోలీసులు కవర్పై ఉన్న ఆసుపత్రి లోగో ఆధారంగా వివరాలు సేకరించి డాలీని అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియలకు డబ్బులేని కారణంగానే మరణించిన బిడ్డను అలా రోడ్డు పక్కన పడేశానని డాలీ తెలిపింది. ఇప్పటికే కాన్పు ఖర్చుల నిమిత్తం అప్పులు చేయాల్సివచ్చిందని పేర్కొంది. -
రైల్వే బ్రిడ్జి కింద శిశువు మృతదేహం
చాంద్రాయణగుట్ట : ఆరేడు నెలల వయసున్న ఓ శిశువు మృతదేహం లభ్యమైన సంఘటన ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం వెలుగుజూసింది. ఎస్ఐ షానవాజ్ తెలిపిన వివరాల ప్రకారం... ఆర్యమేఘ ఆసుపత్రి సమీపంలోని కందికల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఓ పాప మృతి చెంది ఉండడాన్ని గమనించిన స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా.. దాదాపు ఆరేడు నెలల వయసున్న పాపగా గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు పూర్తిగా సన్నబడి ఉండడాన్ని బట్టి అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రికి తీసుకురాగా మృతి చెందితే ఇక్కడ పడేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా చిన్నారి మెడపై చీమలు కరిచినట్లు ఉందని ఎస్ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మురికి కాలువలో చిన్నారి మృతదేహం
తగరపువలస(విశాఖపట్నం): డ్రైనేజీలో ఐదునెలల బాబు మృతదేహం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా తగరపువలస మండలం చిట్టివలస గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామంలోని మురికి కాలువలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. సుమారు నాలుగు ఐదు నెలల వయసు ఉన్న బాలుడు రెండు రోజుల కిందటే కాలువలో పడి ఉంటాడని తెలిపారు. బాబు తల్లిదండ్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
మృతశిశువును పీక్కుతిన్న కుక్కలు
మెదక్ (సంగారెడ్డి) : చనిపోయిన శిశువును కుక్కలు పీక్కుతిన్న హృదయవిదారక ఘటన సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి పరిసరాల్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఓ మహిళ ఆదివారం మగశిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే శిశువు చనిపోవడంతో పక్కనే ఉన్న ముళ్లపొదల్లో పడవేసి వెళ్లిపోయింది. ముళ్లపొదల్లో పడివున్న శిశువు మృతదేహాన్ని సోమవారం వీధికుక్కలు పీక్కుతింటుండటం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బస్టాండులో పసికందు మృతదేహం
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్లో దారుణం జరిగింది. అక్కడ ఓ బ్యాగులో పసికందు మృతదేహం లభ్యమైంది. కర్రల సంచి పడి ఉండటం, ఎవరూ పట్టించుకోకపోవడంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు దాన్ని చూడగా, అందులో ఒకటి రెండు రోజుల వయసున్న పాప మృతదేహం పడి ఉంది. ఆడపిల్ల పుట్టిందని అక్కడ వదిలేశారా, లేక చనిపోయిన చిన్నారిని బ్యాగులో వదిలేశారా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్లాట్ఫారం నెంబరు 1 వద్దనే ఈ బ్యాగ్ ఉండటంతో అక్కడి నుంచి వెళ్లే బస్సులు ఎక్కాల్సిన ప్రయాణికులు ఎవరో ఆ బ్యాగ్ అక్కడ పెట్టి ఉంటారని భావిస్తున్నారు. మారేడ్పల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
బస్టాండులో పసికందు మృతదేహం